కూతురును ప్రేమించాడన్న కక్షతో..! | Woman gang-raped in UP | Sakshi
Sakshi News home page

కూతురును ప్రేమించాడన్న కక్షతో..!

Dec 30 2017 4:35 PM | Updated on Dec 30 2017 4:35 PM

Woman gang-raped in UP - Sakshi

సాక్షి, ముజఫర్‌ నగర్‌ : ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్‌లో మరో దారుణం జరిగిం‍ది. ముజఫర్‌ నగర్‌ జిల్లాలోని భాపూరా గ్రామంలో నివాసముంటున్న 40 ఏళ్ల మహిళపై నలుగురు వ్యక్తుల సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  ఈ ఘటనలో మాజీ గ్రామ ప్రధాన్‌, అతని కుటుంబ సభ్యులు ప్రధాన నిందితులుగా ఉన్నారు.  పోలీసులు ఇప్పటికే మాజీ గ్రామ ప్రధాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ అజయ్‌ పాల్‌ శర్మ చెబుతున్న వివరాలివి.  

అత్యాచార బాధితురాలి 24 ఏళ్ల కుమారుడు..  మాజీ గ్రామ ప్రధాన్‌ కుమార్తె (22)ను ప్రేమించాడు.  ఇద్దరి మధ్య రెండేళ్లుగా ప్రేమ వ్యవహరం నడుస్తోంది. ఇదిలావున్న నేపథ్యంలో అమ్మాయికి కుటుంబ సభ్యులు  పెళ్లి సంబందం కుదిర్చారు. ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని యువతి.. తన ప్రేమికుడితో కలిసి నవంబర్‌ 20 ఎటో వెళ్లిపోయింది.   

ఈ ఘటన జరిగినప్పటినుంచీ మాజీ గ్రామ ప్రధాన్‌ కుటుంబం.. యువకుడి కుటుంబంపై కక్ష పెంచుకుంది. మధ్యలో పలు సందర్భాల్లో యువకుడి కుటుంబంపై భౌతిక దాడులకు గ్రామ ప్రధాన్‌ కుటుం‍బం దిగింది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 25న రాత్రి సమయంలో.. గ్రామ ప్రధాన్‌, అతని సోదరుడు, కుమారుడు,  అల్లుడితో కలిసి యువకుడి కుటుంబంపై మరోసారి దాడికి దిగారు. ఈ సమయంలో ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామ్‌ ప్రధాన్‌, అతని కుటుంబ సభ్యులు  యువకుడి తల్లిపై అత్యాచారానికి ఒడిగట్టారు.  గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ శర్మ తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement