ముంబైలో గ్యాంగ్‌రేప్ | Teenaged girl gang raped in mumbai | Sakshi

ముంబైలో గ్యాంగ్‌రేప్

Nov 5 2013 3:11 AM | Updated on Sep 2 2017 12:16 AM

ముంబైలో ఓ పదహారేళ్ల యువతిపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ముంబై :  ముంబైలో ఓ పదహారేళ్ల యువతిపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. గోరేగావ్‌లోని సంతోష్‌నగర్‌లో ఈ దారుణం జరిగింది. దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు తమతో రావాల్సిందిగా శుక్రవారం నలుగురు యువకులు బాధితురాలిని కోరారు. అందరూ తెలిసినవారే కావడంతో ఆమె వారితో వెళ్లడానికి అంగీకరించింది. తర్వాత ఆ కామాంధులు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చారు. సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. రెండ్రోజులు మౌనంగా ఉన్న బాధితురాలు ఆదివారం తన బామ్మతో కలిసి పోలీసులకు  ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement