ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఆదివారం విషాద ఘటన జరిగింది.
మీరట్: ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఆదివారం విషాద ఘటన జరిగింది. స్థానికంగా కురిసిన భారీ వర్షాలకు ఖార్కుండ ప్రాంతంలో ఓ రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మీరట్ ప్రాంతంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భవనం పునాదుల్లోకి నీరు చేరడం వలన ఒక్కసారిగా కుప్పకూలినట్లు భావిస్తున్నారు.