రేపిస్టుకు మరణ శిక్ష విధించిన కేరళ హైకోర్టు | Kerala High Court upholds death sentence to rapist | Sakshi
Sakshi News home page

రేపిస్టుకు మరణ శిక్ష విధించిన కేరళ హైకోర్టు

Published Tue, Dec 17 2013 4:29 PM | Last Updated on Sat, Jul 28 2018 8:35 PM

Kerala High Court upholds death sentence to rapist

కొచ్చి: అత్యాచార నిందితుడికి మరణ శిక్షను ఖరారు చేస్తూ కేరళ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కింది కోర్టు విదించిన అదే శిక్షను సమర్ధించింది. తమిళనాడుకు చెందిన గోవిందా చామియా అనే యువకుడు ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనపై విచారించిన పీ.ఆర్.రామచంద్రన్ నాయర్ మరియు పి. కమల్ పాషాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును ప్రకటించింది. అత్యాచార నిందితుడు చామియాకు మరణ శిక్షతో పాటు రూ.లక్ష చెల్లించాలని తెలిపింది. ట్రైన్లో రేప్లకు గురౌతున్న వారిని రక్షించడానికి భారత రైల్వేలు, న్యాయవాదులు, తోటి ప్రయాణికులు ముందుకు రాకపోవడం చాలా బాధాకరమని పేర్కొంది.
 

2011 వ సంవత్సరం, ఫిబ్రవరి 1 వ తేదీన ట్రైన్లో ప్రయాణిస్తున్న 23 ఏళ్ల యువతి వద్ద ఓ యువకుడు ప్రేమ ప్రస్తావన తెచ్చి, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. కాగా దీనికి ఆ యువతి నిరాకరించడంతో కదులుతున్న ట్రైన్ లోంచి ఆమెను తోసేసిన అనంతరం అతను కూడా దూకేశాడు. అప్పటికే తీవ్రంగా గాయపడిన ఆ యువతి ప్రతిఘటించడంతో ఆమెను రాయితో తలపై బలంగా మోది అత్యాచారం చేశాడు.ఆమె చికిత్స పొందుతూ అదే సంవత్సరం ఫిబ్రవరి ఆరవ తేదీన మరణించింది.

 

ఈ ఘటనపై కేసు నమోదు కావడంతో కింది కోర్టు చామియాకు మరణశిక్షను ఖరారు చేసింది. ఈ తీర్పును హైకోర్టు సమర్ధిస్తూ అతనికి మరణశిక్ష పబబేనని తెలిపింది. ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు తోటి ప్రయాణికులు అండగా నిలవకపోవడాన్ని కేరళ హైకోర్టు తప్పుబట్టింది. ఇటువంటి సంఘటనలపై భారతీయ రైల్వేలు కూడా సరైన చర్యలు చేపట్టకపోవడాన్ని విమర్శించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement