వివాహితపై సామూహిక అత్యాచారం | Married woman gang raped in Odisha | Sakshi
Sakshi News home page

వివాహితపై సామూహిక అత్యాచారం

Published Tue, Aug 27 2013 5:07 PM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM

Married woman gang raped in Odisha

జైపూర్:అమెరికా యువతిపై దాడి, మహిళ ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం వంటి ఘటనలు పునారావృతమవుతూనే ఉన్నాయి. తాజాగా ఓ వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన జైపూర్‌లో వెలుగు చూసింది. చక్రధర్ దాస్, షేక్ బాబు, మనాస్ మజ్హి అనే ముగ్గురు యువకులు ఓ వివాహితపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన స్థానికంగా కలకం సృష్టించింది. గత రాత్రి ఓ వివాహిత తన విధులు ముగించుకుని ఇంటికి వెళ్లడానికి కైరో గ్రామంలో బస్సు కోసం ఎదురుచూస్తుండగా బైక్ పై వచ్చిన యువకుడు లిఫ్ట్ ఇస్తానని చెప్పి నమ్మబలికాడు.  దీంతో ఆ యువకుడ్ని నమ్మి అతని బైక్ ఎక్కింది.

 

ఆ వివాహితను రివర్ బ్యాంక్ సమీపంలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటికే ఆ ప్రాంతానికి చేరుకున్న మరో ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. మంగళవారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. గ్రామస్తులు ఆమెకు సహకరించడంతో నిందితులను గుర్తించి, కేసు నమోదు చేశామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement