gang raped
-
బాలికపై గ్యాంగ్రేప్: వికారాబాద్ జిల్లా
దోమ: మాయమాటలతో ఓ బాలికను లోబర్చుకున్న ఓ యువకుడు, నలుగురు మైనర్లు ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఎస్ఐ ఆనంద్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం...వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని ఓ గ్రామంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక(13)తో అదే ఊరికి చెందిన సంతోష్ సన్నిహితంగా ఉండేవాడు. ఈ చనువును అవకాశంగా తీసుకొని ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు.ఈ విషయం సంతోష్ స్నేహితులైన నలుగురు మైనర్లకు తెలియగా, బాలికను బ్లాక్మెయిల్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. విషయం బయటకు చెప్పొద్దని హెచ్చరించడంతో వీరి అఘాయిత్యాలను ఆరు నెలలుగా మౌనంగా ఆ బాలిక భరిస్తోంది. ఈ క్రమంలో గత నెల 28వ తేదీన పాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న బాలికను సంతోష్ తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే నలుగురు మిత్రులు అక్కడకు చేరుకున్నారు. అంతా కలిసి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు.సాయంత్రం వరకే స్కూల్ నుంచి రావాల్సిన బాలిక రాత్రి ఆలస్యంగా ఇంటికి రాగా, తల్లి నిలదీయడంతో బోరున విలపించింది. జరిగిన విషయాన్ని తల్లికి వివరించింది. దీంతో వెంటనే పీఎస్కు వెళ్లిన బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురిని పరిగిలోని డీఎస్పీ కార్యాలయానికి తరలించగా, నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చారు. బాలికను సఖి సెంటర్కు తరలించి, వైద్య పరీక్షలు చేయించారు. ప్రస్తుతం బాలిక రెండు నెలల గర్భిణి అని వైద్యులు నిర్ధారించారు.గంజాయి మత్తు కారణమా?గ్రామాల్లో గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందని, ఈ మత్తులోనే వారు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. నగరం నుంచి గ్రామాలకు గంజాయి సరఫరా అవుతోందని, దీనికి బానిసలుగా మారిన యువత విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. -
దారుణం: హోటల్ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో అమానవీయ ఘటన జరిగింది. హోటల్లో పనిచేసే యువతిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి మద్యం తాగించి, ఆమెపై కిరాతకంగా దాడి చేశారు. యువతిని గదిలోకి లోక్కెళుతున్న వీడియో ఒకటి బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి తాజ్గంజ్ పోలీస్ స్టేషన్కి ఓ యువతి కాల్ చేసి రోదిస్తూ విషయం తెలిపింది. పోలీసులు హుటాహుటిన సంఘటన ప్రదేశానికి వెళ్లారు. అప్పటికే గాయాలపాలైన యువతి దారుణాన్ని పోలీసులకు తెలిపింది. యువతి హోటల్లో ఏడాదిన్నరగా ఉద్యోగిగా పనిచేస్తోంది. శనివారం అర్ధరాత్రి యువతి స్నేహితురాలు బలవంతంగా ఆమెకు మద్యం తాగించారు. మద్యం మత్తులో వారితోపాటే ఉన్న మరో నలుగురు యువకులు బాధితురాల్ని ఓ గదిలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ యువతి కాపాడండి అంటూ కేకలు పెడుతున్న ఓ వీడియో పోలీసులకు చిక్కింది. అత్యాచారయత్నాన్ని ప్రతిఘటించిన తనపై ఆ యువకులు దాడి చేశారని బాధితురాలు తెలిపింది. గాజు గ్లాస్తో తలపై కొట్టారని వాపోయింది. ఇంతకు ముందు తీసిన తన అభ్యంతరకర వీడియోను బయటపెడతామని బెదిరించినట్లు పోలీసులకు తెలిపింది. ఈ కేసులో నలుగురు యువకులు, ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాల్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: మరోసారి నోరు జారిన ఎస్పీ నేత.. ఏమన్నారంటే.. -
15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
రైజెన్: మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లాలో 15 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు కలసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ తతంగాన్నంతా నిందితులు వీడియో రికార్డు చేశారని పోలీసులు బుధవారం వెల్లడించారు. తన సోదరికి సాయం చేసేందుకు 10వ తరగతి చదువుతున్న బాధితురాలు గుంగాకు వెళ్లింది. ఆమె సోదరి ఆస్పత్రిలో ఉండగా, బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే సమయంలో తమ బంధువు ఉన్నాడా అంటూ ఓ వ్యక్తి ఇంట్లో ప్రవేశించాడు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న నిందితుడు మరో ఇద్దరితో కలసి బాలికపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటననంతా నిందితులు కలసి వీడియో కూడా తీశారు. బాలిక తిరిగి తన ఇంటికి వచ్చాక తండ్రికి ఈ విషయం చెప్పింది. వెంటనే వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
భయానకం.. మూగజీవినీ వదల్లేదు
ఛండీగఢ్: దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మూగ జీవి.. పైగా గర్భంతో ఉందని కూడా చూడకుండా కొందరు యువకులు మృగ చేష్టలకు పాల్పడ్డారు. సామూహిక లైంగిక దాడికి పాల్పడి, హింసించి దాని ఉసురు తీశారు. ఘోరమైన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మేవాత్లో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో మొత్తం 8 మంది యువకులు మేకపై దాష్టీకానికి పాల్పడ్డారు. ఆ సమయంలో దాని అరుపులకు నిద్ర లేచిన యాజమాని అస్లూ జరుగుతున్న ఘోరం చూసి నిశ్చేష్టులయ్యారు. కేకలు వేయటంతో భయపడ్డ నిందితులు పరారయ్యారు. వెంటనే పశువుల ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒకరోజు తర్వాత అది కన్నుమూసింది. ఈ ఘటనపై నగిన పోలీస్ స్టేషన్లో అస్లూ ఫిర్యాదు చేయగా.. కేసు దర్యాప్తు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కాగా, ఈ ఘటనపై జంతు పరిరక్షక సంఘాలు, పెటా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని పెటా ప్రతినిధులు పోలీసులకు కోరుతున్నారు. -
జార్ఖండ్లో ఐదుగురు మహిళలపై అత్యాచారం
-
దారుణం : రెండు నెలలుగా బాలికపై అత్యాచారం
సాక్షి, చిత్తూరు: మానవత్వం మంట కలిసింది. కామాంధుని దాహానికి మరో చిన్నారి బలైంది. పుంగనూరు మండలం భగత్సింగ్ కాలనీలో ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదుగురు మైనర్ బాలురు 11 ఏళ్ల బాలికపై రెండు నెలల నుంచి అత్యాచారాని పాల్పడుతున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బాలికను బెదిరించారు. బాలిక విషయాన్ని వాళ్ల అమ్మకు తెలియజేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరిని గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. పోలీసులు ఐదుగురు బాలురను అరెస్ట్ చేసి జువైనల్ హోమ్కు తరలించారు. ఘటనపై హోంమంత్రి, ఎస్పీలు స్పందిస్తూ.. బాలికతో సన్నిహితంగా ఉన్నవారే ఈ చర్యకు పాల్పడ్డారన్నారు. ఇందుకోసం టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామని ప్రకటించారు. నెలలో ఈ ఘటన ఆరవది కావడం గమనార్హం. -
నోయిడా గ్యాంగ్ రేప్ కేసులో మలుపు
సాక్షి, : గ్రేటర్ నోయిడాలో 11వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలికపై సమీప బంధువు, స్నేహితులే అత్యాచారం చేశారని వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదని తెలిసింది. తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని ఆరోపించిన బాలికకు నిర్వహించిన వైద్యపరీక్షల్లో ఈ విషయం తేటతెల్లమైంది. బాలికపై అత్యాచారం జరిగినట్లు ఆధారాలు ఏవీ లభించలేదని డాక్టర్లు తెలిపారు. దాంతో పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం... ఈ నెల 18న స్కూల్కి వెళ్లిన బాలిక తిరిగి వచ్చే క్రమంలో స్కూల్బస్ వెళ్లిపోయింది. దీంతో ఆమె ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఆ సమయంలో అదే దారిలో కారులో వస్తున్న ముగ్గురు అబ్బాయిలు ఆమెను ఇంటి వద్ద దించుతామని కారులో ఎక్కించుకున్నారు. అనంతరం కదులుతున్న కారులోనే తనపై సామూహిక అత్యాచారం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాలిక తెలిపింది. స్పృహ కోల్పోయిన తనను గల్గోటియా కళాశాల సమీపంలో వదిలి వెళ్లారని తెలిపింది. తమ కూతురు ఇంటికి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మంగళవారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో కాలేజీ వద్ద అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గుర్తించారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం ఆ ముగ్గురు నిందితుల్లో ఒకరు తన సమీప బంధువని, మరొకరు తన క్లాస్మేట్ కాగా, మూడో వ్యక్తి తెలియదని చెప్పింది. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదే సమయంలో బాలికకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరగలేదని తేలింది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. అసలేం జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
కిడ్నాప్.. రేప్.. మర్డర్
బులంద్ షహర్: ఉత్తర ప్రదేశ్లో మరో అమానుషం వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికను కిడ్నాప్ చేయడంతో పాటు, ఆమెపై అత్యాచారం అనంతరం హత్య చేశారు. బులంద్ షహర్లో 12వ తరగతి చదువుతున్న మైనర్ యువతి మంగళవారం కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. ట్యూషన్ ముగించుకుని సైకిల్పై ఇంటికి తిరిగి వస్తున్న యువతిని.. కొందరు యువకులు మారుతీ ఆల్టో కారులో కిడ్నాప్ చేశారు. రెండు రోజులు పాటు యువతిపై అత్యాచారం జరిపి.. ఆపై హత్య చేశారు. శవాన్ని ఒక సరస్సు పక్కన పడేసి అదేకారులో దుండగులు వెళ్లిపోయారు. ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న యువతిని పట్టపగలు కిడ్నాప్ చేస్తున్న ఘటన సీసీటీవీలో రికార్డయింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారం మేరకు పోలీసులు ఐదుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై యూపీలోని విపక్ష పార్టీలన్నీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విమర్శలకు దిగాయి. రాష్ట్రంలో మహిళలకు భద్రతలేదని సమాజ్ వాదీ పార్టీ ధ్వజమెత్తింది. -
కూతురును ప్రేమించాడన్న కక్షతో..!
సాక్షి, ముజఫర్ నగర్ : ఉత్తర ప్రదేశ్లోని ముజఫర్ నగర్లో మరో దారుణం జరిగింది. ముజఫర్ నగర్ జిల్లాలోని భాపూరా గ్రామంలో నివాసముంటున్న 40 ఏళ్ల మహిళపై నలుగురు వ్యక్తుల సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మాజీ గ్రామ ప్రధాన్, అతని కుటుంబ సభ్యులు ప్రధాన నిందితులుగా ఉన్నారు. పోలీసులు ఇప్పటికే మాజీ గ్రామ ప్రధాన్ను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ అజయ్ పాల్ శర్మ చెబుతున్న వివరాలివి. అత్యాచార బాధితురాలి 24 ఏళ్ల కుమారుడు.. మాజీ గ్రామ ప్రధాన్ కుమార్తె (22)ను ప్రేమించాడు. ఇద్దరి మధ్య రెండేళ్లుగా ప్రేమ వ్యవహరం నడుస్తోంది. ఇదిలావున్న నేపథ్యంలో అమ్మాయికి కుటుంబ సభ్యులు పెళ్లి సంబందం కుదిర్చారు. ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని యువతి.. తన ప్రేమికుడితో కలిసి నవంబర్ 20 ఎటో వెళ్లిపోయింది. ఈ ఘటన జరిగినప్పటినుంచీ మాజీ గ్రామ ప్రధాన్ కుటుంబం.. యువకుడి కుటుంబంపై కక్ష పెంచుకుంది. మధ్యలో పలు సందర్భాల్లో యువకుడి కుటుంబంపై భౌతిక దాడులకు గ్రామ ప్రధాన్ కుటుంబం దిగింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 25న రాత్రి సమయంలో.. గ్రామ ప్రధాన్, అతని సోదరుడు, కుమారుడు, అల్లుడితో కలిసి యువకుడి కుటుంబంపై మరోసారి దాడికి దిగారు. ఈ సమయంలో ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామ్ ప్రధాన్, అతని కుటుంబ సభ్యులు యువకుడి తల్లిపై అత్యాచారానికి ఒడిగట్టారు. గ్యాంగ్రేప్కు పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ శర్మ తెలిపారు. -
జార్ఖండ్లో దారుణం
రాంచీ: జార్ఖండ్లో అత్యంత కిరాతక ఘటన చోటు చేసుకుంది. జమ్షెడ్పూర్లోని బాగ్బెరా ప్రాంతంలో 14 ఏళ్ల మైనర్ బాలికను నాలుగురు వ్యక్తులు అత్యంత రాక్షసంగా అత్యాచారం చేసి.. ఆమెను మురికి కాలువలోకి విసిరేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలని గుర్తించిన స్థానికులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ప్రాణంతో ఉన్న బాధితురాలని పోలీసులు చికిత్స నిమిత్తం స్థానిక సర్దార్ ఆసుపత్రికి తరలించారు. అనుమానితులగా భావిస్తున్న అభయ్ యాదవ్ సహా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ విమల్ కుమార్ చెప్పారు. -
పాతబస్తీలో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్!
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ మొఘల్ ఫురా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మానసిక స్థితి సరిగా లేదని భావిస్తున్న ఓ బాలికపై ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాలిక స్థానికుల సహాయంతో పోలీసులకు బుధవారం అర్ధరాత్రి సమయంలో ఫిర్యాదు చేసింది. ప్రధాన నిందితులు అజయ్, కరణ్ లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికను గ్యాంగ్ రేప్ చేసిన నిందితులపై అత్యాచారం, నిర్భయ, కిడ్నాప్ కేసులు నమోదు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వీడియో తీస్తూ.. మైనర్ పై గ్యాంగ్ రేప్..!
సిడ్నీ: మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనలో ఓ వ్యక్తికి జీవితకాల జైలుశిక్ష అనుభవించనున్నాడు. ఈ ఘటన సిడ్నీలో కొన్ని రోజుల కిందట జరిగింది. ట్రిస్టాన్ కార్లైల్ వాట్సన్ అనే యువకుడిని ఓ కేసులో భాగంగా విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గ్యాంగ్ రేప్ నకు గురై అపస్మారస్థితిలో బాలిక పడి ఉండగా వాట్సన్ తీసిన వీడియో స్థానికంగా హల్ చల్ చేస్తోంది. మొత్తంగా ఈ కేసులో ముగ్గురు వ్యక్తులతో పాటు ఓ మైనర్ దోషిగా ఉన్నాడు. వాట్సన్ అనే యవకుడు ప్రధానంగా వార్తల్లో నిలిచాడు. ఎందుకంటే, ఆ దారుణానికి గురైన బాలికతో ఫేస్ బుక్ లో అతడు ఫ్రెండ్ గా ఉండటమే కారణమని తెలుస్తోంది. పశ్చిమ సిడ్నీలో సెయింట్ క్లెయిర్ పార్టీ రమ్మని ఆ బాలికను వాట్సన్ ఆహ్వానించాడు. అక్కడ ఆ మైనర్ బాలిక మద్యం సేవించింది. కొద్దిసేపట్లో బాలిక అపస్మారకస్థితిలోకి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన వాట్సన్, కొందరు యువకులు మైనర్ పై అత్యాచారానికి ఒడిగట్టారు. ప్లాన్ ప్రకారమే బాలికను రప్పించి అత్యాచారం చేశారని కోర్టులో రుజువైంది. వాట్సన్ అత్యాచారం చేసినట్లు వీడియోలో కనిపించలేదని అతడి తరఫు న్యాయవాది వాదించాడు. ఆ బాలికతో కూడా మాట్లాడి పూర్తివివరాలు తెలుసుకోవాలంటూ కోర్టుకు విన్నవించారు. అయితే అత్యాచారానికి గురైన బాలికను వాట్సన్ తీసిన ఫొటోలతో పాటు అతడి ఫొటో కూడా పోలీసులకు లభ్యమైంది. శుక్రవారం రోజు ఈ కేసు మరోసారి విచారణకు రానుంది. మైనర్ బాలిక వివరాలు వెల్లడించేందుకు కోర్టు, పోలీసు శాఖ నిరాకరించింది. -
కత్తులతో బెదిరించి బాలికపై లైంగిక దాడి
అమలాపురం టౌన్: ఇద్దరు దుండగులు ముఖాలకు నల్ల ముసుగులు ధరించి, కత్తితో బెదిరించి 14 ఏళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డ సంఘటన తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని కొంకాపల్లిలో జరిగింది. ఈ నెల 7న తనపై జరిగిన అఘాయిత్యంపై కుటుంబ సభ్యులతో కలిసి బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అమలాపురం పట్టణ పోలీసులు శనివారం నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పట్టణ సీఐ వై.ఆర్.కె.శ్రీనివాస్ తెలిపారు. అరెస్ట్ చేసిన వ్యక్తిని శనివారం కోర్డులో హాజరు పరిచారు. కొంకాపల్లికి చెందిన బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన రంకిరెడ్డి సత్తిబాబు, కంచిపల్లి తాతబ్బాయి నల్లటి ముసుగులు, పాంట్లు, చొక్కాలు ధరించి లోపలికి చొరబడ్డారు. బాలిక పీకపై కత్తిపెట్టి చంపుతామని బెదిరించి లైంగికదాడి జరిపారు. కాగా బాలిక ఇంటిపై వేరే విషయమై ఈ ఏడాది ఆగష్టు 11న కొందరు దాడి జరిపారు. వారిలోని వారే తనపై అఘాయిత్యం జరిపి ఉంటారన్న అనుమానాన్ని బాధితురాలు వ్యక్తం చేయడంతో ఆ కోణంలో దర్యాప్తు జరిపిన పోలీసులకు చివరికి నిందితుల్ని గుర్తించారు. పోస్కో యూక్ట్ (లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టం) కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. -
పార్టీకి పిలిచి.. గ్యాంగ్ రేప్
-
13ఏళ్ల బాలికపై అత్యాచారం..హత్య
-
ప్రియురాలిపై స్నేహితులతో కలిసి అత్యాచారం
న్యూఢిల్లీ: ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసి.. మిత్రులతో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన వసంత్కుంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. ఓ ప్రయివేటు సంస్థలో డెలివరీ బాయ్గా పనిచేసే అమిత్, బాధితురాలు రంగాపురి పహారి మురికివాడలో నివసిస్తున్నారు. వీరిద్దరి మధ్య స్నేహం చిగురించి గత ఏడాది ప్రేమగా మారింది. శనివారం వాలెంటైన్స్డే కావడంతో తన గదిలో సెలబ్రేట్ చేసుకుందామని యువతిని శుక్రవారం అమిత్ తీసుకెళ్లాడు. గదిలోకి వెళ్లిన తర్వాత ఆమెకు కూల్డ్రింకులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. దానిని తాగిన తర్వాత స్పృహ కోల్పోవడంతో ఆమెపై స్నేహితులతో కలసి అత్యాచారం చేశాడు. కాగా, అమిత్ను పోలీసులు అరెస్టు చేయగా, మిగిలిన ఇద్దరూ పరారీలో ఉన్నారు. -
ప్రతీకారంతో రగిలిపోయి ... సామూహిక అత్యాచారం
లక్నో: తమ తరఫు అమ్మాయిపై అత్యాచారానికి ఒడిగట్టిన యువకుడి కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని బాధితురాలు బంధువులు ఆగ్రహాంతో రగలిపోయారు. తమ అమ్మాయికి జరిగినట్లే ఆ నిందితుడి సోదరిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి ప్రతీకారం తీర్చుకోవాలని బాధితురాలి బంధువులు సమయం కోసం ఎదురు చూశారు. ఆ సమయం రానే వచ్చింది... అత్యాచార నిందితుడి ఇంట్లో అతడి సోదరి ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను ఐదుగురు యువకులు కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెపైన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు అక్కడి నుంచి పరారీ కావడంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆ ఘటన ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్లో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా ఐదుగురు నిందితుల్లో ఓ నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. అయితే అత్యాచారానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకునేందుకు సమీపంలోని కుమ్హేడ బ్రిడ్జ్ వద్దకు చేరుకుంది. ఆ విషయాన్ని గమనించిన స్థానికులు ఆమెను ఇంటికి తీసువెళ్లారు. కాగా ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. నిరసనగా కక్క్రౌలీ పోలీసు స్టేషన్ ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దాంతో నిందితులను అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. దాంతో వారు ఆందోళన విరమించారు. -
పాముతో బెదిరించి యువతిపై గ్యాంగ్ రేప్
సాక్షి, హైదరాబాద్: కాబోయే భర్త ఎదుటే యువతిని నిర్బంధిం చారు. పాముల్ని చూపించి బెదిరించారు. వివస్త్రను చేసి సెల్ఫోన్లలో చిత్రీకరించారు. ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. హైదరాబాద్ నగర శివార్లలోని ఓ ఫాంహౌస్లో గత నెల 31న చోటు చేసుకున్న ఘటన కొత్త మలుపు తిరిగింది. నాటి ఘటనలో.. బాధితురాలు కేవలం ఆభరణాలు చోరీ అయినట్టు మాత్రమే ఫిర్యాదు చేసింది. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులకు.. తాజాగా ఆ యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్టు తేలింది. ఈ అకృత్యానికి పాల్పడిన ఏడుగురు నిందితులను ఇదివరకే అరెస్టు చేసిన పహాడీషరీఫ్ పోలీసులు శుక్రవారం ప్రధాన నిందితుడితో పాటు అతనికి ఆశ్రయం కల్పించిన యువకుడిని అరెస్టు చేశారు. శంషాబాద్ ఏసీపీ ఆర్.సుదర్శన్, ఇన్స్పెక్టర్ డి.భాస్కర్ రెడ్డిలు తెలిపిన వివరాల ప్రకారం... రంజాన్ మాసం ముగిసిన రెండు రోజుల అనంతరం గత నెల 31న ఉదయం వేళ ఓ కుటుంబం విడిది కోసం షాయిన్నగర్ ఉస్మాన్నగర్లోని తమ ఫాంహౌస్కు వచ్చింది. కొద్దిసేపటి అనంతరం కుటంబసభ్యులు వెళ్లిపోగా వారి కుటుంబానికే చెందిన 18 ఏళ్ల యువతి, ఆమె కాబోయే భర్త అక్కడే ఉండి ఫొటోలు తీసుకుంటున్నారు. ఇది గమనించిన ఎర్రకుంటకు చెందిన జిమ్ కోచ్ ఫైసల్ దయానీ (26), ఉస్మాన్నగర్కు చెందిన ఖాదర్ బారక్బా (25), బండ్లగూడకు చెందిన తయ్యబ్ బాసలామా(20), షాయిన్నగర్కు చెందిన మహ్మద్ పర్వేజ్ (25), అన్వర్(19), ఖాజా అహ్మద్(26), మహ్మద్ ఇబ్రహీం (19)లు యువకుడిని కొట్టి గాయపరిచారు. పాముతో బెదిరించి యువతిని వివస్త్రను చేశారు. ఆమెను ఫొటోలు, వీడియోలు తీశారు. ఆపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ విషయమై అరిచినా, ఎవరికైనా చెప్పినా ఫేస్బుక్, సోషల్ నెట్వర్క్లలో సదరు ఫొటోలు పోస్ట్ చేస్తామని బెదిరించారు. ఏడుగురు నిందితులతో పాటు వీరికి సహకరించిన మరో ఇద్దరు సాలం హమ్దీ (24), అలీ బారక్బా (27)పై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో అందర్ని ఇదివరకే అరెస్టు చేయగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఫైసల్ దయానీ, సాలం హమ్దీలను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాగా, మొదట్లో భయంతో అరకొర వివరాలు చెప్పిన బాధితులు... పోలీసుల అభయంతో సామూహిక లైంగికదాడి జరిగిన విషయం బయటపెట్టారు. నిందితుల నుంచి 3 బైక్లు, స్కార్పియో వాహనం, నాలుగు సెల్ఫోన్లు, రెండు జతల అద్దాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురికి పాములతోనే ఆట. ఫైసల్ దయానీతోపాటు తయ్యబ్ బా సలామా, మహ్మద్ పర్వేజ్లకు పాములతో ఆడుకోవడం వెన్నతో పెట్టిన విద్య. ఎలాంటి పామునైనా ఇట్టే పట్టుకొని ఆడించి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. ఒక్కోసారి నడి రోడ్లపై నిలబడి ఏడెనిమిది అడుగుల పొడవున్న పాములను మెడలో వేసుకొని... తోకతో పట్టుకొని కిందికి ఆడిస్తూ స్థానికులను బెదిరించిన వీడియోలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కూడా నిందితులు పాముతోనే బెదిరించారు. కాగా, నిందితులు తాము చేసే ప్రతి పనిని సెల్ఫోన్లలో వీడియో తీసుకోవడం అలవాటుగా చేసుకున్నారు. గతంలో వీరి బారిన పడిన బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తె వీరిపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. -
ఏడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
న్యూఢిల్లీ: ఏడేళ్ల బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన పశ్చిమ ఢిల్లీలోని పశ్చిమ్విహార్ ప్రాంతంలో ఈ నెల మూడో తేదీన చోటుచేసుకుంది. ఈ విషయం ఆదివారం వెలుగులోకొచ్చింది. వివరాలిలా ఉన్నాయి. మామిడిపండు ఇస్తామంటూ ముగ్గురు నిందితులు బాధితురాలిని సమీపంలోని ఉద్యానవనానికి తీసుకుపోయి అక్కడ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులంతా పది నుంచి 15 ఏళ్ల వయసువారేనని పోలీసులు తెలిపారు. వీరిని జువెనైల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచిన అనంతరం కస్టడీకి తరలించామన్నారు. ఆదివారం ఉదయం బాధితురాలి మర్మాంగంలో సమస్యలు తలెత్తడంతో జరిగిన సంఘటనను తల్లికి వివరించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుమేరకు పశ్చిమ్విహార్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
మతిస్థిమితం లేని యువతిపై సామూహిక అత్యాచారం
ప్రకాశం జిల్లా పొదిలి మండలం జువలేరులో దారుణం చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని యువతిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆ యువకులు పరారయ్యారు. మతిస్థిమితం లేని యువతిపై జరిగిన దారుణాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆమె తల్లితండ్రులకు విషయాన్ని వివరించారు. దాంతో ఆ యువతి తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మతిస్థిమితం లేని యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. -
హైదరాబాద్లో రెచ్చిపోయిన కామాంధులు
-
ఖమ్మం జిల్లాలో దారుణం
-
ముంబైలో గ్యాంగ్రేప్
ముంబై : ముంబైలో ఓ పదహారేళ్ల యువతిపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కూల్డ్రింక్లో మత్తు మందు కలిపి ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. గోరేగావ్లోని సంతోష్నగర్లో ఈ దారుణం జరిగింది. దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు తమతో రావాల్సిందిగా శుక్రవారం నలుగురు యువకులు బాధితురాలిని కోరారు. అందరూ తెలిసినవారే కావడంతో ఆమె వారితో వెళ్లడానికి అంగీకరించింది. తర్వాత ఆ కామాంధులు కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చారు. సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. రెండ్రోజులు మౌనంగా ఉన్న బాధితురాలు ఆదివారం తన బామ్మతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
వివాహితపై సామూహిక అత్యాచారం
జైపూర్:అమెరికా యువతిపై దాడి, మహిళ ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం వంటి ఘటనలు పునారావృతమవుతూనే ఉన్నాయి. తాజాగా ఓ వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన జైపూర్లో వెలుగు చూసింది. చక్రధర్ దాస్, షేక్ బాబు, మనాస్ మజ్హి అనే ముగ్గురు యువకులు ఓ వివాహితపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన స్థానికంగా కలకం సృష్టించింది. గత రాత్రి ఓ వివాహిత తన విధులు ముగించుకుని ఇంటికి వెళ్లడానికి కైరో గ్రామంలో బస్సు కోసం ఎదురుచూస్తుండగా బైక్ పై వచ్చిన యువకుడు లిఫ్ట్ ఇస్తానని చెప్పి నమ్మబలికాడు. దీంతో ఆ యువకుడ్ని నమ్మి అతని బైక్ ఎక్కింది. ఆ వివాహితను రివర్ బ్యాంక్ సమీపంలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటికే ఆ ప్రాంతానికి చేరుకున్న మరో ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. మంగళవారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. గ్రామస్తులు ఆమెకు సహకరించడంతో నిందితులను గుర్తించి, కేసు నమోదు చేశామన్నారు.