
దీపావళి రోజు దారుణం
ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో దీపావళి పండగ రోజు దారుణం జరిగింది.
మీరట్: ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో దీపావళి పండగ రోజు దారుణం జరిగింది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు యువకులు మిఠాయిలు కొనిస్తామని తీసుకెళ్లి ఇద్దరు చిన్నారులపై అత్యాచారానికి ఒడిగట్టారు.
బుధవారం సాయంత్రం బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి ముందు మూడేళ్ల చిన్నారిని ఆడుకుంటుండగా.. ఓ యువకుడు (25) తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి పరిస్థితి విషమంగా మారడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అదే రోజు సాయంత్రం పల్లవపురం ప్రాంతంలో మరో యువకుడు (20).. మోటార్ బైకుపై ఏడేళ్ల చిన్నారిని తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.