న్యూఢిల్లీ: ఫోర్డ్ ఇండియా కార్ల ధరలను పెంచింది. అన్ని మోడళ్ల కార్ల ధరలను 1-5 శాతం వరకూ పెంచుతున్నామని కంపెనీ గురువారం తెలిపింది. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతుండటంతో ధరలు పెంచక తప్పలేదని, ఈ పెరుగుదల తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఏ మోడల్పై ఎంత ధర పెంచుతున్నదీ కంపెనీ వివరంగా వెల్లడించలేదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధికంగా ఉన్న ఇంధనం ధరలు, పడిపోతున్న రూపాయి తదితర అంశాల కారణంగా ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోయాయని ఫోర్డ్ ఇండియా ఈడీ(మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్) వినయ్ పిపర్సానియా వివరించారు.