మాపై సామూహిక అత్యాచారం: ముజఫర్నగర్ బాధితులు | Muzaffarnagar riots: 3 women allege gangrape | Sakshi
Sakshi News home page

మాపై సామూహిక అత్యాచారం: ముజఫర్నగర్ బాధితులు

Published Mon, Sep 30 2013 1:32 PM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM

ముజఫర్నగర్ అల్లర్లలో కేవలం దోపిడీలు, గృహదహనాలు మాత్రమే కాదు.. సామూహిక అత్యాచారాలు కూడా జరిగాయట!!

ముజఫర్నగర్ అల్లర్లలో కేవలం దోపిడీలు, గృహదహనాలు మాత్రమే కాదు.. సామూహిక అత్యాచారాలు కూడా జరిగాయట!! ఈ విషయమై ఆ జిల్లాలోని ఫుగనా గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. అల్లర్ల సమయంలో తమ ఇళ్లను కాల్చేశారని, తమపై సామూహిక అత్యాచారాలు చేశారని ఇన్నాళ్ల తర్వాత వాళ్లు బయటకొచ్చి చెప్పారు.  

ఈ మేరకు వాళ్లు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అల్లర్లలో పాల్గొన్నవాళ్లు తమ ఇళ్ల మీదకు వచ్చి దాడి చేశారని కూడా చెప్పినట్లు అదనపు ఎస్పీ (రూరల్) అలోక్ ప్రియ దర్శి తెలిపారు. ఈ దారుణానికి గాను 17 మందిపై పోలీసులు మూడు వేర్వేరు కేసులు నమోదు చేశారు.  ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో జరిగిన మత ఘర్షణలలో దాదాపు 49 మంది ప్రాణాలు పోగా, 40 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement