పాములకు నో ఎంట్రీ | Narendra Modi's rally site had to be guarded against snakes | Sakshi
Sakshi News home page

పాములకు నో ఎంట్రీ

Published Fri, Feb 7 2014 1:45 PM | Last Updated on Mon, Oct 22 2018 2:22 PM

పాములకు నో ఎంట్రీ - Sakshi

పాములకు నో ఎంట్రీ

పనాజీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఇటీవల గోవాలో పాల్గొన్న ర్యాలీకి ఊహించని ముప్పు ఎదురైంది. బీహార్ రాజధాని పాట్నాలో బాంబు పేలుళ్ల సంఘటన అనంతరం నరేంద్ర మోడీకి, ఆయన పాల్గొనే బహిరంగ సభలకు అసాధారణ భద్రత కల్పిస్తున్నారు. కాగా గోవాలో మాత్రం పాముల నుంచి రక్షణ కల్పించారట. ఈ విషయాన్ని గోవా ముఖ్యమంత్రి మనోమర్ పారికర్ వెల్లడించారు.

గత నెలలో పనాజీ సమీపంలోని మెర్సెస్ గ్రామంలో జరిగిన సభలో మోడీ పాల్గొన్నారు. దాదాపు లక్షమందికి పైగా జనం హాజరయ్యారు. ఆ సమయంలో బహిరంగ సభలోకి పాములు రాకుండా ప్రత్యేక భద్రత చర్యలు తీసుకున్నారు. రక్షణగా నిపుణులను మోహరించారు. ఆ సమయంలో బొరియల్లో నుంచి రెండు పాములు బయటకు రానే వచ్చాయి. వెంటనే వాటిని పట్టుకుని దూరంగా విడిచిపెట్టారు. ఆ ప్రాంతంలో పాములు ఎక్కువగా ఉండటంతో ముందు జాగ్రత్తగా భద్రత చర్యలు తీసుకున్నట్టు పారికర్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement