meerut
-
మేము ఇద్దరం జైల్లో కూడా కలిసే ఉంటాం..!
ఉత్తర ప్రదేశ్ మీరట్కు చెందిన మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్పుత్ మర్డర్ కేసులో వెన్నులో వణుకు పుట్టించే విషయాలు వెలుగులోకి చూస్తుండగా.. ముస్కాన్ రాక్షసత్వంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. భర్తను చంపాక అతనితో జాలీగా ట్రిప్పులు వేసిన ముస్కాన్.. అతని పుట్టినరోజుతో పాటు హోలీ పార్టీ కూడా జరుపుకుంది. అయితే ఈ కేసులో వీరద్దర్నీ అరెస్ట్ చేసి ప్రస్తుతం పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. దీనిలో భాగంగా చౌదరి చరణ్ సింగ్ జైల్ లో ఉన్న వీరిని పోలీసులు విచారిస్తున్నారు.జైల్లో కూడా కలిసే ఉంటామని..భర్తను హత్య చేసి జైలు పాలయ్యానన్న కనీస పశ్చాత్తాపం కూడా ముస్కాన్ లో కనిపించడం లేదు. జైల్లో కూడా తామిద్దరం కలిసే ఉంటామని పట్టుబట్టారు. ఇద్దర్నీ వేరు వేరు సెల్ లో వేయకండి.. తాము ఇద్దరం ఒకే చోట ఉంటామంటూ పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయితే ఇది జైలు నియమాలకు విరుద్ధమని, ఇలా ఒక పురుషుడు, ఒక మహిళ కలిసి ఉండటం సాధ్యం కాదని సదరు అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకూ వారిద్దరితో మిగతా ఖైదీలు ఎవరూ మాట్లాడలేదని జైలు సూపరెండెంట్ విరేష్ రాజ్ శర్మ తెలిపారు. తొలిరోజు వీరు ఏమీ తినలేదని, తర్వాత నుంచి భోజనం చేస్తున్నారన్నారు. అయితే ఒకే సెల్ లో ఉంచాలని కోరినట్లు విరేష్ రాజ్ శర్మ పేర్కొన్నారు. ఇది విరుద్దం కావడంతో వారి అభ్యర్థనను తిరస్కరించినట్లు చెప్పారు. వీరిద్దరికి సెపరేట్ బారక్ లు ఇచ్చామని, దాంతో వారు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఉండదన్నారు.వీరిద్దరూ డ్రగ్స్కు బానిసలువీరిద్దరూ డ్రగ్స్ కు బానిసలైన సంగతని విరేష్ రాజ్ శర్మ పేర్కొన్నారు. మెడికల్ రిపోర్ట్ లు ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా వీరికి ట్రీట్ మెంట్ కు కూడా ఇప్పించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఇండియన్ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి తెలియజేశారు.మాకు లాయర్ ను ఏర్పాటు చేయండితమ తరఫున వాదించడానికి లాయర్ కావాలని విజ్ఞప్తి చేశారు ఆ నిందితులిద్దరూ. తమ కుటుంబానికి న్యాయవాదిని ఏర్పాటు చేసుకునే స్థోమత లేదని, అందుచేత తమ తరఫున వాదించడానికి ప్రత్యేక గవర్నమెంట్ లాయర్ ను ఏర్పాటు చేయాలని చెప్పినట్లు మరో సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.#WATCH | Saurabh Rajput murder case | On accused Muskan Rastogi and Sahil Shukla, Senior Jail Superintendent Viresh Raj Sharma says, "They arrived 3 days ago and they said that they be lodged together or nearby barracks. They were told that as per the system in jail, there is no… pic.twitter.com/5vKpgzXEe0— ANI (@ANI) March 23, 2025ప్రియుడితో కలిసి భర్త హత్యసౌరభ్ గుండెల్లో కత్తితో మూడు సార్లు పొడిచింది. కత్తి లోతుగా అతడి గుండెల్లో దిగబడింది. ముస్కాన్ అతి దారుణంగా సౌరభ్ గుండెను చీల్చి పడేసింది. తర్వాత తలను శరీరంనుంచి వేరు చేసింది. శరీరాన్ని ముక్కలుముక్కలుగా కొసి పడేసింది. ముక్కల్ని డ్రమ్లో పడేసింది. ముస్కాన్ చేసిన దారుణం తెలిసి డాక్టర్లే షాక్ అయిపోయారు.ఇక, పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. ముస్కాన్ పినతల్లిని కలిశారు. ఆమె ముస్కాన్పై ఫైర్ అయింది. చేసిన ఘోరానికి తన కూతురికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేసింది. ఈ దారుణంలో ముస్కాన్ హస్తంతో పాటు ఆమె ప్రియుడు సాహిల్ హస్తం కూడా ఉంది. ఇద్దరూ కలిసి, పక్కా ప్లాన్ ప్రకారం సౌరభ్ను చంపేశారు. మృతదేహాన్ని కనిపించకుండా చేసి తప్పించుకుందామనుకున్నారు. చాలా నాటకాలు ఆడారు. అవేవీ ఫలించలేదు. సౌరభ్ తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సౌరభ్ గురించి ఎంక్వైరీ చేయగా.. మర్డర్ విషయం బయటపడింది.ప్రేమ పెళ్లి.. ప్రియుడి కోసం..ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన సౌరభ్ రాజ్పుత్ అదే ప్రాంతానికి చెందిన ముస్కాన్ రస్తోగి ప్రేమించుకున్నారు. 2016లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత భార్యతో గడపడానికి టైం దొరకటం లేదని నేవీలో ఉద్యోగం మానేశాడు. ఇంట్లో గొడవలు అవ్వటంతో భార్యతో కలిసి వేరుకాపురం పెట్టాడు. 2019లో వీరికి ఓ ఆడపిల్ల పుట్టింది. బిడ్డపుట్టిన తర్వాత సౌరభ్కు ఓ దారుణమైన విషయం తెలిసింది. ముస్కాన్.. ఆమె స్నేహితుడు సాహిల్తో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసింది. ఈ విషయమై సౌరభ్, ముస్కాన్ల మధ్య గొడవలు అయ్యాయి. పరిస్థితి విడాకుల వరకు వెళ్లింది. కూతురు కోసం సౌరభ్ వెనక్కు తగ్గాడు. మళ్లీ జాబ్లో జాయిన్ అయ్యాడు. 2023లో విదేశానికి వెళ్లిపోయాడు. 2025 ఫిబ్రవరి నెలలో కూతురి పుట్టిన రోజు ఉండటంతో ఇండియా వచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్, సాహిల్ .. అతడ్ని చంపేశారు. ఆరేళ్ల చిన్నారి తండ్రి హత్యను కళ్లారా చూసింది.. తన తల్లి మరో వ్యక్తితో కలిసి తండ్రిని ప్లాస్టిక్ డ్రమ్ములో దాచడం గమనించింది. అయితే, అది దాచడం కాదని, నాన్నను చంపేశారని ఆ చిన్నారికి తెలియదు. మీ నాన్న ఏరమ్మా అని అడిగిన చుట్టుపక్కల వాళ్లకు ‘డ్రమ్ములో ఉన్నాడు’ అంటూ చెప్పింది. ఆ మాటల వెనకున్న విషాదం తెలియక చిన్నపిల్ల ఏదో చెబుతోందని వారంతా అనుకున్నారు. కానీ నిజంగానే పాప తండ్రి నిర్జీవంగా మారి డ్రమ్ములో సమాధి అయ్యాడని వారు ఊహించలేకపోయారు. -
భర్తను వదిలేస్తే పోయేది కదా!
ఆ భర్త భార్య, బిడ్డనే ప్రాణం అనుకున్నాడు. కానీ, ప్రియుడి మోజులో పడి ఆమె ఆ భర్తనే వద్దునుకుంది. అలాంటప్పుడు వదిలేసి వెళ్లిపోతే సరిపోయేది కదా అంటూ సోషల్మీడియా ఇప్పుడు కోడై కూస్తోంది. ఉత్తర ప్రదేశ్ మీరట్కు చెందిన మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్పుత్ మర్డర్ కేసులో వెన్నులో వణుకు పుట్టించే విషయాలు వెలుగులోకి చూస్తుండగా.. ముస్కాన్ రాక్షసత్వంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది.భర్తను చంపాక అతనితో జాలీగా ట్రిప్పులు వేసిన ముస్కాన్.. అతని పుట్టినరోజుతో పాటు హోలీ పార్టీ కూడా జరుపుకుంది. అందుకు సంబంధించిన దృశ్యాలే ఇప్పుడు బయటకు వస్తున్నాయి.సౌరభ్ శవానికి పోస్టుమార్టం పూర్తయింది. డ్రమ్ములో సిమెంట్తో కప్పబడిన శరీరభాగాలను డాక్టర్లు అతి కష్టం మీద బయటకు తీశారు. వాటికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం.. నిద్రమాత్రల కారణంగా సౌరభ్ గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత ముస్కాన్ తన రాక్షసత్వాన్ని బయటపెట్టింది.సౌరభ్ గుండెల్లో కత్తితో మూడు సార్లు పొడిచింది. కత్తి లోతుగా అతడి గుండెల్లో దిగబడింది. ముస్కాన్ అతి దారుణంగా సౌరభ్ గుండెను చీల్చి పడేసింది. తర్వాత తలను శరీరంనుంచి వేరు చేసింది. శరీరాన్ని ముక్కలుముక్కలుగా కొసి పడేసింది. ముక్కల్ని డ్రమ్లో పడేసింది. ముస్కాన్ చేసిన దారుణం తెలిసి డాక్టర్లే షాక్ అయిపోయారు.ఇక, పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. ముస్కాన్ పినతల్లిని కలిశారు. ఆమె ముస్కాన్పై ఫైర్ అయింది. చేసిన ఘోరానికి తన కూతురికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేసింది. ఈ దారుణంలో ముస్కాన్ హస్తంతో పాటు ఆమె ప్రియుడు సాహిల్ హస్తం కూడా ఉంది. ఇద్దరూ కలిసి, పక్కా ప్లాన్ ప్రకారం సౌరభ్ను చంపేశారు. మృతదేహాన్ని కనిపించకుండా చేసి తప్పించుకుందామనుకున్నారు. చాలా నాటకాలు ఆడారు. అవేవీ ఫలించలేదు. సౌరభ్ తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సౌరభ్ గురించి ఎంక్వైరీ చేయగా.. మర్డర్ విషయం బయటపడింది.ప్రేమ పెళ్లి.. ప్రియుడి కోసం..ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన సౌరభ్ రాజ్పుత్ అదే ప్రాంతానికి చెందిన ముస్కాన్ రస్తోగి ప్రేమించుకున్నారు. 2016లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత భార్యతో గడపడానికి టైం దొరకటం లేదని నేవీలో ఉద్యోగం మానేశాడు. ఇంట్లో గొడవలు అవ్వటంతో భార్యతో కలిసి వేరుకాపురం పెట్టాడు. 2019లో వీరికి ఓ ఆడపిల్ల పుట్టింది. బిడ్డపుట్టిన తర్వాత సౌరభ్కు ఓ దారుణమైన విషయం తెలిసింది. ముస్కాన్.. ఆమె స్నేహితుడు సాహిల్తో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసింది. ఈ విషయమై సౌరభ్, ముస్కాన్ల మధ్య గొడవలు అయ్యాయి. పరిస్థితి విడాకుల వరకు వెళ్లింది. కూతురు కోసం సౌరభ్ వెనక్కు తగ్గాడు. మళ్లీ జాబ్లో జాయిన్ అయ్యాడు. 2023లో విదేశానికి వెళ్లిపోయాడు. 2025 ఫిబ్రవరి నెలలో కూతురి పుట్టిన రోజు ఉండటంతో ఇండియా వచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్, సాహిల్ .. అతడ్ని చంపేశారు. ప్రియుడితో కలిసి మనాలికిభర్తను హత్య చేసిన తర్వాత ప్రియుడితో కలిసి మనాలికి వచ్చిన ముస్కాన్.. ఆపై ట్యాక్సీలో కాసోల్ లోని తమ హెటల్ కు వచ్చినట్లు స్టాఫ్ ఒకరు తెలిపారు. హెటల్ లో రూమ్ తీసుకున్న తర్వాత రోజులో ఒకసారి మాత్రమే బయటకు వచ్చి చాలా స్వల్ప సమయం మాత్రమే ఉన్నారని హోటల్ స్టాఫ్ లో మరొకరు తెలిపారు.నా వైఫ్ అంటూ సిబ్బందితో గొడవహోటల్ చెక్ ఇన్ లో భాగంగా ఇద్దరి ఐడీ కార్డులను పరిశీలించే క్రమంలో ముస్కాన్ ప్రియుడు ఐడీ కార్డు చూపించాడు. ఆపై ఆమె ఐడీ కార్డును చూసేటప్పుడు హోటల్ సిబ్బంది చేతుల్లోంచి ఆ కార్డును లాక్కొని తన భార్య అంటూ వారితో వాదనకు దిగాడు. ఆపై కొంత ఒత్తిడి తర్వాత ముస్కాన్ ఐడీ కార్డు కార్డును కు ఇచ్చినట్లు సిబ్బంది పేర్కొన్నారు.ఆరు రోజులు రూమ్ లోనే..వారు వచ్చిన తర్వాత ఆరు రోజులు రూమ్ తీసుకున్నారని, ఎక్కడికి వెళ్లకుండా రూమ్ లోనే ఉండిపోయేవారని హోటల్ సిబ్బంది తెలిపారు. సాధారణంగా ఎవరైనా మనాలికి వస్తే కొన్ని ప్లేస్ లకు వెళతారని కానీ వీరు అలా వెళ్లకుండా రూమ్ లోనే గడిపేవారన్నారు. ఫుడ్ ను ఒక్కసారే ఆర్డర్ చేసేవారని, క్లీనింగ్ కి కూడా ఒక్కసారే అనుమతి ఇచ్చేవారని సిబ్బంది తెలిపారు. అసలు బయటకు వచ్చేవారు కాదని, అనుమానం రాకుండా ఉండటానికి కేవలం ఏదొకసారి వచ్చి లోపలికి వెళ్లిపోయేవారట. మార్చి 16వ తేదీన వారు హోటల్ ను వెళ్లిపోయారని, వెళ్లే క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ కు తిరిగి వెళ్లిపోతున్నట్లు తమకు తెలిపారని స్టాఫ్ లో ఒకరు తెలిపారు. -
పెద్దలను కాదని ఆమెతో ప్రేమ పెళ్లి.. అతడి పరిచయంతో సీన్ రివర్స్..
లక్నో: ఆమెను ఎంతో ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకోవడమే అతడి ప్రాణాలు తీసింది. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను భార్య దారుణంగా హత్య చేసింది. ప్రియుడితో కలిసి భర్తను ప్లాన్ ప్రకారం హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కులుగా చేసి శరీర భాగాలను సిమెంట్తో కలిపిన ప్లాస్టిక్ డ్రమ్లో కప్పి పెట్టారు. ఈ క్రైమ్ సీన్ చూసి అక్కడికి వెళ్లిన పోలీసులే ఖంగుతిన్నారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. యూపీలోని మీరట్కు చెందిన సౌరవ్ కుమార్ మర్చంట్ నేవీలో పనిచేస్తున్నాడు. సౌరవ్.. ముస్కాన్ను ప్రేమించి 2016లో ఆమెను వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో సౌరవ్కు, తన కుటుంబ సభ్యులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో, మూడు సంవత్సరాల క్రితం, సౌరభ్ తన భార్య ముస్కాన్తో కలిసి ఇందిరానగర్లోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరికీ రెండో తరగతి చదువుతున్న 5 సంవత్సరాల కుమార్తె కూడా ఉన్నట్లు తెలుస్తోంది.చిగురించిన మరో ప్రేమ..అయితే, నేవీలో పనిచేస్తున్న కారణంగా సౌరవ్.. విధులకు వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలోనే ముస్కాన్కు సాహిల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా ప్రేమకు దారితీసింది. దీంతో, వారిద్దరి శారీరక సంబంధం కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ అడ్డుగా ఉన్న భర్త సౌరవ్ను అడ్డుతొలగించుకోవాలని భావించారు. దీని కోసం సౌరవ్ను హత్య చేయాలని ప్లాన్ చేశారు. ఈ సందర్బంగా సౌరవ్ మార్చి 4న మీరట్ ఇందిరానగర్లోని వచ్చిన వెంటనే అతడిని హత్య చేశారు. అనంతరం, మృతదేహాన్ని ముక్కులుగా చేసి శరీర భాగాలను సిమెంట్తో కలిపిన ప్లాస్టిక్ డ్రమ్లో దాచిపెట్టారు.#Meerut: Wife Muskan Rastogi along with her boyfriend Sahil Shukla stabbed her husband Saurabh Rajput,The two then chopped up his body into 15 pieces, placed the remains in a drum, and sealed it with cement. After committing the crime, she allegedly went on a vacation with sahil. pic.twitter.com/qs6xnwWpa0— Dilip Kumar (@PDilip_kumar) March 19, 2025పక్కా ప్లాన్తో హత్య..మరోవైపు.. భర్తను హతమార్చేందుకు ప్లాన్ వేసిన ముస్కాన్.. భర్తతో కలిసి హిమాచల్ ప్రదేశ్ వెళ్తున్నానని పొరుగువారికి చెప్పింది. దీంతో, వారికి ఎలాంటి అనుమానం రాలేదు. తర్వాత ముస్కాన్ ఒక్కరే కనిపించడంతో సౌరవ్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా.. ముస్కాన్ను అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. భార్య ముస్కాన్, ఆమె ప్రేమికుడు సాహిల్ కలిసి సౌరభ్ను హత్య చేసినట్లు తేలింది. అతని మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో ఉంచి, ఆపై సిమెంట్ ద్రావణాన్ని తయారు చేసి డ్రమ్ములో పోశారు. దీని కారణంగా మృతదేహం లోపల గడ్డకట్టిందని పోలీసులు తెలిపారు. This is very painful,Saurabh Kumar, who works in the Merchant Navy, had a love marriage with his wife. He had come to #UttarPradesh's #Meerut from #London 22 days ago.In Meerut, his wife along with her boyfriend killed Saurabh. Both of them cut the body into pieces and1/2 pic.twitter.com/gdiwwaZDHP— Siraj Noorani (@sirajnoorani) March 18, 2025 -
లోన్ తీసుకుని మరీ మరదలు హత్యకు సుపారీ
ముజఫర్నగర్: లోన్ తీసుకుని మరీ.. మరదలిపై సామూహి క అత్యాచారం, హత్య చేయించాడో ప్రభుద్ధుడు. ఈ దారుణ ఘటన యూపీలోని మీరట్లో జరిగింది. ముజఫర్నగర్కు చెందిన ఆశిష్ అనే వ్యక్తి.. తన భార్య చెల్లెలితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు.. ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. చంపేంత ధైర్యం ఒక్కడికే లేదు. అందుకోసం ఇద్దరు మనుషులను మాట్లాడుకున్నాడు. వారికి చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో రూ.40 వేలు అప్పుగా తీసుకుని మరీ శుభమ్, అతని స్నేహితుడు దీపక్కు చెల్లించాడు. జనవరి 21న బాధితురాలికి కాల్ చేసి రప్పించారు. స్కూటర్పై మీరట్లోని నాను కాలువ సమీపంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత కండువాతో గొంతు నులిమి చంపేశారు. మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టి.. ఎక్కడి వాళ్లక్కడ వెళ్లిపోయారు. 21న ఇంటి నుంచి వెళ్లిపోయిన అమ్మాయి ఎంతకీ రాకపోవడం, ఫోన్ పనిచేయకపోవడంతో జనవరి 23న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె చివరిసారి ఆశిష్, శుభం, దీపక్లతో కనిపించినట్లు తేలింది. ఆశిశ్ను విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు. మరదలు బ్లాక్మెయిల్ చేయడంవల్లే చంపాల్సి వచ్చిందని చెప్పాడు. ఘటనా స్థలం నుంచి బాధితురాలి అవశేషాలు, కాలిపోయిన దుస్తులు, ఉంగరం, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
మీరట్లో దారుణం
మీరట్: ఉత్తరప్రదేశ్లోని మీరట్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. దంపతులు, వారి 8 ఏళ్లలోపు ముగ్గురు కుమార్తెలు దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది. పాత గొడవలే ఈ దారుణానికి కారణమని భావిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. లిసారి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుహైల్ గార్డెన్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఇటీవలే మొయిన్ అలియాన్ మోయినుద్దీన్(52), అస్మా(45)దంపతులు అద్దెకు దిగారు. వీరికి ముగ్గురు కుమార్తెలు అఫ్సా(8), అజిజా(4), అడీబా(1)ఉన్నారు. మొయిన్ దంపతులు బుధవారం నుంచి కనిపించకపోవడంతో అస్మా సోదరుడు షమీమ్, మొయిన్ సోదరుడు సలీ వారుండే ఇంటికి వచ్చి చూడగా బయట తాళం వేసి ఉంది. శుక్రవారం అతికష్టమ్మీద ఇంటి పైకప్పును తొలగించి, లోపలికి వెళ్లి చూడగా భయానక దృశ్యాలు కనిపించాయి. పడుకునే మంచానికి ఉన్న అరలో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు కుక్కి ఉండగా దంపతులను బెడ్షీట్లో చుట్టి పడేశారు. వీరి కాళ్లు కట్టేసి ఉన్నాయి. షమీమ్, సలీమ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అస్మా చిన్న మరదలు, ఆమె ఇద్దరు సోదరులతోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో అనుమానితుడి కోసం గాలింపు చేపట్టారు. ఇది తెలిసిన వారి పనే కావొచ్చని పోలీసులు తెలిపారు. -
పెళ్లి కాని జంటలకు ఓయో రూమ్ కష్టమే
న్యూఢిల్లీ: ప్రముఖ ప్రయాణ బుకింగ్స్ వ్యాపార సంస్థ ఓయో కొత్తగా తమ భాగస్వామ్య హోటళ్లలో దిగే వినియోగదారులకు నూతన నిబంధనలను అమల్లోకి తెస్తోంది. తొలుత మీరట్ పట్టణంలో మాత్రమే ఈ కొత్త చెక్–ఇన్ నియమావళిని అమలుచేస్తోంది. పెళ్లికాని జంటలకు హోటల్ గది ఇవ్వడం ఇకపై కుదరదని తేల్చిచెప్పింది. సవరించిన నిబంధనావళి ప్రకారం ఎవరైనా జంట హోటల్ గదిని బుక్చేయాలనుకుంటే తమ వివాహబంధాన్ని ధృవీకరిస్తూ ఏదైనా గుర్తింపును చూపాల్సి ఉంటుంది. స్థానిక సామాజిక సున్నితాంశాలను పరిగణనలోకి తీసుకుని గదిని ఎవరికి ఇవ్వాలి ఇవ్వకూడదు అనే విచక్షణాధికారం ఆయా హోటళ్లకు ఉందని ఓయో ఒక ప్రకటనలో పేర్కొంది. కొత్త చెక్–ఇన్ నిబంధనలపై ఫీడ్బ్యాక్ తీసుకుని తదనుగుణంగా సవరించిన నియామావళిని దేశవ్యాప్తంగా త్వరలో అమలుచేసే యోచన ఉందని ఓయో పేర్కొంది. ‘‘అత్యంత సురక్షితమైన, భద్రమైన, మెరుగైన హోటల్ సేవలు అందించే లక్ష్యంతో కొత్త నిబంధనావళిని తెస్తున్నాం. వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు విలువ ఇస్తూనే పౌరసమాజాల విజ్ఞప్తులు, వినతులను పరిగణనలోకి తీసుకుని మేం పనిచేయాల్సి ఉంటుంది. కుటుంబాలు, విద్యార్థులు, ఒంటరిగా ప్రయాణాలు చేసే పర్యాటకులు, సందర్శకులు, వ్యాపారుల సౌకర్యార్థం కొత్త నియమావళిని తెస్తున్నాం’అని ఓయో నార్త్ ఇండియా రీజియన్ హెడ్ పవాస్ శర్మ చెప్పారు. ‘‘మెరుగైన, పటిష్ట నిబంధనల కారణంగా వినియోగదారుల్లో మా పట్ల విశ్వాసం మరింత పెరుగుతుంది. అప్పుడు ఎక్కువ రోజులు గదులు అద్దెకు తీసుకోవడం, మళ్లీ మళ్లీ బుక్ చేయడం వంటివి చేస్తారు’’అని ఆయన అన్నారు. అనైతిక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న హోటళ్లపై చర్యలు తీసుకోవడం, వాటిని నిషేధించడం, తమ బ్రాండ్ పేరును అనధికారికంగా వాడుకోవడం, దుర్వినియోగం చేయడం వంటి వాటిపై ఓయో సంస్థ.. హోటళ్ల భాగస్వాములు, పోలీసులతో కలిసి పనిచేస్తోంది. ఇందుకోసం సంస్థ ఇప్పటికే దేశవ్యాప్తంగా సంయుక్తంగా పలు సెమినార్లను నిర్వహించింది. -
ఓయో సంచలన నిర్ణయం.. ఆ జంటలకు నో రూమ్
ప్రముఖ ట్రావెల్, హోటల్ బుకింగ్ ప్లాట్ఫామ్ ఓయో (OYO) పెళ్లికాని జంటలకు షాకిచ్చింది. ఇకపై పెళ్లి కాని జంటలకు రూమ్స్ బుకింగ్స్ లేదంటూ తేల్చిచెప్పింది. ఈమేరకు తన భాగస్వామి హోటల్లకు చెక్ ఇన్ పాలసీలో కీలక మార్పులు తీసుకొచ్చింది.ఇకపై పెళ్లి కాని యువతీ, యువకులు ఓయో రూమ్స్ లో చెక్ ఇన్ చేసేటప్పుడు వారి రిలేషన్షిప్కు సంబంధించిన చెల్లుబాటు అయ్యే ఐడీ ప్రూఫ్స్ అడగనుంది. సరైన ఐడీ ప్రూఫ్ లేకపోతే బుకింగ్స్ను తిరస్కరించే అధికారాన్ని పార్టనర్ హోటల్స్కు ఇస్తున్నట్టు ఓయో చెప్పుకొచ్చింది.మొదటగా మీరట్ నుంచి..మొదటగా ఉత్తరప్రదేశ్ మీరట్లోని ఓయో భాగస్వామి హోటల్స్లో కొత్త చెక్ ఇన్ పాలసీని ప్రారంభించింది. అక్కడ నుంచి వచ్చే గ్రౌండ్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా కంపెనీ ఈ కొత్త రూల్ని దేశంలోని మరిన్ని నగరాలలో అమలు చేయనుంది. ఇటీవల కొత్త సంవత్సరం సందర్భంగా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ఓయో రూమ్స్ ఉపయోగించిన వారి సంఖ్య 10 లక్షలు దాటింది. 2023తో పోలిస్తే ఈ సంఖ్య 58 శాతం పెరిగింది.పెళ్లికాని జంటలు విచ్చలవిడిగా ఓయో రూమ్స్ను దుర్వినియోగం చేస్తున్నారని, దీన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని పౌర సమాజ సమూహాల నుంచి అభ్యర్థనలు వచ్చాయి. ఓయో రూమ్స్ దుర్వినియోగంపై ముఖ్యంగా మీరట్లో పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయి. దీంతో అక్కడ నుంచే ఓయో కొత్త చెక్ ఇన్ పాలసీని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఓయోపై ఉన్న పాత అభిప్రాయాలను మార్చడం, కుటుంబాలు, విద్యార్థులు, వ్యాపార వర్గాలు, మతపరమైన, ఒంటరి ప్రయాణీకులకు సురక్షితమైన అనుభూతిని అందించే బ్రాండ్గా తనను తాను రూపొందించుకోవడం లక్ష్యంగా కంపెనీ ఈ చొరవ తీసుకున్నట్లు ఓయో నార్త్ ఇండియా రీజియన్ హెడ్ పవాస్ శర్మ పేర్కొన్నారు.సురక్షితమైన ఆతిథ్య పద్ధతులపై పోలీసులు, హోటల్ భాగస్వాములతో కలిసి సదస్సులను నిర్వహించడంతోపాటు అనైతిక కార్యకలాపాలను ప్రోత్సహించే హోటళ్లను బ్లాక్లిస్ట్ చేయడం, ఓయో బ్రాండింగ్ని అనధికారిక ఉపయోగించే హోటళ్లపై చర్యలు తీసుకోవడం వంటి అనేక దేశవ్యాప్త కార్యక్రమాలను ఓయో ప్రారంభించింది. -
కారుపై మట్టితో యువకుడి స్టంట్.. పోలీసుల దెబ్బకు తిక్క కుదిరింది!
సోషల్ మీడియా వినియోగం పెరగడంతో ప్రతిఒక్కరూ క్రేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. షార్ట్స్, రీల్స్ చేస్తూ తొందరగా పాపులారిటీ తెచ్చుకోవాలని ఉబలాటపడుతున్నారు. ఈ క్రమంలో పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా యువత స్టంట్ల పేరుతో ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు.తాజాగా ఓ వ్యక్తి తన కారుతో విచిత్రమైన ప్రయోగం చేసి చిక్కుల్లో పడ్డాడు. ఉత్తర ప్రదేశ్లోని మీరట్లో ఈ ఘటన జరిగింది. ముందలి గ్రామానికి చెందిన ఇంతేజార్ అలీ అనే వ్యక్తి తన మహీంద్రా థార్ కారు పైకప్పుపై పార సాయంతో మట్టిని నింపాడు. తర్వాత రోడ్డు మీద రాంగ్ రూట్లో అతివేగంతో ప్రయాణించాడు. దీంతో గాలికి ఆ మట్టి పైకి ఎగిరింది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింటా వైరల్గా మారాయి.ఈ వీడియోను చూసిన అనేక మంది స్టంట్ చేసిన యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ పుటేజీ అధారంగా యువకుడిని మీరట్ పోలీసులు పట్టుకున్నారు. అతనిక రూ. 25 వేల చలాన్ విధించారు. मेरठ में THAR पर मिट्टी चढ़ाकर युवक ने दिखाया स्टंटpic.twitter.com/PqBGtMJ935— Priya singh (@priyarajputlive) November 29, 2024 -
యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ని తలపిస్తూ..కొత్త పెళ్లికొడుకు సాహసం, వైరల్ వీడియో
కాబోయే భార్యను తలచుకుంటూ ముసి ముసి నవ్వులతో పెళ్లి కొడుకు దేవ్ కుమార్ గుర్రమెక్కి పెళ్లి మంటపానికి బందు మిత్ర సపరివారంగా తరలి వెళ్లాడు. బాజా భజంత్రీల సమక్షంలో అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశాడు. కొత్తభార్యతో ఆనందంగా ఇంటికి బయలుదేరాడు. మెడలో మెరిసిపోతున్న కరెన్సీ మాలను చూసుకుంటున్నాడు. ఇంతలో ఎక్కడనుంచి వచ్చాడో తెలియదు ఆగంతకుడు. పెళ్లి కొడుకు మెడలోని కరెన్సీ దండలోని 100 రూపాయలనోటను అమాంతం ఎగరేసుకుపోయాడు ఘొక మినీ ట్రక్ డ్రైవర్ కాజేశాడు. ఒక్క క్షణం బిత్తరపోయినా, వెంటనే తేరుకుని అత్యత సాహసంగా అతణ్ణి వెంబడించి పట్టుకున్నాడు. బాలీవుడ్ బ్లాక్బస్టర్ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్గా సాగిన ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.పియూష్ రాయ్ అనే జర్నలిస్టు ఈ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. దీని ప్రకారం. తన మెడలోని నోట్ల దండను ట్రక్ డ్రైవర్ కొట్టేయడంతో వెంటనే అప్రమత్తమైన వరుడు పెళ్లీ, గిళ్లీ తరువాత చూద్దాం అనుకున్నాడో ఏమో గానీ, నగదు దండను చోరీ చేసిన డ్రైవర్ను పట్టుకునేందుకు రంగంలోకి దిగిపోయాడు. హైవేపై ట్రక్ను వెంబడించాడు. అత్యంత సాహసంతో స్టంట్మ్యాన్లాగా ట్రక్పైకి దూకాడు. చాకచక్యంగా క్యాబిన్లోకి ప్రవేశించి అతగాడిని దొరకబుచ్చుకున్నాడు. నాలుగు తగిలించాడు. ఇంతులో అతని వెనకాలే ఫాలో అయిన స్నేహితులు, చుట్టుపక్కల వాళ్లు కూడా తోడయ్యాడు. దీంతో పొరపాటు జరిగిందని వదిలేయాలంటూ లబోదిబో మన్నాడు. దీంతో దేవ్ కుమార్ హీరోగా అయిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు పన్నీ కామెంట్లను షేర్ చేశారు. దెబ్బకి పెళ్లి కూతురు ఫిదా అని ఒకరు, కొత్త పెళ్లి కూతురు స్పైడర్ మాన్ స్పైడర్ మాన్ నా మనసు దోచేశావ్ అని పాడుకుంటుందేమో అని మరికొందరు వ్యాఖ్యానించారు. మరోవైపు పెళ్లి రాత్రిని తప్పించుకోవడానికి వరుడు ఇలా ప్లాన్ చేసి ఉంటాడని కొందరు, ఇంత చేసినా అమ్మాయి ఇంప్రెస్ అవుతుందా అని ఇంకొందరు ఫన్నీగా కమెంట్ చేశారు. <Video of the year! In UP's Meerut, groom Dev Kumar was happily getting home after the wedding when a pick up driver pinched a note from his currency tucked garland. What followed was a near Bollywood, daring chase for justice! Groom Dev Kumar asked for lift from a motorist,… pic.twitter.com/libIH8PRTT— Piyush Rai (@Benarasiyaa) November 25, 2024రవాణా సంస్థ ప్రకటనట్రక్ స్థానిక రవాణా సంస్థకు చెందినది, దీని యజమాని మనీష్ సెహగల్ ఈ సంఘటనపై భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ట్రక్ డ్రైవర్ దొంగ కాదని, దొంగతనంతో అతనికి ఎటువంటి సంబంధం లేదని వాదించారు. అతని వాహనానికి వ్యతికేంగా వేగంగా దూసుకురావడం వల్లే పెళ్లి ఇలా చేశాడని ఆరోపించారు. ఎలాంటి సంబంధం లేనప్పటికీ వరుడు , అతని స్నేహితులు డ్రైవర్పై దాడి చేశారని సెహగల్ ఆరోపించారు. దీంతో ఏం జరిగిందో స్పష్టత లేక బుర్ర గోక్కుంటున్నారట స్థానిక పోలీసులు. ప్రస్తుతానికి ఈ వ్యవహారంపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. -
మహిళ హత్య.. సుపారీ డబ్బులు ఇవ్వలేదని ట్విస్ట్ ఇచ్చిన కిల్లర్
లక్నో: సుపారీ సొమ్ము అందలేదని.. హత్య చేసిన వ్యక్తే పోలీస్ స్టేషన్కు వచ్చి కేసు పెట్టిన ఘటన ఉత్తర ప్రదేశ్లో వెలుగు చూసింది. ఏడాది క్రితం హత్య చేసిన కేసులో.. సుపారీ ఇచ్చిన వారి నుంచి డబ్బులు చెల్లించలేదని వారిపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఖంగుతున్నారు. దీంతో పాత హత్య కేసును తాజాగా రీఓపెన్ చేశారు.వివరాలు.. 2023 జూన్ 7న మీరఠ్లోని చెందిన అంజలి అనే న్యాయవాది ఇంటికి వస్తుండగా ఇద్దరు దుండగులు కాల్చిచంపారు. ఆస్తి వివాదంలో భాగంగా అత్తింటివారే ఆమెను హత్య చేయించారనే కోణంలో పోలీసులు ఆమె మాజీ భర్త, అత్తమామలను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. వారి ప్రమేయానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారిని వదిలేశారు. తరువాత కొన్ని రోజులకు పోలీసులు ఇద్దరు షూటర్లు నీరజ్ శర్మ, యశ్పాల్ను అరెస్టు చేశారు.బాధితురాలు తన మాజీ భర్త నితిన్ గుప్తా పేరుతో ఉన్న ఇంట్లో నివసిస్తోంది. అయితే ఆ ఇంటిని ఆమె అత్తమామలు యశ్పాల్, సురేష్ భాటియాకు విక్రయించారు. కాని మహిళ ఇల్లు ఖాళీ చేయడానికి సిద్ధంగా లేకపోవడంతో వివాదం ఏర్పడింది. దీంతో ఆస్తి కొనుగోలుదారులు అంజలిని చంపడానికి రూ. రెండు లక్షల సుపారీ కుదుర్చుకున్నట్లు తేలింది. దీంతో యశ్పాల్, భాటియా, నీరజ్ శర్మ, ఇద్దరు హంతకులు సహా ఐదుగురిని అరెస్టు చేశారు. అయితే ఇది జరిగిన ఏడాది తర్వాత బెయిల్పై విడుదలైన నీరజ్ శర్మ..పోలీసు స్టేషన్లో కేసు పెట్టాడు. మృతురాలి భర్త, అత్తింటివారే ఈ హత్య చేయించినట్లు చెప్పాడు.ఇందు కోసం తమ మధ్య రూ.20 లక్షలకు ఒప్పందం కుదిరిందని వెల్లడించాడు. అడ్వాన్స్గా ఒక లక్ష ఇచ్చారని, మిగతా సొమ్ము అందలేదని తెలిపాడు. అయిత, ఇప్పుడు జైలు నుంచి బయటకు రావడంతో మిగిలిన మొత్తం కోసం బాధితురాలి అత్తమామలను సంప్రదించగా వారు నిరాకరించారని శర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో అంజలి హత్యలో ప్రధాన కుట్రదారులైన ఆమె భర్త, అత్తమామలు, మరో బంధువుపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరాడు. కాంట్రాక్ట్ హత్యకు సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులకు అందించాడు. దీంతో నీరజ్ ఫిర్యాదుపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి వెల్లడించారు -
అటు అమ్మాయి, ఇటు వ్యాపారం, ఇలాంటి పెళ్లి ప్రకటన ఎపుడైనా చూశారా?
పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టు చూడు అన్నది మనం ఎప్పటినుంచో వింటున్న సామెత. కానీ ఒక యువకుడు తన పెళ్లి కోసం వినూత్నంగా ప్రయత్నించాడు. కూటికోసం కాదు.. కాదు.. కళ్యాణం కోసం కోటి విద్యలు అన్నట్టు మ్యాట్రిమోనియల్ సైట్లో ఒక ప్రకటన ఇచ్చాడు. తనవ్యక్తిగత వివరాలతోపాటు, ఆదాయం గురించి చెప్పాడు. అంతేకాదు ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన 26 ఏళ్ల ఇన్వెస్టర్ పెళ్లి ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయిఒడ్డూ పొడుగు, ఇతర వివరాలతో పాటు తాను సంవత్సరానికి 29 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నాడు. అలాగే తన ఆదాయం ప్రతీ ఏడాదీ 54 శాతం వృద్ధి చెందుతోందన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. తాను స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెట్టి బాగా లాభాలు ఆర్జిస్తున్నట్టు చెప్పుకొస్తూ తాను ఆర్థికంగా ఎలా నిలదొక్కుకున్నదీ వెల్లడించాడు. సేఫ్ ఇన్వెస్టింగ్ సంబంధించిన విజ్ఞానాన్ని స్వయంగా నేర్చుకున్నానని చెప్పాడు.అలా స్వీయ అనుభవంతో తన పెట్టుబడులు బాగా పెరిగాయని చెప్పాడు. ఆగండి.. స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. మంచి లాభాలు సాధించాలంటే తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా నా దగ్గర ఉందంటూ ఊరించాడు. "సురక్షిత పెట్టుబడి"కి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటూ ఆఫర్ చేశాడు. ఆసక్తి ఉన్న ఎవరికైనా 16-స్లయిడ్ ప్రెజెంటేషన్ వాట్సాప్ ద్వారా పంపిస్తానని ప్రకటించాడు.What all bull market does to people. Rough calculations show that he was 10 year old when 2008 GFC hit us. @ActusDei - maybe someone from your team should reach out to him. Not for matrimonial but for that ppt! 😉 pic.twitter.com/9jAquIy1co— Samit Singh (@kumarsamit) October 6, 2024మాజీ-బ్యాంకర్ సమిత్ సింగ్ ఎక్స్లో ఈ పోస్ట్ను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు అంతా బిజినెస్ భాషలోనే కమెంట్లు వెల్లువెత్తాయి. "షార్ట్ సెల్లర్ (స్టాక్మార్కెట్లో షేర్ నష్టపోతుంది తెలిసి ముందే అమ్మేయడం) ఇన్వెస్టర్లా కనిపిస్తున్నాడు అని ఒకరు, విన్-విన్ సిట్యువేషన్ని టార్గెట్ చేసినట్టున్నాడు, అటు అమ్మాయిని వెదుక్కోవడం ఇటు, తన పవర్పాయింట్ ప్రెజెంటేషన్ను కూడా ప్రచారం చేసుకోవడం రెండూ ఒకేసారి చేస్తున్నాడు అంటూ మరొకరు కమెంట్ చేశారు. ‘‘అమ్మో..ఇతగాడు తొందర్లోనే వారెన్ బఫెట్ అయిపోయేలా ఉన్నాడు’’, ‘‘అమ్మాయి లక్షణాలకు సంబంధించిఎలాంటి డిమాండ్ లేదట.. అంటే కాల్ ఆప్షన్’’ అన్నమాట, ‘‘ఇదేదో మోసంలా ఉంది, జాగ్రత్తగా ఉండాలి..’’ఇలా రకరకాల కమెంట్స్ పోస్ట్ చేశారు. మొత్తానికి పీపీటి కమ్, మేట్రిమోనియల్యాడ్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. -
మూడంతస్తుల భవనం కూలి ముగ్గురు మృతి
మీరట్: ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లా హెడ్ క్వార్టర్స్లోని జనసాంద్రత అధికంగా ఉండే జాకీర్ కాలనీలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఆరుగురు శిథిలాల కింద చిక్కుకున్నారని స్థానికులు అంటున్నారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.అకస్మాత్తుగా ఇల్లు కూలిపోవడంతో 12 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు, శిథిలాల నుండి మొత్తం ఆరుగురిని వెలికితీశారు. వారిలో ముగ్గురు మృతిచెందారు. గాయపడిన ముగ్గురిని లాలా లజపతి రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజీకి తరలించారు.మీరట్ డిఎం దీపక్ మీనా మీడియాతో మాట్లాడుతూ సంఘటనా స్థలంలో ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయన్నారు. వర్షం కారణంగా రెస్క్యూ ఆపరేషన్కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. మీరట్ జిల్లా మేజిస్ట్రేట్ దీపక్ మీనా జాకీర్ కాలనీలోని మూడంతస్తుల ఇల్లు కూలిన విషయాన్ని ధృవీకరిస్తూ, శిథిలాల కింద ఆరుగురు సమాధి అయ్యారని తెలుస్తోందని సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు.ఇది కూడా చదవండి: చమురు ట్యాంకర్కు మంటలు -
బంతితో చెలరేగిన రింకూ సింగ్.. ఒకే ఓవర్లో మూడు వికెట్లు
ఇప్పటి వరకు తన బ్యాటింగ్ మెరుపులతో ఆకట్టుకున్న టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్.. ఇప్పుడు తన బౌలింగ్ నైపుణ్యాలతోనూ అభిమానులను ఫిదా చేస్తున్నాడు. దీంతో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఇలాగే నిలకడగా రాణిస్తే భారత జట్టుకు మరో అదనపు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ దొరికినట్టేనంటూ అతడిని ప్రశంసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన రింకూ సింగ్ యూపీ టీ20 లీగ్ 2024లో మీరట్ మెవెరిక్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.ఈ క్రమంలో సారథ్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న రింకూ... ఆల్రౌండ్ ప్రతిభతోనూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల నోయిడా సూపర్ కింగ్స్తో మ్యాచ్లో 64 పరుగులు చేయడంతో పాటు రెండు కీలక వికెట్లు తీసిన విషయం తెలిసిందే. తాజాగా కాన్పూర్ సూపర్స్టార్స్తో మ్యాచ్లోనూ మూడు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు.ఏకనా క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన మీరట్ మెవెరిక్స్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసకర ఓపెనర్గా పేరొందిన స్వస్తిక్ చికరా డకౌట్ అయ్యాడు. అయితే, మరో ఓపెనర్ అక్షయ్ దూబే సైతం 14 బంతుల్లో 11 పరుగులు చేసి నిష్క్రమించాడు.ఆ తర్వాతి స్థానంలో వచ్చిన మాధవ్ కౌశిక్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించినా.. క్రమంగా క్రీజులో పాతుకుపోయి అద్భుత ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. మాధవ్ 18, రితురాజ్ శర్మ 14 పరుగులతో ఉన్న సమయంలో వర్షం ఆటంకం కలిగించింది. ఈ క్రమంలో మ్యాచ్ను తొమ్మిది ఓవర్లకు కుదించారు. అప్పటికి మెవెరిక్స్ స్కోరు 49-2.26 బంతుల్లో 52 పరుగులువర్షం తగ్గిన తర్వాత మళ్లీ ఆట మొదలుపెట్టగా మాధవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో నిర్ణీత తొమ్మిది ఓవర్లలో మెవెరిక్స్ మూడు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.ఈ నేపథ్యంలో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం కాన్పూర్ సూపర్స్టార్స్కు 106 పరుగుల లక్ష్యం విధించారు. ఈ క్రమంలో ఐదు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసిన కాన్పూర్ టార్గెట్ ఛేదించేలా కనిపించింది. అయితే, ఆరో ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన మెవెరిక్స్ కెప్టెన్ రింకూ సింగ్.. స్పిన్ మాయాజాలంతో కాన్పూర్ బ్యాటర్లకు వరుస షాకులిచ్చాడు.ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన రింకూ సింగ్ఈ రైటార్మ్ ఆఫ్బ్రేక్ స్పిన్నర్కు ఫోర్తో స్వాగతం పలికిన శౌర్య సింగ్(5).. ఆ మరుసటి బంతికే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఆదర్శ్ సింగ్, సుధాంశుల వికెట్లు కూడా పడగొట్టాడు రింకూ. ఒకే ఓవర్లో మూడు వికెట్లు(3/7) పడగొట్టి కాన్పూర్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఈ క్రమంలో 7.4 ఓవర్లలోనే కాన్పూర్ కథ(83 రన్స్) ముగియగా.. 22 పరుగుల తేడాతో మీరట్ మెవెరిక్స్ జయభేరి మోగించింది. దీంతో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో ఐదింట గెలిచి పాయింట్ల పట్టికలో మొదటిస్థానంలో నిలిచింది. View this post on Instagram A post shared by UP T20 League (@t20uttarpradesh) -
నేటి నుంచి ర్యాపిడ్ రైలు సేవల్లో మరో ముందడుగు
దేశంలో నేటి నుంచి ర్యాపిడ్ రైలు మరింత దూరం పరుగులు తీయనుంది. ఇది ఆధునిక రైల్వే యుగంలో మరో ముందడుగు కానుంది. మీరట్ సౌత్ ఆర్ఆర్టీఎస్ స్టేషన్ నుంచి ర్యాపిడ్ రైలు రాకపోకలు ప్రారంభం కానున్నాయిని నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎన్సీఆర్టీసీ) తెలిపింది. దీంతో ఢిల్లీలోని ప్రయాణికులు ఎన్సీఆర్ నుంచి ఉత్తరప్రదేశ్లోని మీరట్ వరకు రాకపోకలు సాగించగలుగుతారు.82 కిలోమీటర్ల రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్)లో 42 కి.మీల వినియోగం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని ఎన్సీఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈరోజు (ఆదివారం) మీరట్ మొదటి స్టేషన్ మధ్యాహ్నం రెండు గంటలకు తెరుచుకోనుంది. ఇప్పటి వరకు నమో భారత్ రైలు సర్వీసులు ఘజియాబాద్ నుంచి మోదీనగర్ నార్త్ వరకు మాత్రమే నడిచేవి. ఇప్పుడు మీరట్ నగరంలో సర్వీసు ప్రారంభం కావడంతో ఘజియాబాద్, ఢిల్లీ వైపు వెళ్లే వారి ప్రయాణం మరింత సులభతరం కానుంది.ఆర్ఆర్టీఎస్ 2023, అక్టోబర్లో ఘజియాబాద్లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఘజియాబాద్లోని సాహిబాబాద్- దుహై డిపోల మధ్య 17 కిలోమీటర్ల దూరం ఉంది. ఇప్పటి వరకు ఈ మార్గంలో 22 లక్షల మంది ప్రయాణించారు. ఢిల్లీ - మీరట్ మధ్యనున్న కారిడార్లో మొత్తం 25 స్టేషన్లున్నాయి. జూన్ 2025 నాటికి ఢిల్లీ- మీరట్ మధ్య మొత్తం విస్తరణను పూర్తి చేయాలని ఎన్సీఆర్టీసీ భావిస్తోంది. -
వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్ విమర్శలు
ఉత్తరప్రదేశ్లోని మీరట్ నుంచి పోటీ చేసిన నటుడు, బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ముంబైకి వెళ్లిపోవడంపై కాంగ్రెస్ విమర్శల దాడి చేసింది. ఆయన 'పారాచూట్ రాజకీయాలు' చేస్తున్నారని ఆరోపించింది.“మీరట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఉన్న అరుణ్ గోవిల్ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజునే ముంబైకి బయలుదేరినట్లు తెలిసింది. బహుశా ఆయన ప్రజల మధ్య ఉండడానికి కష్టపడి ఉండవచ్చు. ఈ వ్యక్తి నిన్న పోలింగ్ బూత్ లోపల వీడియోగ్రఫీ చేస్తున్నారు” అని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.“అలాంటి నాయకుడు, నటుడి నుంచి దేవుడే మనల్ని రక్షించగలడు! చాలా మంది బీజేపీ నేతల విధానం ఇదే. వీరికి ప్రజల పట్ల, ప్రాంతం పట్ల పట్టింపు లేదు. వారు పారాచూట్ రాజకీయాలను మాత్రమే నమ్ముతారు” అని రాసుకొచ్చారు.టీవీ సీరియల్స్లో రాముడి పాత్రధారిగా ప్రసిద్ధి చెందిన అరుణ్ గోవిల్ కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించారు. “మార్చి 24న హోలీ నాడు భారతీయ జనతా పార్టీ నా పేరును ప్రకటించింది. వారి సూచనల మేరకు నేను మార్చి 26న మీ మధ్యకు వచ్చాను. నెల రోజుల పాటు మీతో ఉండి మీ మద్దతుతో ఎన్నికల ప్రచారం చేశాను. ఎన్నికలు పూర్తయ్యాయి. మీ ప్రేమ, మద్దతు, గౌరవానికి నేను మీకు చాలా కృతజ్ఞుడను” అంటూ ‘ఎక్స్’ ద్వారా పేర్కొన్నారు.“ఇప్పుడు, పార్టీ సూచనల మేరకు, ఇక్కడ నా బాధ్యతలను నెరవేర్చడానికి నేను ముంబైలో ఉన్నాను. ఎన్నికల ప్రచారానికి నన్ను ఇతర ప్రాంతాలకు పంపాలని పార్టీ యోచిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే, మీరట్ ప్రజలు, కార్యకర్తలతో కలిసి మీ మధ్యే ఉంటాను” అన్నారు. -
‘వారి అదృష్టం కొన్ని గంటలే’.. మరోసారి ఎస్పీ అభ్యర్థుల మార్పు
లక్నో: ఉత్తర ప్రదేశ్లో లోక్సభ ఎన్నికలకు ప్రకటించిన అభ్యర్థులను సమాజ్వాదీ పార్టీ తరచూ మారుస్తోంది. మీరట్ స్థానానికి అభ్యర్థిని రెండోసారి మార్చింది. అలాగే భాగ్పట్ నియోజకవర్గ అభ్యర్థిని కూడా మార్చింది. ఇప్పుడు అతుల్ ప్రధాన్ స్థానంలో సునీత వర్మ మీరట్ నుంచి పోటీ చేయనున్నారు. సోమవారం రాత్రి ‘ఎక్స్’లో షేర్ చేసిన జాబితాలో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ మీరట్, ఆగ్రా (రిజర్వ్డ్) పార్లమెంట్ స్థానాల నుంచి అతుల్ ప్రధాన్ సురేష్ చంద్ కదమ్ అభ్యర్థులుగా ఉంటారని పేర్కొంది. మీరట్ నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్న నటుడు అరుణ్ గోవిల్పై సమాజ్వాదీ పార్టీ మొదట భాను ప్రతాప్సింగ్ను పోటీకి నిలబెట్టింది. పార్టీ అలా తన పేరును ప్రకటించగానే అతుల్ ప్రధాన్ ‘ఎక్స్’ ద్వారా పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్కు కృతజ్ఞతలు కూడా తెలిపారు. తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే మీరట్ అభ్యర్థిని మరోసారి మారుస్తూ అతుల్ ప్రధాన్ స్థానంలో సునీత వర్మను పార్టీ ప్రకటించింది. ఇక భాగ్పట్లో మనోజ్ చౌదరి స్థానంలో అమర్పాల్ శర్మను బరిలోకి దింపింది. ప్రత్యర్థుల విమర్శలు సమాజ్వాదీ పార్టీ తమ అభ్యర్థులను తరచూ మారుస్తుండటంపై ప్రత్యర్థు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఒకప్పుడు మిత్రపక్షంగా ఉన్న రాష్ట్రీయ లోక్దళ్ అధినేత జయంత్ సింగ్ సమాజ్ వాదీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. "ప్రతిపక్షంలో కొంతమందికి అదృష్టం కొన్ని గంటల పాటే ఉంటుంది” అంటూ ఎద్దేవా చేశారు. -
మీరట్లో సమాజ్వాదీ అభ్యర్థి మార్పు?
యూపీలో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) కొత్త నిర్ణయం తీసుకుంది. లోక్సభ ఎన్నికలకు మీరట్ స్థానం నుంచి గతంలో ప్రకటించిన అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నదని సమాచారం. అతుల్ ప్రధాన్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే యోగేష్ వర్మ భార్య సునీతా వర్మను ఎస్పీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరట్ అభ్యర్థిని మార్చడంపై జరుతున్న చర్చల మధ్య అతుల్ ప్రధాన్ తన ట్విట్టర్లో ఖాతాలో ఇలా రాశారు. ‘పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నిర్ణయం నాకు సమ్మతమే. త్వరలో పార్టీ నేతలతో కూర్చొని మాట్లాడతాను’ అని రాశారు. కాగా బుధవారం అతుల్ ప్రధాన్ నామినేషన్ దాఖలు చేయగానే మాజీ ఎమ్మెల్యే యోగేష్ వర్మ మద్దతుదారులు నిరసన గళం వినిపించారు. దీంతో అతుల్ అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేసి, మాజీ ఎమ్మెల్యే యోగేశ్ వర్మ భార్య, మేయర్ సునీతా వర్మను మీరట్ అభ్యర్థిగా ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతోంది. ఆమె గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారని కూడా అంటున్నారు. 2019లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుంచి సునీతా వర్మ, ఆమె భర్త యోగేశ్ వర్మ బహిష్కరణకు గురయ్యారు. అనంతరం వారు 2021లో సమాజ్వాదీ పార్టీలో చేరారు. పార్టీ హైకమాండ్ తమ అభియాన్ని గౌరవించిందని, తన భార్య సునీతా వర్మను అభ్యర్థిగా ఎంపికచేసిందని అంగీకరించిందన్నారు. -
మీరట్ సభలో విపక్షాలపై విరుచుకుపడ్డ మోదీ...ఇంకా ఇతర అప్డేట్స్
-
ఎన్నికల్లో ‘శ్రీరాముడు’.. మీరఠ్లో జన్మించి..
టీవీ సీరియల్ ‘రామాయణం’లో శ్రీరాముని పాత్ర పోషించి ప్రేక్షకులను అలరించిన నటుడు అరుణ్ గోవిల్ యూపీలోని మీరట్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరపున బరిలోగి దిగాడు. అరుణ్ గోవిల్కి స్టార్డమ్తో పాటు మీరఠ్తో అనుబంధం కూడా ఉంది. అరుణ్ గోవిల్ మీరఠ్ కాంట్లో 1958 జనవరి 12న జన్మించారు. అతని తండ్రి చంద్రప్రకాష్ గోవిల్ మీరట్ మునిసిపాలిటీలో హైడ్రాలిక్ ఇంజనీర్గా పనిచేశారు. అరుణ్ ప్రారంభ విద్యాభ్యాసం సరస్వతి శిశు మందిర్లో సాగింది. తరువాత ఆయన ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో చదువుకున్నారు. అనంతరం చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేశారు. అరుణ్ను ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలని అతని తండ్రి భావించారు. అయితే అరుణ్ నటనారంగంలోకి ప్రవేశించారు. ఆరుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులలో అరుణ్ నాల్గవవాడు. గోవిల్ నటి శ్రీలేఖను వివాహం చేసుకున్నారు. వీరికి సోనిక, అమల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 17 ఏళ్ల వయసులోనే అరుణ్ గోవిల్ ముంబైకి వెళ్లి నటునిగా అవకాశాల కోసం ప్రయత్నించారు. 1977లో హిందీ సినిమా 'పహేలీ' సినిమాలో అరుణ్కు అవకాశం దక్కింది. అయితే అరుణ్ గోవిల్కు ‘రామాయణం’ సీరియల్ ఎంతో పేరును తీసుకువచ్చింది. అరుణ్ పోషించిన రాముని పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఆయనను సాక్షాత్తూ రామునిగా చూసినవారు కూడా ఉన్నారట. రామాయణం తర్వాత అరుణ్ గోవిల్ టీవీ ఇండస్ట్రీలో యాక్టివ్గా మారారు. పలు పౌరాణిక సీరియల్స్లో నటించారు. ఇప్పుడు మీరఠ్ నుంచి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగిన అరుణ్ గోవిల్ భవితవ్యాన్ని కాలమే తేల్చి చెప్పనుంది. -
షార్ట్ సర్క్యూట్తో పేలిన ఫోను.. నలుగురు మృతి!
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి మోదిపురం జనతా కాలనీలోని ఓ ఇంటిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొబైల్ ఫోన్ పేలి గదిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనతా కాలనీలో నివాసం ఉంటున్న జానీ(41) కూలి పనులు చేసుకుంటూ, భార్య బబిత (37), నలుగురు పిల్లలు సారిక (10), నిహారిక (8), గోలు (6), కల్లు (5)లను పోషిస్తున్నాడు. శనివారం సాయంత్రం గదిలో పిల్లలు ఆడుకుంటూ, మొబైల్ ఛార్జర్ను ఎలక్ట్రికల్ బోర్డులో పెట్టారు. ఈ సమయంలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలి మంచానికి మంటలు అంటుకున్నాయి. మంటలు చుట్టుముట్టడంలో చిన్నారులు కేకలు వేశారు. వెంటనే జానీ, బబితలు ఆ గదిలోకి వెళ్లి చిన్నారులను మంటల బారి నుంచి కాపాడారు. ఈ సమయంలో బబిత, జానీలు కూడా గాయపడ్డారు. జానీ ఇంట్లో నుంచి అరుపులు వినిపించడంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. వారు పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాధితులను ఆసుపత్రికి తరలించారు. చికిత్ప పొందుతూ నలుగురు చిన్నారులు మృతి చెందారు. దంపతుల పరిస్థితి విషమంగా ఉంది. బబిత పరిస్థితి మరింత విషమంగా మారడంతో ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
Video: బట్టల షోరూంలో భారీ పైథాన్
లక్నో: మీరట్లోని ఓ బట్టల షోరూమ్లో భారీ పైథాన్ కలకలం సృష్టించింది. షాప్లో దూరిన కొండచిలువ వినియోగదారులను భయాందోళనకు గురిచేసింది. దాదాపు 14 అడుగులు, 18 కిలోల బరువు ఉన్న పైథాన్ను అటవీ అధికారులు సంరక్షించి అడవిలో విడిచిపెట్టారు. #उत्तर_प्रदेश #मेरठ: दुकान में विशालकाय अजगर निकला..!! अजगर देख बाजार में मची अफरा-तफरी..!! वन विभाग की टीम ने अजगर को पकड़ा..!! मेरठ के लालकुर्ती पैठ बाजार का मामला..!! #ViralVideo pic.twitter.com/SwSLAwSpOt — MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) December 5, 2023 షోరూమ్లో దూరిన పైథాన్ను ఓ వినియోగదారుడు గుర్తించి యజమానికి తెలియజేశాడు. మొదట యజమాని దాన్ని ఎలుకగా భ్రమించాడు. కానీ వినియోగదారుడు పట్టువీడకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భారీ పైథాన్ను చూసిన సిబ్బంది, వినియోగదారులు షోరూం నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు దాన్ని సురక్షితంగా సంరక్షించారు. అనంతరం అడవిలో విడిచిపెట్టారు. ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని వెల్లడించారు. ఇదీ చదవండి: కర్ణిసేన చీఫ్ గోగామేడి హత్య కేసులో నిందితులు వీరే..! -
బాలున్ని చితకబాది.. ఒంటిపై మూత్రం పోసి..
లక్నో: ఉత్తరప్రదేశ్, మీరట్లో దారుణం జరిగింది. కొందరు వ్యక్తులు ఓ బాలునిపై దాడి చేసి మూత్రం పోశారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నవంబర్ 13న బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో బాలునిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆ రోజు రాత్రి బాధితుడు ఇంటికి కూడా వెళ్లలేదు. మరునాడు ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు విషయం తెలిపాడు. కానీ యూరినేషన్ ఘటనను మాత్రం బయటకు వెల్లడించలేదు. తాజాగా బాలునిపై మూత్రం పోసిన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో విషయం బయటకు వచ్చింది. వీడియో బయటకు వచ్చిన తర్వాత బాధితుడు పోలీసులకు అసలు విషయాన్ని బయటపెట్టాడు. కొందరు దుండగులు తనను బందించి శరీరంపై మూత్రం పోశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనకు పాల్పడినవారిలో బాలుని స్నేహితులు ఉన్నారని బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వీడియో ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటివరకు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. బాలురు గొడవ పడటానికి గల కారణాలు మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. ఇదీ చదవండి: Lightning Strikes In Gujarat: అకాల వర్షాలు.. పిడుగుపాటుకు 20 మంది మృత్యువాత -
జాతీయ రహదారిపై కారు స్టంట్లు.. యువకుల పిచ్చి చేష్టలు..
ఢిల్లీ: ఢిల్లీ-మీరట్ జాతీయ రహదారిపై కొందరు యువకులు అనుచితంగా ప్రవర్తించారు. దేశ ప్రధాన రహదారిపై కారుతో చక్కర్లు కొడుతూ తోటి ప్రయాణీకులకు అసౌకర్యం కలిగించారు. రద్దీగా ఉండే రహదారిపై యువకుల చేష్టలతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. వీడియోలో చూపిన విధంగా కొందరు యువకులు కారులో ప్రయాణిస్తున్నారు. అయితే.. సవ్యమైన దిశలో కాదు. రోడ్డుకు అడ్డంగా చక్కర్లు కొట్టారు. 25 సెకన్ల వీడియోలో చూపిన విధంగా రౌండ్లు వేస్తూ ఇతర ప్రయాణికులు వెళ్లకుండా ఇబ్బంది కలిగించారు. వీడియోలో యువకుల పిచ్చి చేష్టలకు భయపడిన తోటి ప్రయాణికులు కాసేపు ఎటూ వెళ్లకుండా అక్కడే నిలుచుని ఉండిపోయారు. Car stunt on Delhi Meerut Expressway#CarStunt #Meerut #Delhi #DelhiMeerutExpressway #viralvideo #NoConfidenceMotion #Suspended #DerekOBrien #DerekOBrienSuspended #DreamGirl2On25thAugust #DareToBeBold #AlluArjun #ElvishYadav #Adaniports pic.twitter.com/4NBGCgqlrp — Human Rights Reform Org. (@hqHumanRights) August 8, 2023 కారులో ఇద్దరు యువకులు బయటికి వేలాడారు. మరో ఇద్దరు కారులో కూర్చున్నారు. కనీసం జాతీయ రహదారి అనే జ్ఞానం లేకుండా రోడ్డుపై అడ్డంగా చక్కర్లు కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. పోలీసులు స్పందించారు. దోషులకు శిక్ష తప్పదని చెప్పారు. ఇదీ చదవండి: వీల్ ఛైర్లో మన్మోహన్సింగ్.. కాంగ్రెస్పై బీజేపీ ఫైర్ -
టీమిండియా క్రికెటర్కు తప్పిన పెను ప్రమాదం
టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఉత్తర్ప్రదేశ్లోని పాండవ్ నగర్ నుంచి మీరట్కు వస్తుండగా ప్రవీణ్ కుమార్ ప్రయాణిస్తున్న ల్యాండ్ రోవర్ కారు ప్రమాదానికి గురైంది. ప్రవీణ్ ప్రయాణిస్తున్న కారును వేగంగా వస్తున్న క్యాంటర్ వాహనం ఢీకొట్టింది. ఆ సమయంలో ప్రవీణ్తోపాటు అతని కుమారుడు కారులో ఉన్నాడు. అయితే వీరిద్దరు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి కారణమైన వాహనం కారణంగా ప్రవీణ్ ప్రయాణిస్తున్న కారు నుజ్జుగుజ్జయ్యింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్యాంటర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మీరట్ సిటీ ఎంట్రెన్స్లో మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ప్రవీణ్ కుమార్ మీరట్లోని బాగ్పత్ రోడ్లో ఉన్న ముల్తాన్ నగర్లో నివాసం ఉంటాడు. 36 ఏళ్ల ప్రవీణ్ కుమార్ 2007-12 మధ్యలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ప్రవీణ్ ప్రధాన బౌలర్గా సత్తా చాటాడు. 2008లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ను టీమిండియా కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ప్రవీణ్.. 68 వన్డేలు, 10 టీ20లు, 6 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఇందులో వన్డేల్లో 77, టీ20ల్లో 8, టెస్టుల్లో 27 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లోనే కాకుండా ప్రవీణ్ ఐపీఎల్లోనూ సత్తా చాటాడు. 119 మ్యాచ్ల్లో 90 వికెట్లు పడగొట్టాడు. రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్ అయిన ప్రవీణ్ అడపాదడపా బ్యాట్తో కూడా రాణించాడు. వన్డేల్లో అతని పేరిట ఓ అర్ధసెంచరీ ఉంది. చదవండి: #RishabhPant: 'యాక్సిడెంట్ నాకు రెండో లైఫ్'.. 'డేట్ ఆఫ్ బర్త్' మార్చుకున్న పంత్ -
యూపీలో ఎన్కౌంటర్.. మరో గ్యాంగ్స్టర్ హతం
లక్నో: యూపీలో కరుడుగట్టిన నేరస్థులు, గ్యాంగ్స్టర్లను ఏరివేసే పనిలో పడింది సీఎం యోగి ఆదిత్యనాత్ ప్రభత్వం. యోగీ సీఎం అయ్యాక మార్చి 2017 నుంచి ఇప్పటి వరకు 183 మంది గ్యాంగ్స్టర్లు ఎన్కౌంటర్లో మరణించారు. ఇటీవల సైతం రాజకీయవేత్తగా ఎదిగిన గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో గ్యాంగ్స్టర్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. జాతీయ రాజధాని ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ వంటి ప్రాంతంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి గ్యాంగ్స్టర్గా పేరుమోసిన అనిల్ దుజానాను ఉత్తర ప్రదేశ్కు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మీరట్లో కాల్చి చంపారు. పశ్చిమ యూపీకి చెందిన అనిల్ దుజానాపై హత్యలు, దోపిడీలు, భూ కబ్జాలు వంటి కేసులు నమోదయ్యాయి. మొత్తం 60కి పైగా క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 2012 నుంచి జైల్లో ఉంటున్నాడు. హత్య కేసులో బెయిల్ పొంది వారం రోజుల క్రితమే దుజానా జైలు నుంచి విడుదలయ్యారు. అయితే బెయిల్పై బయటకు వచ్చిన వెంటనే తనపై నమోదైన హత్య కేసులో కీలక సాక్షులలో ఒకరిని బెదిరించడం ప్రారంభించాడని పోలీస్ వర్గాలు తెలిపాయి. సాక్షిని చంపాలని ప్లాన్ చేసుకున్నట్లు పేర్కొన్నాయి. దీంతో అతడిని అరెస్ట్ చేసేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. మీరట్లోని ఓ గ్రామంలో దుజానా, అతని గ్యాంగ్ దాగి ఉందని తెలియడంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. విషయం తెలుసుకన్న గ్యాంగ్స్టర్ ఎస్టీఎఫ్ బలగాలపై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసు బృందంఎదురు కాల్పులు జరిపిందని ఈ ఆపరేషన్లో దుజానా మరణించినట్లు పేర్కొన్నారు. చదవండి: హెలిప్యాడ్ వద్ద మంటలు.. మరోసారి డీకే శివకుమార్కు తప్పిన ప్రమాదం -
కారును ఢీకొట్టి.. 3 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన భారీ ట్రక్..
-
షాకింగ్ దృశ్యాలు: కారును ఢీకొట్టి.. 3 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన భారీ ట్రక్..
లక్నో: ఉత్తర ప్రదేశ్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. వేగంగా దూసుకొచ్చిన 22 చక్రాల భారీ కంటైనర్ ట్రక్.. కారును ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా అందరూ చూస్తుండగానే కారును మూడు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో ట్రక్ మరికొన్ని వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటన మీరట్లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ప్రమాద ఘటనను కొందరు వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కారును ట్రక్ ముందు భాగంతో ఈడ్చుకెళ్లిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్గా మారాయి. అయితే అదృష్టం బాగుండి కారులో కూర్చున్న నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో ఎవరికి కూడా తీవ్రమైన గాయాలేవి అవ్వలేదు. కారును టక్కు లాక్కెళ్తుండటం చూసి రోడ్డుమీదున్న జనాలు, వాహనదారులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వాహనం ఆపమని ఆరిచినా పట్టించుకోకుండా ట్రక్ డ్రైవర్ అలాగే ముందుకు పోనిచ్చాడు. దీంతో స్థానికులు వెంటనే సమాచారంనిచ్చారు. పోలీసులకు రంగంలోకి దిగిన పోలీసులు ట్రక్ను వెంబడించి అడ్డగించే వరకు కంటైనర్ను ఆపలేదు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే కారులో ఉన్నవారికి, ట్రక్కు డ్రైవర్కు మధ్య జరిగిన ఓ వాగ్వాదంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్పై కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామన్నారు. చదవండి: ఈ పెళ్లికొడుకు చాలా రిచ్.. బంధువుల కోసం విమానం బుక్ చేశాడు.. That's #Meerut neighbour of #Ghaziabad. Real life action in #UttarPradeshpic.twitter.com/xxazsrOREV — Arvind Chauhan (@Arv_Ind_Chauhan) February 13, 2023 -
బాత్రూమ్లో గీజర్ నుంచి గ్యాస్ లీకై నవ వధువు మృతి
ఉత్తర ప్రదేశ్లోని మీరట్లోని షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బాత్రూమ్లో గీజర్ నుంచి లీక్ అయిన గ్యాస్ పీల్చుకొని ఊపిరాడక నవ వధువు మృత్యువాతపడింది. వివరాలు.. ఇటీవల వివాహం అయిన వధువు స్నానం చేసేందుకు అత్తవారింట్లోని బాత్రూమ్లోకి వెళ్లింది. చాలా సేపు అక్కడే ఉంది. ఎంతకూ యువతి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు బాత్రూమ్ డోర్ తట్టి చూడగా ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బాత్రూమ్ తలుపులు పగలగొట్టగా.. ఓ మూలన అపస్మారక స్థితిలో పడిపోయి కనిపించింది. వెంటనే యువతిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. గ్యాస్ గీజర్లో నుంచి వెలువడిన కార్బర్ మోనాక్సైడ్ను పీల్చడం వల్లే వధువు మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. ఈ గ్యాస్ చాలా ప్రమాదకరమని.. పీల్చిన కొద్ది నిమిషాల్లోనే ఊపిరాకడ అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. గ్యాస్ గీజర్ను ఉపయోగించిన ప్రతిసారి దాని నుంచి కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది. ఇది ప్రాణాంతకమైనది. వీటిని బాత్రూమ్లో ఏర్పాటు చేసుకోకుండా ఉంటేనే మంచింది. వెంటిలేషన్ బాగా ఉండే ప్రదేశాల్లోనే ఫిట్ చేయాల్సి ఉంటుంది. అయితే గ్యాస్ గీజర్ల నిర్వహణ ఖర్చు ఎలక్ట్రిక్ గీజర్లతో పోలిస్తే చాలా తక్కువ. అందుకే దేశంలో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇంట్లో గ్యాస్ గీజర్లను ఉపయోగించడం ప్రమాదకరమనే విషయం తెలిసిందే. ఇవి విడుదల చేసే కార్బన్ మోనాక్సైడ్ పీల్చిన కొద్ది నిమిషాల్లోనే కళ్లు తిరిగి అపస్మారక స్థితిలోకి వెళ్తుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు. అయిదు నిమిషాలు కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ పీల్చడం వల్ల తల తిరగడం.. అంతకంటే ఎక్కువ సమయం పీలిస్తే స్పృహ కోల్పోయి ఊపిరాడక చనిపోయే ప్రమాదం ఉంది. శాశ్వతంగా మెదడు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. కొన్ని నెలల పాటు యాంటీ సీజర్ మందులతో చికిత్స చేయవచ్చు. గ్యాస్ సీజర్ను ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?. 1. బాత్రూమ్, వంటగది వంటి మూసివేసిన ప్రదేశాలలో గ్యాస్ గీజర్ను ఎప్పుడూ ఇన్స్టాల్ చేయవద్దు. 2. ఒకవేళ బాత్రూమ్, కిచెన్ వంటి ప్రదేశాల్లో వీటిని అమర్చినట్లయితే తగినంత వెంటిలేషన్ ఉండాలి. అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఆన్ చేసి ఉంచాలి. 3. గ్యాస్ గీజర్ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. ఏదైనా లీకేజీ లేదా మరేదైనా సమస్య ఉంటే బయటపడే అవకాశాలు ఉంటాయి. 4. గ్యాస్ గీజర్ను రోజంతా వినియోగించడం మంచిది కాదు. నిరంతరాయంగా టిని వినియోగిస్తే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్కువసార్లు ఉపయోగించాల్సి వస్తే వినియోగించే ముందు తగినంత గ్యాస్ ఉండాలి. 5. బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్లే ముందే గ్యాస్ గీజర్ను స్విచ్ ఆఫ్ చేయడం మంచింది.. దీంతో స్నానం చేసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉండదు. 6. కార్భన్ మోనాక్సైడ్ రంగు, రుచి లేని కారణంగా గీజర్లో గ్యాస్ లీకవడాన్ని గుర్తించడం అంత సులభం కాదు. వీటిని పీలుస్తున్న విషయం కూడా మనకు తెలియదు. 7. గ్యాస్ గీజర్లో లీకేజీ ఉంటే, దాని నుంచి కార్బన్ మోనాక్సైడ్ వాయువు బయటకు వస్తుంది. ఇది మైకం, వికారం, వాంతులు, అలసట, కడుపు నొప్పికి కారణం కావచ్చు. 8. కార్బన్ మోనాక్సైడ్ చాలా ప్రమాదకరమైనది. ఇది మైకం, వికారం, వాంతులు, అలసట, కడుపు నొప్పికి కారణం కావచ్చు. ఇది పీల్చిన తర్వాత నిమిషాల్లో ప్రాణాలు పోయే అవకాశం ఉంది. 9. గ్యాస్ గీజర్ కారణంగా ఎవరైనా సమస్యలను ఎదుర్కొంటే, బాధితుడిని వీలైనంత త్వరగా బహిరంగ ప్రదేశానికి తీసుకెళ్లాలి. దీని వల్ల అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు. తరువాత ఆసుపత్రికి తరలించాలి. -
క్లాస్రూమ్లో బరితెగించిన విద్యార్థులు.. మహిళా టీచర్తో అసభ్యకర ప్రవర్తన
క్లాస్రూమ్లోనే విద్యార్థులు బరితెగించి ప్రవర్తించారు. విద్యాబుద్ధులు నేర్పుతున్న మహిళా టీచర్నే లైంగిక వేధింపులకు గురిచేశారు. అంతటితో ఆగకుండా టీచర్ను అసభ్యకర వ్యాఖ్యలతో వేధిస్తూ రాక్షసానందం పొందుతూ ఈ ఘటనను వీడియో తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మీటర్లోని ఓ పాఠశాలలో ముగ్గురు మైనర్ విద్యార్థులు అనుచితంగా ప్రవర్తించారు. అయితే, అమన్, కైఫ్, అతాష్ అనే ముగ్గురు విద్యార్థులు తనను వేధిస్తున్నారని టీచర్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ చర్యలో పాల్గొన్న అమన్ సోదరి పేరును కూడా ఆమె ప్రస్తావించింది. కాగా, మొదట టీచర్ వారి చేష్టలను, వ్యాఖ్యలను పట్టించుకోలేదు. ఇది తప్పు, చట్టవిరుద్ధమని చెబుతూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ వారు టీచర్ వ్యాఖ్యలను పట్టించుకోకుండానే క్లాస్ రూమ్లో ఆమెకు ఐ లవ్ యూ చెబుతూ, అసభ్యకర కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన టీచర్.. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. మైనర్ విద్యార్ధులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మీరట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేశవ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు మైనర్లు కావడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా, వీడియోలో విద్యార్థుల వెకిలిచేష్టల కారణంగా టీచర్ వారి నుండి దూరంగా వెళ్తున్నట్టు కనిపించింది. Breaking News: In UP's Meerut, inside the school, 3 student Atash, Kaif, Aman molested & said "I Love U" to the female teacher & made its video viral on social media. Shagufa a female accused also involved FIR filled under sec for obscene comments, threat to murder & IT act + pic.twitter.com/jb0pEcajAE — Ashwini Shrivastava (@AshwiniSahaya) November 27, 2022 -
పట్టపగలే యూపీలో దారుణం.. షాకింగ్ వీడియో
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో రోజురోజుకూ మహిళలపై దాడులు, హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. రెండు క్రితమే యూపీలో కొందరు వ్యక్తులు ఓ మహిళకు మద్యం తాగించి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన మరువకముందే మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మతిస్థిమితం సరిగాలేని ఓ యువతి పట్ల కొందరు వ్యక్తులు అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై మీరట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దౌరాలా పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 19వ తేదీన కొందరు వ్యక్తులు పట్టపగలే ఓ యువతిని దారుణంగా కొట్టారు. ఇద్దరు వ్యక్తులు.. ఆమె కాళ్లు, చేతులను పట్టుకుని ఈడ్చుకెళ్లారు. అనంతరం, వారు ఆమెపై దాడి చేశారు. ఈ క్రమంలోనే బాధితురాలు సహాయం కోసం వేడుకుంది. తనను వదిలేయాలని గట్టిగా అరుస్తూ కేకలు వేసింది. ఈ ఘటన సందర్భంగా చుట్టుపక్కలు చాలా మంది ఉన్నప్పటికీ ఆమెను ఎవరూ కాపాడలేదు. ఆమెపై దాడిని కొందరు మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. తాజాగా ఈ వీడియో పోలీసులకు చేరింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం బాధితురాలికి బరేలీలోని ఆసుప్రతిలో వైద్య చికిత్సలు అందిస్తున్నామని అన్నారు. ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితమే యూపీలోని బదోస్ రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగింది. బాధితురాలికి తెలిసిన వ్యక్తి ఆమెను.. తన భర్త పిలుస్తున్నాడని చెప్పి ఆమెను గ్రామ శివారులోని చెరువు వద్దకు తీసుకువెళ్లాడు.అప్పటికే అక్కడ మరో ముగ్గురు యువకులు ఉన్నారు. వారంతా తనకు తెలిసిన వారే కావడంతో మాట్లాడింది. అనంతరం, నిందితులు ఆమెతో బలవంతంగా మద్యం తాగించారు. ఆ తరువాత వరుసగా ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు. దీంతో, కొన్ని రోజులు మౌనంగా బాధను దిగమింగిన మహిళ.. చివరకు ధైర్యం చేసి భర్తకు జరిగిన విషయం చెప్పింది. అనంతరం, వారు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నారు. మరోవైపు.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా డేటా ప్రకారం.. ఉత్తరప్రదేశ్లో 2022 జనవరి నుండి ఆగస్టు వరకు మహిళలపై నేరాలకు సంబంధించి మొత్తం 56,083 కేసులను నమోదు చేసింది, ప్రతి లక్ష జనాభాకు 50.5 నేరాల రేటుగా నమోదైంది. మహిళలపై నేరాలకు సంబంధించి దాదాపు 31,000 ఫిర్యాదులు గత ఏడాది జాతీయ మహిళా కమిషన్ (NCW)కి అందాయి. యూపీలో 2020తో పోలిస్తే 2021లో మహిళలపై నేరాల ఫిర్యాదులు 30 శాతం పెరిగాయి. -
బాహుబలి సమోసా.. తిన్నారంటే రూ. 51,000 మీవే.. కానీ ఒక్క షరతు!
సమోసా.. భారతీయులు ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్లో మొదటి వరుసలో ఉంటుంది. స్నేహితులతో సరదాగా బేకరీకి వెళ్లిన, ఆఫీస్లో క్యాంటీన్కు వెళ్లినా ఆర్డర్ చేసే ఫుడ్ ఐటమ్స్లో సమోసా తప్పక ఉంటుంది. ఆలు, ఆనియన్, కార్న్ సమోసా.. పేర్లు ఏవైనా చాలా మందికి ఇది ఫేవరెట్ స్నాక్. తాజాగా ఉత్తర ప్రదేవ్లోని మీరట్లో బహుబలి సమోసా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అసలు దీని స్టోరి ఏంటో తెలుసుకుందాం మీరట్లోని లాల్కుర్తి బజార్లో కౌశల్ స్వీట్స్ పేరుతో షాపు నిర్వహిస్తున్న శుభం.. బహుబలి సమోసా పేరుతో ఫుడ్ చాలెంజ్ విసిరారు. అది మనం తినే సాధారణ సమోసాల్లా ఉండదు. ఏకంగా 8 కేజీల బరువు ఉంటుంది. ఇత పెద్ద సమోసాను తిన్న వారికి రూ. 51,000 అందిస్తామని ప్రకటించారు. అయితే ఈ సమోసాను కేవలం 30 నిమిషాల్లో మాత్రమే పూర్తి చేయాలి. చదవండి: భారీ వర్షాలతో జనాలు బెంబేలెత్తిపోతుంటే.. అతను మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నాడు ఈ విషయంపై షాప్ యజమాని మాట్లాడుతూ.. నిత్యం ఏదో కొత్తదనాన్ని తీసుకురావాలనే ఉద్ధేశ్యంతోనే సమోసా చాలెంజ్ను విసురుతున్నట్లు తెలిపారు. అందుకే బాహుబలి సమోసాను తయారు చేసినట్లు పేర్కొన్నారు. ముందుగా నాలుగు కిలోల సమోసాతో చాలెంజ్ ప్రారంభించామని ఇప్పుడు 8 కిలోలకు పెంచినట్లు వెల్లడించారు. ఎనిమిది కిలోల సమోసా ధర దాదాపు రూ. 1,100 ఉంటుందని, ఇందులో ఆలు, చీజ్, డ్రరై ఫ్రూట్స్ నింపినట్లు తెలిపారు. అంతేగాక త్వరలో 10 కిలలో సమోసా చేయనున్నట్లు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. మీకు ఓ విషయం చెప్పలేదు కదూ.. ఇప్పటి వరకు ఈ చాలెంజ్ను చాలా మంది ప్రయత్నించినప్పటికీ ఎవరూ గెలవలేదట. ఆరగంటలో తినలేకపోయి ఓడిపోయారట. మరి మీరు కూడా ప్రయత్నించాలనుకుంటే మీరట్ వెళ్లాల్సిందే. -
జైహింద్ స్పెషల్: తొలి నిప్పుకణం ఇతడేనా?
మీరట్లో తొలిసారి సిపాయిలు తిరగబడిన రెండు నెలల తర్వాత ఆనాటి ఘటనలపై బ్రిటన్ ప్రధాని బెంజమిన్ దిస్రేలీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. 1857 జూలై 27న ‘హౌస్ ఆఫ్ కామన్స్’ని ఉద్దేశించి ఆయన ఇచ్చిన ఆ ప్రసంగం మూడు గంటల పాటు సాగింది. ‘‘ఇంతకీ అది సిపాయిల తిరుగుబాటా? స్వాతంత్య్ర పోరాటమా? అకస్మాత్తుగా పెల్లుబికిన ఆగ్రహమా? కుట్రలో ఒక భాగమా? అని దిస్రేలీ ప్రశ్నించారు. కార్ల్ మార్క్స్ కూడా ఇదే సంశయంలో పడ్డారు. సిపాయిల తిరుగుబాటు పరిణామాలను న్యూయార్క్ డెయిలీ ట్రిబ్యూన్కు ధారావాహికగా రాసిన మార్క్స్ తరచు ఈ సందేహాన్ని వ్యక్తం చేస్తుండేవారట. చివరికాయన అది స్వాతంత్య్ర సమరమేనన్న అభిప్రాయాన్ని స్థిరపరచుకున్నారు. ఇక జె.డబ్లు్య.కాయే వంటి బ్రిటిష్ చరిత్రకారులు ఈ పోరాటం సిపాయిల తిరుగుబాటు తప్ప ఇంకోటి కాదని నిర్థరించారు! హైందవ జాతీయత సంస్థాపకులలో ఒకరైన వి.డి.సావర్కర్ తను రాసిన ‘ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్’ పుస్తకంలో (1909) సిపాయిల తిరుగుబాటుకు జాతీయభావ కోణాన్ని కల్పించారు. అటువంటి అన్వయాన్ని ఇచ్చిన పుస్తకాలలో ఇది మొట్టమొదటిది. దీని ద్వారా సావర్కర్ హిందూ ముస్లిం ఐక్యతను, దేశభక్తిని అంతర్లీనంగా ప్రబోధించారు. అయితే ఇదంతా చారిత్రక వాస్తవాలను విస్మరించి, జాతీయ భావ విశ్వాసాలతో అల్లిన కాల్పనిక రచన అని మజుందార్ విమర్శించారు. అయితే తిరుగుబాటుపై తొలి తిరుగుబాటు శతాబ్ది నాటికి 1957లో విడుదలైన అనేక గ్రంథాలు ఏదో ఒక కోణంలో సావర్కర్ భావాలనే ప్రతిఫలించడం విశేషం. ఎంతగానంటే ఆయన పుస్తకం కూడా ఒక వీర సిపాయి అయింది. తిరుగుబాటు గొప్పతనాన్నంతా సావర్కర్.. మంగళ్ పాండేకే ఆపాదించారని ఇప్పటికీ డాల్రింపుల్వంటి కొందరు బ్రిటిష్ చరిత్రకారులు ఆరోపిస్తున్నారు. అయితే పుస్తక ప్రచురణ సంస్థలు, బాలివుడ్ చిత్ర పరిశ్రమ ఈ విమర్శలకు, చరిత్రకారుల భిన్న దృక్కోణాలకు ప్రాముఖ్యం ఇవ్వలేదు. సావర్కర్ పుస్తకం ఆధారంగా పాండే, ఝాన్సీలక్ష్మీబాయ్ తదితర పోరాట యోధులపై అనేక హిందీ సినిమాలు, అమర్ చిత్ర కథ కామిక్స్ కూడా విరివిగా వచ్చాయి. భారత చరిత్రలో 1857 నాటి పరిణామాలకు ఉన్న ప్రాముఖ్యం వల్ల దేశ విదేశ చరిత్రకారుల మధ్య ఎడతెగని చర్చ మొదలైంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అంతకు ముందు కూడా తిరుగుబాట్లు జరిగాయి కానీ, పాలకులు పాలితుల సంబంధాలలో మౌలికమైన మార్పులు తీసుకువచ్చింది మాత్రం సిపాయిలేనని సావర్కర్ను సమర్థించేవారు అంటారు. భారత ప్రభుత్వమూ ఇలాగే భావిస్తోంది కనుక 1857 కు 150 ఏళ్లు అయిన సందర్భంగా కోట్ల రూపాయల వ్యయంతో 2007లో ఆ ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన 60 మంది సభ్యులతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవ ఏర్పాట్ల పర్యవేక్షణ జరిగింది. ఆ ఏడాది మే 10న లాంఛనంగా వేడుకలు మొదలయ్యాయి. ఎవరిది తొలి తిరుగుబాటు? 1857 తిరుగుబాటు జరిగిన సమయ సందర్భాలపై నెలకొని ఉన్న అస్పష్టత 165 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది! మార్చి 29 నాటి ఒక ఉక్కపోత మధ్యాహ్నపు వేళ బరక్పూర్ (ప.బెం) లోని 34వ నేటివ్ ఇన్ఫాంట్రీ దళ సభ్యుడు, 26 ఏళ్ల సిపాయి.. పరేడ్ గ్రౌండ్లో బ్రిటిష్ అధికారులకు ఎదురు తిరగడం వల్లనా లేక మే 10న మీరట్ (ఉ.ప్ర)లో సిపాయిలంతా ఒక్కసారిగా తిరగబడటం వల్లనా ఎలా పడింది బీజం ఒక మహా స్వాతంత్య్ర సంగ్రామానికి? ఉత్తర భారతదేశం పొడవునా ఆనాడు వ్యాపించిన మీరట్ దావానలం బూడిద జాడలను వెదుక్కుంటూ వెనక్కు వెనక్కు వెళ్లిన చరిత్రకారుల అన్వేషణ ఆఖరికి బరక్పూర్లోనే ఆగిపోతోంది. తొలి నిప్పుకణంలా మంగళ్పాండే మొదట కనిపించాడు. మార్చి 29న అసలేం జరిగిందన్న విషయమై అప్పటి బ్రిటిష్ అధికారులు చెప్పిన లిఖితపూర్వక వివరాలే నేటికీ మనకు అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలు. -
12 ఏళ్ల ప్రేమ.. వరుడికి ‘వరకట్న’ వేధింపులు.. సొంత తల్లిదండ్రులకు షాక్!
ఒకప్పటి కాలంలో పెళ్లి అంటే ఏదో సాధాసీదాగా జరిపించేవాళ్లు. ఒక్క రోజులో వేడుక అయిపోయిది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా వదలకుండా పండుగలా చేసుకుంటున్నారు. పెళ్లి వేడుకలో ఎన్ని మార్పులు వచ్చినా కట్నకానుకల విషయంలో మాత్రం ఏలాంటి మార్పు రాలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ కట్నం విలువ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అబ్బాయి తరపున వారు లక్షల్లో అడుగుతుండటంతో కూతురు సంతోషంగా ఉంటే అదే చాలని భావించిన వధువు తల్లిదండ్రులు అప్పులు చేసి మరి కట్న కానుకలు ముట్టజెపుతున్నారు. తాజాగా పెళ్లి, కట్నం విషయంలో ఉత్తరప్రదేశ్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మీరట్ జిల్లా కంకర్ఖేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని రోహతాలో ముప్పై ఏళ్ల యోగేష్ కుమార్ తన తల్లిదండ్రులతో నివాసముంటున్నాడు. అయితే ఆయన 26 ఏళ్ల యువతిని ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పగా వారు కూడా పెళ్లికి ఓకే చెప్పారు. కానీ వధువు నుంచి భారీగా కట్నం కావాలని షరతు పెట్టారు. వధువు కుటుంబ సభ్యులు అంతగా ఇచ్చుకోలేమని చెబుతున్నా.. ఎంతకీ వినిపించుకోవడం లేదు. దీంతో పెళ్లి కాస్తా సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తోంది. చదవండి: జ్ఞానవాపి మసీదు వివాదం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు దీంతో కట్నం కారణంగా పెళ్లి వాయిదా పడుతోందని వరుడు తన తల్లిదండ్రులపై జిల్లా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. ‘నా గర్ల్ఫ్రెండ్ మా తల్లిదండ్రులను కాదని నన్ను పెళ్లిచేసుకోలేదు. అలాగే మా తల్లిదండ్రులు కట్నాన్ని తగ్గించేందుకు సిద్దంగా లేరు. వాళ్లు కేవలం డబ్బు మాత్రమే కాదు, ఇంట్లో వస్తువులు కూడా కావాలంటూ పెద్ద లిస్ట్ ఇచ్చారు. కానీ నా ప్రియురాలి కుటుంబం అంతగా ఆర్థికంగా ఉన్నవారు కారు. ఈ సమస్యకు పరిష్కారం చూపి, నా పెళ్లి జరిపించాలి’ అంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే దీనిపై విచారణ చేయాలంటూ మీరట్ జిల్లా ఎస్పీ కంకర్ఖేరా పోలీసులను ఆదేశించారు. యువకుడు తన తల్లిదండ్రులపై కొన్ని ఆరోపణలు చేశాడని, ప్రథమిక విచారణ అనంతరం ఎఫ్ ఐఆర్ నమోదు చేస్తామని తెలిపారు. ఈ విషయంపై యోగేష్ మాట్లాడుతూ.. అయిదుగురు అన్నదమ్ముల్లో నేను పెద్దవాడిని. నా తమ్ముళ్లందరు పెళ్లి చేసుకొని స్దిరపడ్డారు. 12 సంవత్సరాలుగా యువతిని ప్రేమిస్తున్నాను. తన చెల్లెలికి కూడా పెళ్లి అయిపోయింది. తల్లిదండ్రులు అధికంగా కట్నం ఇచ్చుకోలేరని తెలిసి యువతి ఇంకా నాకోసం ఎదురుచూస్తుంది. నేను కోర్టులో లేదా ఎప్పుడో ఇంటి నుంచి పారిపోయి ఆ అమ్మాయిని వివాహమాడొచ్చు. కానీ నేను అలా చేస్తే నా తమ్ముళ్లు కూడా అదే నేర్చుకున్నారు. అందుకే అలా చేయలేదు. నా తల్లిదండ్రులు నన్ను కొట్టి ఇంటి నుంచి బయటకు పంపించేశారు. నా సమస్యకు పోలీసులు పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. కాగా తమ 30 ఏళ్ల పోలీస్ సర్వీసులో ఇలాంటి కేసు ఎప్పుడూ రాలేదని ఓ పోలీస్ అధికారి తెలిపారు. అయితే మొత్తం ఈ విషయంపై యువకుడి తల్లిదండ్రులు ఏం స్పందించలేదు. చదవండి: Assam Floods: కొనసాగుతోన్న వరదల బీభత్సం.. 9 మంది మృతి -
UP News: కటౌట్ చూసి పరిగెత్తాలి డ్యూడ్
కటౌట్లంటే రాజకీయ నాయకులకు, సినిమా వాళ్లకు భారీ ప్రచారమనే విషయం చెప్పనక్కర్లేదు. కానీ, వైవిధ్యమైన ఆలోచనలు ఎప్పుడూ జనాల ఆసక్తిని తమ వైపు మళ్లించుకుంటాయి. ఉత్తర ప్రదేశ్లో తాజాగా అలాంటి దృశ్యమే ఒకటి కనిపించింది. యూపీ మీరట్లో కోతులను తరిమేందుకు అటవీ అధికారులు.. కొండముచ్చుల (కొండెంగల) కటౌట్లను ఉంచారు. మరి ఈ ఐడియా ఫలితం ఇచ్చిందా?.. ఇచ్చిందనే అంటున్నారు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రాజేశ్ కుమార్. ప్రయోగం మంచి ఫలితాన్ని ఇచ్చిందని, చిన్నచిన్న మార్పులతో ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. కోతుల బెడదతో ఇళ్ల నుంచి బయట అడుగు పెట్టేందుకే జనాలు వణికిపోయిన రోజులున్నాయి. ఈ తరుణంలో అధికారులు ఇలా కటౌట్ల ప్రయోగంతో కోతుల్ని తరమడం విశేషం. ఇదివరకు లక్నో మెట్రో స్టేషన్లో ఇలా కొండముచ్చుల Langoor Cutouts కటౌట్లతో ఫలితం రాబట్టారు అధికారులు. అదే చూసే మీరట్ అధికారులు ఈ పని చేశారు. అఫ్కోర్స్.. ఇదేం కొత్త ఐడియా కాదు.. చాలా చోట్ల చూసే ఉంటారు. -
మంటల్లో ఇంజన్.. రైలును ముందుకు తోసిన ప్యాసింజర్లు
ఐకమత్యమే మహాబలం అనేవాళ్లు పెద్దలు. అలాగే భిన్నత్వంలో ఏకత్వం.. బహుశా మన గడ్డకే సొంతమైన స్లోగన్ కాబోలు. కొన్ని పరిస్థితులు, ఘటనలు మినహాయిస్తే.. కలిసికట్టుగా ముందుకు సాగడంలో మనకు మనమే సాటి. ఇందుకు సంబంధించిన వీడియో ఇది. యూపీలో జరిగిన ఓ ఘటన తాలుకా వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. షార్నాపూర్-ఢిల్లీ మధ్య రైలు, మీరట్ దౌరాలా రైల్వే స్టేషన్ దగ్గర రైలు శనివారం అగ్నిప్రమాదానికి గురైంది. ఇంజన్కు మంటలు అంటుకోగా.. దాని నుంచి వెనకాల రెండు బోగీలకు మంటలు విస్తరించాయి. వెంటనే అధికారులు స్పందించి.. ఆ ఇంజన్, బోగీలను మిగతా బోగీలతో విడదీశారు. ఆ వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు.. మిగతా కంపార్ట్మెంట్లను ముందుకు తోసి మంటలు అంటుకోకుండా చూడగలిగారు. #WATCH | Uttar Pradesh: Fire broke out in engine & two compartments of a Saharanpur-Delhi train, at Daurala railway station near Meerut. Passengers push the train in a bid to separate the rest of the compartments from the engine and two compartments on which the fire broke out. pic.twitter.com/Vp2sCcLFsd — ANI UP/Uttarakhand (@ANINewsUP) March 5, 2022 ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఇక ప్రయాణికులు రైలును ముందుకు తోస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్గా మారింది. కశ్మీర్లో రోడ్డు ప్రమాదం జమ్ముకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుంది. సాంబా నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఒక కారు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. చికిత్స పొందుతున్న డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. కాగా, ఆ వాహనం అనంత్నాగ్ వ్యాలీకి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. -
అసదుద్దీన్ ఒవైసీని అందుకే చంపాలనుకున్నా
లక్నో: ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిపిన నిందితుడు సచిన్ పండిట్ నేరం అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు. ఒవైసీని చంపాలన్న ఉద్దేశంతో కాల్పులు జరిపినట్టు విచారణలో అతడు వెల్లడించాడని తెలిపారు. బుల్లెట్లు తగిలే ఉంటాయనుకున్నా ‘నేనో పెద్ద రాజకీయ నాయకుడిని కావాలనుకున్నాను. కానీ ఒవైసీ రెచ్చగొట్టే ప్రసంగాలు విని కలత చెందాను. అందుకే నా స్నేహితుడు శుభమ్తో కలిసి ఒవైసీ హత్యకు పథకం వేశాను. నేను ఒవైసీపై కాల్పులు జరిపినప్పుడు ఆయన వంగిపోయాడు. దీంతో కిందకు కాల్పులు జరిపాను. ఒవైసీకి బుల్లెట్లు తగిలే ఉంటాయని అనుకున్నాను. తర్వాత అక్కడి నుంచి పారిపోయాన’ని పోలీసుల విచారణలో సచిన్ వెల్లడించాడు. దాడికి చాలాసార్లు ట్రైచేశా ఒవైసీపై దాడికి చాలా రోజులు నుంచి ప్రణాళిక తయారు చేసినట్టు చెప్పాడు. సోషల్ మీడియా ద్వారా ఎంపీ కదలికలను తెలుసుకునేవాడినని, దాడి చేయడానికి పలుమార్లు ఒవైసీ సమావేశాలకు కూడా వెళ్లినట్టు తెలిపారు. అయితే సమావేశాలకు జనం భారీ సంఖ్యలో రావడంతో దాడి చేయడం సాధ్యపడలేదని అన్నాడు. ‘ఒవైసీ మీరట్ నుంచి ఢిల్లీకి వెళతారని తెలుసుకుని.. నేను ఆయన కంటే ముందే టోల్గేట్ వద్దకు చేరుకున్నాను. ఒవైసీ కారు రాగానే కాల్పులు జరిపాన’ని పోలీసుల విచారణలో సచిన్ చెప్పినట్టు సమాచారం. పిస్టల్ ఇచ్చింది అతడే ఒవైసీపై కాల్పులకు సంబంధించి ఇప్పటివరకు సచిన్తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు హాపూర్ అడిషినల్ ఎస్పీ తెలిపారు. సచిన్ నుంచి 9 ఎంఎం పిస్టల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడికి పిస్టల్ సమకూర్చిన మీరట్కు చెందిన తలీమ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే సచిన్ ఉద్దేశం గురించి అతడికి తెలియదని విచారణలో తేలింది. కాగా, సచిన్ పండిత్ బీజేపీ నాయకులతో కలిసివున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (చదవండి: ఆంక్షలతో బతకలేను, చావుకు భయపడను) -
గోనె సంచిలో మహిళ మృత దేహం.. కుక్కలు పీక్కుతింటుండగా
లక్నో: యూపీలో దారుణం చోటు చేసుకుంది. మీరట్లోని పార్తాపూర్లో సమీపంలో.. ఒక గోనె సంచిలో ఉన్న మహిళ మృత దేహం కుక్కి ఉండటం కలకలంగా మారింది. కాగా, కాశీ గ్రామంలోని చెరువుకు ఒడ్డున మహిళ మృత దేహన్ని కుక్కలు పీక్కుతింటుండడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గత ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారులు వెంటనే మృత దేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టంకు తరలించారు. చనిపోయిన మహిళ.. బురఖా వేసుకుని ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడ పాడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: రిపబ్లిక్ డే వేడుకలలో అపశృతి.. తలపై పడిన డ్రోన్.. ఇద్దరికి -
స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ
మీరట్: ఉత్తర్ప్రదేశ్లోని సర్ధనలో ప్రధాని మోదీ.. స్పోర్ట్స్ యూనివర్శిటీకి శంకుస్థాపన చేశారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. ఒకప్పటి నేరస్థుల గడ్డ త్వరలో క్రీడాకారులకు అడ్డాగా మారబోతుందని అన్నారు. గతంలో నేరస్తులు మీరట్ పరిసర ప్రాంతాల్లో "ఖేల్ ఖేల్" అంటూ సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడుకునేవాళ్లని.. యోగి ప్రభుత్వం వచ్చాక ఆ నేరస్తులంతా ఇప్పుడు "జైల్ జైల్" అంటూ ఊసలు లెక్కబెడుతున్నారని సెటైర్లు వేసారు. 700 కోట్లతో దాదాపు 92 ఎకరాల్లో యూనివర్సిటీని నిర్మించనున్నట్లు పేర్కొన్న ప్రధాని.. ఈ క్రీడా విశ్వవిద్యాలయానికి హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ పేరు పెట్టారు. చదవండి: అతి త్వరలో పుజారాను సాగనంపడం ఖాయం..! -
పీఎం నరేంద్ర మోదీ: సీఎం యోగి ఆధ్వర్యంలో ఉత్తర్ ప్రదేశ్ అభివృద్ధి
-
అంతా జంక్.. చీకటి వ్యాపారంతో కోట్లు కొల్లగొట్టారు
Asia's largest 'junk market' shuts down: చోరీ చేసిన కార్లను విడిభాగాలుగా విడగొట్టి, వాటితో జోరుగా వ్యాపారం సాగిస్తున్న సోటిగంజ్ మార్కెట్ను ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం ఆదివారం సీజ్ చేసింది. ఢిల్లీతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దొంగిలించిన కార్లను ఈ మార్కెట్లో విడిభాగాలుగా చేసి ఇల్లీగల్గా వ్యాపారం సాగుతోంది. ఈ దందాకు చెందిన హాజీ ఇక్బాల్, హాజీ గల్లా అనే ఇల్లీగల్ గ్యాంగ్స్టర్లు పోలీసులకు పట్టుబడిన తర్వాత సోటిగంజ్ మార్కెట్ మూసివేతకు ఉపక్రమించారు. అంతేకాకుండా కోట్ల విలువచేసే ఆస్తులను కూడా సీజ్ చేశారు. నివేదికల ప్రకారం.. దొంగిలించిన కార్లను విడిభాగాలుగా విడగొట్టి అక్రమ వ్యాపారం చేయడం ఈ మార్కెట్లో 1990లలో ప్రారంభమైంది. కాలక్రమేణా ఇళ్లలోపల గౌడౌన్లు నిర్మించి దొంగ కార్ల వ్యాపారం ప్రారంభించారు. 1,000 మందికి పైగా పనిచేసే ఈ మార్కెట్లో ప్రస్తుతం దాదాపుగా 300 కంటే ఎక్కువ దుకాణాలున్నాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అన్ని దుకాణాలను మూసివేయాలని అక్కడి ఎస్హెచ్ఓ ఆదేశించినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ కేసులో మీరట్ జిల్లా ఎస్ఎస్పీ ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ.. ఈ మార్కెట్లో అక్రమ వ్యాపారం చేస్తున్న 100 షాప్లను గుర్తించాం. స్టాక్ సమాచారాన్ని సేకరిస్తే తప్ప, వాటికి ఎలాంటి సరుకులు చేరనివ్వబోమని' వెల్లడించారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా చూసేందుకు పరిపాలనా యంత్రాంగం ముఖ్యమైన చర్యలు తీసుకుంది. ఆదివారం మధ్యాహ్నం సోటిగంజ్ మార్కెట్లో 200 మందికి పైగా సైనికులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. సోటిగంజ్లోని ప్రధాన జంక్లలో హాజీ గల్లా, హాజీ ఇక్బాల్, హాజీ అఫ్తాబ్, ముష్తాక్, మన్ను అలియాస్ మీనుద్దీన్, హాజీ మొహ్సిన్, సల్మాన్ అలియాస్ షేర్, రాహుల్ కాలా, సలాహుద్దీన్ ఉన్నారు. ఈ స్క్రాపర్లపై 2,500కు పైగా కేసులు ఇప్పటికే నమోదయ్యి ఉన్నాయి. వీరిలో 37 మందిపై గ్యాంగ్స్టర్ చట్టం కింద కేసులు నమోదయ్యాయని స్థానిక మీడియా తెల్పింది. చదవండి: తక్కువ వడ్డీ పేరిట అదితి గోల్డ్ లోన్ సంస్థ ఘరానా మోసం! కిలోల బంగారంతో పరార్.. -
పరువు హత్య: చెల్లిని తుపాకీతో కాల్చి చంపేశాడు!
మీరట్: ఎన్ని చట్టాలు వచ్చినా...ఎన్ని హక్కులు ఉన్నా...వాటికీ విలువ లేకుండా పోతుంది. చదువకున్నవాళ్లు సైతం పరువు, ప్రతిష్ట అంటూ.....నిండు ప్రాణాలను బలిచేయడంతో పాటు...వాళ్ల జీవితాలను నాశనం చేసేసుకుంటున్నారు. అలాంటి ఘటనే మీరట్లోని సర్ధనా ప్రాంతంలో చోటు చేసుకుంది. చెల్లెలు ఎవరితోనో సంబంధం పెట్టుకుందన్న కక్షతో ఆమెను హత్యచేశాడో అన్న.. వివరాల్లోకెళ్తే..మృతిరాలి తల్లి షహనో తన భర్త నుంచి విడాకులు తీసుకుని తల్లిదండ్రులతో కలిసి ఉండేది. ఆమెకు ఆరీప్, సమీరన్ ఇద్దరూ పిల్లలు. ఆమె మళ్లీ పెళ్లి చేసుకోవడంతో పిల్లలు ఆమె తండ్రి వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలో సమీరన్ స్థానిక వ్యక్తితో చనువుగా ఉంటుంది. కుటుంబ సభ్యులు ఆ వ్యక్తికి దూరంగా ఉండమని సూచించారు. కానీ ఆమె అంతగా పట్టించుకోకుండా అలానే కొనసాగించింది. దీంతో ఆమె సోదరుడు ఆగ్రహంతో ఆమె నిదురుస్తున్న సమయంలో దేశీయ తుపాకీతో కాల్చి చంపేశారు. ఆ తర్వాత స్థానిక పోలీస్టేషన్కీ వెళ్లి లొంగిపోయాడు. మృతురాలిని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించి, అతని పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
వైభవంగా పెళ్లి వేడుకలు; ఇంతలో ఊహించని పరిణామం
మీరట్: ఆ ఇంట్లో అంరగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఇంకా కొద్దిసేపట్లో వివాహతంతు ముగుస్తుందనగా ఒక వ్యక్తి తుపాకీతో మంటపంలోకి ప్రవేశించాడు. వచ్చీ రాగానే తుపాకీతో కాల్పులు జరిపాడు. తుపాకీ తూటాలకు ఒక వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలగా.. మరొక వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అప్పటివరకు ఆహ్లదకరంగా ఎంతో సంతోషంగా కనిపించిన వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని మీరట్ జిల్లాలోని సరూర్పూర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని 18 ఏళ్ల సుమిత్గా.. గాయపడిన వ్యక్తిని అంకుర్గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం శుక్రవారం అర్థరాత్రి 12 గంటల తర్వాత అగంతకుడు సురేంద్ర అలియాస్ కల్లు.. సుమిత్పై కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. సుమిత్తో ఉన్న పాత గొడవల కారణంగానే సురేంద్ర ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. అయితే సుమిత్ శరీరంలోకి దూసుకెళ్లిన బులెట్ పక్కనే ఉన్న అంకుర్ను గాయపరిచిందన్నారు. అయితే నిందితుడు సురేంద్ర కాల్పులు జరిపి పారిపోతుండగా స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. కాగా పోస్టుమార్టం నిమిత్తం సుమిత్ను తరలిస్తుండగా.. కుటుంబసభ్యులు అందుకు ఒప్పుకోలేదు. సుమిత్ మృతికి కారణమైన సురేంద్రను మాకు అప్పగించాలని కోరినా పోలీసులు అందుకు నిరాకరించారు. మూడు గంటలపాటు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోగా.. చివరికి పోలీసులు ఎలాగోలా సుమిత్ కుటుంబసభ్యులను ఒప్పించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. -
లంచం డిమాండ్; 75 రోజుల తర్వాత అంత్యక్రియలు
లక్నో: కరోనాతో మరణించిన ఒక వ్యక్తి మృతదేహానికి రెండున్నర నెలల తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. అయితే తన భర్త మృతదేహాన్ని అప్పగించేందుకు వైద్యులు రూ.15,000 లంచం డిమాండ్ చేశారని భార్య ఆరోపించింది. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాలు.. 28 ఏళ్ల నరేశ్కు ఏప్రిల్ 10న కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఆయనకు తొలుత హాపూర్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం నరేశ్ను మీరట్లోని లాలా లాజ్పత్ రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఏప్రిల్ 15న చనిపోయాడు.అయితే ఆయన భార్య గుడియాకు మృతదేహాన్ని అప్పగించేందుకు వైద్యులు రూ.15,000 డిమాండ్ చేసినట్లు తేలింది. డబ్బులు ఇవ్వని పక్షంలో మృతదేహానికి తామే అంత్యక్రియలు నిర్వహిస్తామని వారు చెప్పారు. దీంతో డబ్బులు లేక గుడియా తిరిగి ఊరికి వెళ్లిపోయింది. ఆ తర్వాత బంధువులు సాయంతో విషయాన్ని పోలీసులకు వివరించింది. పోలీసులు ఇటీవల మృతుడి భార్య గుడియాతో ఫోన్లో మాట్లాడి ఆమెను హాపూర్కు రప్పించినట్లు తెలిపారు. అనంతరం హాపూర్ మున్సిపల్ సిబ్బంది ఈ నెల 2న భార్య సమక్షంలో నరేశ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారని వెల్లడించారు. కాగా గుడియా ఆరోపణల్లో నిజానిజాలు ఎంత అనేది తెలుసుకోవడానికి మీర్ట్ జిల్లా కలెక్టర్ బాలాజీ దర్యాప్తుకు ఆదేశించారు. -
ఆ కారులో ఉన్నది రెజ్లర్ సుశీల్ కుమారేనా?
లక్నో: రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒలింపియన్.. రెజ్లర్ సుశీల్ కుమార్ కొంతకాలంగా పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న సుశీల్ ఆచూకీ చెప్పినవారికి రూ. లక్ష బహుమతి కూడా ప్రకటించారు. కాగా తాజాగా సుశీల్ కుమార్ కారులో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్లోని మీరట్ టోల్ప్లాజా వద్ద కారులో డ్రైవర్ పక్కన ముందుసీట్లో సుశీల్ కుమార్ ఉన్నట్లు అక్కడి కెమెరాల్లో రికార్డైంది. అయితే అతను మాస్క్ పెట్టుకోవడంతో సుశీల్ కుమార్ ..అవునా కాదా? అని ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోలు మే 6న అక్కడి కెమెరాల్లో రికార్డు కావడం.. సాగర్ రాణా హత్య జరిగిన రెండు రోజులకు సుశీల్ కారులో ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ నేపథ్యంలో సుశీల్ ఉన్న కారును ట్రేస్ చేసే పనిలో ఉన్న పోలీసులు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా మే 4న ఛత్రశాల్ స్టేడియం ముందు రెండు వర్గాలు కొట్టుకున్న ఘటనలో జాతీయ మాజీ జూనియర్ చాంపియన్ సాగర్ రాణా మరణించగా... సుశీల్పై ఆరోపణలు రావడంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కాగా సుశీల్ కుమార్కు ఢిల్లీ కోర్టులోనూ చుక్కెదురైంది. రెండు వారాలుగా పరారీలో ఉన్న అతనికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అరెస్ట్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తనకు బెయిల్ ఇవ్వాలంటూ సోమవారం స్థానిక రోహిణి కోర్టులో సుశీల్ పిటిషన్ దాఖలు చేయగా... మంగళవారం అతని విజ్ఞప్తిని అడిషనల్ సెషన్స్ జడ్జి జగదీశ్ కుమార్ కొట్టి పారేశారు. ఘటనలో ప్రధాన కుట్రదారుడిగా సుశీల్పై ఉన్న అభియోగాలు తీవ్రమైనవవి న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. చదవండి: రెజ్లర్ సుశీల్కు చుక్కెదురు.. ముందస్తు బెయిల్ కొట్టివేత Sushil Kumar: ఆచూకీ చెబితే రూ.1 లక్ష! -
కవలల విషాదం: అమ్మా నువ్వేదో దాస్తున్నావ్ చెప్పు.. అంతలోనే
వెబ్డెస్క్: ఏప్రిల్ 23, 1997. ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన గ్రెగరీ రైమండ్ రఫేల్ జీవితంలో మర్చిపోలేని రోజు. తన భార్య సోజా పండంటి మగ కవలలకు జన్మనిచ్చిందని, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎప్పుడెప్పుడు భార్యాపిల్లలను చూస్తానా అంటూ ఆస్పత్రి గది బయట తిరగాడిన క్షణాలు ఆయనకు ఇంకా గుర్తే. పిల్లలకు జోఫ్రెడ్ వాగెసే గ్రెగరీ, రాల్ఫ్రెడ్ వాగెసే గ్రెగరీ అని పేర్లు పెట్టుకున్నారు రేమండ్ దంపతులు. ఇక జంట కవలలకు ఒకరంటే ఒకరికి ప్రాణం. ఏం చేసినా కలిసే చేసేవారు. ఇద్దరూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లే. కోయంబత్తూరులోని కారుణ్య యూనివర్సిటీ నుంచి పట్టా పుచ్చుకున్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్లలో భాగంగా జోఫ్రెడ్ అసెంచర్లో ఉద్యోగం సంపాదిస్తే.. రాల్ఫ్రెడ్ హుందాయ్ మ్యుబిస్ కంపెనీ(హైదరాబాద్ కార్యాలయం)లో ఉద్యోగానికి కుదిరాడు. ఆరు అడుగుల ఎత్తుతో, ఆకట్టుకునే రూపాలతో ఉండే కొడుకులు.. ముఖ్యంగా ప్రతీ పనిలోనూ ఒకరికి ఒకరు తోడుగా ఉండే కలివిడితనం చూసి రేమండ్ దంపతులు మురిసిపోని రోజు లేదు. పసిపాపలుగా ఉన్ననాటి నుంచే అన్నదమ్ములు ఒకరికిపై ఒకరు చూపే ఆప్యాయతకు తల్లిదండ్రులే ముగ్ధులయ్యేవారు. అంతటి అనుబంధం ఆ కవలలది. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ అలాంటిది. అంతా సవ్యంగా, సంతోషంగా సాగిపోతోందనుకున్న వారి జీవితాల్లో కరోనా పెను విషాదాన్ని నింపుతుందని ఊహించలేకపోయారు. కలిసి పుట్టిన కవలలు కోవిడ్ బారిన పడి రోజు వ్యవధిలో మరణించడం తట్టుకోలేకపోతున్నారు. చెట్టంత ఎదిగిన కొడుకులు కళ్ల ముందే కన్నుమూయడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. నెగటివ్ వచ్చింది.. కానీ అంతలోనే తమ జీవితంలోని తీరని విషాదం గురించి కవలల తండ్రి రేమండ్ మాట్లాడుతూ..‘‘ఇద్దరూ వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఉండటంతో ఇంటికి వచ్చారు. ఏప్రిల్ 23న అన్నదమ్ములిద్దరికీ జ్వరం వచ్చింది. ఎందుకైనా మంచిదని వైద్యుల సలహాతో మెడికేషన్ ప్రారంభించారు. కానీ వారం రోజుల్లోనే పరిస్థితి దిగజారిపోయింది. మే 1 వాళ్లను స్థానిక ఆస్పత్రిలో చేర్పించాం. కోవిడ్ అని తేలింది. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో వెంటే వెంటిలేటర్పై ఉంచి చికిత్స మొదలుపెట్టారు. కాస్త పరిస్థితి మెరుగుపడింది అనుకున్నాం. పది రోజుల తర్వాత ఇద్దరికీ నెగటివ్ వచ్చింది. కానీ.. కానీ మూడు రోజుల్లోనే అంతా తలకిందులైంది. జాఫ్రెడ్ ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయాడు. ఈ విషయాన్ని మేం రాల్ఫ్రెడ్కు చెప్పలేదు. తనను చూసేందుకు మేం వెళ్లగానే.. ‘‘అమ్మా.. నువ్వేదో దాస్తున్నాం. ఏదో జరిగింది. నాకు చెప్పడం లేదు కదా. చెప్పమ్మా ప్లీజ్’’ అని వాళ్ల అమ్మను అడిగాడు. 24 గంటలు గడవకముందే తను కూడా తనకెంతో ఇష్టమైన కవల సోదరుడి దగ్గరకు వెళ్లిపోయాడు. మూడు నిమిషాల వ్యవధిలో పుట్టిన మా కవలలు, రోజు వ్యవధిలో శాశ్వతంగా మమ్మల్ని విడిచివెళ్లిపోయారు. నిజానికి తన ప్రియమైన సోదరుడు జాఫ్రెడ్ లేకుండా రాల్ఫ్రెడ్ ఒంటరిగా ఇంటికి రాడని నేను ముందే ఊహించాను’’అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మమ్మల్ని సంతోషపెట్టాలనుకున్నారు టీచర్లమైన తాము ఎంతకష్టపడి పిల్లలను పెంచామో వాళ్లకు తెలుసునని, అందుకే తమకు లోకంలోని అన్ని సంతోషాలు ఇవ్వాలని కొడుకులు ఎంతో శ్రమించేవారని, విదేశాల్లో స్థిరపడాలని కలలు కన్నారని గుర్తుచేసుకున్నారు. కానీ దేవుడు మాత్రం వాళ్లకు ఊహించని శిక్ష విధించాడంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా రేమండ్ దంపతులకు కవలల కంటే ముందు కుమారుడు నెల్ఫ్రెడ్ జన్మించాడు. ప్రస్తుతం అతడొక్కడే వారి బాధను కొంతనైనా తీర్చగలిగే ఆశాదీపం. మేం కాపాడలేకపోయాం.. ఇద్దరూ ఎంతో ఫిట్గా ఆరు అడుగుల ఎత్తుతో బలంగా ఉన్నారు. కానీ కోవిడ్ వారిని బలితీసుకుంది. మేమెంతగా ప్రయత్నించినా ఆ కవలలను కాపాడలేకపోయాం అంటూ వారికి చికిత్స అందించిన వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: Plasma Therapy: ప్లాస్మా థెరపీ నిలిపివేత -
'ఆ చట్టాలు రైతుల పాలిట మరణ శాసనాలు'
లక్నో: కొత్తసాగు చట్టాలు రైతుల పాలిట మరణ శాసనాలుగా మారుతున్నాయంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన ఉత్తర్ ప్రదేశ్లోని మీరట్లో పర్యటించారు. ఈ సందర్భంగా మీరట్లో నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్ సభకు హాజరైన కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు సాయం చేసే ఉద్దేశం కేంద్రానికి లేదన్నారు. రైతుల భూమిని పెత్తందార్లకు కట్టబెట్టాలని కేంద్రం చూస్తోందని తెలిపారు. కేంద్రం తెచ్చిన కొత్త సాగుచట్టాల వల్ల రైతులు తమ సొంత పొలాల్లోనూ కూలీలుగా మారుతారంటూ పేర్కొన్నారు. ''కొత్త సాగుచట్టాల వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని.. గతంలో కనీస మద్దతు ధర ఉంది.. ఇప్పుడు అది కొనసాగుతుంది.. భవిష్యత్తులో కూడా కనీస మద్దతు ధర ఉంటుందని'' మోదీ పార్లమెంట్ సాక్షిగా తెలిపారన్నారు. నూతన సాగు చట్టాల రద్దుకోసం మూడు నెలలుగా ఆందోళన చేస్తున్న రైతుల పోరాటాన్ని నీరు గార్చడానికే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ దుయ్యబట్టారు. ఇదే అంశంలో యూపీలో అధికారంలో ఉన్న యోగి ప్రభుత్వానికి మాత్రం రైతుల అంశాలు పట్టవా అని ప్రశ్నించారు. సొంత రాష్ట్రంలో రైతుల సమస్యలు పట్టదు గాని కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలకు మద్దతిస్తున్నట్లు యోగి ప్రభుత్వం పేర్కొనడం సిగ్గుచేటన్నారు. గత రెండేళ్లుగా మీ రాష్ట్రంలోని చెరకు రైతులకు చెల్లింపు విషయంలో భరోసా ఇవ్వకపోవడంతోనే ఆయన పాలన ఏంటో అర్థమవుతుందన్నారు. రైతులను పట్టించుకోని యోగి ప్రభుత్వానికి ఇది పెద్ద అవమానం అని ఎద్దేవా చేశారు. -
వైరల్: ఉమ్ముతూ రోటీలు చేసిన వ్యక్తి
-
పెళ్లి విందు: తుపుక్మంటూ రోటీ మీద ఉమ్మేసి
చాలామందికి పెళ్లంటే గుర్తొచ్చేది కమ్మని విందు భోజనమే.. వెజ్ అయినా నాన్వెజ్ అయినా రకరకాల వంటకాలతో వివాహానికి వచ్చినవారి కడుపు నింపుతారు. అందుకే ఎప్పుడైనా పెళ్లికి వెళ్లాల్సి వస్తే ఓ పూట కడుపు ఖాళీగా ఉంచుకుని మరీ విందుకు రెడీ అవుతుంటారు. కానీ ఈ వీడియో చూశాక మాత్రం పెళ్లి భోజనం అంటే బెంబేలెత్తిపోవడం ఖాయం. లక్నో: ఉత్తర ప్రదేశ్లోని మీరట్లో ఓ పెళ్లితంతు ఘనంగా జరిగింది. అక్కడికి వచ్చిన అతిథుల కోసం ఓ వ్యక్తి తందూరీ రోటీ చేశాడు. ఆ సమయంలో అతడికి దగ్గర్లో ఇతర వంటగాళ్లు ఎవరూ లేనట్లున్నారు. ఇంతలో అతడు ఎవరూ చూడట్లేదు కదా అన్నట్లుగా ఓ లుక్కిచ్చుకుని రోటీ మీద తుపుక్కుమని ఉమ్మేశాడు. అలా ఏదో ఒకదాని మీద ఉమ్మేసి వదిలేయలేదు. అతడు చేసిన ప్రతి రోటీ మీద ఇలాగే ఉమ్మాడు. దీన్నంతటినీ ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముందీ, ఈ వీడియో కాస్త వైరల్గా మారగా మీరట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉద్దేశ్యపూర్వకంగా రోటీని నాశనం పట్టించిన అతడిని మీరట్కు చెందిన సోహైల్గా గుర్తించారు. ఇక ఈ వీడియో చూసిన జనాలు అతడి నిర్వాకానికి శివాలెత్తిపోతున్నారు. ఛీ ఇదేం గలీజు పనిరా నాయనా అని ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అతడికిదేం పోయేం కాలం అని తిట్టిపోస్తూ కామెంట్లు చేస్తున్నారు. కొంపదీసి ఆ రోటీలను పెళ్లికి వచ్చినవాళ్లు తిన్నారా? ఏంటని ఆరా తీస్తున్నారు. చదవండి: వైరల్: అమ్మాయిని ముద్దు లంచంగా అడిగిన పోలీస్ వైరల్: వంటకు సాయం చేస్తున్న కోతి! -
12,638 వజ్రాలతో ఉంగరం
మీరట్: హైదరాబాద్కు చెందిన నగల వ్యాపారి కొట్టి శ్రీకాంత్ నెల క్రితమే 7,801 వజ్రాలు పొదిగిన ఉంగరం తయారు చేసి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. తాజాగా, ఉత్తరప్రదేశ్కు చెందిన నగల దుకాణదారు ఆ రికార్డును బద్దలు కొట్టారు. మీరట్కు చెందిన హర్షిత్ బన్సాల్ ఏకంగా 12,638 వజ్రాలు పొదిగిన రింగ్ను తయారు చేశారు. 8 పొరలతో 165.45 గ్రాముల బరువున్న ఉంగరానికి మారిగోల్డ్ డైమండ్ రింగ్ అనే పేరు పెట్టారు. ఇది గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో స్థానం సంపాదించింది. రూపశిల్పి, 25 ఏళ్ల హర్షిత్ మాట్లాడుతూ.. ‘6,690 వజ్రాలతో తయారైన ఉంగరం గిన్నిస్ రికార్డుల్లో ఉన్నట్లు 2018లో తెలుసుకున్నాను. అనంతరం 2018లో మొదలుపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమం చివరికి 2020 ఫిబ్రవరిలో ముగింపునకు వచ్చింది. గిన్నిస్ ప్రపంచ గుర్తింపు లభించింది. ఇలా భారీ సంఖ్యలో వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని రూపొందించడం క్లిష్టమైన పనే’ అని చెప్పారు. ఉంగరం తయారీలో ఇంటర్నేషనల్ జెమాలజీ లేబొరేటరీ ధ్రువీకరించిన శుద్ధమైన వజ్రాలను వినియోగించినట్లు తెలిపారు. ‘రింగ్ డిజైన్పై చాలా కసరత్తు చేసి చివరికి మా పెరట్లోని మారిగోల్డ్ పుష్పం రూపం బాగా నచ్చింది. ఆ పువ్వు రేకులను పోలిన డిజైన్తో చేయాలని నిర్ణయిం చుకున్నాను. ఉంగరంలోని ఏ రెండు రేకులు కూడా ఒకేలా ఉండకపోవడం దీని ప్రత్యేకత. ఈ రింగ్తో నాకు ఎంతో అనుబంధం ఉంది. అమ్మాలనుకోవడం లేదు. దీనిని నాతోనే ఉంచుకుంటాను’అని చెప్పారు. -
వాళ్లు అసలు మనుషులేనా..
లక్నో: ఆడపిల్ల భారం అనుకున్నారేమో ఆ తల్లిదండ్రులు. పురిట్లోనే తనను వదిలించుకునేందుకు పథకం రచించారు. పసిబిడ్డ అనే కనికరం లేకుండా సంచీలో తనను కుక్కి రోడ్డు పక్కన పడేశారు. కన్నవాళ్లు అంత కర్కశకంగా ప్రవర్తించినా బాటసారులు మాత్రం మానవత్వం చాటుకున్నారు. దీంతో ఆ చిన్నారి మృత్యువును జయించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాలు.. మీరట్లోని శతాబ్దినగర్లో రోడ్డు పక్కన నవజాత శిశువు ఏడుపు విన్న స్థానికులు పాప కోసం వెదికగా.. సంచీలో కుక్కి ఉన్నట్లు గుర్తించారు. నెమ్మదిగా తనను బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారిని సమీప ప్యారేలాల్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు సెల్ఫోన్లో బంధించగా ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘ఇలాంటి ఘాతుకానికి పాల్పడేందుకు అసలు ఆ తల్లిదండ్రులకు మనసెలా వచ్చిందో. పసిపాప అనే కనికరం లేకుండా అమానుషంగా ప్రవర్తించారు. వాళ్లసలు మనుషులేనా’ అంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్న తీరు మానవత్వమున్న ప్రతి ఒక్కరి మనస్సును కదిలిస్తోంది.(చదవండి: గర్భవతితో సహజీవనం.. దారుణ హత్య) ఈ మీరట్ ఘటన గురించి పోలీసు ఉన్నతాధికారి అఖిలేశ్ నారాయణ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘రోడ్డు పక్కన సంచీలో పసిపాపను గుర్తించినట్లు శతాబ్దినగర్ నుంచి కాల్ వచ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న మా బృందం తనను జిల్లా ఆస్పత్రిలో చేర్పించింది. నెలలు నిండకముందే పుట్టినప్పటికీ ప్రస్తుతం తను ఆరోగ్యంగానే ఉందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం తను కోలుకుంటోంది’’ అని పేర్కొన్నారు. కాగా లింగ సమానత్వంపై అవగాహన కల్పించేందుక ప్రభుత్వాలు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా సమాజంలో మార్పు రావడం లేదు. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే, అబార్షన్లు చేయించేవాళ్లు కొందరైతే, అన్ని అడ్డంకులు దాటుకుని ఈ భూమి మీద పడిన పసిపాపలను పురిట్లోనే చంపేసేవారు ఎంతో మంది ఉన్నారు. -
పైకప్పుపై రూ. 40 లక్షల డబ్బు, నగల సంచులు
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. మీరుట్కు చెందిన ఓ కుటుంబానికి ఉదయం లేవగానే నమ్మలేని దృశ్యం ఎదురుపడింది. డబ్బు కట్టలు, బంగారంతో నిండి ఉన్న రెండు బ్యాగులను వారి ఇంటి పైకప్పుపై గుర్తించిన సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. మీరుట్లో నివాసముంటున్న వరణ్ శర్మ అనే వ్యక్తి బుధవారం ఉదయం తన ఇంటి పైకప్పుపై రెండు బ్యాగులను గుర్తించాడు. తెరిచి చూడగా వాటి నిండ డబ్బు, నగలు కనిపించాయి. ఇది దొంగలించిన డబ్బుగా భావించి వెంటనే సర్దార్ పోలీసు స్టేషన్కు సమాచారం ఇచ్చాడు. అక్కడి చేరుకున్న పోలీసులు దాదాపు 40 లక్షల రూపాయలు విలువ చేసే డబ్బు, బంగారం సంచులను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. వరుణ్ శర్మ ఇంటి పక్కనే ఉన్న వ్యాపారవేత్త పవన్ సింఘాల్కు సంబంధించి సొత్తుగా ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసు అధికారి దీనేష్ బాగెల్ తెలిపారు. (చదవండి: ఆ ఇంట్లో.. అనుమానాస్పదస్థితిలో 6 మృతదేహాలు) ఈ డబ్బు, నగలను పవన్ సింఘాల్ ఇంట్లో రెండేళ్లుగా పనిచేస్తున్న నేపాల్కు చెందిన రాజు దొంగతనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల నేపాల్కు వెళ్లిన రాజు కొంతకాలం తర్వాత తిరిగి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి సెక్యూరిటి గార్డుతో కలిసి బుధవారం ఈ దొంగతనానికి పాల్పడ్డాడని, ఈ క్రమంలో రెండు బ్యాగుల్లో డబ్బు, బంగారం సర్థేసి సీసీ టీవీలో కనిపించకుండా ఉండేందుకు వరుణ్ శర్మ ఇంటి పైకప్పుపై దాచినట్లు తెలిపారు. ప్రస్తుతం సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. దొంగతనం జరిగిన తన వస్తువులు, బంగారంపై స్పష్టత లేదని వాటిని లెక్కించిన అనంతరం ఫిర్యాదు చేస్తానని పోలీసులతో పవన్ సింఘాల్ పేర్కొన్నాడు. (చదవండి: చిన్నారుల హత్య: నర్సుపై ఛార్జ్షీట్) -
‘రూ.31 లక్షలకే అల్లావుద్దీన్ అద్భుత దీపం’
లక్నో: పిల్లలు నుంచి పెద్దల వరకు అల్లావుద్దీన్ అద్భుత దీపం గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రసిద్ధ మధ్య ప్రాచ్య జానపద కథల నుంచి వచ్చిన మాయా కళా ఖండం ఇది. ఈ దీపాన్ని రుద్దితో అందులో నుంచి ‘జీనీ’ బయటకు వస్తాడు. మనం కోరిన కోరికలు తీరుస్తాడు. ఇదంతా కేవలం కథల్లోనే జరుగుతుంది. నిజంగా అలాంటి మాయా దీపాలు ఉండవు. ఒకవేళ ఉంటాయని నమ్మితే ఈ డాక్టర్ మాదిరిగానే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఉత్తరప్రదేశ్ మీరట్కు చెందిన ఇద్దరు వ్యక్తులు అల్లావుద్దీన్ దీపాన్ని పోలిన వస్తువును ఒక దాన్ని డాక్టర్కు ఏకంగా 31 లక్షల రూపాయలకు అమ్మారు. డాక్టర్ని బురిడీ కొట్టించడం కోసం ఏకంగా అల్లావుద్దీన్నే రంగంలోకి దించారు. దాంతో వారి మాటలు నమ్మిన డాక్టర్ 31 లక్షల రూపాయలు చెల్లించి నిట్ట నిలువునా మునిగాడు. వివరాలు.. డాక్టర్ ఎల్ఏ ఖాన్కు ఇక్రముద్దీన్, అనీన్ అనే ఇద్దరు వ్యక్తులు పరిచయం అయ్యారు. తమ తల్లికి ఆరోగ్యం బాగాలేదు.. ఇంటికి వచ్చి చూడాల్సిందిగా ఖాన్ను కోరారు. దాంతో వారి ఇంటికి వెళ్లి అనారోగ్య తల్లిగా వర్ణించిన స్త్రీకి చికిత్స చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో నిందితులిద్దరు డాక్టర్తో పరిచయం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో నిందితులిద్దరు ఓ బాబా గురించి డాక్టర్కు చెప్పారు. ఒకసారి ఆయన వారి ఇంటికి కూడా వచ్చినట్లు తెలిపారు. ఆయనకు ఎన్నో అతీత శక్తులున్నాయని.. బాబాను కలవాల్సిందిగా డాక్టర్కు బ్రెయిన్ వాష్ చేశారు. దాంతో డాక్టర్ సదరు బాబాని కలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు కలిసి తమ దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందని.. దాంతో సంపద, ఆరోగ్యం, అందం లభిస్తాయని తెలిపారు. కోటిన్నర రూపాయలకు అమ్ముతామని డాక్టర్కు తెలిపారు. అయితే వైద్యుడు మొదట ఈ మాటలు నమ్మలేదు. (చదవండి: సైకో డాక్టర్.. భార్య కాపురానికి రాలేదని..) దాంతో వారు ఒకసారి ఏకంగా ‘అల్లావుద్దీన్’ ఇతడే అంటూ ఓ వ్యక్తిని డాక్టర్ ముందు ప్రవేశపెట్టారు. దాంతో నిజమేనని నమ్మిన డాక్టర్ ఆ దీపాన్ని తనకు అమ్మాల్సిందిగా కోరాడు. అయితే వారు చెప్పినట్లు కోటిన్నర రూపాయలు ఇవ్వలేనని.. 31 లక్షల రూపాయలు చెల్లించగలనని తెలిపాడు. నిందితులు ఆ మొత్తం తీసుకుని ‘అల్లావుద్దీన్ దీపం’ అని పిలవబడే వస్తువును డాక్టర్కి ఇచ్చారు. ఇంటికి వెళ్లి దాన్ని పరీక్షించిన ఖాన్ అది డమ్మీదని తెలిసి ఒక్కసారి షాక్కు గురయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఖాన్ కంప్లైంట్ మేరకు పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మీరట్ సీనియర్ అధికారి అమిత్ రాయ్ మాట్లాడుతూ.. ఈ గ్యాంగ్ తంత్ర విద్యల పేరు చెప్పి నగరంలో ఇప్పటికే చాలా మందిని మోసం చేశారు. దీనిలో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. ఇద్దరిని అరెస్ట్ చేశాం. ఒక మహిళ పరారీలో ఉంది అని తెలిపారు. -
పబ్జీ కోసం తండ్రిపై కత్తితో దాడి!
లక్నో: పబ్జీ గేమ్ను భారత్తో బ్యాన్ చేసిన దాని వల్ల జరుగుతున్న దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా గంటలు గంటలు పబ్జీ అడొద్దు అని చెప్పినందకు ఒక కొడుకు తన తండ్రిని కత్తితో గాయపరిచాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో చోటు చేసుకుంది. అమర్ అనే వ్యక్తిని అతని తండ్రి ఇర్ఫాన్ పబ్జీ అడొద్దు అంటూ మందలించాడు. ప్రతిసారి అలా అడ్డుచెప్పడంతో విసుగుచెందిన అమర్ అతని తండ్రిపై విచక్షణా రహితంగా దాడి చేసి అతని గొంతు వద్ద అనేకసార్లు కత్తితో దాడి చేశాడు. అనంతరం అతను కూడా కత్తితో పొడుచుకున్నాడు. ఇంటి నుంచి బయటకు రక్తపు మరకలతో వచ్చిన అతడిని రక్షించడానికి స్థానికులు ప్రయత్నించిన వారిపై కూడా దాడి చేయబోయాడు. గాయపడిన తండ్రి కొడుకులను ఆసుపత్రిలో చేర్పించారు. వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అయితే అమర్కు డ్రగ్స్ అలవాటు ఉందని అతని కుటుంబ సభ్యులు తెలియజేశారు. కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. భారత్లో పబ్జీని ఆపేసినప్పటికి ఇప్పటికే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న వారు ఆడటానికి వీలు కల్పిస్తుండంటతో యువత పబ్జీకి బానిసలుగా మారుతున్నారు. చదవండి: పబ్జీ ముసుగులో బాలికపై దారుణం -
ఆర్ఆర్టీఎస్ రైలు ఫస్ట్లుక్ ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్) రైలు తొలి డిజైన్ను పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ శుక్రవారం విడుదల చేసింది. 82 కిలోమీటర్ల పొడవున గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్లతో ఆర్ఆర్టీఎస్ క్యారిడార్ దేశంలో ఇదే మొదటిది కావడం గమనార్హం. జాతీయ రాజధాని ప్రాంతం వెంట ఆర్ఆర్టీఎస్ ప్రాజెక్టును అమలుచేసేందుకు ఢిల్లీ, హర్యానా, రాజస్తాన్, యూపీ ప్రభుత్వాలు కలిసి ఎన్సీఆర్టీసీ పేరిట జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేశాయి. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందే ఆర్ఆర్టీఎస్ రైళ్లు స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో నిర్మాణమై తేలికపాటి బరువును కలిగిఉంటాయి. ఈ రైళ్లు పూర్తిగా ఏసీ సౌకర్యాన్ని కలిగిఉంటాయి. చదవండి : యాదాద్రికి ఎంఎంటీఎస్ ఏదీ? -
జీతం అడిగితే.. అశ్లీల వీడియోలు
మీరట్ : యూపీలోని మీరట్లో స్కూల్ యాజమాన్యం వికృత చర్యలు ఆలస్యంగా వెలుగుచూశాయి. జీతాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన మహిళా ఉపాధ్యాయులను వేధించడమే గాక టాయిలెట్స్లో రహస్యంగా స్పై కెమెరాలు ఏర్పాటు చేసి అశ్లీల వీడియోలు తీసినట్లు బయటపడింది. వివరాలు.. మీరట్లోని సర్ధార్ బజార్లో రిషబ్ అకాడమీ స్కూల్ నడుపుతున్నారు. లాక్డౌన్ ఉండడంతో పాఠశాలను మూసివేశారు. దీంతో ఆ స్కూల్లో పనిచేస్తున్న పలువురు మహిళా ఉపాధ్యాయులు తమకు అందాల్సిన జీతాలను ఇవ్వాలంటూ స్కూల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. పాఠశాల సెక్రటరీగా ఉన్న రంజీత్ జైన్ అతని కొడుకు అభినవ్ జైన్లు జీతాలు ఇవ్వకుండా వేధించడమే గాక మహిళల టాయిలెట్ రూంలో రహస్యంగా స్పై కెమెరాలు అమర్చినట్లు తేలింది.(చదవండి : విషాదం: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య) జీతాలు అడగానికి వచ్చిన సదరు మహిళా ఉపాధ్యాయులకు వారి వీడియోలు చూపిస్తూ బ్లాక్మెయిలింగ్కు పాల్పడినట్లు తెలిసింది. దీంతో పాఠశాల గేటు ఎదుట నిరసన వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు అక్కడినుంచి మీరట్ పోలీస్ స్టేషన్కు వెళ్లి రంజిత్, అభినవ్లపై ఫిర్యాదు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా తండ్రీ, కొడుకులు తమకు తెలియకుండా తీసిన రహస్య వీడియోలను చూపించి చనువుగా ఉండాలంటూ బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతున్నారని ఒక మహిళ ఉపాధ్యాయురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ తాము వారికి లొంగకపోతే చేతబడి చేయించి మమ్మల్ని చంపేందుకు కూడా వెనకాడమని బెదిరించారంటూ మరికొందరు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. (చదవండి : ప్రణయ్ని చంపినట్లు చంపుతామని..) -
ముక్కలుగా నరికి బోర్బావిలో పడేశారు
లక్నో: గత మూడు రోజుల నుంచి మీరట్ పోలీసులు ఓ యువకుడి మృతదేహం కోసం బోరు బావిని తవ్వుతునే ఉన్నారు. నీళ్లు పడ్డాయి కానీ శరీర భాగాలు మాత్రం లభించలేదు. వివరాలు.. మీరట్కు చెందిన ఐటీఐ విద్యార్థి రూపక్(20) గత నెల 25న స్నేహితులను కలవాలంటూ ఇంటి నుంచి వెళ్లాడు. రాత్రి అయినా తిరిగి రాలేదు. దాంతో అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు రూపక్ స్నేహితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. స్నేహితులు, రూపక్ సోదరి గురించి చెడుగా మాట్లాడటంతో వారి మధ్య గొడవ ప్రారంభమయ్యింది. ఈ క్రమంలో స్నేహితుల్లో ఒకడైన వివేక్ రూపక్ని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం మృతదేహాన్ని పొలంలోని ఓ ఇటుక బట్టీ వద్ద పాతి పెట్టారు. కానీ పోలుసులకు దొరికిపోతామనే ఉద్దేశంతో మృతదేహాన్ని వెలికి తీసి ముక్కలుగా చేశారు. అనంతరం ఊరవతల ఉన్న బోరువెల్లో మృతదేహం ముక్కలను పడేసినట్లు వివేక్ బృందం పోలీసులకు తెలిపింది. దాంతో గత మూడు రోజులుగా పోలీసులు రూపక్ శరీర భాగాల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి ఆధారం లభించలేదు. శరీర భాగాలు బావి లోపల చాలా లోతులో అయినా పడి ఉండాలి లేదా నిందితులు తప్పుడు సమాచారం అయినా ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దాంతో చాలా జాగ్రత్తగా తవ్వకాలు జరుపుతున్నారు. నీటి పారుదల శాఖ సాయం కూడా తీసుకున్నారు. ఇప్పటికే 50 అడుగులు లోతు తవ్వారు. నీళ్లు పడ్డాయి.. కానీ శరీర భాగాలు మాత్రం లభ్యం కాలేదు. రూపక్ మృతదేహం లభించకపోతే.. నిందితుల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేమంటున్నారు పోలీసులు. -
రూ.2500కే కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్
మీరట్ : ‘కరోనా పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అని భయపడక్కర్లేదు.. కరోనా ఉన్నప్పటికీ దాన్ని లేకుండా చేయగలం.. మీకు ఎలాంటి చింత అవసరం లేకుండా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ఇస్తాం’ అంటూ బంపర్ ఆఫర్ ఇస్తోంది ఉత్తర ప్రదేశ్లోని మీరట్ ఆస్పత్రి. ఇందుకోసం కేవలం 2,500 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించింది. మనుషుల ప్రాణాలతోనే వ్యాపారమా.. అని ఈ విషయం తెలిసిన వారు నోరెళ్లబెడుతున్నారు. యథేచ్ఛగా నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న న్యూ మీరట్ ఆస్పత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు దాన్ని మూసివేయడంతోపాటు ఆస్పత్రి నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలియజేశారు. (వైరల్ : ఫైన్ వేశారని నానా రభస చేశాడు) ఆస్పత్రి లైసెన్స్ను రద్దు చేశారు. కాగా 2,500 రూపాయలకే కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్లు మీ చేతికి ముట్టజెప్తామంటూ ఆస్పత్రి సిబ్బంది మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీని ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇక ఈ ఆరోపణలను సదరు ఆస్పత్రి యజమాని షా అలామ్ తోసిపుచ్చారు. తనకే పాపం తెలియదని, తన పరువుకు భంగం కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ వీడియోను వదిలారని వాపోయాడు. పోలీసుల విచారణలో తాను నిర్దోషిని అని రుజువు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. (మత వివక్ష; ఆసుపత్రి యాజమాన్యం క్షమాపణ) -
13 వేల ఫోన్లకు ఒకే ఐఎమ్ఈఐ నెంబర్
మీరట్ : 13,500 మొబైల్ ఫోన్లు ఒకే ఐఎమ్ఈఐ నెంబర్(ఇంటర్ నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ) కలిగి ఉన్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మీరట్కు చెందిన ఓ పోలీసు అధికారి సెల్ఫోన్ కొద్దిరోజుల క్రితం పాడైంది. అయన దాన్ని రిపేరు చేయించారు. అయినప్పటికి అది సరిగా పనిచేయలేదు. దీంతో దాన్ని సైబర్ క్రైం విభాగానికి చెందిన ఓ సిబ్బందికి అప్పగించి, సమస్య ఎంటో చూడమన్నారు. ఈ నేపథ్యంలో ఐఎమ్ఈఐల విషయం వెలుగులోకి వచ్చింది. ( కొడుకు కళ్లెదుటే.. భర్త దారుణం ) దీంతో సదరు మొబైల్ కంపెనీ, సర్వీస్ సెంటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మీరట్ ఎస్పీ అఖిలేష్ ఎన్. సింగ్ మాట్లాడుతూ.. ‘‘ దాదాపు 13,500 ఫోన్లు ఒకే ఐఎమ్ఈఐ నెంబర్పై పనిచేస్తున్నాయి. ఇది భద్రతకు సంబంధించిన సీరియస్ సమస్య. మొబైల్ కంపెనీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. నేరస్తులు వారి స్వలాభానికి దాన్ని వాడుకునే అవకాశం ఉంది’’ అని అన్నారు. ( మేనకా గాంధీపై కేసు నమోదు ) -
కలకలం: కరోనా సాంపిల్స్ ఎత్తుకెళ్లిన కోతి
లక్నో: మీరట్ వాసులు కోవిడ్ భయంతో వణికిపోతున్నారు. దీనికి కారణం అక్కడి కోతుల గుంపు చేసిన తుంటరి పనే. ఆట బొమ్మ అనుకుందో, అరటి పండే అనుకుందో ఏమో కానీ ఓ కోతుల గుంపు కరోనా అనుమానితుల నమూనాలను ఎత్తుకెళ్లింది. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మీరట్ మెడికల్ కాలేజీలో ముగ్గురు కోవిడ్ అనుమానితులకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. వీటిని పరీక్షించేందుకు శుక్రవారం ఓ ల్యాబ్ టెక్నీషియన్ ఈ టెస్ట్ సాంపిల్స్ను మోసుకు వెళుతుండగా ఒక్కసారిగా కోతులు అతనిపై మూకుమ్మడిగా దాడి చేశాయి. (కోతులపై టీకా పరీక్ష.. సానుకూలం) అనంతరం అతని దగ్గర ఉన్న సాంపిల్స్ను ఎత్తుకెళ్లాయి. అందులో ఓ కోతి కరోనా టెస్టింగ్ కిట్ను నమిలివేస్తూ కనిపించిందని గ్రామస్థులు పేర్కొన్నారు. దీంతో ఆ ప్రాంతవాసులు హడలెత్తిపోతున్నారు. టెస్టింగ్ కిట్లలో కరోనా వైరస్ ఉండొచ్చేమోనని, వాటిని వానరాలు ఎక్కడ తమ ఇళ్లపై విసిరేస్తాయోనని ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. మరోవైపు వైద్యులు కోవిడ్ అనుమానితుల దగ్గర నుంచి మరోసారి నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపారు. (పెళ్లి మండపం నుంచే క్వారంటైన్ సెంటర్కు..) -
ఖైనీ అమ్మనందుకు ఇంటిపై కాల్పులు
లక్నో: ఖైనీ అమ్మనందుకు ఓ దుకాణదారుడి ఇంటిపై ఆగంతుకులు కాల్పులకు తెగబడిన సంఘటన మీరట్లోని భైంసా గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు అలిసన్ మాట్లాడుతూ.. ‘నేను ఇంట్లోనే కిరాణ దుకాణం నడుపుతున్నాను. ఈ క్రమంలో గురువారం సాయంత్రం షాప్ మూసేశాను. ఇంతలో లోకేంద్ర మా ఇంటికి వచ్చి ఖైనీ కావాలని అడిగాడు. దుకాణం మూసి వేశాను. ఇవ్వడం కుదరదని చెప్పి, వెళ్లి పొమ్మన్నాను. అతడు వెళ్లకుండా నాతో గొడవపడ్డాడు. దాంతో నేను ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాను. కాసేపటి తర్వాత లోకేంద్ర ఓ 10 మంది వ్యక్తులను తీసుకుని నా ఇంటి మీదకు వచ్చాడు. అందరి చేతుల్లో తుపాకులు ఉన్నాయ’న్నాడు అలీసన్. అలీసన్ మాట్లాడుతూ.. ‘వారిలో కొందరు మా ఇంటి మీద కాల్పులకు తెగబడ్డారు. సుమారు మూడు రౌండ్లు మా ఇంటి మీద కాల్పులు జరిపారు. గేటుకు పెద్ద రంధ్రం పడింది. అదృష్టం బాగుండి మేం తప్పించుకోగలిగాము’ అని చెప్పాడు. అనంతరం పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. లోకేంద్ర, అతడి స్నేహితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
గబ్బిలాల మృత్యువాత.. ఆందోళనలో గ్రామస్తులు
లక్నో: కరోనా వైరస్ భయాలు వెంటాడుతున్న వేళ ఎనిమిది గబ్బిలాలు మృత్యువాత పడటం ఓ గ్రామంలో కలకలం రేపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. మీరట్ శివారులోని మెహ్రోలీ గ్రామ సమీపంలోని నీటి గుంటలో ఏప్రిల్ 29న గబ్బిలాల కళేబరాలు బయటపడ్డాయి. కరోనా వ్యాప్తికి గబ్బిలాలే కారణమన్న వార్తల నేపథ్యంలో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారి అదితి శర్మ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం బరేలిలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐవీఆర్ఐ)కి గబ్బిలాల నమూనాలు పంపించారు. ఇక ఈ విషయంపై పరిశోధన జరిపిన ఐవీఆర్ఐ శాస్త్రవేత్తలు కరెంట్ షాక్ తగిలినందు వల్లే గబ్బిలాలు మృత్యువాత పడ్డాయని తాజాగా స్పష్టం చేశారు. (కరోనా.. 53 వేలకు చేరువలో కేసులు) ఈ విషయం గురించి డీఎఫ్ఓ అదితి శర్మ మాట్లాడుతూ.. నీటి కుంట సమీపంలోని పండ్ల తోటలో వెదజల్లిన రసాయనాల వల్లే గబ్బిలాలు చనిపోయినట్లు భావించామని.. అయితే ఎలక్ట్రిక్ షాక్ వల్లే ఘటన జరిగిందని.. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కానీ మెహ్రోలి గ్రామస్తులు మాత్రం అదితి మాటలతో ఏకీభవించడం లేదు. ఊరి పెద్ద గంగారాం ఘటన గురించి మాట్లాడుతూ.. గబ్బిలాల మృతదేహాలు లభించిన చోటుకు సమీపంలో ఎలాంటి కరెంట్ లైన్ లేదని తెలిపారు. షాక్ కొట్టడం వల్లే అవి చనిపోయాయని చెబుతున్నారని.. అయితే అక్కడే ఉన్న ఇతర జంతువులు ఎందుకు చనిపోలేదని ప్రశ్నించారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఈ ఘటనపై లోతుగా విచారణ జరిపాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని తేలికగా కొట్టిపారేయవద్దని.. తమ ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని అధికారులకు విన్నవించారు. (ఆ రాష్ట్రాల గబ్బిలాల్లో కరోనా పాజిటివ్!) గబ్బిలాన్ని కరోనా ఏం చేయలేదా? -
సీఏఏ : హింస చల్లారంటే అదొక్కటే మార్గం!
మీరట్: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కేంద్రమంత్రి సంజీవ్ బల్యాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్కు చెందిన విద్యార్థులకు అన్ని వర్సిటీల్లో 10 శాతం సీట్లు కేటాయించారంటే ఆందోళనలు చల్లారుతాయని ఆయన పేర్కొన్నారు. బుధవారం మీరట్లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు మద్దతుగా బీజేపీ చేపట్టిన ర్యాలీలో సంజీవ్ బల్యాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ‘రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఓ విన్నపం. సీఏఏ ఆందోళనలు సద్దుమణగాలంటే ఒకే ఒక పరిష్కారం. పశ్చిమ యూపీకి చెందిన విద్యార్థులకు అన్ని యూనివర్సిటీల్లో 10 శాతం కోటా కల్పిస్తే చాలు. ముఖ్యంగా జేఎన్యూ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఆందోళనలు సద్దుమణుగుతాయి. అంతకుమించి మరేమీ అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు. ఇక కేంద్రమంత్రి వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసేలా ఉన్నాయని ప్రతిపక్షాలు ఆయనపై విరుచుకుపడుతున్నాయి. దేశవ్యాప్తంగా నిరసనలు కాగా కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన నాటినుంచి వేలాది విద్యార్థులు దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేపడుతున్న విషయం తెలిసిందే. అది చట్ట రూపం దాల్చిన అనంతరం సీఏఏ వ్యతిరేక ఆందోళనలు పలుచోట్ల హింసాత్మకంగా మారాయి. ఈ క్రమంలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో పోలీసులు విద్యార్థులపై లాఠీ ఝుళిపించగా.. జేఎన్యూలో ముసుగు వేసుకున్న కొంతమంది దుండగులు యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులపై దాడికి దిగారు. అనంతరం ఈ దాడులపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు పెల్లుబికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. కాగా మంత్రి సంజీవ్ బల్యాన్ 2013 ముజఫర్నగర్ దాడుల్లో నిందితుడిగా ఉన్నారు. ఈ దాడుల్లో 60 మంది చనిపోగా వేలాదిమంది నిరాశ్రయులైన విషయం తెలిసిందే. చదవండి: వెనక్కి తగ్గని ‘షహీన్బాగ్’ దళితులపై హింసపట్ల స్పందన ఏది? -
నిరసనకారులకు ప్రియాంక పరామర్శ
ముజఫర్నగర్/మీరట్: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్, మీరట్లో జరిగిన నిరసనల్లో.. పోలీసుల దాడిలో గాయపడ్డ వారి కుటుంబాలను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కలిశారు. ‘పోలీసులు ప్రజలను రక్షించాలి. కానీ ఇందుకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారు’అని ప్రియాంక ఆరోపించారు. లక్నోలోని బిజ్నూర్లో బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పోలీసుల దాడిలో గాయపడ్డ ముజఫర్నగర్లోని మౌలానా అసద్ రజా హుస్సేనీని ఆమె పరామర్శించారు. మదరసాలో హుస్సేనీ పిల్లలతో కలసి ఉండగా, పోలీసులు వారిపై దాడికి పాల్పడి.. పిల్లలను కూడా జైలులో పెట్టారని ఆమె ఆరోపించారు. నిరసనల్లో జరిగిన హింసలో మరణించిన నూర్ మొహమ్మద్ కుటుంబాన్ని కలసి ఆమె పరామర్శించారు. పోలీసులు దౌర్జన్యంగా ప్రవేశించి ఇబ్బంది పెట్టిన రఖియా పర్వీన్ను కూడా ఆమె కలిశారు. ఏదైనా తప్పు చేస్తే చర్యలు తీసుకుంటే ఎవరూ తప్పు పట్టరని, అయితే ఎలాంటి తప్పు చేయకుండానే పోలీసులు అతిగా ప్రవర్తించారని దుయ్యబట్టారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలతో సంబంధముందన్న ఆరోపణలతో అరెస్టయిన సామాజిక కార్యకర్త సదాఫ్ జాఫర్, మాజీ ఐపీఎస్ అధికారి ధరపురి సహా 13 మందికి లక్నోలోని ఓ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
‘పాకిస్తాన్ వెళ్లిపోండి!’
మీరట్: పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులను ‘పాకిస్తాన్ వెళ్లిపోండి’ అని మీరట్లోని ఓ పోలీసు ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. సీఏఏకి వ్యతిరేకంగా మీరట్లో డిసెంబర్ 20న లిసారీ గేట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఆందోళనకారులను ఉద్దేశించి మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది. ‘నిరసన సందర్భంగా పాక్కు మద్దతుగా కొందరు నినాదాలు చేస్తున్నారు. భారత్లో ఉండి పాకిస్తాన్కు మద్దతుగా నినాదాలు చేసే వారు ఆ దేశానికే వెళ్లిపోండి’అని తాను వారికి సలహా ఇచ్చానని సింగ్ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శనివారం తీవ్రంగా తప్పుబడ్డారు. -
రాహుల్, ప్రియాంకలను ఆపేశారు
న్యూఢిల్లీ/కోల్కతా/బిజ్నోర్/మీరట్: ఉత్తర ప్రదేశ్లోని మీరట్లో గత వారం ‘పౌర’ ఆందోళనల్లో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలను మీరట్ పోలీసులు అడ్డుకున్నారు. ‘మీరట్లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంతో నిషేధాజ్ఞలు విధించాం. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపాం. దీంతో వారే వెనక్కి వెళ్లిపోయారు’ అని పోలీసులు తెలిపారు. ‘సంబంధిత ఉత్తర్వులను చూపాలని పోలీసులను అడిగాం. అవేమీ చూపకుండా వారు మమ్మల్ని వెనక్కి వెళ్లాలన్నారు’ అని రాహుల్, ప్రియాంక మీడియాతో అన్నారు. ‘పౌర’ చట్టంపై ఏకమైన విద్యార్థి సంఘాలు పౌరసత్వ చట్ట సవరణతోపాటు, కేంద్రం చేపట్టదలచిన జాతీయ పౌర పట్టిక, జనాభా పట్టిక సవరణలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న 70 యువ, విద్యార్థి సంఘాలు ఏకమయ్యాయి. నేషనల్ యంగ్ ఇండియా కో ఆర్డినేషన్ అండ్ కాంపెయిన్ (వైఐఎన్సీసీ) ఛత్రం కింద ఈ సంఘాలు మంగళవారం ఏకమయ్యాయి. 71వ గణతంత్ర దినోత్సవాలకు ముందుగానే కేంద్రం పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని వైఐఎన్సీసీ సభ్యుడు సాయి బాలాజీ డిమాండ్ చేశారు. అతడు మా కాల్పుల్లోనే చనిపోయాడు ‘పౌర’ ఆందోళనల సందర్భంగా ఒక యువకుడి మృతికి తామే కారణమని ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ పోలీసులు అంగీకరించారు. బిజ్నోర్లోని నహ్తౌర్లో హింసాత్మకంగా మారిన ఆందోళనలను అదుపు చేసేందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందని ఎస్పీ విశ్వజీత్ శ్రీవాస్తవ మంగళవారం వెల్లడించారు. కాగా, ఎన్నార్సీపై ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా చేస్తున్న ప్రకటనలు పొంతనలేకుండా ఉన్నాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బెంగాల్ గవర్నర్కు చుక్కెదురు బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధంఖర్ మరోసారి భంగపాటుకు గురయ్యారు. కోల్కతాలో జాదవ్పూర్ వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు బయలుదేరిన ఆయన్ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న టీఎంసీ అనుబంధ విద్యార్థి సంఘం కార్యకర్తలు ఆయన వాహనం వర్సిటీలోకి ప్రవేశించకుండా మెయిన్ గేట్ వద్దే రోడ్డుపై బైఠాయించారు. గో బ్యాక్ అని నినాదాలు చేసుకుంటూ, నల్ల జెండాలు ప్రదర్శించారు. దీంతో యూనివర్సిటీ వైస్చాన్స్లర్ అయిన సురంజన్ దాస్కు గవర్నర్ ఫోన్ చేశారు. ఆందోళనకారులను శాంతింప జేయాలని సురంజన్ను కోరారు. ఫలితం లేకపోవడంతో గవర్నర్ వెనుదిరిగారు. ఈ సందర్భంగా ధంకర్ మమత ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. -
నాపై వారే చేయి చేసుకున్నారు: మాజీ క్రికెటర్
మీరట్: తాను తప్పతాగి పక్కంటి వారిపై దాడి చేసినట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశాడు. తాను ఎప్పుడూ చీమకు కూడా హాని కల్గించనని, మరి అటువంటిది తాగి ఒక అబ్బాయిపై, అతని తండ్రిపై దాడి చేశానంటూ ఫిర్యాదు చేయడం బాధించిందన్నాడు. కాగా, ఆ అబ్బాయి తండ్రి దీపక్ శర్మనే తనపై చేయి చేసుకున్నాడని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నాడు. ‘ నేను అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడా. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను ఎప్పుడూ కనీసం చీమను కూడా చంపలేదు. అటువంటప్పుడు ఒక అబ్బాయిపై దాడి ఎందుకు చేస్తాను. మా ఇంటికి సమీపంలో ఆ అబ్బాయి, అతని తండ్రి కలిసి నాతో గొడవ పడ్డారు. నేను కారులో ఉన్న సమయంలో వారిద్దరూ నన్ను బయటలాగి మరీ దాడి చేశారు. ఇలా నేను తాగి వారిని కొట్టాననడం అంతా అబద్ధం. నా గొలుసును లాక్కోవడానికి వారు ప్రయత్నించారు. ఇక్కడ స్థానిక రాజకీయాలతో నాపై ఇలా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎప్పుడూ ఇక్కడ పెద్దగా ఉండను. నాకు రెండు-మూడు ఇళ్లులు న్నాయి. నేను కేవలం ఇక్కడ పెయింట్ వర్క్ ఎలా జరుగుతుందనే చూద్దామనే వచ్చా. చాలామంది ఇతరుల సక్సెస్ చూసి ఓర్వలేరు. నా ఇమేజ్ను డామేజ్ చేయాలని చూశారు’ అంటూ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నాడు. టీమిండియా తరఫున మ్యాచ్లు ఆడిన ప్రవీణ్ కుమార్ కాస్త దుందుడుగు స్వభావం కలిగిన వాడు. గతంలో కూడా అతడు తప్ప తాగి గొడవ పడిన సంఘటనలు ఉన్నాయి. అతడి క్రికెట్ కెరీర్ మొదట్లో సాఫీగా సాగినా ఫామ్ ను కోల్పోయి టీమిండియాలో స్థానం కోల్పోయాడు. అయితే ప్రవీణ్ కుమార్ ఫుల్లుగా తాగి తన పక్కింట్లో ఉండే వ్యక్తిని, అతడి కొడుకుని కొట్టాడని పిర్యాదు అందటంతో వారిద్దరూ కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భారత్ తరఫు ఆరు టెస్టులు, 68 వన్డేలు ఆడిన ప్రవీణ్ కుమార్ 104 వికెట్లు తీశాడు. -
వైరల్ : ఫైన్ వేశారని నానా రభస చేశాడు
మీరట్ : ఒక వ్యక్తి తాను హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసులు ఫైన్ వేయడంతో బైక్ను కిందపడేసి నానా రభస చేసిన ఘటన శనివారం ఉత్తర్ప్రదేశ్లోని మీరట్లో చోటు చేసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. మీరట్కు చెందిన ఒక వ్యక్తి బైక్పై వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. హెల్మెట్ ధరించనందుకు చలాన్ వేస్తున్నట్లు అతనికి తెలిపారు. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా తన బైక్ను కింద పడేసి రోడ్డుపై రెండు సార్లు అటూ ఇటూ దొర్లించి తర్వాత అదే బైక్పై కూర్చొని ఏడ్వడం చూసి పోలీసులు అవాక్కయ్యారు. అతని వింత ప్రవర్తన అర్థంగాక పోలీసులు ఆ వ్యక్తిని సముదాయించేందుకు ప్రయత్నించారు. కాగా మొత్తం 43 సెకన్ల నిడివి ఉన్న వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో నెటిజన్లు ఈ వీడియోనూ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ' పోలీసులు చలాన్ వేస్తే కడితే కట్టాలి లేకపోతే లేదు కానీ ఇలా చేయడం ఏంటని' కామెంట్లు పెడుతున్నారు. Agitated over traffic challan, a biker in UP's Meerut took out his anger on his motorcycle. He later sat on the fallen bike and started crying as traffic cops stood and watched the entire drama unfolding on a busy street in the city. @Uppolice pic.twitter.com/lZ8TfQYUWt — Piyush Rai (@Benarasiyaa) November 25, 2019 -
రోజు లడ్డూలే... విడాకులు ఇప్పించండి
లక్నో: వరకట్న వేధింపులు.. అత్తింటి వారి ఆరళ్లు తట్టుకోలేక విడాకులు తీసుకునే వారి గురించి విన్నాము. అయితే ఈ మధ్య కాలంలో చాలా సిల్లీ కారణాలతో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే దంపతులు కూడా ఈ కోవలోకే వస్తారు. ‘ఆహారంలో భాగంగా నా భార్య ప్రతిరోజు కేవలం లడ్డూలు మాత్రమే పెడుతుంది. విడాకులు ఇప్పించండి’ అంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ మీరట్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. బాధితుడికి పదేళ్ల క్రితం వివాహమయ్యింది. ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఇన్నాళ్లు బాగానే సాగిన వీరి దాంపత్యంలో ఓ తాంత్రికుడి వల్ల కలతలు రేగాయి. గత కొద్ది కాలంగా బాధితుడు తరచుగా అనారోగ్యం పాలవుతున్నాడు. దాంతో అతడి భార్య ఓ తాంత్రికుడిని ఆశ్రయించింది. అతని సూచన మేరకు బాధితుడికి ప్రతి రోజు ఉదయం 4, సాయంత్ర నాలుగు చొప్పున లడ్డూలు భోజనంగా పెడుతుంది. ఇక ఇతర ఏ పదార్థాలు ముట్టుకోనివ్వడం లేదు. దాంతో విసిగిపోయిన బాధితుడు, భార్య నుంచి తనకు విడాకులు ఇప్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం అధికారులు వీరిద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చే పనిలో పడ్డారు. అప్పటికి మనసు మార్చుకోకపోతే.. విడాకులు ఇప్పిస్తామని తెలిపారు. -
ఆ ఫోటోలు డిలీట్ చేయకుండా ఫోన్ అమ్మడంతో..
లక్నో : మాజీ గర్ల్ఫ్రెండ్తో అభ్యంతరకరంగా ఉన్న ఫోటోలను డిలీట్ చేయకుండా ఓ వ్యక్తి మరొకరికి ఫోన్ అమ్మడం దారుణ ఘటనలకు దారితీసిన ఉదంతం వెలుగుచూసింది. ఈ పరిణామాలు 35 ఏళ్ల మహిళ తన ఐదేళ్ల కుమారుడితో కలిసి ముజఫర్నగర్లోని గంగ్నహర్ కాల్వలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడే వరకూ వెళ్లాయి. మీరట్లో స్ధిరపడిన ఈ మహిళ మరణించగా, ఆమె కుమారుడిని ప్రాణాలతో కాపాడారు. మాజీ బాయ్ఫ్రెండ్తో దిగిన ఫోటోలు సోషల్మీడియాలో వైరల్ కావడంతో మహిళ తీవ్ర నిర్ణయం తీసుకుందని పోలీసులు చెప్పారు. బాధితురాలి మాజీ బాయ్ఫ్రెండ్ మీరట్కు చెందిన శుభమ్ కుమార్ ఆమెతో కలిసి అభ్యంతరకరంగా ఉన్న ఫోటోలను డిలీట్ చేయకుండా అదే పట్టణానికి చెందిన మరొకరికి తన మొబైల్ ఫోన్ను విక్రయించాడు. ఈ ఫోటోలను ఫోన్ కొనుగోలు చేసిన వ్యక్తి ప్రజాపతి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్గా మారాయి. దీంతో తీవ్రంగా కలతచెందిన బాధితురాలు ముజఫర్నగర్లోని ఖతౌలి బ్రిడ్జిపై నుంచి ఐదేళ్ల కుమారుడితో సహా కిందకి దూకారు. ఆత్మహత్య చేసుకునే ముందు మహిళ తన భర్తతో చివరిసారిగా ఫోన్లో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. కాగా, శుభమ్ అతని స్నేహితులు కలిసి ఫోటోలను షేర్ చేసిన ప్రజాపతిని మే 23న హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ప్రజాపతి హత్య కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు. సహరన్పూర్ పోలీసులు శనివారం జరిపిన ఎన్కౌంటర్లో నిందితులను అరెస్ట్ చేసి వారిని మీరట్ పోలీసులకు అప్పగించారు. కాగా, హత్య కేసు విచారణలో తన పేరు కూడా బయటకు వస్తుందన్న భయంతో మహిళ ఆత్మహత్యకు పాల్పడిందని పోలీస్ అధికారులు అనుమానిస్తున్నారు. -
కూతురి ప్రియుడి సాయంతో ప్రియుడిని చంపేసింది!
మీరట్: ఉత్తరప్రదేశ్లోని మీరట్లో షాకింగ్ కేసు చోటుచేసుకుంది. 35 ఏళ్ల మహిళ తన కూతురి బాయ్ఫ్రెండ్ సాయంతో తన ప్రియుడిని చంపేసింది. ఏప్రిల్ 22న మీరట్ ఔరాంగ్షాపూర్ డిగ్గి ప్రాంతంలోని రాజీవ్ అలియాస్ రాజు (32) మృతదేహం లభ్యమైంది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు. నిందితురాలైన షమిమ్ స్థానికంగా వ్యవసాయ పొలంలో కూలిగా పనిచేస్తూ.. జీవనం సాగిస్తోంది. ఆమెకు ట్రక్ డ్రైవర్ అయిన రాజీవ్తో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో షమిమ్ కూతురు స్థానికంగా ఉండే ముసాహిద్తో సన్నిహితంగా ఉంటూ.. ప్రేమ కలాపాలు సాగిస్తుండటం రాజీవ్కు నచ్చలేదు. ఈ విషయమై తరచూ అతను ముసాహిద్తో గొడవపడేవాడు. రాజీవ్ తరచూ ముసాహిద్తో తలపడటం.. తన కూతురి జీవితంలో కల్పించుకోవడం షమిమ్కు నచ్చలేదు. ఈ క్రమంలో కూతురి ప్రేమికుడు ముసాహిద్తో కలిసి షమిమ్ రాజీవ్ను ఏప్రిల్ 22న గొంతు నులిమి చంపేసింది. ఈ కేసులో ఇద్దరు నిందితులైన షమిమ్, ముసాహిద్ను పోలీసులు అరెస్టు చేశారు. -
పోలీసులకు లిక్కర్ పార్టీ ఇచ్చి ఖైదీ పరార్
మీరట్ : ఉత్తర్ ప్రదేశ్లో ఓ ఖైదీ పోలీసుల చెర నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఓ లాయర్ హత్య కేసులో శిక్ష అనుభవిస్తూ, దోపిడీ కేసుతో పాటూ దాదాపు పది కేసుల్లో నిందితుడిగా ఉన్న గ్యాంగ్స్టర్ బద్దాన్ సింగ్ పోలీసుల చెర నుంచి తప్పించుకున్నాడు. 1996లో ఓ లాయర్ను హత్య చేసిన ఘటనలో బద్దాన్ సింగ్ జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. ఫతేగర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న బద్దాన్ను ఓ కేసు విచారణ విషయంలో గజియా బాద్ తరలించడానికి ఏర్పాట్లు చేశారు. మంచి లిక్కర్ పార్టీ అరేంజ్ చేశానని, బద్దాన్ తనకు ఎస్కార్టుగా వచ్చిన పోలీసులను నమ్మించి మీరట్లోని ఓ హోటల్కు తీసుకెళ్లాడు. అక్కడ తన అనుచరులతో పోలీసులకు మందు పార్టీ ఏర్పాటు చేశాడు. మద్యం మత్తులో పోలీసులు ఉన్న సమయంలో అక్కడి నుంచి బద్దాన్ ఉడాయించాడు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మొత్తం ఏడుగురు పోలీసులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిలో ఓ ఇన్స్పెక్టర్ కూడా ఉండటం గమనార్హం. బద్దాన్ను త్వరలోనే పట్టుకుంటామని మీరట్ ఎస్పీ నితిన్ తివారీ పేర్కొన్నారు. లాయర్ హత్య కేసులో గ్యాంగ్స్టర్ బద్దాన్ దోషిగా తేలడంతో గత ఏడాదిగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. బద్దాన్ సింగ్ పారిపోయిన హోటల్ను పరిశీలిస్తున్న పోలీసులు -
మీరట్లో రెచ్చిపోయిన బీజేపీ కౌన్సిలర్
-
పోలీసులు చూస్తుండగానే..
-
పోలీసులు చూస్తుండగానే మరో దాడి
సాక్షి, న్యూఢిల్లీ : ఓ ముస్లిం యువకుడి ఇంటికి వెళ్లిందన్న కారణంగా పోలీసు జీపులో ఓ మహిళా పోలీసు, 20 ఏళ్ల విద్యార్థినిని పట్టుకొని చెంప చెళ్లుమనిపించడం, ‘నీ చుట్టూరా ఎంతో మంది హిందువులుంటే నీకో ముస్లిం యువకుడే కావాల్సి వచ్చిందే’ అంటూ పక్కనే ఉన్న మరో మహిళా పోలీసు వ్యాఖ్యానించడం వీడియోలో రికార్డయింది. ఆదివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసు జీపులో ఉన్న ముగ్గురు మహిళా పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వీడియోను రికార్డు చేసినట్లు భావిస్తున్న హోం గార్డుపై యోగి అదిత్యనాథ్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. మీరట్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనివర్శిటీకి చెందిన నర్సింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని, తనతోపాటే చదువుతున్న 22 ఏళ్ల ముస్లిం విద్యార్థి ఉంటున్న జాగృతి విహార్కు ఆదివారం నాడు వెళ్లింది. జాగృతి విహార్, వారు చదువుతున్న నర్సింగ్ కాలేజీకి ఎదురుగానే ఉంది. మీరట్ వైద్య యూనివర్శిటీలో చదువుకోవడానికి వచ్చే విద్యార్థులు ఎక్కువగా ఆ జాగృతి విహార్లోనే ఉంటారు. అందులో కిరాయి తీసుకొని ఉంటున్న ముస్లిం యువకుడి వద్దకు ఆ విద్యార్థిని వెళ్లడం గమనించిన స్థానికులు విశ్వ హిందూ పరిషత్కు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి ఆ జంటను పట్టుకొని కొట్టారు. ఈ విషయాన్ని ఎవరో పోలీసు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయగా, మహిళా పోలీసులు వచ్చి మహిళను రక్షించి జీపులో తీసుకెళ్లారు. తాము జాగృతి విహార్పై దాడి చేసినప్పుడు ఆ యువ జంట ప్రేమించుకుంటున్నారని, వారిని హెచ్చరించి పోలీసులకు అప్పగించామని, వారిపై చేయి చేసుకోలేదని వీహెచ్పీ స్థానిక నాయకుడు బలరాజ్ దూంగర్ తెలిపారు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు నుంచి హెపూర్లో ఉంటున్న విద్యార్థిని తల్లిదండ్రుల వద్దకు వీహెచ్పీ కార్యకర్తలు వెళ్లి, ముస్లిం యువకుడిపై కేసు పెట్టాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారు. వారు క్లాస్మేట్స్ మాత్రమేనని, వారి మధ్య మరెలాంటి సంబంధం లేదని ఆ అమ్మాయి తండ్రి చెబుతూ వస్తున్నారు. బుధవారం రాత్రి వరకు విద్యార్థిని తండ్రి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయితే విద్యార్థినిగానీ, ముస్లిం యువకుడుగానీ ఎక్కడున్నారో తెలియడం లేదు. ఆదివారం ఈ సంఘటన జరిగిన నాటి నుంచి నర్సింగ్ కళాశాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ సంఘటనపై కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాగేశ్వర్ శర్మను మీడియా ప్రశ్నించగా, తమది కో ఎడ్యుకేషన్ కాలేజని, విద్యార్థిని, ముస్లిం యువకుడు క్లాస్మేట్స్ అని తెలిపారు. నర్సింగ్ కాలేజీ అవడం వల్ల ల్యాబుల్లో కూడా ఆడ, మగ కలిసే పనిచేయాల్సి వస్తుందని, కలుసుకోవద్దని, పరిచయాలు పెంచుకోవద్దని వారికి తాము చెప్పలేమని అన్నారు. త్వరలోనే వారిద్దరు మళ్లీ కళాశాలకు హాజరవుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అంతకుమించి మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. యూనివర్శిటీలో హిందూత్వ సంస్థల ఉనికి పెరిగినప్పటి నుంచి అశాంతి పరిస్థితులు పెరుగుతున్నాయని అధ్యాపకులు తెలిపారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించడం శోచనీయమని, అందుకే మహిళా పోలీసులపై చర్య తీసుకోవాల్సి వచ్చిందని సబ్ ఇనిస్పెక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. కాగా, ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత మరో వీడియో బయటకు వచ్చింది. పోలీసుల సమక్షంలోనే ముస్లిం యువకుడిపై గూండాలు దాడి చేసిన దృశ్యాలు ఇందులో ఉన్నాయి. ఇలాంటి చర్యలను సహించబోమని, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుంటామని యూపీ డీజీపీ ట్వీట్ చేశారు. -
అర్థరాత్రి ఎమ్మెల్యే ఇంటిపై బుల్లెట్ల వర్షం
ఉత్తర ప్రదేశ్ : మీరుట్లో బుధవారం అర్థరాత్రి షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. బుల్లెట్లు, హ్యాండ్ గ్రెనేడ్తో సంగీత్ ఇంటిపై దాడి చేశారు. సెక్యురిటీ గార్డు ఇచ్చిన సమాచారం ప్రకారం అర్థరాత్రి 12.45 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్టు తెలిసింది. స్పాట్లో ఖాళీ బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటికి ఫోరెన్సిక్ టీమ్ పరిశీలిస్తుందని మీరుట్ ఎస్ఎస్పీ తెలిపారు. హ్యాండ్ గ్రెనైడ్ను కూడా గుర్తించినట్టు చెప్పారు. అదృష్టవశాత్తు ఎవరి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని, సెక్యురిటీ గార్డు క్యాబిన్ను, ఎమ్మెల్యే ఇంటి మెయిన్ గేట్ను లక్ష్యంగా చేసుకుని అర్థరాత్రి కాల్పులు జరిపారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఇంటి పరిసర ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగులు ఎవరో కనుకొనే ప్రయత్నంలో ఉన్నారు. ఎమ్మెల్యే సోమ్ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. రెండేళ్ల క్రితం కూడా తనకు బెదిరింపు హెచ్చరికలు వచ్చాయని ఎమ్యెల్యే చెప్పారు. ఆ సమయంలో తనను గ్రెనైడ్ చంపుతామని బెదిరించారని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఆయన బెదిరింపులేమీ రాలేదన్నారు. -
మీరట్లో పోలీస్ జులుం
-
ప్రేమ వ్యవహారం: యువతిని హింసించిన పోలీసులు
లక్నో : ముస్లిం యువకుడిని ప్రేమించిందన్న కారణంగా ఓ యువతిపై దాడి చేశారు మీరట్ పోలీసులు. ‘ఆ మతం వాడు తప్ప ఎవరూ దొరకలేదా’ అంటూ ఆమెను తీవ్ర పదజాలంతో దూషించారు. వివరాలు.. మీరట్కు చెందిన ఓ హిందూ యువతి, ముస్లిం యువకుడు ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో అతడిని కలిసేందుకు సదరు యువతి మీరట్లోని మెడికల్ ఏరియాకు వచ్చింది. వారిద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో కొంతమంది విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వీరిద్దరు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అమ్మాయిని పోలీసు స్టేషనుకు తీసుకువచ్చి కౌన్సిలింగ్ చేశారు. ఈ క్రమంలో అమ్మాయి పక్కన కూర్చున్న మహిళా కానిస్టేబుల్ ఆవేశంతో ఊగిపోతూ.. అసభ్య పదజాలంతో దూషించింది. అంతటితో ఆగకుండా తలపై పదే పదే కొడుతూ దాడి చేసింది. ఇందుకు అమ్మాయికి మరోవైపు కూర్చున్న మరో పోలీసు ఆఫీసర్ కూడా వంతపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారడంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వీడియోలో ఉన్న ముగ్గురు పోలీసులను, మహిళా కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. కాగా సదరు ముస్లిం యువకుడిపై ఫిర్యాదు చేయాల్సిందిగా వీహెచ్పీ సభ్యులు అమ్మాయి తండ్రిపై ఒత్తిడి తీసుకువచ్చారు. కానీ అందుకు ఆయన అంగీకరించకపోవడంతో ఆయనపై కూడా అసహనం వ్యక్తం చేశారు. -
యువతిపై దాడి చేసిన మీరట్ పోలీసులు
-
యూపీలో భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లో సోమవారం వేకువజామున 6 గంటల 28 నిమిషాలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైంది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం.. యూపీలోని మీరట్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో గల ఖర్కౌదాలో భూకంప కేంద్రాన్ని కనుగొన్నారు. కాగా యూపీలోని భూకంప ప్రభావం వల్ల దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. గడిచిన 24 గంటల్లో ఇలా జరగడం రెండోసారి. ఆదివారం మధ్యాహ్నం హర్యానాలోని జజ్జర్ జిల్లాలో సంభవించిన భూకంపం వల్ల ఢిల్లీలో కూడా భూమి స్వల్పంగా కంపించింది. #FLASH Tremors felt in Delhi after earthquake occurred 6 km from Meerut's Kharkhauda in Uttar Pradesh, at 6.28 am — ANI (@ANI) September 10, 2018 -
‘గాడ్సే కాకపోతే నేను గాంధీని చంపేదాన్ని’
అలహాబాద్ : ‘ఒకవేళ గాడ్సే, మహాత్మ గాంధీని చంపకపోయి ఉంటే నేనే ఆ పని చేసి ఉండేదాన్ని’ అంటూ ప్రముఖ సామాజిక కార్యకర్త పూజా శకున్ పాండే సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిల భారత్ హిందూ మహాసభ(ఏబీహెచ్ఎమ్) అధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా మీరట్లో ఏర్పాటు చేసిన హిందూ కోర్టు ప్రథమ జడ్జీగా పూజా శకున్ పాండే నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘నేను, ఏబీహెచ్ఎమ్ నాథురాం గాడ్సే చేసిన పనిని కీర్తిస్తున్నాను. అంతేకాక నేటి కాలంలో కూడా విభజనను సమర్ధించే గాంధీలు ఉంటే, వారిని వ్యతిరేకించే గాడ్సేలు కూడా ఉంటారు. ఒక వేళ గాడ్సే గాంధీని చంపకపోతే నేనే ఆ పని చేసేదాన్ని’ అని ప్రకటించారు. గత కొంత కాలంగా ఏబీహెచ్ఎమ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. కేరళ వరదల నేపథ్యంలో వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న వారిలో గొడ్డు మాంసం తినే వారు ఉంటే వారికి సాయం చేయొద్దంటూ ఏబీహెబ్ఎమ్ నాయకుడు చక్రపాణి మహరాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరిన్ని హిందూ కోర్టులు: ఏబీహెచ్ఎమ్ మీరట్లో తొలి హిందూ కోర్టును ఏర్పాటు చేసిన ఏబీహెచ్ఎమ్ త్వరలోనే దేశ వ్యాప్తంగా మరిన్ని హిందూ కోర్టులను ఏర్పాటు చేస్తానని ప్రకటించింది. ఈ హిందూ కోర్టు భూ తగదాలు, ఆస్తి లావాదేవీలు, విడాకుల వంటి అంశాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరిస్తుందని ఏబీహెచ్ఎమ్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ శర్మ తెలిపారు. అంతేకాక ఈ ఏడాది అక్టోబర్ 2న ఈ హిందూ కోర్టుకు సంబంధించిన నియమ నిబంధనలను, కార్యకలాపాల వివరాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఇదిలావుండగా హిందూ కోర్టు ఏర్పాటు విషయంపై అలహబాద్ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాక ఈ కోర్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమర్పించాలని నోటీసులు కూడా జారీ చేసింది. -
20 కేజీల బంగారం.. 21 కార్లు, బౌన్సర్లు
న్యూఢిల్లీ : ‘దేవుడి దయ వల్లే నా దగ్గర ఉన్న బంగారం ప్రతి ఏడు పెరుగుతుంది. పరిస్థితులు అనుకూలించి.. నా ఆరోగ్యం సహకరిస్తే మరిన్ని యాత్రలు చేస్తానంటున్నా’రు ‘గోల్డెన్ బాబా’ అలియాస్ సుధీర్ మక్కర్. ఈ బాబా ప్రతి ఏడాది 200 కిలోమీటర్ల పాటు సాగే కన్వర్ యాత్ర చేస్తారనే విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా కన్వర్ యాత్ర ప్రారంభించారు. ప్రస్తుతం యాత్రలో భాగంగా ఢిల్లీ - మీరట్ రోడ్డులో ఉన్న ఒక రిసార్ట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ‘గోల్డెన్ బాబా’ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. ‘బంగారం, కార్లు అంటే నాకు చాలా ఇష్టం. నేను మరణించే వరకూ వాటి మీద నా పిచ్చి ప్రేమ తగ్గదు. దేవుడు దయ వల్ల నా దగ్గర ఉన్న సంపద (బంగారం) ప్రతి ఏడాది పెరుగుతోంది. పరిస్థితులు అనుకూలించి, ముఖ్యంగా నా ఆరోగ్యం సహకరిస్తే ఇలాంటి యాత్రలు మరిన్ని చేస్తాను. మూడేళ్ల క్రితం నాకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. చికిత్సం కోసం ముంబైలో ఉన్న అన్ని ప్రముఖ ఆస్పత్రులను సందర్శించాను. కానీ ఉపయోగం లేదు’ అన్నారు. ఈ ఏడాది చేసే కన్వర్ యాత్ర 25వది. ఇదే తన చివరి కన్వర్ యాత్రగా ప్రకటించారు గోల్డెన్ బాబా. తన యాత్రా ప్రస్థానం గురించి చెప్తూ ‘నా తొలి యాత్ర పూర్తవడానికి అయిన ఖర్చు కేవలం 250 రూపాయలు మాత్రమే. ఆ సమయంలో భక్తులు పెట్టింది తింటూ, రోడ్డు పక్కన ఉండే ఆశ్రమాల్లో సేద తీరుతూ నా యాత్రను కొనసాగించాను. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రస్తుతం నేను నాతో పాటు ఒక ప్రత్యేక వంట మనిషిని, వాటర్ ప్రూఫ్ టెంట్ని, సిబ్బందిని తీసుకెళ్తాను. వాహానాల కోసమే దాదాపు 1. 25 కోట్లు ఖర్చు చేస్తున్నాను. వీటన్నింటి వల్ల భారీగా ఖర్చవుతుంది. అందుకే నా తొలి కన్వర్ యాత్ర నాకు చాలా ప్రత్యేకం అన్నారు. గతేడాది యాత్ర సందర్భంగా ఈ బాబా 14.5 కేజీల బంగారాన్ని ధరించగా.. ఈ ఏడాది దాదాపు 20 కేజీల బంగారాన్ని ధరించారు, 21 కార్లను, బౌన్సర్లను తీసుకెళ్తున్నారు. ఈ గోల్డేన్ బాబా సన్యాసిగా మారకముందు ఢిల్లీలోని గాంధీ నగర్ మార్కెట్లో వస్త్రాల వ్యాపారం చేసేవారు. ప్రస్తుతం ఈ బాబాకు ఘజియాబాద్లో ఒక విలాసవంతమైన భవనం ఉంది. ఈ ఆస్తుల గురించి స్పందిస్తూ ‘నా తదనంతరం ఈ ఆస్తులన్ని నా ప్రియ శిష్యునికి చెందుతాయ’ని తెలిపారు. ప్రస్తుతం ఈ బాబా దగ్గర ఓ బీఎండబ్ల్యూ కారు, 2 ఆడీ కార్లు, రెండు ఇన్నోవాలున్నాయి. ఇవే కాక ఒక రోలెక్స్ వాచ్, రూ 150 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు వార్తలు వచ్చాయి. -
అలా దొరికిపోయాడు
పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఓ నిరుద్యోగికి అది కష్టతరమన్న విషయం అర్థమైంది. ఓ ఫ్లాన్ వేసి అధికారులను బురిడీ కొట్టించాలనుకున్నాడు. అయితే ఫిజికల్ టెస్టులో అతగాడి వ్యవహారం బయటపడింది. అతనిపై కేసు నమోదు చేసి అధికారులు కటకటాల వెనక్కి నెట్టారు. మీరట్: బులంద్షహర్కు చెందిన అంకిత్ కుమార్కు పోలీస్ కావాలనే కల. ఎస్సై ఉద్యోగాల కోసం దరఖాస్తు చేశాడు. రాత పరీక్ష క్లియర్ అయిపోగా, ఫిజికల్ టెస్టులు మిగిలి ఉన్నాయి. అయితే ఎత్తు సమస్య అతని పాలిట శాపంగా మారింది. నిబంధనల ప్రకారం 168 ఎత్తు కాగా, అంకిత్ ఓ సెంటీమీటర్ తక్కువగా ఉన్నాడు. దీంతో ఎత్తు పెరిగేందుకు అడ్డమైన మందులు వాడాడు.. ఫిజికల్ ఎక్సర్సైజ్లు చేశాడు. అయినా లాభం లేకుండా పోయింది. దీంతో ఓ ఫ్లాన్ వేశాడు. అలా దొరికిపోయాడు.. జుట్టులో హెన్నా పెట్టుకుని శారీరక ధారుడ్య పరీక్షలకు హాజరయ్యారు. ఎత్తు కొలిచే సమయంలో మెషీన్ మెటాలిక్ ప్లేట్కు, జుట్టుకు మధ్య గ్యాప్ ఉండటం అధికారులకు అనుమానం తెప్పించింది. అతన్ని పక్కకు తీసుకెళ్లి వెతకగా.. జుట్టులో హెన్నా బయటపడింది. దానిని తొలగించి నిల్చోవాలని అధికారులు ఆదేశించారు. తిరిగి ఎత్తు కొలవగా ఒక సెంటీమీటర్ తక్కువ హైట్ వచ్చింది. దీంతో అధికారులు అతన్ని అనర్హుడిగా ప్రకటించారు. అంతేకాదు రిక్రూట్మెంట్లో మోసానికి యత్నించినందుకుగానూ ఐపీసీ సెక్షన్ 420 ప్రకారం అతనిపై కేసు నమోదు చేసినట్లు మీరట్ ఎస్పీ(ట్రాఫిక్), ఫిజికల్ టెస్టుల పర్యవేక్షకుడు సంజీవ్ బాజ్పాయి వెల్లడించారు. అంకిత్ మాటల్లో...‘నా ఎత్తు తక్కువ. అది కేవలం 1 సెం.మీ. మాత్రమే. అది పెరిగేందుకు చాలా యత్నించా. కానీ, వీలు పడలేదు. అలాగని అధికారులు మినహాయింపు ఇవ్వరు కదా!. రాత పరీక్ష క్వాలిఫై అయిన నేను ఈ అవకాశం ఎందుకు వదులుకోవాలని భావించా. నేను చేసింది తప్పే. కానీ, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఇలా చేశా. దయచేసి అవకాశం ఇవ్వండి’ అని 24 ఏళ్ల అంకిత్ ప్రాధేయపడుతున్నాడు. అంకిత్ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. -
నవవధువును కిరాతకంగా..
సాక్షి, లక్నో : ఉత్తర్ ప్రదేశ్లోని మీరట్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి ఊరేగింపు నుంచి తిరిగివస్తున్న జంటపై దోపిడీ ముఠా దాడిలో 18 ఏళ్ల నవవధువు ప్రాణాలు కోల్పోయింది. దౌరెలా ప్రాంతంలోని మథోర్ గ్రామానికి సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. కొత్తగా పెళ్లయిన దంపతులు ఊరేగింపుగా తిరిగివస్తున్న క్రమంలో వారి వాహనంపై దుండగులు దాడి చేశారు. అతిసమీపం నుంచి కాల్పులు జరపడంతో వధువు మెహ్వీష్ పర్వీన్ ఘటనా స్థలంలోనే మరణించారు. భర్త మహ్మద్ షజెబ్, ఇతర కుటుంబ సభ్యులు దాడి నుంచి తప్పించుకున్నారు. దుండగులు కారు, నగదు, బంగారు ఆభరణాలతో పరారయ్యారు. తాము జాతీయ రహదారి 58పై ప్రయాణిస్తుండగా ఘజియాబాద్ సమీపంలో దోపిడీదారుల ముఠా తమ వాహనాన్ని ఆపి తనపై తుపాకీ గురిపెట్టిందని, దీంతో తన భార్య భయంతో కేకలు పెట్టగా దుండగులు ఆమె ఛాతీపై కాల్పులు జరిపారని బాధితురాలి భర్త షజిబ్ చెప్పారు. రెండు కార్లలో ఆరుగురు సాయుధ దుండగులు వివాహ బృందం వాహనాన్ని అడ్డగించి దోపిడీకి యత్నించారని, వారిని ప్రతిఘటించిన పర్వీన్ను కాల్చిచంపారని సీనియర్ ఎస్పీ మంజిల్ సైనీ తెలిపారు. పెళ్లి బృందం నుంచి కారుతో పాటు రూ లక్షల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించారని చెప్పారు. సాక్షుల స్టేట్మెంట్లతో పాటు టోల్ప్లాజాల నుంచి సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసు దర్యాప్తు చేసి విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. -
హైప్రొఫైల్ సెక్స్ రాకెట్ రట్టు
సాక్షి, మీరట్ : ఉత్తర్ ప్రదేశ్కు చెందిన మీరట్లోని హోటల్స్ వ్యభిచారానికి హబ్లుగా మారాయి. సదర్బజార్ పోలీస్ స్టేషన్కు సమీపంలోని పలు హోటల్స్పై పోలీసులు దాడులు జరిపి 35 మంది సెక్స్వర్కర్లు, విటులను అరెస్ట్ చేశారు. ఆరుకు పైగా హోటల్స్పై పోలీసులు దాడులు చేశారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన జంటలను మహిళా కానిస్టేబుళ్ల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసినవారిని బస్సుల్లో పోలీస్ స్టేషన్కు తరలించారు. మీరట్ హోటల్స్లో కొన్నేళ్లుగా సెక్స్ రాకెట్ నడుస్తున్నట్టు సమాచారం. పోలీసు అధికారులు ముడుపుల మత్తులో ఈ బాగోతానికి సహకరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. -
యూపీలో అంబేద్కర్ విగ్రహం కూల్చివేత
మీరట్ : ఈశాన్య రాష్ట్రం త్రిపురలో బీజేపీ గెలుపు అనంతరం మొదలైన ధ్వంసరచన దేశమంతా విస్తరిస్తున్నది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లా మనావాలో రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం కూల్చివేతకు గురైంది. మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు కొందరు విగ్రహం తలను, విరగొట్టి కిందపడేసి వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన దళితులు బుధవారం ఉదయం నుంచి ఆందోళనలకు దిగారు. మవానా రహదారిపై బైఠాయించి, విద్వేషకారులకు వ్యతికేకంగా నినాదాలు చేశారు. వారిని పోలీసులు అడ్డకునే సమయంలో కొంత ఉద్రిక్తత తలెత్తింది. గంటలపాటు రాస్తారోకో చేసిన దళితులు.. నిందితులను పట్టుకునేదాకా ఆందోళన విరమించబోయేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఉపశమన చర్యగా కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. విగ్రహం కూల్చివేతకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ప్రస్తుతం మనావాలో పరిస్థితి అదుపులోనే ఉందని, ఎలాంటి హింసాయుత ఘటనలు నమోదుకాలేదని పోలీసులు తెలిపారు. మొన్న లెనిన్, నిన్న పెరియార్, ముఖర్జీ.. ఇప్పుడు అంబేద్కర్ : త్రిపురలో బీజేపీ వర్గీయులు లెనిన్ విగ్రహాన్ని కూల్చిన తర్వాత ఆ పార్టీకే చెందిన తమిళనాడు నేతలు ‘ఇక పెరియార్ విగ్రహాలు కూల్చుతాం’అని ప్రకటన చేశారు. ఆ మేరకు వేలూరు సహా కొన్ని జిల్లాల్లో పెరియార్ విగ్రహాలు ధ్వసమయ్యాయి. త్రిపుర ఘటకు ప్రతీకారంగా పశ్చిమ బెంగాల్లో భారతీయ జనసంఘ్ స్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం తెలిసిందే. విగ్రహాల ధ్వంసాలు కూడదంటూ ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఒక ప్రకటన చేశారు. -
పట్టపగలే దారుణ హత్యలు
మీరట్ : ఉత్తర ప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలిని, ఆమె కొడుకును కొందరు దుండగులు కిరాతకంగా కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మొత్తం సీసీ ఫుటేజీలో నిక్షిప్తం కాగా, ప్రస్తుతం ఆ వీడియో మీడియా ఛానెళ్లలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళ్లితే... ప్రతాప్పూర్ శివార్లలోని సోర్ఖా గ్రామంలో నిచాట్టర్ కౌర్ అనే వృద్ధురాలు, తన కొడుకు బల్విందర్తో నివసిస్తోంది. బుధవారం ఉదయం కొందరు వ్యక్తులు తుపాకులతో వారుంటున్న ఇంటికొచ్చారు. ఆ సమయంలో బయటే ఉన్న బల్విందర్ను వారు కాల్చి చంపారు. అటుపై కాస్త ముందుకు వెళ్లగానే ఆరు బయట మంచంపై నిచాట్టర్ వారికి కనిపించింది. దీంతో కాల్పులకు తెగబడ్డారు. ఆ సమయంలో పక్కనే ఉన్న మరో వృద్ధురాలిని వారు బెదిరించటంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత నిచాట్టర్ పై మరిన్ని రౌండ్ల కాల్పులు జరిపారు. మంచంపై రక్తపు మడుగుతో ఆ వృద్ధురాలు అలాగే కుప్పకూలిపోయింది. అయితే ఆమెను చంపిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ ఫుటేజీలో నమోదు కాగా.. ఆ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలతోనే ఈ హత్యలు జరిగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. గ్రామస్థుల కథనం... నిచాట్టర్ భర్త నరేంద్రను 2016 సంవత్సరంలో కొందరు ఆగంతకులు చంపేశారు. అందుకు నిచాట్టర్, ఆమె కొడుకు బల్విందర్లే సాక్ష్యం. ఈ కేసులో మాలే, మంగు మరికొందరు దోషులుగా తేలారు. మంగూ ఇప్పటికే శిక్షను అనుభవిస్తుండగా.. మిగతా వాళ్లు పరారీలో ఉన్నారు. కాగా, ఘటనకు కొద్దిరోజుల ముందే వీరిని చంపేస్తామని గ్రామస్థుల సమక్షంలోనే నిందితులు ప్రకటించారంట. దీంతో నరేంద్ర హత్య కేసు నిందితులే ఈ పని చేయించి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు. భయానకంగా ఉన్న ఈ సీసీ ఫుటేజీ దృశ్యాలు మీ కోసం... -
ఉత్తరప్రదేశ్లో పట్టపగలే దారుణ హత్య
-
'ప్లీజ్.. నన్ను మీ రాజకీయాల్లోకి లాగొద్దు'
సాక్షి, మీరట్ : తనను రాజకీయాల్లోకి లాగొద్దని అలియా ఖాన్ అనే ఉత్తరప్రదేశ్కు చెందిన విద్యార్థిని వేడుకుంది. తాను కృష్ణుడి వేషం వేయడం, భగవద్గీత శ్లోకాలు చెప్పడం వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'నేను కృష్ణుడు వేషం వేసి, భగవద్గీత శ్లోకాలు చదివినంత మాత్రాన ఇస్లాం బలహీనమైనదని అర్ధం కాదు. అలా అనుకునే వారితో నేను ఏకీభవించను. ముస్లిం మత పెద్దలు నాకు వ్యతిరేకంగా ఫత్వా కూడా విడుదల చేశారు. అందుకే ఈ సందర్భంగా నేను అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను.. దయచేసి నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు' అని అలియా వేడుకుంది. గతంలో కూడా తాను చేసిన పని ఏ ఒక్క మత విశ్వాసాన్నిగానీ, గుర్తింపునకుగానీ హానీ కలిగించదని చెప్పిన విషయం తెలిసిందే. గత ఏడాది (2017) డిసెంబర్ 30న జరిగిన ఓ కార్యక్రమంలో అలియా కృష్ణుడి వేషం వేసుకోవడంతోపాటు భగవద్గీత శ్లోకాలు కూడా చదివింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. -
అంబులెన్స్లో మద్యం.. డాక్టర్ల చిందులు
సాక్షి, మీరట్: అంబులెన్స్.. ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడే వరప్రదాయిని. రోడ్లపై అంబులెన్స్ శబ్దం వినిపిస్తే.. ప్రధానులు సైతం తప్పుకుని దారిస్తారు. ఇటువంటి అంబులెన్స్ను ఉత్తర్ ప్రదేశ్లోని ఒక ఆసుపత్రి పూర్వ విద్యార్థులు మద్యాన్ని తరలించడం కోసం వినియోగించడం ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉత్తర్ ప్రదేశ్ మీరట్లోరి లాలా లజపతిరాయ్ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో.. మద్యాన్ని తరలించడం కోసం అంబులెన్స్ను ఉపయోగించుకున్నారు. అంతేకాక సరదా కోసం రష్యా నుంచి బెల్లీ డ్యాన్సర్లను పిలిపించుకుని.. హడావుడి చేశారు. లాలాలజపతి రాయ్ మెడికల్ కాలేజ్లో వైద్య విద్యను అభ్యసించిన 1992 బ్యాచ్ పూర్వ విద్యార్థులు.. సోమవారం నాడు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ క్రమంలో పూర్వ విద్యార్థులు.. సెలబ్రేషన్స్ను అట్టహాసంగా నిర్వహించేందుకు మద్యం, మగువలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మద్యాన్ని తరలించేందుకు అంబులెన్స్ వాహనాన్ని వినియోగించారు. రష్యాను పిలిపించిన బెల్లీ డ్యాన్సర్లతో కలిసి వైద్యులు కూడా చిందులు వేశారు. ఈ విషయంపై మెడికల్ కాలేజ్ ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ వినయ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఈ ఘటన గురించి తనకు అప్పుడే తెలిసిందని చెప్పారు. . ఆ కార్యక్రమ నిర్వాహకుల నుంచి సమాధానం రావాల్సి ఉందని, మద్యం సరఫరాకు వినియోగించిన అంబులెన్సు మెడికల్ కాలేజీకి సంబంధించినదేనా లేదంటే ప్రైవేటు ఆస్పత్రికి చెందినదా అన్న విషయంపై క్లారిటీ లేదని, ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేస్తామని ఆయన తెలిపారు. ఈ ఘటనను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం తీవ్రంగా ఖండించింది. ఈ పార్టీలో పాల్గొన్న వైద్యులపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోందని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. -
‘వందేమాతరం పాడమంటే పాడం’
లక్నో: ఎవరెన్ని చెప్పినా వందేమాతరం పాడమంటే పాడమని బీఎస్పీ మేయర్ సునీతా వర్మ స్పష్టం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాల ప్రారంభానికి ముందు వందే మాతరం పాడమని, జాతీయ గీతం జనగణమన ఆలపిస్తామని ఇటీవల ఆమె వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారాన్ని లేపాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు. వందేమాతరం అంటే దండం పెట్టడమని, తల్లికి కాకుండా ఉగ్రవాదులకు దండం పెడుతారా.. అని ఆయన ఘాటుగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. సునీతా వర్మ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చినా ఆమె వెనక్కి తగ్గకుండా మళ్లీ పాడమని తెగేసి చెప్పడం చర్చనీయాంశమైంది. -
'వందేమాతరం పాడం.. '
లక్నో : మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాల ప్రారంభానికి ముందు వందేమాతరం పాడబోమని మీరట్ మేయర్ బీఎస్పీకి చెందిన సునీతా వర్మ స్పష్టం చేశారు. భారత జాతీయ గీతం జనగణమన అని ఆ గీతాన్నిమాత్రమే ఆలపిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మీరట్, అలీఘడ్ ప్రాంతాల్లో బీఎస్పీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే, ఈ ప్రాంతాల్లో సమావేశాల ప్రారంభ సమయంలో వందేమాతరం ఆలపించాలని గతంలో పనిచేసిన మేయర్లు షరతు పెట్టగా కొత్తగా ఎన్నికైన సునీతా ఆ విధానాన్ని నిరాకరించారు. కేవలం తాము జనగణమన మాత్రమే ఆలపిస్తామని స్పష్టం చేశారు. దీనిపై ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేసినా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు నిరాకరించారు. ముఖ్యంగా బీజేపీ నేతలు సునీతా వర్మ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నారు. -
ఘనంగా క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ వివాహం
-
సీఎం యోగి సభలో నల్ల జెండాలు
-
వందేళ్ల వృద్ధురాలిపై అత్యాచారం, పోయిన ప్రాణాలు
మీరట్ : దేశంలో పసిపాపలకే కాదు పండుముసలికి కూడా భద్రత లేదన్న విషయం మరోసారి రుజువైంది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో వందేళ్ల వృద్ధురాలు అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయింది. మీరట్ శివారు గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. దళిత కుటుంబానికి చెందిన వృద్ధురాలు వయో భారంతో కొన్నేళ్లుగా మంచానికే పరిమితమైపోయింది. ఆదివారం ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన అంకిత్ పునియా(35) అనే యువకుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గట్టిగా అరవలేని స్థితిలో, ఆమె దీనంగా ఏడ్చిన ఏడుపులు వినబడటంతో చుట్టుపక్కలవారు స్పందించారు. ఏం జరిగిందోననే కంగారుతో తలుపులు తెరవగా, యువకుడు చేస్తున్న అకృత్యాన్ని చూసి షాకయ్యారు. వెంటనే అతణ్ని బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బలహీన ప్రాణాలు గాలిలోకి : అసలే నీరసించిన బాధితురాలి ఆరోగ్యస్థితి ఇంకా దిగజారింది. సోమవారం ఉదయాని కల్లా పోలీసులు ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యం అందేలోపే వృద్ధురాలు మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. పోస్ట్మార్టం అనంతరం మృతురాలి శరీరభాగాలను లక్నోలోని ఫోరెన్సిక్ విభాగానికి పంపారు. నిందితుడిపై హత్య కేసు : నిందితుడు అంకిత్ పునియాపై ఐసీసీ 458, 376, ఎస్సీ,ఎస్టీ చట్టాల కింద పోలీసులు కేసు నమోదుచేశారు. బాధితురాలు ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఐసీసీ 302 సెక్షన్ను కూడా చేర్చినట్లు జానీ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి అధికారి పీసీ శర్మ మీడియాకు తెలిపారు. కొద్ది రోజుల కిందటే యూపీ, పంజాబ్లలో వృద్ధురాళ్లపై అత్యాచారం ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. -
30 కోట్లతో మోదీకి గుడి
సాక్షి, పంచకుల : టీ అమ్ముకున్న స్థాయి నుంచి.. దేశ ప్రధానిగా ఎదిగిన నరేంద్ర దామోదర్దాస్ మోదీకి ప్రత్యేక అభిమానగణం ఉన్న విషయం తెలిసిందే. ఆ అభిమానంతోనే ఆయన వంద అడుగుల విగ్రహంతో మీరట్లో ఓ గుడిని నిర్మించేందుకు ముందుకొచ్చారు హర్యానాకు చెందిన ఓ రిటైర్డ్ ఇంజనీర్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్గా పని చేసి రిటైర్డ్ అయిన జేపీ సింగ్కు మోదీ అంటే చాలా ఇష్టం. ఆయన(మోదీ) సిద్ధాంతాలు, పాలన నన్ను ఎంతగానో ఆకర్షించాయి. దశాబ్దం పైగా నేను ఆయన అభిమానిని. ఆయన కోసం ఏదైనా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. కానీ, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండటం మూలానా వీలు కాలేదు. ఇప్పుడు రిటైర్డ్ అయ్యాను కాబట్టి మార్గం సులభతరం అయ్యింది అని సింగ్ చెప్పుకొచ్చారు. అక్టోబర్ 23న ఈ గుడి భూమి పూజ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇక కార్యక్రమానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా హాజరయ్యే అవకాశం ఉంది. మీరట్-ఖర్నా హైవేలోని సార్ధనా ప్రాంతంలో ఐదు ఎకరాల భూమిలో ఈ ఆలయ నిర్మాణం చేపడుతుండగా.. సుమారు 30 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇందుకోసం ఆ మాజీ ఉద్యోగి ప్రజల నుంచి విరాళాలు కూడా సేకరించారంట. వంద అడుగుల మోదీ విగ్రహాంతో సుమారు రెండేళ్లలో గుడి నిర్మాణం పూర్తి చేస్తామని సింగ్ వెల్లడించారు. -
రేపు మీరట్లో మాయావతి భారీ సభ
సాక్షి, న్యూఢిల్లీ: యూపీలో శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన తర్వాత బీఎస్పీ అధినేత్రి మాయావతి తొలిసారి ప్రజలముందుకెళ్లనున్నారు. సోమవారం ఆమె మీరట్లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ ప్రభ తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో మాయవతి నిర్వహిస్తున్న ఈ ర్యాలీ పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. మార్చిలో జరిగిన ఎన్నికల్లో 403 స్థానాలకుగాను బీఎస్పీ కేవలం 19 చోట్ల గెలవడం తెలిసిందే. లోక్సభలో ఆ పార్టీకి ఒక్క ఎంపీ కూడా లేరు. అటు రాజ్యసభలోనూ కేవలం నలుగురే బీఎస్పీ సభ్యులున్నారు. వివిధ కారణాలతో కొన్ని పార్టీ శ్రేణులు పార్టీకి దూరమయ్యాయి. ఇలాంటి ర్యాలీలను మాయావతి ఇకపై ప్రతి నెలా 18వ తేదీన వారణాసి, ఆజాంగఢ్, లక్నో, అలహాబాద్ సహా పలుచోట్ల నిర్వహిస్తారని బీఎస్పీ నేత ఒకరు తెలిపారు. -
‘హింస భరించలేను.. నా భర్తకు విడాకులిస్తా’
మీరట్: దేశ వ్యాప్తంగా ట్రిపుల్ తలాక్ అంశంపై చర్చ జరుగుతుండగా.. తన భర్తకు ట్రిపుల్ తలాక్ చెప్పేసి అతడు పెట్టే హింస నుంచి బయటపడతానంటూ ఓ ముస్లిం మహిళ బయటకొచ్చింది. ఉత్తర ప్రదేశ్కు చెందిన ఆమె పెళ్లయినప్పటి నుంచి తన భర్త, అతడి సోదరుడు, కుటుంబ సభ్యుల నుంచి పడుతున్న హింస అంతాఇంతా కాదంటూ వాపోయింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన అమ్రీన్ బానో అనే ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతడి సోదరుడు షకీర్ను ఆమె సోదరి ఫర్హీన్ వివాహం చేసుకుంది. అయితే, వీరిద్దరి ప్రతి రోజు ఆ సోదరుల నుంచి టార్చర్ మొదలైంది. ఫర్హీన్ భర్తను ఒకసారి అమ్రీన్ కుమారుడు కేవలం ఒక ఐదు రూపాయలు అడిగినందుకు ఆ బాలుడిపై చేయిచేసుకోవడమే కాకుండా అమ్రీన్ను, ఫర్హీన్ను చావుదెబ్బలు కొట్టాడు. అదే సమయంలో ఇంటికెళ్లి రూ.5లక్షలు తీసుకురావాలంటూ గొడవ చేశాడు. అంతటితో ఆగకుండా ఫర్హీన్కు మూడుసార్లు తలాక్ చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్లగొట్టేశాడు. ఆ తర్వాత అమ్రీన్ బానో భర్త కూడా అదే పని చేయడంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తలాక్పై చర్చ జరగడంతోపాటు పలువురు బాధితులు ధైర్యంగా తమకు జరుగుతున్న అన్యాయాలు మీడియాకు చెబుతుండటంతో అమ్రీన్ కూడా బయటకొచ్చింది. అయితే, తన భర్తకు తానే విడాకులు ఇవ్వబోతున్నానంటూ ప్రకటించేసింది. తమను భౌతికంగా హింసించడమే కాకుండా అనైతిక శృంగార చేష్టలకు కూడా ఆ ఇద్దరు సోదరులు పాల్పడే వారంటూ ఆమె తన గోడును వెళ్లబోసుకుంది. -
మీ నాన్న పేరేంటి.. ఇక్కడెందుకున్నావ్?
మీరట్: ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో హిందూ యువ వాహిని కార్యకర్తలు రెచ్చిపోయారు. శాస్త్రినగర్ ప్రాంతంలో మంగళవారం ఇంట్లోకి చొరబడి ఓ జంటపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. మత మార్పిడిలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలతో ముస్లిం వ్యక్తిపై దాడి చేశారు. అతడితో పాటు ఉన్న యువతికి ప్రశ్నాస్త్రాలు సంధించారు. ‘మేము ఇంట్లోకి వెళ్లసరికి వీరిద్దరూ రాజీ మార్గంలో కనిపించారు. అద్దెకు తీసుకున్న ఈ ఇంట్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్టు తెలుస్తోంద’ని హిందూ యువ వాహిని సభ్యుడు నాగేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ‘నీ పేరేంటి? మీ నాన్న పేరు చెప్పు. ఇక్కడ ఏం చేస్తున్నారు. మీ పేర్లు ఎందుకు వేర్వేరుగా ఉన్నాయి. మత మార్పిడి చేసుకుంటున్నారా?’ అంటూ వారిద్దరినీ హిందూ యువ వాహిని సభ్యులు ప్రశ్నించారు. తర్వాత వీరిని పోలీసులకు అప్పగించారు. అయితే వీరిద్దరూ ముస్లిం మతానికి చెందిన వారని నిర్ధారణ కావడంతో విడిచిపెట్టినట్టు మీరట్ నగర పోలీసు కమిషనర్ అలోక్ ప్రియదర్శిని తర్వాత తెలిపారు. హిందూ యువ వాహిని సంస్థను 2002లో సీఎం యోగి ఆదిత్యనాథ్ స్థాపించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సంస్థకు ఆయన దూరంగా ఉంటున్నారు. -
అడవిలో యువతిపై రేప్.. హత్య!
మీరట్: ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువతి(18)పై లైంగికదాడికి పాల్పడి అనంతరం గొంతునులిమి చంపేశారు. ఈ విషయం ఇంకా నిర్థారణ కానప్పటికీ ఘటన ఆధారంగా పోలీసులు ఈ విషయాన్ని రూడీ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని మీరట్ సమీపాన గల కలిద్పూర్ గ్రామానికి చెందిన యువతి మంగళవారం సాయంత్రం ఆరుబయటకు వెళ్లింది. అలా వెళ్లిన యువతి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం గాలించగా గ్రామ శివారులోని అడవిలో శవమై కనిపించింది. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పగా వచ్చి వెంటనే ఆధారాలు సేకరించారు. అనంతరం వాటి వివరాలు మీడియాకు తెలిపారు. 'యువతి వేసుకున్న దుస్తులు చిందరవందరగా చిరిగిపోయి ఉన్నాయి. గొంతు నులిమినట్లు మెడ దగ్గర గాట్లు కనిపించాయి. ఇవన్ని చూస్తుంటే గుర్తు తెలియని వ్యక్తులెవరో ఆమెపై లైంగికదాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది' అని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఘటనా స్థలంలో మృతురాలి ఫోను, ఆమె సోదరి ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
'నా అకౌంట్లో రూ.100కోట్లు పడ్డాయి'
ఘజియాబాద్: తన జన్ ధన్ బ్యాంకు ఖాతాలో రూ.100 కోట్ల నగదు డిపాజిట్ అయిందని ఓ మహిళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యాలయానికి ఈ-మెయిల్లే పంపింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన శీతల్ యాదవ్ కు మీరట్ లో గల ఓ భారతీయ స్టేట్ బ్యాంకు బ్రాంచిలో జన్ ధన్ ఖాతా ఉంది. కాగా, ఈ నెల 18వ తేదీన డబ్బు డ్రా చేసుకునేందుకు ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంకు వెళ్లిన శీతల్ కు బ్యాలెన్స్ అమౌంట్ ను చూసి షాక్ గురైంది. రూ.99,99,99,394లు తన అకౌంట్లో ఉండటాన్ని గుర్తించింది. ఈ విషయాన్ని తొలుత నమ్మలేకపోయిన శీతల్.. ఏటీఎం వద్దకు వచ్చిన మరొకరికి చూపించి ద్రువీకరించుకుంది. అప్పటికీ నమ్మలేక దగ్గరలోని ఎస్ బ్యాంకు ఏటీఎం వద్దకు వెళ్లి మరో మారు బ్యాంకు అకౌంట్ బ్యాలెన్స్ ను చెక్ చేసి చూసింది. మరలా ఖాతలో రూ.100కోట్లు ఉన్నట్లు చూపడంతో ఈ విషయాన్ని తన భర్త జైలెదార్ సింగ్ కు చెప్పింది. శీతల్ ను వెంటబెట్టుకుని బ్యాంకు వద్దకు వెళ్లిన జైలెదార్.. బ్యాంకు అధికారులకు డబ్బు విషయాన్ని చెప్పాడు. బ్యాంకు మేనేజర్ అందుబాటులో లేడని మరలా రావాలని వారు చెప్పడంతో మరుసటి రోజు మరలా బ్యాంకుకు వెళ్లగా వేరే కారణాలు చెప్పి మళ్లీ పంపేశారు. దీంతో అనుమానం వచ్చిన జైలెదార్.. ఓ ఎడ్యుకేటెడ్ పర్సన్ కు జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పాడు. ఆయన సలహాతో సోమవారం ప్రధానమంత్రి కార్యాలయానికి అకౌంట్ కు సంబంధించిన వివరాలను పంపినట్లు మీడియాతో చెప్పాడు. -
తెలిసిన మహిళను లిఫ్ట్ ఇస్తామని తీసుకెళ్లి..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో ఇద్దరు దుండగులు ఓ మహిళపై లైంగికదాడికి పాల్పడ్డారు. మీరట్ జిల్లా సార్దన ప్రాంతంలో శనివారం రాత్రి ఈ దారుణం జరిగినట్టు పోలీసులు తెలిపారు. 40 ఏళ్ల బాధితురాలకు లిఫ్ట్ ఇస్తామని చెప్పి ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లారు. వీళ్లలో ఒకడు ఆమెకు తెలిసినవాడు కావడంతో వెంట వెళ్లింది. కాస్త దూరం వెళ్లాక ఆమెకు తెలియకుండా మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చారు. ఆమె డ్రింక్ తాగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇద్దరూ ఆమెను సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితులు బాధితురాలిని అక్కడే వదిలేసి పరారయ్యారు. బాధితురాలు స్పృహలోకి వచ్చాక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. -
రూ.250 కోసం వ్యక్తి పై దాడి
-
మీరట్లో అక్రమ కూల్చివేతల్లో విషాదం
-
మీరట్లో అక్రమ కూల్చివేతల్లో విషాదం
మీరట్ : ఉత్తరప్రదేశ్లో అక్రమ కట్టడాల కూల్చివేతలో విషాదం నెలకొంది. మీరట్లోని కంటోన్మెంట్ ఏరియాలో అక్రమంగా నిర్మించిన భవనాల తొలగింపు సందర్బంగా ఒక భవనం కూలిపోవడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. కాగా సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం హుటాహుటీన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. మరోవైపు అక్రమ కట్టడాల కూల్చివేతలను నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. -
భవనం కూలి ఐదుగురు మృతి
మీరట్: ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఆదివారం విషాద ఘటన జరిగింది. స్థానికంగా కురిసిన భారీ వర్షాలకు ఖార్కుండ ప్రాంతంలో ఓ రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మీరట్ ప్రాంతంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భవనం పునాదుల్లోకి నీరు చేరడం వలన ఒక్కసారిగా కుప్పకూలినట్లు భావిస్తున్నారు. -
అత్యుత్సాహంతో కాల్చేశాడు..
మీరట్: ఉత్తరప్రదేశ్లో ఎన్నికల విజయమైనా ఇంట్లో శుభకార్యమైనా అత్యుత్సాహంతో చేసుకునే సంబరాలు ఒక్కోసారి విషాదంగా మారుతుంటాయి. మీరట్ జిల్లాలో బీఎస్పీ నాయకుడు భరత్ వీర్ కొడుకు నిశ్చితార్థం వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. వీర్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు సంబరాలు చేసుకుంటుండగా, అరుణ్ అనే వ్యక్తి గాల్లోకి కాల్పులు జరిపాడు. మిస్ ఫైర్ కావడంతో ఓ వ్యక్తి మరణించాడు. మృతుడ్ని జోగిందర్ (36)గా గుర్తించారు. జోగిందర్ సంఘటనా స్థలంలోనే చనిపోయినట్టు ఫలవ్డా పోలీస్ స్టేషన్ అధికారి రామ్ రతన్ యాదవ్ చెప్పారు. నిందితుడు పరారయ్యాడని, కేసు నమోదు చేసుకుని అతడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. యూపీలోనే ఇటీవల ఎన్నికల విజయోత్సవాల్లో ఇలాగే గాల్లోకి కాల్పులు జరపగా, రిక్షాలో వెళ్తున్న బాలుడికి బుల్లెట్ తగలడంతో మరణించాడు. -
ఉత్తరప్రదేశ్ లో నినాదాల కలకలం
మీరట్: ఓ మతానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ సర్దానా ప్రాంతంలో మళ్ళీ కలకలం సృష్టించింది. ఇప్పటికే జెఎన్ యు కేసుతో దేశం అట్టుడుకుతుండగా మీరట్ ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. ఓ సంతాప సభ సమావేశం అనంతరం ఓ గ్రూప్ నకు చెందని కార్యకర్తలు ఓ మతానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాట్ రిజర్వేషన్ల ఆందోళన సందర్భంలో ముజఫర్ నగర్ సోనిపట్ లో మృతి చెందిన దళిత యువకుడు కులదీప్ మృతికి సంతాపంగా సర్దానాలో సభ ఏర్పాటు చేశారు. సభ అనంతరం కార్యకర్తలు ఓ మతానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. ఆందోళనకారులు నినాదాలు చేయడంతో పాటు రోడ్లను నిర్బంధించినట్టు రూరల్ ఎస్పీ ప్రవీణ్ రంజన్ తెలిపారు. మత వ్యతిరేక నినాదాలతో ర్యాలీగా వెళ్ళిన కార్యకర్తలు స్థానిక తహశీల్దార్ కు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఆరుగురు కార్యకర్తలు మత మనోభావాలను దెబ్బతీసేవిధంగా నినాదాలు చేశారని, వారిని అరెస్ట్ చేయలేదని రూరల్ ఎస్పీ తెలిపారు. ప్రత్యేక భద్రత బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్టు చెప్పారు. -
ఆ బాలిక జ్ఞాపకశక్తి అమోఘం
మీరట్: ఆమె ఓ ముస్లిం బాలిక. వయసు ఏడేళ్లు కనుచూపు 80శాతం వరకు లేదు. అందువల్ల పెద్దగా పుస్తకాలు చదువలేదు.. బ్రెయిలీ లిపిని కూడా వల్లె వేయలేదు. కానీ, ఆ బాలికకు ఉన్న ప్రజ్ఞ అంతా ఇంతా కాదు. ఏకంగా భగవద్గీతను తన మనసులో అక్షరం పొల్లు కూడా మర్చిపోలేనంత. ఎవరైనా భగవద్గీత చెప్పమ్మా అని ఇలా అడుగుతుంటారో లేదో వెంటనే తన రెండు చేతులు జోడించి దేవుడిని స్మరిస్తూ టకటకా భగవద్గీత ఆసాంతం వినిపిస్తుంది. ఇది మీరట్కు చెందిన రిదా జెరా అనే ఏడేళ్ల ముస్లిం బాలిక సాధిచిన ఘనత. పాఠాలు బోధించి, పేజీలపేజీలు బట్టీలు పట్టించినా తెల్లవారే సరికి ఒక పేజీ కూడా గుర్తు పెట్టుకోలేని విద్యార్థులు ఉన్న ఈ రోజుల్లో ఏకంగా భగవద్గీత మొత్తాన్ని కేవలం వినడం ద్వారా పూర్తిగా జ్ఞప్తికి పెట్టుకోవడం సాధారణ విషయమేమి కాదు. ఆమె ఏ మతానికి సంబంధించిన గ్రంథాన్ని చదువుతుందన్నది ప్రస్తుతం ప్రధాన అంశంకాదు కానీ, ఆమెకున్న జ్ఞాపక శక్తి మాత్రమే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. జెరా చదువుతున్న పాఠశాలలోని ఉపాధ్యాయుడు ఆమె జ్ఞాపక శక్తికి అబ్బురపడి భగవద్గీత మొత్తం ఆమెకు వినిపించగా దాన్ని విని గుర్తుపెట్టుకొని ఇప్పుడు చక్కగా చెప్తోంది. 'నేను ఖురాన్ చదువుతున్నా, గీత చదువుతున్నా దేవుడిని ప్రార్థిస్తున్నట్లే చదువుతాను. నేను ఏ దేవుడికి ప్రార్థిస్తున్నానన్నది ముఖ్యం కాదు. నేను ఇప్పటి వరకు ఏ దేవుడిని చూడలేదు. ఒక వేళ ఎదురుగా వచ్చినా చూడలేను' అని ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్న జెరా చెప్పింది. ప్రస్తుతం ఆమె మీరట్ లోని జాగృతి విహార్లోగల బ్రిజ్ మోహన్ అంధుల పాఠశాలలో చదువుతోంది. -
సల్మాన్, షారూఖ్లకు షాక్
బాలీవుడ్ స్టార్ హీరోలు, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్లపై మీరట్ లోకల్ కోర్టులో హిందూ మహాసభ ఫిర్యాదు చేసింది. ఓ ఛానల్లో ప్రసారం అయిన కార్యక్రమంలో ఈ ఇద్దరు నటులు చెప్పులతో ఆలయంలో ప్రవేశించినట్టుగా చూపించినందుకు గాను, షారూఖ్, సల్మాన్ లతో పాటు ఛానల్ యాజమాన్యంపై కూడా హిందూ మహాసభ కార్యకర్తలు కోర్టులో ఫిర్యాదు చేశారు. జనవరి 18న ఈ కేసు విచారణకు రానుంది. దీంతో బాలీవుడ్ ఖాన్ ద్వయం ఇబ్బందుల్లో పడింది. వివరాల్లోకి వెళితే ఓ ప్రయివేట్ ఛానల్ లో ప్రసారమవుతున్న 'బిగ్ బాస్ ' చిత్రీకరణలో భాగంగా కాళీ మందిరంలోకి ఈ హీరోలిద్దరూ షూ తో వెళ్లి, సాంప్రదాయాన్ని అవమానించారని హిందూ మహాసభ అధ్యక్షుడు రాజ్పుత్ ఆరోపిస్తున్నారు. పాదరక్షలతో పవిత్ర స్థలంలోకి అడుగుపెట్టడాన్ని ఏమతమూ అంగీకరించదన్నారు. ఈ దృశ్యాలను ప్రసారం చేసిన సదరు చానల్కు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు, కలెక్టరుకు గత ఏడాది డిసెంబర్ 23న ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అందుకే వారిపై చర్యలు తీసుకోవాల్సింది కోరుతూ కోర్టును ఆశ్రయించామని ఆయన తెలిపారు. -
క్రికెటర్ షమీ కుటుంబానికి 'గోవధ' ఉచ్చు
- షమీ ఎదుగుదలచూసి ఓర్వలేకే కుట్రలు - గోవధ నిందితులను కాపాడామనే ఆరోపణ అవాస్తవం - వేధింపులపై నెల కిందటే ఫిర్యాదుచేశా: షమీ తండ్రి మీరట్: టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ సోదరుడు మొహమ్మద్ హసీబ్ పై పోలీసు కేసు చిలికిచిలికి గాలివానలా మారుతోంది. గోవధకు పాల్పడినవారితో తమకు ఎలాంటి సంబంధంలేదని, షమీ ఎదుగుదల చూసి ఓర్వలేని కొందరు ఉద్దేశపూర్వకంగా తమను కేసులోకి లాగారని క్రికెటర్ తండ్రి తౌసీప్ అహ్మద్ ఆరోపించారు. గొడవ జరిగిన ప్రాంతంలో కేవలం ప్రేక్షకుడిలా ఉన్న హసీబ్ ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని, వేధింపుల్లో భాగంగానే ఇలా జరిగిందని విమర్శించారు. ఆయన ఆరోపణల నేపథ్యంలోకి వెళితే.. గురువారం షమీ స్వగ్రామమైన అమ్రోహలో గోవధ జరుగుతోందన్న సమాచారంతో దిబోలీ స్టేషన్ కు చెందిన ఇద్దరు పోలీసులు దాడులు నిర్వహించారు. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశారు. ఇంతలోనే షమీ సోదరుడైన హసీబ్ పోలీస్ వాహనానికి అడ్డుపడి నిందితులను వదిలిపెట్టాలన్నాడని, కుదరదన్న తమపై దాడి చేశాడని పోలీసుల వాదన. నిందితుల పరారీకి సహకరించడంతోపాటు, విధినిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలపై హసీబ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అనారోగ్యకారణాలతో హసీబ్ బెయిల్ పై విడుదలయ్యాడు. అయితే పోలీసులు చెబుతున్నట్లు తన పెద్దకొడుకు(హసీబ్) దాడికి పాల్పడలేదని తండ్రి తౌసీఫ్ అంటున్నారు. 'గోవధ నిందితులను పోలీసులు అరెస్టు చేసే సమయంలో చాలా మంది గుమ్మిగూడారు. అందరిలాగే హసీబ్ కూడా చూస్తూ నిల్చున్నాడేకానీ పోలీసులను అడ్డుకోలేదు. ఇదంతా ఒక కుట్ర. గోవధ కేసులోకి మమ్మల్ని లాగాలనే ఉద్దేశంతో కొందరు కల్పించిన కట్టుకథ. గతంలోనూ ఇలాంటి బెదిరింపులు ఎదుర్కొన్నా. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది' అని తౌసీఫ్ చెప్పుకొచ్చారు. ఇదే విషయంపై అమ్రోహా కలెక్టర్ వేద ప్రకాశ్ స్పందిస్తూ.. కొందరు వేధిస్తున్నారంటూ షమీ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనన్నారు. కచ్చితంగా ఎవరు బెదిరిస్తున్నారనే సమాచారం లేనందున తదుపరి చర్యలు తీసుకోలేకపోయామని కలెక్టర్ వివరించారు. -
బెడ్ షీట్లే తాళ్లుగా బాలనేరస్తుల పరారీ
గట్టిగా కొలిస్తే ఐదున్నర అడుగుల ఎత్తైనాలేని నలుగురు బాలనేరస్తులు.. 10 అడుగుల గోడ దూకి జువెనైల్ హోమ్ నుంచి పరారైన సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో చోటుచేసుకుంది. గతేడాది సంచలన రీతిలో ఒకేసారి 91 మంది బాలనేరస్తులు పారిపోయింది కూడా ఇదే వసతి గృహం నుంచి కావడం గమనార్హం. బెడ్ షీట్లు, బ్లాంకెట్లను తాళ్లుగా మలిచిన బాలనేరస్తులు గురువారం రాత్రి వసతి గృహం గోడదూకి పారిపోయారని, ఆ గోడ ఎత్తు10 అడుగులని నిర్వాహకులు చెప్పారు. పరారీ విషయం తెలుసుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాలనేరస్తుల కోసం వేట ప్రారంభించారు. కాగా, గతేడాది హోమ్ నుంచి తప్పించుకున్న91 మంది జువెనైల్స్ లో 80 మంది పోలీసులకు చిక్కగా.. మరో 11 మంది ఇప్పటికీ పట్టుబడలేదు. ఇంతలోనే మరోసారి బాలనేరస్తులు పారిపోవటంతో వసతి గృహం నిర్వాహకులపై ఉన్నతాధికారులు మండిపడుతున్నారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు మీరట్ జిల్లా పోలీసు అధికారి పుష్పేంద్ర సింగ్ తెలిపారు. -
'ఆ నలుగురు ప్రమాదకారులు'
మీరట్: ములాయం సింగ్ యాదవ్, నితీశ్ కుమార్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ దేశానికి ప్రమాదకారులు అని వివాదస్పద బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలతో విపక్షాలు బెంబేలెత్తుతున్నాయని ఎద్దేవా చేశారు. ముస్లింలకు భారత్ అత్యంత సురక్షిత ప్రాంతమని చెప్పారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో ముస్లింలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. భారత్-పాకిస్థాన్ చర్చల గురించి ప్రస్తావిస్తూ... ప్రధాని మోదీ పాకిస్థాన్ తో మాట్లాడినా, మాట్లాడకపోయినా ప్రతిపక్షాలకు సమస్యగానే ఉందని చురక అంటించారు. మత అసహనం పెరిగిపోయిందని గగ్గోలు పెట్టినవారంతా బిహార్ ఎన్నికలు ముగియగానే మౌనం దాల్చారని గుర్తుచేశారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అనుకూలంగా మధ్యప్రదేశ్ లో లక్ష మంది ముస్లింలు సంతకాలు చేశారని చెప్పారు. దేశ ప్రజలంతా రామమందిరం నిర్మించాలని కోరుకుంటుంటే వివాదం ఎక్కడుందని సాక్షి మహరాజ్ ప్రశ్నించారు. -
'ఎంజాయ్ చేశారుగా.. పార్లమెంటును జరగనివ్వండి'
నోయిడా: కొత్త సంవత్సరంలోనైనా పార్లమెంటు వ్యవహారాలు జరగనివ్వాలని భారత ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలను కోరారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగకపోవడం నిజంగా దురదృష్టకరమని చెప్పారు. ఆరు దశాబ్దాలపాటు అధికారాన్ని ఎంజాయ్ చేసిన కాంగ్రెస్ ఇప్పటికైనా సభలను కొనసాగేందుకు సహకరించాలని కోరారు. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్ వే రహదారికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం శంకుస్థాపన చేశారు. 7,500 కోట్ల భారీ వ్యయంతో 14 లేన్లతో నిర్మించనున్న ఈ రహదారి శంకుస్థాపన సందర్బంగా మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఆరు దశాబ్దాలపాటు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఎంజాయ్ చేసిందని, దేశ అభివృద్ధి విషయంలో తనకు ఏం తెలియనట్లు వ్యవహరించడం సరికాదని అన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారాన్ని చేతికందిస్తే కాంగ్రెస్ బాధ్యతారహితంగా వ్యవహరించి ఆరు దశాబ్దాలు వృధాగా గడిపిందని మండిపడ్డారు. 'రేపు జనవరి 1. కొత్త సంవత్సర వేడుకలకు వెళ్లే ముందు గట్టిగా ప్రమాణం చేయండి.. మేం పార్లమెంటును సజావుగా జరగనిస్తామని.. దేశ అభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు సృష్టించబోమని' అని మోదీ అన్నారు. 'లోక్ సభ ప్రారంభమైనప్పటి నుంచి నాకు సరిగా మాట్లాడే అవకాశమే రావడం లేదు. అందుకే నేను జనసభల్లో మాట్లాడుతున్నాను. ప్రజలు మనల్ని పార్లమెంటుకు పంపించింది చర్చించడానిని.. నిర్ణయాలు తీసుకోవడానికి.. ఎక్కడివక్కడ పెండింగ్ లో పెట్టడానికి కాదు.. సభా వ్యవహారాలు నిలిచిపోయేలా చేసేందుకు కాదు' అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా మోదీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్కు ఓ విజ్ఞప్తి చేశారు. గ్రూప్-3, గ్రూప్-4 పరీక్షలకు ఇంటర్యూలు నిర్వహించవద్దని, మెరిట్ ఆధారంగా వారు ఉద్యోగాలు పొందేలా అవకాశం కల్పించాలని ఆ విజ్ఞప్తిలో కోరారు. -
రోడ్డు కాదు.. అభివృద్ధికి రాజమార్గం
మీరట్: కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్ వే రహదారికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం శంకుస్థాపన చేశారు. 7,500 కోట్ల భారీ వ్యయంతో 14 లేన్లతో నిర్మించనున్న ఈ రహదారిని అభివృద్ధికి రాజమార్గంగా ప్రధాని పేర్కొన్నారు. కాలుష్యాన్ని తగ్గించేలా ఆధునిక పద్ధతిలో ఈ రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో మీరట్ కీలక పాత్ర పోషించిన విషయాన్ని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలోని మారుమూల గ్రామాలు సైతం అభివృద్ధి బాటలో పయనించాలంటే చక్కని రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండాలని ప్రధాని స్పష్టం చేశారు. వేగవంతమైన రవాణా సౌకర్యాల ద్వారా మౌలిక వసతులు సైతం వేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు. గ్రామసడక్ యోజన కార్యక్రమం ద్వారా మాజీ ప్రధాని వాజ్పేయి రోడ్డు మార్గాల అభివృద్ధి కోసం కృషి చేశారని తెలిపారు. పార్లమెంట్ కార్యక్రమాలు సజావుగా జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రధాని విమర్శించారు. ఎక్స్ప్రెస్ వే ద్వారా మీరట్ నుంచి ఢిల్లీ మధ్య 70 కిలోమీటర్ల దూరం ఉన్నా.. కేవలం 40 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
మీరట్లో ISI ఏజెంట్ మహమ్మద్ ఇజాజ్ అరెస్ట్
-
దీపావళి రోజు దారుణం
మీరట్: ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో దీపావళి పండగ రోజు దారుణం జరిగింది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు యువకులు మిఠాయిలు కొనిస్తామని తీసుకెళ్లి ఇద్దరు చిన్నారులపై అత్యాచారానికి ఒడిగట్టారు. బుధవారం సాయంత్రం బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి ముందు మూడేళ్ల చిన్నారిని ఆడుకుంటుండగా.. ఓ యువకుడు (25) తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి పరిస్థితి విషమంగా మారడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అదే రోజు సాయంత్రం పల్లవపురం ప్రాంతంలో మరో యువకుడు (20).. మోటార్ బైకుపై ఏడేళ్ల చిన్నారిని తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
ఆవు దూడకు ఘనంగా ముస్లిం ఫ్యామిలీ బర్త్ డే
మీరట్: గోహత్యలకు సంబంధించిన ఘటనలతో దేశ వ్యాప్తంగా అలజడులు జరుగుతున్న ప్రస్తుత సమయంలో ఓ ముస్లిం కుటుంబం ఆవు దూడకు పుట్టిన రోజు వేడుకలు జరిపి అందరినీ ఆకర్షించింది. ఉత్తరప్రదేశ్లోని 'దాద్రీ'లో ఆవుమాంసం వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, అదే రాష్ట్రంలో మీరట్లోని సికిందర్ కాలనీకి చెందిన ఓ ముస్లిం కుటుంబం ఆవులను తమ సొంత కుటుంబసభ్యులుగా చూస్తూ ఓ దూడకు జన్మదిన వేడుకలు జరిపింది. మీరట్లోని మహమ్మద్ ఇర్షాద్ కుటుంబానికి 'జూలి' అనే సంవత్సరం వయసున్న ఆవుదూడ ఉంది. దానికి పుట్టిన రోజు వేడుకలు జరపాలని నిర్ణయించి ఆ వేడుకలకు 100 మంది అతిధులను కూడా ఆహ్వానించారు. వేడుకకు ప్రత్యేకంగా 10 కిలోల ఎగ్లెస్ వెనీలా కేక్ను ఆర్డర్ చేసి తెప్పించారు. జూలీకి పుట్టిన రోజు వేడుకలలో బర్త్డే టోపీని కూడా అలంకరించారు. ఈ వేడుకకు హాజరైన ఇర్షాద్ మిత్రులు, బంధువులు జూలీకి పుట్టినరోజు బహుమతులుగా పండ్లను తీసుకొచ్చారు. ఈ వేడుకల కోసం ఆ కుటుంబం ఏకంగా రూ. 40 వేలు ఖర్చుచేసింది. ఇర్షాద్ కుటుంబం గత 40 సంవత్సరాలుగా ఆవులను కలిగి ఉంది. ఇస్మాయిల్ తండ్రి హాజీ అబ్ధుల్ గని.. గోవులపై ఇష్టంతో వాటికి పుట్టినరోజు వేడుకలు జరిపే సాంప్రదాయాన్ని ప్రారంభించారు. -
ఈవ్టీజర్ల నుంచి బాలికను రక్షించబోయి..
-
ఈవ్టీజర్ల నుంచి బాలికను రక్షించబోయి..
మీరట్(యూపీ): ఓ బాలికను కాపాడబోయిన జవానును ఈవ్టీజర్లు బలి తీసుకున్నారు. మీరట్లో ఈవ్టీజర్ల దాడిలో గురువారం తీవ్రంగా గాయపడిన వేదమిత్ర చౌధరీ(35) అనే జవాను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించారు. మీరట్లోని హర్దేవ్నగర్, రోహ్తా రోడ్డులో గల ఓ పాల బూత్ యజమాని కూతురిని పలువురు యువకులు వేధిస్తుండగా అక్కడికి పాలకోసం వెళ్లిన జవాను వారిని వారించారు. బాలికను కాపాడేందుకు యువకుల్లో ఒకడిపై చేయి కూడా చేసుకున్నారు. దీంతో రెచ్చిపోయిన ఆ యువకుడు తన స్నేహితులను పిలవడంతో వారు కర్రలు, ఆయుధాలతో వచ్చి చౌధరిని తీవ్రంగా గాయపర్చారు. చౌధరీ నగరంలోని గోపాల్ విహార్లో భార్య, పిల్లలతో నివసిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశామని, ఇతరుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
బాయ్ఫ్రెండ్ కోసం కొట్టుకున్నారు..
మీరట్ : అచ్చం సినిమాల్లో జరిగినట్లే... బాయ్ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతులు రోడ్డెక్కారు. అంతటితో ఆగకుండా రోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఇద్దరూ తమ చేతులకు పని చెప్పారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ భయంకరంగా కొట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో చోటు చేసుకుంది. మీరట్లోని మాధవాపురానికి చెందిన పూజ (పేరు మార్చబడింది) అనే యువతి స్థానిక మొబైల్ దుకాణంలో పనిచేస్తుంది. పూజ తన ప్రియుడిని తనకు కాకుండా చేస్తోందని ఆర్తి (పేరు మార్చబడింది) అనే మరో యువతి ఆరోపించింది. గురువారం పూజ ...యువకుడితో కలిసి మొబైల్ దుకాణానికి వెళ్తుండగా ఆర్తి అడ్డుకుంది. తన బాయ్ఫ్రెండ్కు దూరంగా వుండాలని హెచ్చరించింది. అయినా..ఆర్తి మాటలను పూజ పట్టించుకోలేదు. వారిద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆర్తి..పూజను రోడ్డు మీదనే కొట్టింది. తన ప్రియుడికి దూరంగా ఉండకపోతే ఫలితం దారుణంగా ఉంటుందని బెదిరించింది. పలువురు ఇద్దరు యువతులను విడదీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మరోవైపు వీరిద్దరూ అలా ఒకరినొకరు కొట్టుకుంటుంటే సందట్లో సడేమియాలాగా స్థానికులు ఆ దృశ్యాలను మొబైల్లో చిత్రీకరించారు. -
భర్తను చంపి బాత్ రూంలో పాతేసి జైలుపాలు
మీరట్: సినిమా పక్కీలో కట్టుకున్న భర్తను కడతేర్చి ఎవరికీ అనుమానం రాకుండా బాత్రూంలోనే పాతి పెట్టిన ఓ భార్యకు కోర్టు జీవిత కారాగార శిక్షను విధించింది. దీంతోపాటు రూ.25 వేల జరిమాన కూడా విధించింది. పోలీసుల వివరాల ప్రకారం మీరట్లోని గంగా నగర్కు చెందిన రాజేంద్రపటేల్, వర్షా అనే ఇద్దరు భార్య భర్తలు. రాజేంద్ర పటేల్ ఆర్మీ జవానుగా పనిచేస్తుండగా ఆమె ఇంట్లోనే ఉంటుంది. 2012 మార్చి 24న రాజేంద్ర పటేల్కు వర్ష నిద్ర మాత్రలు వేసి అనంతరం పదునైన ఆయుధంతో దాడి చేసింది. అనంతరం అతడిని ఈడ్చుకెళ్లి ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి బాత్రూంలో పాతిపెట్టి పైన బండలు వేసి ప్లాసింగ్ కూడా చేయించింది. ఆ తర్వాత ఇల్లును మంజు అనే మరో మహిళకు అమ్మేసింది. దీంతో వారు మార్చి 27న గృహ ప్రవేశం చేయగా వారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు తెలిసింది. అక్కడ తవ్వకాలు జరపడంతో రాజేంద్ర కుమార్ మృతదేహం బయటపడింది. దీంతో అదే రోజు వర్షాను పోలీసులు అరెస్టు చేశారు. చివరికి మంగళవారం జిల్లా కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది. -
అతనికి 747 సంవత్సరాలు!
మీరట్: హరి సింగ్.. మీరట్ లోని సుభాష్ నగర్ కు చెందిన వ్యక్తి. అయితే అతనికి ఏడు శతాబ్దాలకు పైగానే వయసట. అతని వయసు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగమానదు. మనిషి జీవన ప్రమాణం అంతకాలం ఉంటుందా?అనే అనుమానం కూడా రాకమానదు. ఓటర్ జాబితాలో చోటు చేసుకున్న తప్పిదాల కారణంగానే హరి సింగ్ వయసు అమాంతం వందల ఏళ్లకు పైగా దాటి పెరిగిపోయింది. తాజాగా మీరట్ కంటోన్మెంట్ బోర్డు ఓటరు వెరిఫికేషన్ చేపట్టగా ఈ విషయం బయటపడింది. ఇలా అతనే కాదండోయ్. చాలా మంది 200 వందల సంవత్సరాల నుంచి 600 సంవత్సరాల వయసు కల్గినవారు ఉన్నారు. కేవలం ఒక్క వార్డులోనే అనేక మంది వందల ఏళ్ల వయసు ఉన్నట్లు కంటోన్మెంట్ బోర్డు సర్వేలో వెలుగుచూసింది. ఇది అలా ఉంచితే కొన్ని చోట్ల తండ్రి వయసు కంటే కుమారుడు వయసే ఎక్కువగా ఉంది. ఉదాహరణకు కొడుకు వయసు 112 సంవత్సరాలు అయితే.. తండ్రి వయసు 72 సంవత్సరాలుగా ఓటర్ జాబితాలో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఓటరు జాబితాలో చోటు చేసుకున్న తప్పిదాల సవరణకు నడుంబిగించినట్లు కంటోన్మెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డీఎన్ యాదవ్ తెలిపారు. -
తోటి ఉద్యోగిని కాల్చి చంపిన ఆర్మీ జవాను
లక్నో: ఓ ఆర్మీ జవాను తన సహోద్యోగిని కాల్చి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మీరట్ లో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమిత్, అరవింద్ లు ఆర్మీ జవాన్లు. అయితే వారిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. బలియా గ్రామంలో అమిత్ నివాసం ఉంటుండగా, మీరట్ లో అరవింద్ ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అరవింద్ ఇంటికి వెళ్లిన అమిత్ తన వద్ద నున్న గన్ తో కాల్పులకు పాల్పడ్డాడు. అరవింద్ నిద్రిస్తున్న సమయంలో అతనిపై అమిత్ కాల్పులు జరిపినట్లు పోలీసు అధికారి తెలిపారు. ప్రస్తుతం అక్కడి నుంచి పరారైన జవాను అమిత్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అమిత్ భార్యతో అరవింద్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తమ ప్రాథమిక విచారణలో తేలిందని.. ఈ కారణంతోనే అరవింద్ మృతికి అమిత్ కారణమై ఉండవచ్చని పోలీస్ అధికారి తెలిపాడు. -
ఎత్తుకెళ్లి.. సామూహిక లైంగిక దాడి
మీరట్: ఎన్ని చట్టాలు తెచ్చినా.. వాటినెంత కఠినంగా మార్చినా మృగాళ్లు మాత్రం మారడం లేదు. ఉత్తరప్రదేశ్లో ఇద్దరు యువకులు దారుణానికి పాల్పడ్డారు. పదిహేనేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఓ కర్మాగారంలో పనిచేస్తున్న పదిహేనేళ్ల బాలికను నూర్ నగర్ రైల్వే క్రాసింగ్ వద్ద అడ్డుకున్న ఇద్దరు యువకులు బెదిరించి ఆటోలో తీసుకెళ్లారు. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో కొట్టారు. చేతిలోని మొబైల్ ఫోన్ లాక్కున్నారు. ఆ తర్వాత సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ బాలిక స్పృహకోల్పోవడంతో జురాన్పూర్ రైల్వే క్రాసింగ్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఆమెను గుర్తించిన జురాన్పూర్కు చెందిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వివరాలు సేకరించి నిందితుల కోసం గాలింపులు జరుపుతున్నారు. -
గ్యాంగ్స్టర్ను కొట్టి చంపిన గ్రామస్తులు
మీరట్: ముఠా సభ్యుడ్ని హత్యచేసిన గ్యాంగ్స్టర్ను గ్రామస్తులు కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ మీరట్లో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం హతుడు హస్మత్ పాటు మరో ముగ్గురు ఒకహత్యకేసులో నిందితులు. ఆరునెలల క్రితం నలుగురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈమధ్యనే పోలీసుల కస్టడీనుంచి తప్పించుకున్న హస్మత్ తమ అరెస్టులకు కారణం షాబీర్ అని కక్ష పెంచుకున్నాడు. తన గ్యాంగ్ రహస్యాలను పోలీసులకు చేరవేస్తున్నాడనే కోపంతో, అనుమానంతో రగిలిపోయాడు. అంతే....షాబీర్ గ్రామం ఇంద్రిష్పూర్కి వెళ్లి అతినిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో షాబీర్ అక్కడిక్కడే చనిపోయాడు. కాల్పుల శబ్దం విన్నగ్రామస్తులు, విగతజీవిగా మారినషాబీర్ ను చూసి కోపోద్రిక్తులై హస్మత్ను చుట్టుముట్టి కట్టెలతో దారుణంగా కొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరేలోపే హస్మత్ ప్రాణాలొదిలాడు. -
తల్లీ పిల్లల గొంతులు కోసేశారు
లక్నో: తల్లితోపాటు ఆమె నలుగురి సంతానాన్ని గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ మీరట్ నగరంలో సోమవారం సంచలనం సృష్టించింది. మీరట్ నగరంలోని సుహాల్ గార్డెన్లో ఓ ఇంట్లో రక్తపు మడుగులో ఐదుగురు పడి ఉన్నారని ఆగంతకులు పోలీసులు ఫోన్లో సమాచారం అందించారు. దాంతో పోలీసులు సదరు నివాసానికి చేరుకుని పోలీసులు మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో తల్లి రుక్సానాతోపాటు ఆమె పిల్లలు రిన్షా (20), జూలీ (8), గూంగీ (6), సుహాల్ (12) గా గుర్తించినట్లు చెప్పారు. అలాగే ఆ ఇంట్లో మరో మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఆ మృతదేహం ఎవరిదో గుర్తించవలసి ఉందని తెలిపారు. మృతుల గొంతుకలను మాత్రం బాగా పదునైన ఆయుధాలతో కొసి వేశారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఓ హత్య కేసులో రుక్సానా భర్త ఇప్పటికే జైలులో ఉన్నారని పోలీసులు తెలిపారు. -
బ్యాట్ల కోసం మీరట్ కు ధోని
మీరట్: గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆస్ట్రేలియా సిరీస్ కు సిద్ధమవుతున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ కోసం మీరట్ లో బ్యాట్లు సెలెక్టు చేసుకున్నాడు. ఆసీస్ బౌన్సీ పిచ్ లకు అనుకూలంగా ఉండే బ్యాట్లను అతడు ఎంపిక చేసుకున్నాడు. ఇందుకోసం అతడు ఐదు గంటల సమయం వెచ్చించాడు. 1260 గ్రాముల బరువుండే ఆరు బ్యాట్లను ధోని ఎంపిక చేసుకున్నాడని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బ్యాట్ ఆకారంతో పాటు స్ట్రోక్ పరిగణనలోకి తీసుకుని బ్యాట్లు సెలెక్ట్ చేసుకున్నాడని తెలిపాయి. ఆడిలైడ్ లో డిసెంబర్ 12 నుంచి జరిగే రెండో టెస్టులో ధోని ఆడనున్నాడు. -
ప్రియురాలిపై ప్రియుడు, మరో ఇద్దరు గ్యాంగ్ రేప్
మీరట్: ఓ యువతిపై ఆమె ప్రియుడు, మరో ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... భవాన్పూర్ ప్రాంతానికి చెందిన బాధితురాలితో శాస్త్రి నగర్ కు చెందిన నగీన్ గుప్తా పరిచయం పెంచుకున్నాడు. తనకు పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి ఆమెను ప్రేమలోకి దించాడు. ఈ విషయం తెలియడంతో అతడిని ఆమె నిలదీసింది. ఈనెల 18న రెస్టారెంట్ కు రావాలని ఆమెకు నగీన్ ఫోన్ చేశాడు. అక్కడ అతడి సోదరుడు ఆశు, స్నేహితుడు నిక్కీ ఉన్నారు. ఆమెను మాటల్లోకి దించి పల్లవపురం ప్రాంతంలోని ఓ ఇంటికి తీసుకున్నారు. ఆమెకు మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దురాగతాన్ని వీడియో తీశారు. తమ గురించి ఎవరికైనా చెబితే వీడియో ఇంటర్నెట్ లో పెడతామని బెదిరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వయసు ఐదేళ్లు.. ఎత్తు 5 అడుగుల 7అంగుళాలు
ఎల్కేజీ చదివే పిల్లాడు ఎంత ఎత్తు ఉంటాడు.. సాధారణంగా అయితే మూడు అడుగులు కదూ. కానీ, కరణ్ సింగ్ అనే ఓ కుర్రాడు మాత్రం ఐదేళ్లకే ఏకంగా ఐదడుగుల ఏడు అంగుళాలు పెరిగిపోయాడు. గట్టిగా మాట్లాడితే, ఎల్కేజీ చదివేసరికే అతగాడు ఐదడులు ఎత్తున్నాడు. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఈ పిల్లాడు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాడు. కానీ అదే అతడి తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారింది. ఎల్కేజీలో వేసినప్పుడు పిల్లంతా అతడి నుంచి దూరంగా వెళ్లిపోయేవారని, నెమ్మదిగా వాళ్లు స్నేహితులయ్యారని కరణ్ తండ్రి సంజయ్ సింగ్ చెప్పారు. త్వరలోనే కరణ్కు గిన్నిస్ రికార్డు కూడా సొంతమవుతుంది. మరో ఐదు నెలలు గడిస్తే అతడు ఆరేళ్ల వయసుకు వస్తాడు. ఆ వయసుకు ఎవరూ ఇంతవరకు 5 అడుగుల 7 అంగుళాల ఎత్తు పెరగలేదు. ఇంత ఎత్తు కరణ్కు ఎలా వచ్చిందనుకుంటున్నారా? అతడి తల్లి స్వెత్లానా సింగ్ 7 అడుగుల 2 అంగుళాల ఎత్తుంటారు. అంతేకాదు.. పాతికేళ్ల వయసులో ఇప్పుడు కూడా ప్రతి రెండేళ్లకు ఆమె నాలుగు అంగుళాల చొప్పున పొడవు పెరుగుతున్నారు. 2007లో ఆమెను తాను ప్రేమించి పెళ్లి చేసుకునే సమయానికి ఆమె 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉండేదని, తామిద్దరం సరిగ్గా సరిపోయేలా ఉండేవారిమని సంజయ్ సింగ్ చెప్పారు. కానీ ఆ తర్వాత ఆమె మరింత ఎత్తు ఎదిగిపోయారు. -
చెరుకు తోటలోకి లాక్కెళ్లి చెరబట్టాడు
మీరట్: దళిత బాలికపై యువడొకరు అత్యారానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని పార్థాపూర్ ప్రాంతంలో జరిగింది. గడ్డి కోసుకురావగానికి పొలానికి వెళ్లిన 15 ఏళ్ల బాలికపై దుండగుడు ఈ అకృత్యానికి ఒడిగట్టాడు. నిందితుడు సోనుపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. బాలికను బలవంతంగా చెరుకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఇంటికి తిరిగొచ్చిన బాలిక కుటుంబ సభ్యులకు ఈ విషయంతో తెలపడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాలికపై అత్యాచారం జరిగినట్టు వైద్య పరీక్షలో నిర్ధారణయిందని పోలీసులు తెలిపారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ, పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. -
బ్రేవ్ లేడి @ మీరట్
-
మీరట్ సాహసమహిళ ఆత్మహత్య చేసుకోవలసిందేనా?
మీరట్: ఈ దేశంలో సాహసమహిళలకు, వీరనారీమణులకు దక్కేది ఏమిటి? ఓ మహిళ తనను, తన భర్తను రక్షించుకోవడం కోసం దుండగులపై తిరగబడినా ఈ సమాజంలో సహాయపడేవారే లేరా? పోలీసులు, ప్రభుత్వం సహాయపడరా? బెదిరింపులు ...భయం భయంగా బతకవలసిందేనా? అంటే అంతే అని స్పష్టమవుతోంది మీరట్లో ఓ మహిళ ఎదుర్కొంటున్న పరిస్థితి చూస్తుంటే. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో పట్టపగలు నడిరోడ్డు మీద తన భర్తపై దాడి చేస్తున్న ఇద్దరు యువకులను ఓ మహిళ ధైర్యంగా ఎదుర్కొన్న సంఘటన తెలిసిందే. సంఘటన పూర్వాపరాలను పరిశీలిస్తే.. మమత యాదవ్ అనే మహిళ తన భర్తతో కలసి బైకుపై వెళుతోంది. ఇద్దరు యువకులు వారి బైకును కారుతో ఢీకొట్టారు. ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అంతేకాకుండా ఆమె భర్తపై దాడి చేశారు. తమకు సాయం చేయాలంటూ ఆ మహిళ పట్టపగలు రోడ్డుపై ఉన్నవారిని ప్రాధేయపడినా ఎవరూ ముందుకు రాలేదు. పైగా చోద్యం చూస్తూ ఈ సంఘటనను తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. దాంతో భర్తను రక్షించుకునేందుకు ఆ మహిళే రంగంలోకి దిగింది. అపరకాళిలా విరుచుకుపడింది. ఆ యువకులకు దేహశుద్ధి చేసింది. ప్రాణాలకు తెగించి నడిరోడ్డుపై పోరాడుతున్న ఆ మహిళకు అక్కడ ఉన్న ఏ ఒక్క మగవాడు కూడా సహాయపడలేదు. ఆ సంఘటనను సెల్ ఫోన్ లో ఎక్కించడంలో నిమగ్నమై ఉన్నారు. ఆ తరువాత పోలీసులు ఒక్క నిందితుడిని మాత్రమే అరెస్ట్ చేశారు. ఇంతటి సాహసం చేసిన మమతకు ఆ సంఘట తరువాత న్యాయం జరుగలేదు. నిందితుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. తన భర్తను రక్షించుకోవడం కోసం యువకులను చికతబాదిన మహిళ, ఇప్పుడు న్యాయం కోసం పోరాడవలసిన పరిస్థితి ఏర్పడింది. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. ఈ సంఘటన మంగళవారం జరిగితే అంకిత్ అనే నిందితుడిని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారని మమత యాదవ్ చెప్పారు. మరో నిందితుడు సమాజ్వాదీ పార్టీ నేత అనుచరుడు అయినందున అరెస్ట్ చేయలేదని తెలిపారు. ఆ రోజు నుంచి వేధింపులు, బెదిరింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా నిందితుడి అరెస్ట్ చేయకుండా, తనకు సహకరించకుండా వేధిస్తున్నారని చెప్పారు. తాను ఏమీ మాట్లాడకుండా ఉంటే లక్ష రూపాయలు డబ్బు ఇస్తామని చెప్పారని తెలిపారు. తనకు డబ్బు అవసరంలేదని, న్యాయం కావాలని ఆమె కోరారు. తన కుటుంబం భయంతో బతుకుతోందని మమత తెలిపారు. ఒక వారంలో తనకు న్యాయం జరగకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పారు. -
హెచ్ఐవీ సోకిన 12 మంది చిన్నారులు దత్తత!
మీరట్: మంచి పనులు చేయడానికి కావాల్సింది మాటలు కాదు.. చేతలు కావాలి. అందుకే ప్రార్ధించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులే మిన్నా అన్నారు. హెచ్ఐవీ సోకిన 12 మంది పిల్లల్ని దత్తత తీసుకుని మనకు చేతనైన సాయంలో భాగం కావాలని సాటి చెప్పాడు అజయ్ శర్మ. మీరట్ లోని గంగానగర్ లో ఉంటున్నఅజయ్ శర్మ హెచ్ఐవీ బారిన పడ్డ చిన్నారులకు అన్నీ తానై ఆసరాగా నిలిచాడు. ఆ చిన్నారులు తల్లి దండ్రులను ఎయిడ్స్ మహమ్మారి కాటేయడంతో వారు అజయ్ వద్దకు చేరారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు బ్రతికున్నాన్నాళ్లు వారి వద్దే ఉన్నా తరువాత ఆదరణ కరవైంది. బంధువులు కూడా ఛీదరించుకున్న సమయంలో అజయ్ వారిని అక్కున చేర్చుకుని ఆశ్రయమిచ్చాడు. కొంతమంది సందర్శకులు ఆ పిల్లల ఉన్న గృహాన్ని సందర్శించినప్పుడు ఈ విషయాలు వెలుగుచూశాయి. ఆ సందర్శకులను వివేక్ అనే 12 ఏళ్ల చిన్నారి చెమర్చిన కళ్లతో స్వాగతం పలకడం వారిని కలిచివేసింది. వీరిలో ఉన్న చిన్నారులంతా ఏడు సంవత్సరాల నుంచి 17 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. 'నాకు 12 మంది పిల్లలు ఉన్నారు. ప్రతీ ఒక్కరూ నాకు అమూల్యమైన వారే. అత్యంత ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డ ఆ తల్లిదండ్రులకు వారిని పెంచడం నిజంగా కష్టంతో కూడుకున్న పని. ఆ క్రమంలో ఈ 12 మంది నాచెంతకు చేరడం నా అదృష్టం' అంటూ అజయ్ నవ్వుతూ ఆ సందర్శకులకు తెలిపాడు. -
ప్రకాష్ రాజ్కు ఎదురైన అనుభవమే....
మొన్న నటుడు ప్రకాష్ రాజ్ ఎదుర్కొన్న అనుభవమే... తాజాగా మరో మహిళకు ఎదురైంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే విషయంలో మనుషులు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్న సంఘటనలు తరచు చోటుచేసుకుంటున్నాయి. సాయం చేయాలని అర్ధిస్తున్నా పట్టించుకోకుండా వినోదం చూస్తున్నట్లు సెల్ఫోన్లలో ఆ సంఘటను బంధించటంలో కొందరు పోటీలు పడ్డారు. రోడ్డుమీద ఏం జరిగినా సాయం చేయడం మానేసి వీడియోలు తీసి ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను పెట్టడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో పదే పదే చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని మీరట్లో పట్టపగలు.. నడిరోడ్డుమీద తన భర్తపై దాడి చేస్తున్న ఇద్దరు యువకులను ఓ మహిళ ధైర్యంగా ఎదుర్కొంది. దంపతుల బైకును కారుతో ఢీకొట్టిన యువకులు, ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించటంతో పాటు ఆమె భర్తపై దాడికి దిగారు. తమకు సాయం చేయాలంటూ ఆ మహిళ అక్కడున్న వారిని ప్రాధేయపడినా ఎవరూ ముందుకు రాలేదు. పైగా చోద్యం చూస్తూ. ఈ సంఘటనను తమ సెల్ఫోన్లలో చిత్రీకరించటంలో నిమగ్నమైపోయారు. దాంతో భర్తను రక్షించుకునేందుకు ఆ మహిళే రంగంలోకి దిగింది. అపరకాళిలా విరుచుకుపడి ...దాడికి దిగిన యువకులకు దేహశుద్ధి చేసింది. ఈ ఘటనను చూసిన ఓ హోం గార్డు తీరిగ్గా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియో తీసినవాళ్లు దాన్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేయడంతో.. ఆ వీడియోను చూసిన పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. రోడ్డుమీద సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేకపోయినా... సామాజిక వెబ్సైట్లలో ఆమెకు పెద్ద ఎత్తున సానుభూతితో పాటు అభినందలు తెలపటం విశేషం. సరిగ్గా ప్రకాష్రాజ్కు కూడా ఇలాంటి అనుభవమే ఇంతకుముందు ఎదురైంది. దాని గురించి ఆయన ట్విట్టర్లో కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రమాదం జరిగిన సమయంలో ప్రమాదం కన్నా ఘటనా స్థలంలో జరిగిన సంఘటనలు మరింత బాధించాయి. ప్రమాదాన్ని పట్టించుకోకుండా కొందరు యువకులు తమ సెల్ఫోన్లతో ఫొటోలు తీసుకోవడంలో బిజీగా కనిపించారు. ఆ పరిస్థితి చూసి సిగ్గుతో తలవంచుకున్నాను. నా ప్రాణం మీద భయం కన్నా మానవత్వం లేకుండా ప్రవర్తించే అలాంటి మనుషులను చూసి భయమేసింది’ అంటూ ట్వీట్ చేశారు. -
యువతి కిడ్నాప్, 3 రోజులపాటు గ్యాంగ్రేప్
మీరట్: ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ యువతి (18)ని కిడ్నాప్ చేసిన ఇద్దరు కీచకులు ఆమెపై మూడు రోజులపాటు గ్యాంగ్రేప్కు పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరీక్షిత్గఢ్లో సోదరుడితో కలసి అడవిలోకి వెళ్తున్న యువతిని ఎత్తుకెళ్లిన సాజిద్, జుబేర్ అనే నిందితులు ఆమెను ఓ ఇంట్లో నిర్బంధించి మూడు రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డారు. పైగా ఈ దారుణాన్ని కెమెరాలో చిత్రీకరించారు. నిందితుల్లో ఒకరి ఫోన్ నుంచి బాధితురాలు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు సాజిద్ను అరెస్టు చేశారు. -
యువతిపై 3 రోజులు సామూహిక అత్యాచారం
మీరట్: ఉత్తరప్రదేశ్లోని మీటర్ నగరం ఇప్పుడు సామూహిక అత్యాచారాలకు నిలయంగా మారిపోయింది. ఈ నగరంలో అపరకీచకులు ఎక్కువైపోయారు. కొద్ది రోజుల క్రితం ఓ యువతిపై కొందరు యువకులు సామూహికంగా అత్యాచారం చేసి, ఇస్లాంమత మార్పిడికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. గత ఆదివారం మరో 15 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇప్పడు అదే మీరట్లో 18 ఏళ్ల యువతిపై ఇద్దరు యువకులు మూడు రోజులపాటు సామూహిక అత్యాచారం చేశారు. పరీక్షిత్గఢ్ ప్రాంతంలో సోదరుడితో కలసి అడవిలోకి వెళ్తున్న యువతిని సాజిద్, జుబేర్ అనే నిందితులు కిడ్నాప్ చేశారు. ఆమెను ఓ ఇంట్లో నిర్బంధించి మూడు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఈ దారుణాన్ని కెమెరాలో చిత్రీకరించారు. నిందితుల్లో ఒకరి ఫోన్ నుంచి బాధితురాలు కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సాజిద్ను అరెస్టు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
మహిళపై కాంగ్రెస్ నేత కుమారుడు అత్యాచారం
మీరట్: దేశంలో మహిళలపై, టీనేజ్ బాలికలపై మృగాళ్ల ఆగడాలు శృతిమించుతూనే ఉన్నాయి. తాజాగా ఓ 21 ఏళ్ల మహిళపై స్థానిక కాంగ్రెస్ నేత కుమారుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన మీరట్ లో ఆలస్యంగా వెలుగుచూసింది. గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లాలో ఉంటున్న ఆ మహిళను జూలై 29 వ తేదీన కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత కుమారుడు నోయిడా 29 సెక్టార్ నుంచి బలవంతంగా హోటల్ కు తీసుకువెళ్లి అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె ఫిర్యాదు ఇవ్వడానికి స్థానికి పోలీస్ స్టేషన్ కు వెళితే అక్కడి పోలీసులు దర్యాప్తుకు విముఖత చూపారని డీఐజీ కే.సత్యనారాయణ తెలిపారు. దాంతో ఆ మహిళ తనను ఆశ్రయించడంతో దర్యాప్తుకు ఆదేశించానని ఆయన పేర్కొన్నారు. -
మజాక్ నుంచి మత కల్లోలం దాకా....
ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సరదాగా మొదలైన వేళాకోళం వికటించి ఏకంగా మత ఉద్రిక్తతకి దారి తీసి, అయిదుగురు గాయపడేదాకా వచ్చింది. ఇదంతా ఇప్పటికే కమ్యూనల్ కుంపటిపై కుతకుతలాడుతున్న మీరట్ నగరంలో జరిగింది. ప్రస్తుతం అక్కడ పోలీసుల బలగాలను మొహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మీరట్ లోని లాల్ కుర్తీ ప్రాంతంలో పింటూ, అజ్జూ అనే ఇద్దరు దోస్తులు ఒకరినొకరు ఆట పట్టించుకున్నారు. అది నెమ్మదిగా వేడెక్కింది. ఇంతలోపింటూ ఒక అగ్గిపుల్ల వెలిగించి అజ్జూపైకి విసిరాడు. అంతే... అజ్జూ కి తిక్కరేగింది. క్షణాల్లో ఫోన్ చేసి మిత్రులందరినీ పిలుచుకున్నారు. పింటూ తనవారిని లాఠీలతో సహా రమ్మన్నాడు. అంతే నినాదాలు, వివాదాలు, లాఠీలు, ఈటెలు మొదలయ్యాయి. చివరికి ఒకరు నాటు తుపాకీ తెచ్చి పేల్చాడు. దాంతో జనం శివాలెత్తి పెళ్లి బస్సు సహా కనిపించిన వాహనాలను ధ్వంసం చేశారు. రాళ్లు విసురుకోవడం మొదలైంది. చివరికి పోలీసులను దించి, కర్ ఫ్యూ విధించి, గంటల పాటు శ్రమిస్తే కానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇప్పటికీ అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. -
మార్నింగ్ వాక్కు వెళితే.. గ్యాంగ్రేప్
మీరట్: మార్నింగ్ వాక్కు వెళ్లిన యువతిపై ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీరట్లోని మలియానా ప్రాంతంలో ఉండే 26 ఏళ్ల యువతి శనివారం ఉదయం చెల్లెలితో కలసి మార్నింగ్ వాక్కు వెళ్లింది. ఈ సమయంలో అక్కడికి వచ్చిన ఐదుగురు యువకులు యువతితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దీంతో యువతి సోదరి అక్కడి నుంచి పరుగున ఇంటికి వెళ్లి.. జరిగిన విషయం చెప్పి కొంతమందిని తీసుకువచ్చింది. అయితే వారు ఘటనా స్థలానికి వచ్చేసరికి యువతి సమీపంలోని పొలాల్లో అపస్మారక స్థితిలో కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి యాశ్పాల్, రాజ్పాల్, రాజేంద్రతో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. -
యువతిపై సామూహిక అత్యాచారం: ఫేస్బుక్లో వీడియో!
ఉత్తరప్రదేశ్లో ఓ యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం చేసి, ఆ దృశ్యాలను సామాజిక వెబ్సైట్లో పెట్టారు. మీరట్కు చెందిన 20 ఏళ్ల యువతి తనపై ఎనిమిది మంది యువకులు ఏడాది క్రితం అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గురించి ఎవరికైనా చెపితే వీడియోను నెట్లో పెడతామని బెదిరించారు. అయితే ఇప్పుడు ఆ వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేయడంతో పోలీసులను ఆశ్రయించినట్టు ఆ యువతి తెలిపింది. గత ఏడాది ఆగస్టులో ఒక స్నేహితునితో కలసి బాధితురాలు బసాదా గ్రామానికి వెళ్లింది. ఆ సమయంలో వారితో మరో నలుగురు యువకులు జత కలిశారు. ఆమెను అక్కడి నుంచి ఓ చోటుకి తీసుకెళ్లగా, అక్కడ మరో ముగ్గురు యువకులు ఉన్నారు. వీరంతా కలసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాక ఆ దశ్యాలను వీడియో తీశారు. ఈ విషయం ఎవరికైనా చెపితే ఆ వీడియోను నెట్లో పెడతామని బెదిరించారు. దాంతో భయపడి ఆమె ఎవరికీ చెప్పలేదు. ఈమధ్యే ఆ వీడియోను ఫేస్ బుక్లో చూసిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్ఎస్పీ హెచ్ఎన్ సింగ్ చెప్పారు. రషీద్, వాసిక్, అబ్దుల్ రహమాన్, మోను, రాహుల్, సలావ్, అబుల్, షోకన్లను నిందితులుగా గుర్తించారు. వీరిలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. -
రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్, మీరట్ అల్లర్ల నేపథ్యంలో కేంద్రం సూచన న్యూఢిల్లీ: హైదరాబాద్, మీరట్లో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఘర్షణలు చెలరేగే అవకాశం ఉన్న ఏ చిన్న ఘటననైనా నివారించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గురువారం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. సున్నితమైన ప్రాంతాల్లో అవసరమైతే అదనపు బలగాలను మోహరించాలని, శాంతి సామరస్యాలను పరిరక్షించాలని సూచించింది. మత ప్రదేశాలు, మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు, జనం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో నిరంతరం తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. శుక్రవారం సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా ఉన్నందున కేంద్రం రాష్ట్రాలకు ఈ సూచనలు చేసింది. హైదరాబాద్లోని పాతబస్తీ ప్రాంతంలో జెండా కోసం జరిగిన అల్లర్ల సమయంలో పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే మీరట్లో గత వారం జరిగిన ఘర్షణల్లో ఒక వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే. -
కేసు వాపస్ తీసుకోని యువతిపై గ్యాంగ్ రేపిస్టుల కాల్పులు
ఎంతో కొండ డబ్బు పుచ్చుకుని కేసు ఉపసంహరించుకునేందుకు ఒప్పుకోని గ్యాంగ్ రేప్ బాధితురాలిని దుండగులు కాల్చి చంపేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటనలో బాధితురాలు తృటిలో తప్పించుకుంది. ఒక బుల్లెట్ ఆమె భుజానికి రాసుకుంటూ వెళ్లింది. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలోని ఢిల్లీ గేట్ ప్రాంతంలో ఒక మహిళ గత జనవరి 21 న సామూహిక అత్యాచారానికి గురైంది. ఆమెకు లిఫ్ట్ ఇస్తామని నమ్మబలికి కొంత మంది దుండగులు ఆమెను ఒక నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఆ తరువాత ఆమె వీరిపై ఫిర్యాదు చేసింది. అప్పట్నుంచీ దుండగులు ఆమెతో కేసు ఉపసంహరించుకునేందుకు బేరసారాలు జరుపుతున్నారు. యువతి ససేమిరా అనడంతో సోమవారం రాత్రి ఆమె రిక్షాలో వెళ్తూండగా ఆమెపై కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన వారిని వసీమ్, రషీద్ లు గా గుర్తించారు. ఈ సంఘటనలో మరో వ్యక్తి తప్పించుకుని తిరుగుతున్నాడు. వసీమ్, రషీద్ లు కేసు ఉపసంహరించుకోవలసిందిగా ఆమెను బలవంత పెడుతున్నారు. ఆ యువతి ప్రస్తుతం క్షేమంగానే ఉంది. -
ఫేస్బుక్లో భార్య మృతదేహాన్ని గుర్తించిన భర్త
కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన తన భార్య మృతదేహం ఫొటోను ఫేస్బుక్లో చూసి గుర్తుపట్టాడో భర్త. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగింది. మీరట్లో ఓ యువతి మృతదేహాన్ని పోలీసులు గత గురువారం రాత్రి కనుగొన్నారు. జింఖానా సమీపంలో ఈ మృతదేహం పడి ఉంది. ఆమెను ఎవరో అత్యంత సమీపం నుంచి పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్చి చంపారు. అయితే ఆమె ఎవరన్న విషయాన్ని గుర్తించడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. దాంతో పోలీసులు ఏం చేయాలో తెలియక, ఆమె మృతదేహాన్ని ఫొటో తీసి, దాన్ని ఫేస్బుక్లో పెట్టారు. ఆ ఫొటోను ఒకరి తర్వాత ఒకరుగా చాలామంది షేర్ చేశారు. దాంతో ఎట్టకేలకు ఆమె భర్త విపిన్ ఆ ఫొటోను ఫేస్బుక్లో చూశాడు. నోయిడాకు చెందిన తన భార్య నేహ కొన్నాళ్లుగా కనిపించడం లేదని, ఇప్పుడు ఫేస్బుక్లో ఆమె మృతదేహం కనిపించిందని విపిన్ వాపోయాడు. అయితే, ఇంటినుంచి బయటకు వెళ్లిన నేహ అంతదూరం మీరట్ ఎందుకు వెళ్లింది, అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో హత్యకు గురైందన్న విషయాలు మాత్రం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయాయి. -
చెంప చెళ్లుమనిపించిన నగ్మా
హీరోయిన్లు బయట అడుగు పెడితే....... అభిమానుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఇక ఆ హీరోయిన్లే రాజకీయాల్లోకి వచ్చి ప్రచార రంగంలోకి దూకితే జనాభిమానికి హద్దే ఉండదు. అయితే ఒక్కోసారి ఈ అభిమానం వెర్రితలలు వేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ప్రముఖ సినీ నటి నగ్మా విషయంలో అదే జరిగింది. ఇటీవలి కాంగ్రెస్లో చేరి ఉత్తరప్రదేశ్లోని మీరట్ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న నగ్మాకు వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. నామినేషన్ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత ప్రవర్తనను మరిచిపోకముందే నగ్మాకు మరో చేదు అనుభవం ఎదురైంది. మీరట్లో ప్రచారానికి వచ్చిన నగ్మా పట్ల కొందరు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించారు. నగ్మా చుట్టూ చేరిన అల్లరిమూక ఆమెను అడ్డుకుంది. ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటూ విపరీత చేష్టలకు పాల్పడింది. ఈ చర్యలతో నివ్వెరపోయిన నగ్మా... అల్లరి మూకపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ ఆకతాయి యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించబోగా ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఆమె తన చేతికి పనిచెప్పింది. అందరి ముందే నగ్మా అతగాడి చెంప చెళ్లుమనిపించింది. ఈ సంఘటనతో అందరూ ఒక్కసారిగా నివ్వెరబోయారు. స్థానిక పెద్దల జోక్యంతో అక్కడి నుంచి బయటపడిన నగ్మా... అనంతరం ప్రచారం సాగించింది. -
పబ్లిక్గా నగ్మాకు ముద్దు
* కాంగ్రెస్ ఎమ్మెల్యే వికృత చేష్ట మీరట్: మహిళల భద్రత కోసం చట్టాలు చేశామంటూ జబ్బలు చరుచుకుంటున్న కాంగ్రెస్ గొంతులో పచ్చివెలక్కాయపడింది! మీరట్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన నటి నగ్మా పట్ల ఆ పార్టీ నేత ఒకరు అసభ్యంగా ప్రవర్తించారు. శనివారం యూపీలోని హాపూర్లో పట్టపగలు అందరిముందూ బహిరంగ సభలో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే గజ్రాజ్ శర్మ.. నగ్మాను పట్టుకుని బలవంతంగా ముద్దుపెట్టుకున్నారు. దీంతో ఆమె దిగ్భ్రాంతికి గురై అతని చేతిని విసురుగా తోసేసి, వెనక్కి నెట్టేసింది. సభలో మాట్లాడకుండానే వెళ్లిపోయింది. దీనిపై స్థానిక మునిసిపాలిటీ చైర్మన్ మాలతీ భారతీ స్పందిస్తూ.. శర్మ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, స్థానిక గురుద్వారాలో ప్రార్థన చేసేందుకు నగ్మా హాపూర్కు వెళ్లారు. -
లోక్సభ బరిలో నటి నగ్మా
ఆమెకు యూపీలోని మీరట్ కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ మాజీ క్రికెటర్ అజహర్ సీటు మరొకరికి మాజీ మంత్రి బన్సల్కు మళ్లీ టికెట్ 71 మందితో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణాది సినిమాల్లో హీరోయిన్గా గతంలో ఓ వెలుగు వెలిగిన నటి నగ్మాకు ఈ సారి కాంగ్రెస్ లోక్సభ టికెట్ దక్కింది. ఆమె ఉత్తరప్రదేశ్లోని మీరట్ స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. లోక్సభ ఎన్నికలకు 71 మందితో కాంగ్రెస్ తన రెండో జాబితాను గురువారం ఢిల్లీలో విడుదల చేసింది. తొలి జాబితాలోంచి నలుగురి పేర్లను మారుస్తూ రెండో జాబితాలో కొత్త పేర్లు ప్రకటించింది. ముందుగా మీరట్ స్థానానికి దయానంద్ గుప్తా పేరును ప్రకటించినా ఇప్పుడాస్థానంలో నగ్మాకు చోటు కల్పించారు. అలాగే రాయ్గఢ్ స్థానాన్ని మేనకాసింగ్కు బదులుగా ఆర్తీసింగ్కు, రాయ్పూర్ సీటును ఛాయా వర్మకు బదు లు సత్యనారాయణ్ శర్మకు, మేఘాలయలోని తురా స్థానాన్ని డి.జెన్నిత్ ఎం.సంగ్మాకు బదులు డారిల్ విలియం చైకు కేటాయించారు. రెండో జాబితాలో మొత్తం 11 మంది మహిళలకు చోటు కల్పించారు. మరోవైపు మాజీ క్రికెటర్, మొరాదాబాద్ ఎంపీ అజారుద్దీన్కు రెండో జాబితాలో టికెట్ దక్కలేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని మొరాదాబాద్ స్థానాన్ని పార్టీ సీనియర్ నాయకురాలు బేగం నూర్ బానోకు కాంగ్రెస్ కేటాయించింది. నిన్నటితరం బాలీ వుడ్ నటుడు రాజ్ బబ్బర్కు ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ స్థానం లభించింది. రైల్వేశాఖలో వెలుగుచూసిన ‘ముడుపులకు ఉద్యోగం’ కుంభకోణంలో ప్రమేయం ఆరోపణల తో ఆ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన పవన్కుమార్ బన్సల్కు ఈ జాబితాలో చోటు దక్కింది. ఆయన్ను తిరిగి చండీగఢ్ అభ్యర్థిగా కాంగ్రెస్ బరిలోకి దింపింది. రెండో జాబితాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన అభ్యర్థులెవరూ లేరు. కాగా, ఈసారి తిరిగి టికెట్ దక్కించుకున్న కేంద్ర మంత్రుల్లో వీరప్ప మొయిలీ (చిక్బళ్లాపూర్), శశిథరూర్ (తిరువనంతపురం), నారాయణ సామి (పుదుచ్చేరి) ఉన్నారు. కామన్వెల్త్ క్రీడల స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేశ్ కల్మాడీ ప్రాతినిధ్యం వహిస్తున్న పుణే స్థానంతోపాటు ఆదర్శ్ హౌసింగ్ స్కాంలో ఆరోపణలతో సీఎం పదవికి రాజీనామా చేసిన అశోక్ చవాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నాందేడ్కు అభ్యర్థిని ప్రకటించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. -
లిఫ్టు ఇస్తామని చెప్పి.. గ్యాంగ్ రేప్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. లిఫ్టు ఇస్తామని చెప్పి.. ముగ్గురు యువకులు ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. జాన్పద్ హపూర్ గ్రామానికి చెందిన బాధితురాలు సోమవారం నాడు వారపు సంత కోసం బుధానా గేట్ ప్రాంతానికి వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆ ముగ్గురు యువకులు ఆమెకు లిఫ్ట్ ఇస్తామని చెప్పి.. ఆమెను ఫతేలాపూర్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి బలవంతంగా లాక్కెళ్లి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి, ఒకరి తర్వాత ఒకరిగా ఆమెను చెరిచారు. అనంతరం బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ముగ్గురు యువకులపై కేసు నమోడు చేశారు. ఫిర్యాదులో ఆమె తెలిపిన వివరాల ప్రకారం చూస్తే, మహిళపై సామూహిక అత్యాచారం చేసిన తర్వాత, ఆమెను హపూడ్ గ్రామానికి తీసుకెళ్లి, కదులుతున్న కారులోంచి ఆమెను కిందకు తోసేసి అక్కడి నుంచి పారిపోయారు. నిందితులలో ఒకరు తనకు తెలియడం వల్లే వారు లిఫ్టు ఇస్తామంటే వాళ్ల వాహనంలో ఎక్కినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. నిందితులలో ఇద్దరిని రషీద్, మష్రుగా గుర్తించారు. మొత్తం ముగ్గురినీ అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
విద్యార్థినిపై యాసిడ్ దాడి
కళాశాల నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థినిపై బైకుపై వచ్చిన ముగ్గురు యువకులు యాసిడ్తో దాడి చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ మీరట్ సమీపంలోని మన్వాలో చోటు చేసుకుంది. దీంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఆ బాలికను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ బాలిక మోహం మొత్తం కాలిందని, అయితే కళ్లు మాత్రం సురక్షితంగా ఉన్నాయని చెప్పారు. అయితే బాధితులరాలి పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. కళాశాలో నిర్వహించిన పరీక్ష రాసి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆగంతకులు యాసిడ్ దాడి చేశారని పోలీసులు వెల్లడించారు. అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను ఆదుపులోకి తీసుకుంటామన్నారు. -
యువతిపై ఆర్మీ ఉన్నతాధికారి అత్యాచారం!
క్రమశిక్షణకు మారు పేరు భారతీయ ఆర్మీ. ఆ ఆర్మీ రంగానికి చెందిన ఉన్నతాధికారి ఓ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం...రోహిత్ శర్మ (29) ఆర్మీలో లెఫ్టినెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆర్మీ కళాశాలలో ఉపాధ్యాయురాలి ఉద్యోగం ఇప్పిస్తానని 24 ఏళ్ల యువతికి మాయ మాటలు చెప్పాడు. ఆ విషయంపై చర్చించేందుకు హోటల్ రూమ్ అనువైన వేదిక అని ఆ యువతికి వెల్లడించాడు. హోటల్కు వెళ్లిన యువతిపై రోహిత్ అత్యాచారం జరిపాడు. దాంతో ఆ యువతి జరిగిన విషయాన్నితల్లీ తండ్రులకు వివరించింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.అత్యాచారానికి గురైన యువతికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు. యువతి వాంగ్మూలాన్ని రికార్డు చెసినట్లు పోలీసు ఉన్నతాధికారి గురువారం మీరట్ లో వివరించారు. అత్యాచారం విషయమై ఆర్మీ అధికారులను సంప్రదిస్తున్నట్లు చెప్పారు. అయితే ఆ కేసులో ఇంతవరకు లెఫ్టినెంట్ను అరెస్ట్ చేయలేదని పోలీసు ఉన్నతాధికారి వివరించారు.అయితే ఆ ఘటన ఈ ఏడాది ఆక్టోబర్ 22న జరిగిందని పోలీసులు చెప్పారు. -
మీరట్ ఆశ్రమంలో పనివాళ్లూ రేపిస్టులే.. కేసు నమోదు!!
ఈ రోజుల్లో ఏ ఆశ్రయాన్ని చూసినా రేపిస్టులే కనిపిస్తున్నారు. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు, ఆయన సుపుత్రుడే కాదు.. మరికొందరు రేపిస్టులు కూడా బయటపడుతున్నారు. మీరట్లో ఉన్న ఓ ఆశ్రమంలో తొమ్మిది మంది పనివాళ్లు ఓ కాలేజి విద్యార్థినిపై అత్యాచారానికి ప్రయత్నించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థిని ఫిర్యాదు మేరకు ఆశ్రమ ఇన్చార్జి సహా మొత్తం తొమ్మిదిమందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నవంబర్ మూడో తేదీన ఆ యువతి ఆరోగ్యం బాగోలేకపోయినా.. స్వామి చంద్రమోహన్ దర్శనం కోసం ఆమె పరమాధమ్ ఆశ్రమానికి వెళ్లింది. స్వామికి నాలుగు రోజుల పాటు సేవలు చేసుకోవాలని చెప్పిన ముగ్గురు మహిళలు.. ఆమెను ఓ గదిలో బంధించారు. అనంతరం నలుగురు పురుషులు వచ్చి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె అభ్యంతరం చెప్పగా, అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. ఆమె అరుపులు విన్న ఇతర భక్తులు అక్కడికొచ్చి ఆమెను కాపాడారు.