ప్రత్యేక హోదా కోసం రహదారుల దిగ్బంధం | Highways blockade to demand of special status for andhra | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా కోసం రహదారుల దిగ్బంధం

Published Sat, Aug 29 2015 12:40 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ప్రత్యేక హోదా కోసం రహదారుల దిగ్బంధం - Sakshi

ప్రత్యేక హోదా కోసం రహదారుల దిగ్బంధం

శింగనమల(అనంతపురం జిల్లా): అనంతపురం జిల్లా శింగనమల నియోజికవర్గం వ్యాప్తంగా శనివారం వైఎస్‌ఆర్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి ఆద్వర్యంలో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ సీపీ నాయకులు పెద్ద ఎత్తున రహదారుల దిగ్బంధం చేశారు. పుట్లూరు, యల్లనూరు, నార్పల, బుక్కరాయసముద్రం, శింగనమల, గార్లదిన్నె మండలాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు.

వైఎస్‌ఆర్ సీపీ చేపడుతున్న బంద్‌కు వ్యాపారుల నుంచి మద్దతు రావడంతో దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. శింగనమల చెరువుకట్ట వద్ద అనంతపురం-తాడిపత్రి ప్రదానరహదారిపై వందలాది మంది ఆలూరు సాంబశివారెడ్డి ఆద్వర్యంలో రోడ్డుపై బైఠాయిండం జరిగింది. ఈ బంద్‌కు వామపక్షాలు మద్దతు అందించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement