కాపురానికి పిలవలేదని.. ఏడుగురి సజీవదహనం | Seven burnt alive in Chennai | Sakshi
Sakshi News home page

కాపురానికి పిలవలేదని.. ఏడుగురి సజీవదహనం

Published Wed, May 20 2015 8:53 AM | Last Updated on Sun, Sep 3 2017 2:23 AM

కాపురానికి పిలవలేదని.. ఏడుగురి సజీవదహనం

కాపురానికి పిలవలేదని.. ఏడుగురి సజీవదహనం

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలో ఓ దారుణం వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఇదంతా చేసినది ఆ ఇంటి కోడలే! తన భర్త తనను చాలా కాలంగా కాపురానికి పిలవడం లేదనే కోపంతోనే ఆమె  ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు తెలిసింది. కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఆమె తన భర్త, అత్త మామలు నివసిస్తున్న ఇంటికి నిప్పుంటించింది.

దాంతో భర్త, అత్తమామలతో పాటు ఏడుగురు సజీవదహనమయ్యారు. అంతా నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన అనంతరం ఆమె స్వయంగా వెళ్లి, పోలీసుల ఎదుట లొంగిపోయింది. అయితే భార్యాభర్తల మధ్య ఇంతకుముందు ఎలాంటి గొడవలు జరిగాయో, ఎందుకు ఆమె ఇంతటి దారుణానికి ఒడిగట్టిందోననే విషయాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement