breaking news
Diwali
-
పిల్లలతో పటాసులు కాల్చిన కాజల్ అగర్వాల్ (ఫోటోలు)
-
రాజాసాబ్ బ్యూటీ దీపావళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
దీపావళి వేడుకల్లో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య, దీపికా పిల్లి.. ఫోటోలు
-
పండుగ కళ ఉట్టిపడుతున్న ఈ భామను గుర్తుపట్టారా?
-
రూ.1కే సిమ్కార్డ్, అన్లిమిటెడ్ కాల్స్, ఇంకా మరెన్నో!
తిరుపతి ఎడ్యుకేషన్ : దీపావళి పండుగ సందర్భంగా వినియోగదారులకు ఈ నెల 18 నుంచి నవంబరు 18వ తేదీ వరకు వివిధ ఆఫర్లను బీఎస్ఎన్ఎల్ ప్రకటించినట్లు జీఎం సి.అమరేంద్రనాథ్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు రూపాయికే సిమ్కార్డుతో పాటు 30రోజుల పాటు అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, ప్రతి రోజు 2జీబీ ఇంటర్నెట్, 100ఎస్ఎంఎస్లు ఉంటాయని తెలిపారు. ఏదేని కార్పొరేట్ కస్టమర్ కనిష్టంగా పది అంతకుమించి పోస్ట్ పెయిడ్ కనెక్షన్లు తీసుకున్నా, ఒక ఎఫ్టీటీహెచ్ కనెక్షన్ తీసుకున్నా వారికి మొదటి నెల రీచార్జ్పై 10శాతం డిస్కౌంట్ లభిస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 18నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్కేర్ యాప్ ద్వారా మిత్రులకు, కుటుంబ సభ్యులకు రీచార్జ్ చేస్తే, రీచార్జ్ మొత్తంలో 2.5శాతం డిస్కౌంట్ లభిస్తుందని తెలిపారు. దీపావళి సందర్భంగా సీనియర్ సిటిజన్లకు ఈ నెల 18నుంచి నవంబరు 18వ తేదీ వరకు రూ.1,812కే సిమ్కార్డుతో పాటు 365 రోజుల పాటు అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, ప్రతి రోజు 2జీబీ డేటా, 100ఎస్ఎంఎస్లు, 6నెలల పాటు బైటీవీ సబ్్రస్కిప్షన్ అందించనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ఈ నెల 18నుంచి నవంబరు 18వ తేదీ వరకు రూ.485, రూ.1,999 ప్లాన్లపై బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్కేర్ యాప్ ద్వారా రీచార్జ్ చేసిన వారికి 5శాతం రాయితీ లభిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సది్వనియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
క్రాకర్స్ మంటలతో కంటికి గాయాలు
-
మధ్యప్రదేశ్ లో వింత ఆచారం బాణాసంచాలతో ఫైట్
-
White House: దీపావళి వేడుకల్లో ట్రంప్
-
కంటిపై పొడిస్తే నోట్లోకొచ్చిన్ కత్తి!
కాకినాడ క్రైం/పి.గన్నవరం: దీపావళి పండగ పూట మద్యం తాగి పేట్రేగిపోయిన భర్త, కత్తితో తన భార్య కంట్లో పొడిచాడు. ఆ కత్తి మొన నోటి గుండా బయటకు వచి్చంది. మృత్యువుతో పోరాడుతున్న ఆమెకు కాకినాడ జీజీహెచ్ వైద్యులు పునర్జన్మనిచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఊడుమూడి గ్రామానికి చెందిన 35 ఏళ్ల నేలపూడి పల్లాలమ్మ (పల్లవి) భర్త గంగరాజు తాగొచ్చి నిత్యం వేధిస్తుండేవాడు. దీపావళి రోజున మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. అర్ధరాత్రి ఇంట్లో కూరలు తరిగే కత్తి తీసుకొని భార్యను చంపే ఉద్దేశంతో తలపై బలంగా పొడవబోయాడు. ఈ క్రమంలో కత్తి గురి తప్పి పల్లాలమ్మ ఎడమ కంటికి పై భాగంలో గుచ్చుకుంది. భార్య విలవిల్లాడుతున్నా వదిలి పెట్టకుండా కత్తిని గంగరాజు బలంగా నొక్కుతూ మరింత లోతుకు దింపాడు. దీంతో, ఆ కత్తి మొన నోటి గుండా బయటకి వచ్చేసింది. ఈ దారుణాన్ని గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాలిని అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కాకినాడ జీజీహెచ్లో చేర్చారు. తక్షణమే స్పందించిన వైద్యులు మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో శస్త్రచికిత్స మొదలు పెట్టారు. రెండు గంటల పాటు సుదీర్ఘ శస్త్రచికిత్స నిర్వహించి, దిగబడిన కత్తిని విజయవంతంగా తొలగించి, పల్లాలమ్మ ప్రాణాలు కాపాడారు. క్లిష్టతరమైన ఈ శస్త్రచికిత్స జీజీహెచ్ సూపరింటెండెంట్ లావణ్య కుమారి పర్యవేక్షణలో రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ నేతృత్వంలో జరిగింది. బాధితురాలికి ఎస్ఐసీయూలో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. పల్లాలమ్మ కంటి చూపు, ప్రాణాలు రెండూ నిలిచాయని వైద్యులు నిర్ధారించారు. బాధితురాలి కుటుంబీకులు వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపారు. -
ఢిల్లీలో రికార్డు స్థాయికి వాయు కాలుష్యం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత మంగళవారం నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది. 24 గంటల సరాసరి వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) సోమవారం 4 గంటల సమయంలో 345కి పడిపోయి, వెరీ పూర్ విభాగంలో చేరిందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ) తెలిపింది. ఇది గతంలో 2024లో 330, 2023లో 218, 2022లో 312, 2021లో 382గా నమోదైందని సీపీసీబీ గుర్తు చేసింది. పండుగ రోజు, సోమవారం రాత్రి 8–10 గంటల మధ్య మాత్రమే బాణసంచా కాల్చాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. అయితే, జనం ఆ పరిమితిని పట్టించుకోలేదు.అర్ధరాత్రి వరకు మోతమోగించారు. సోమవారం రాత్రి కాలుష్య కారక సూక్ష్మ ధూళి కణాల(పీఎం 2.5)స్థాయిలు 675కు చేరాయని సీపీసీబీ తెలిపింది. మంగళవారం ఉదయం నుంచి ఢిల్లీపై దట్టమైన బూడిదరంగు మంచు మేఘాలు కమ్ముకున్నాయి. వాయు నాణ్యత రెడ్ జోన్ స్థాయికి చేరుకుంది. వీటన్నిటికీ పంజాబ్ రైతుల పంటవ్యర్థాల దహనమే కారణమని ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం ఆరోపించింది. పంజాబ్లోని ఆప్ ప్రభుత్వం నిషేధాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని తెలిపింది. ఢిల్లీలో దీపావళికి ముందు ఏక్యూఐ 345 ఉండగా, మంగళవారం ఉదయం కేవలం 11 పాయింట్లు పెరిగి 356కి చేరుకుందని పేర్కొంది. -
పండుగ సేల్స్ @ 6 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: ఇటీవలి జీఎస్టీ సంస్కరణలు, కొనుగోలుదారుల సానుకూల సెంటిమెంటు దన్నుతో దీపావళి పండుగ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. విక్రయాలు రూ. 6.05 లక్షల కోట్ల రికార్డు స్థాయిని తాకాయని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ వెల్లడించింది. ఇందులో రూ. 5.40 లక్షల కోట్ల విలువ చేసే వస్తువులు, రూ. 65,000 కోట్ల విలువ చేసే సర్వీసులు ఉన్నట్లు తెలిపింది. గతేడాది దీపావళి విక్రయాలు రూ. 4.25 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.వివిధ రాష్ట్రాల రాజధానులతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని 60 కీలక పంపిణీ కేంద్రాలవ్యాప్తంగా సీఏఐటీ రీసెర్చ్ వింగ్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్యాకేజింగ్, ఆతిథ్యం, క్యాబ్ సరీ్వసులు, ట్రావెల్, ఈవెంట్ మేనేజ్మెంట్, డెలివరీ విభాగాల్లో రూ. 65,000 కోట్ల మేర విక్రయాలు నమోదైనట్లు సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బి.సి. భార్తియా తెలిపారు. శీతాకాలం, వివాహాల సీజన్తో పాటు జనవరి మధ్య నుంచి మొదలయ్యే పండుగల సీజన్లోను ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎఫ్ఎంసీజీ, ఆభరణాలకు డిమాండ్.. 2025 దీపావళి సందర్భంగా లాజిస్టిక్స్, ప్యాకేజింగ్ తదితర విభాగాల్లో 50 లక్షలకు పైగా తాత్కాలిక ఉద్యోగాల కల్పన జరిగింది. మొత్తం వ్యాపారంలో గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాల వాటా సుమారు 28 శాతంగా నమోదైంది. సీఏఐటీ నివేదిక ప్రకారం.. మొత్తం అమ్మకాల్లో వాటాలపరంగా చూస్తే నిత్యావసరాలు..ఎఫ్ఎంసీజీ వాటా 12 శాతంగా, బంగారం.. ఆభరణాలు 10 శాతంగా, ఎల్రక్టానిక్స్..ఎలక్ట్రికల్స్ 8 శాతంగా, కన్జూమర్ డ్యూరబుల్స్.. రెడీమేడ్ దుస్తులు..గిఫ్ట్ ఐటమ్లు మొదలైన వాటి వాటా తలో 7 శాతంగా నమోదైంది. మరోవైపు, గతేడాదితో పోలిస్తే మొబైల్స్, ఎల్రక్టానిక్స్, భారీ ఉపకరణాలు, ఫ్యాషన్ విక్రయాలు భారీగా పెరిగినట్లు ఫ్లిప్కార్ట్ వైస్ ప్రెసిడెంట్ ప్రతీక్ శెట్టి తెలిపారు. జెనరేషన్ జెడ్ (1997–2012 మధ్య జన్మించినవారు) నుంచి డిమాండ్ గణనీయంగా నెలకొన్నట్లు వివరించారు. మార్కెట్ప్లేస్ మెరుపులు: యూనికామర్స్ ఈసారి దీపావళి పండుగ సీజన్లో ఈ–కామర్స్కి సంబంధించి ఆర్డర్ల పరిమాణం వార్షికంగా 24 శాతం, స్థూల కొనుగోళ్ల విలువ (జీఎంవీ) 23 శాతం మేర పెరిగినట్లు యూనికామర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక క్విక్ కామర్స్ యాప్ల ద్వారా ఆర్డర్ల పరిమాణం 120 శాతం ఎగియగా, బ్రాండ్ వెబ్సైట్లలో ఆర్డర్లు 33 శాతం పెరిగాయి. మొత్తం కొనుగోళ్లలో 38 శాతం వాటా, 8 శాతం ఆర్డర్ల పరిమాణం వృద్ధితో మార్కెట్ప్లేస్ల (అమెజాన్, ఫ్లిప్కార్ట్లాంటివి) ఆధిపత్యం కొనసాగింది. 2024, 2025 సంవత్సరాల్లో 25 రోజుల పండుగ సీజన్ వ్యవధిలో తమ ఫ్లాగ్షిప్ ప్లాట్ఫాం యూనివేర్ ద్వారా జరిగిన 15 కోట్లకు పైగా లావాదేవీల ఆధారంగా ఈ గణాంకాలు రూపొందించినట్లు యూనికామర్స్ తెలిపింది. మరిన్ని విశేషాలు... ⇒ ఎఫ్ఎంసీజీ (డ్రైఫ్రూట్ కాంబో ప్యాక్లు మొదలైన ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తులు), గృహాలంకరణ..ఫరి్నచర్, సౌందర్య సంరక్షణ..ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్యం.. ఫార్మా (సప్లిమెంట్లు మొదలైనవి) అత్యధికంగా అమ్మకాలు నమోదైన కేటగిరీల్లో నిల్చాయి. ⇒ చిన్న పట్టణాల్లో కూడా డిజిటల్ వినియోగం, కొనుగోలు శక్తి పెరుగు తోందనడానికి నిదర్శనంగా మొత్తం ఆర్డర్లలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల వాటా 55 శాతంగా నమోదైంది. ప్రాంతీయంగా ద్వితీయ శ్రేణి నగరాల నుంచి ఆర్డర్లు 28 శాతం, పెద్ద నగరాల్లో 24 శాతం, తృతీయ శ్రేణి పట్టణాల్లో 23 శాతం మేర పెరిగాయి. ⇒ డిజిటల్ లావాదేవీలపై పెరుగుతున్న నమ్మకాన్ని సూచిస్తూ ప్రీపెయిడ్ ఆర్డర్లు 26 శాతం పెరగ్గా, క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ) ఆర్డర్ల పరిమాణం 22 శాతం.. విలువ 35 శాతం మేర పెరిగాయి. ⇒ యూనికామర్స్ లాజిస్టిక్స్ ప్లాట్ఫాం షిప్వే డేటా ప్రకారం ఈ ఏడాది డెలివరీలు చాలా వేగవంతమయ్యాయి. గతేడాది పండగ సీజన్తో పోలిస్తే ఈ ఏడాది 15 శాతం తక్కువ వ్యవధిలోనే డెలివరీ చేశారు. -
తెలుగు చిత్ర పరిశ్రమలో దీపావళి సందడి
తెలుగు చిత్ర పరిశ్రమలో దీపావళి సందడి జోరుగా కనిపించింది. ఫస్ట్ లుక్, కొత్త పోస్టర్స్, రిలీజ్ డేట్స్, వీడియో గ్లింప్స్, ప్రెస్మీట్స్... ఇలా సినిమా లవర్స్కి కావల్సినన్ని అప్డేట్స్ ఇచ్చింది ఈ పండగ. ఆ విశేషాల్లోకి...డేట్ ఫిక్స్⇒ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన చిత్రం ‘కాంత’. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. తెలుగు, తమిళ భాషల్లో సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మించారు. ఈ సినిమాను నవంబరు 14న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు. 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో స్టార్ హీరో చంద్రన్గా దుల్కర్, దర్శకుడు అయ్యా పాత్రలో సముద్ర ఖని కనిపిస్తారు. ⇒ శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారి నారి నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ⇒ భూమిక చావ్లా ప్రధాన పాత్రలో, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత కీలక పాత్రల్లో నటించిన యూత్ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘యుఫోరియా’. గుణశేఖర్ దర్శకత్వంలో రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్త గుణ నిర్మించారు. ఈ సినిమాను డిసెంబరు 25న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ⇒ పతంగుల పోటీ నేపథ్యంలో రూపొందిన కామెడీ స్పోర్ట్స్ డ్రామా ‘పతంగ్’. వంశీ పూజిత్, ‘జీ సరిగమప’ రన్నరప్ ప్రణవ్ కౌశిక్, ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల ప్రధాన పాత్రధారులుగా, సింగర్ ఎస్పీ చరణ్ కీలక పాత్రలో నటించారు. ప్రణీత్ పత్తి పాటి దర్శకత్వంలో విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించారు. ఈ సినిమాను డిసెంబరు 25న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలి పారు.అప్ డేట్స్⇒ చిరంజీవి ఇంట్లో దీ పావళి సంబరాలు ఘనంగా జరిగాయి. హీరోలు నాగార్జున, వెంకటేశ్, సతీసమేతంగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో నీరజ (వెంకటేశ్ భార్య), అమల (నాగార్జున భార్య)లతో పాటు చిరంజీవి తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్గారు’లో హీరోయిన్గా నటిస్తున్న నయనతార కూడా పాల్గొన్నారు. ఈ వేడుకల్లోని ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మరోవైపు చిరంజీవి, నయనతార హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్గారు’ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సుస్మిత కొణిదెల, సాహు గార పాటి నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.⇒ విశాల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మకుటం’. ఈ సినిమా సెకండ్ లుక్ను రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమాకు తానే దర్శకత్వం వహిస్తున్నట్లుగా కూడా విశాల్ తెలి పారు. ‘‘పరిస్థితులు నన్ను ఈ సినిమాకు దర్శకత్వం వహించాలనే నిర్ణయం తీసుకునేలా చేశాయి. ఈ నిర్ణయం బలవంతం వల్ల కాదు, బాధ్యతగా తీసుకోవడం జరిగింది’’ అంటూ ఓ లాంగ్ నోట్ను విశాల్ షేర్ చేశారు. విశాల్కు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో దుషారా విజయన్, అంజలి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ సినిమాకు తొలుత దర్శకుడిగా ఉన్న రవి అరసు ఇప్పుడు ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్బి చౌదరి నిర్మిస్తున్నారు. ⇒ హీరో వెంకటేశ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా రూ పొందనున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్నారు. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రలో శ్రీనిధి శెట్టి నటించనున్నారు. మంగళవారం (అక్టోబరు 21) శ్రీనిధి శెట్టి బర్త్ డే సందర్భంగా ఈ చిత్రంలో ఆమె హీరోయిన్గా నటించనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా తెలి పారు.⇒ నవీన్ పొలిశెట్టి, మీనాక్షీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’. మారి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా స్పెషల్ ్ర΄ోమో వీడియోను రిలీజ్ చేశారు చేశారు మేకర్స్. అలాగే త్వరలోనే ‘అనగనగా ఒక రాజు’ సినిమా నుంచి పాటను రిలీజ్ చేయనున్నట్లుగా కూడా తెలి పారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది.⇒ ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫ్యాంటసీ ఎంటర్టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ యేలేటి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ్ర పారంభమైంది. ‘‘తొలి షూటింగ్ షెడ్యూల్ నవంబరు 8 వరకు కొనసాగుతుంది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.ఫస్ట్ లుక్⇒ మోటార్ సైకిల్ రేసర్గా హీరో శర్వానంద్ నటిస్తున్న చిత్రానికి ‘బైకర్’ టైటిల్ ఖరారు చేసి, లుక్ని విడుదల చేశారు. ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. 1990, 2000ల నేపథ్యంలో రేసింగ్ డ్రీమ్స్, ఎమోషన్స్ ప్రధానంగా ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూ పొందుతోంది.⇒ రష్మికా మందన్నా నటిస్తున్న ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మైసా’. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్ఫార్ములా ఫిల్మ్స్ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలోని రష్మిక లుక్ విడుదలైంది. గోండు తెగల నేపథ్యంలో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా రూ పొందుతున్న ఈ చిత్రం గ్లింప్స్ త్వరలో విడుదల కానుంది.⇒ సంయుక్త నటిస్తున్న తొలి ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్కి ‘ది బ్లాక్ గోల్డ్’ టైటిల్ని ఖరారు చేసి, లుక్ని విడుదల చేశారు. యోగేష్ ఏఎంసి దర్శకత్వంలో ఈ యాక్షన్ మూవీని రాజేశ్ దండ నిర్మిస్తున్నారు. హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్న ఆరవ సినిమా ఇది. ఈ చిత్రంలో నటించడంతో పాటు సంయుక్త సమర్పకురాలిగానూ వ్యవహరిస్తుండటం విశేషం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది.⇒ ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో కీర్తన నరేశ్, టీఆర్ ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్న చిత్రం ‘కాగితం పడవలు’. వర్ధన్, కృష్ణప్రియ జటంగా నటిస్తున్న ఈ ప్రేమకథా చిత్రం గ్లింప్స్ను విడుదల చేశారు. ఓ తీరంలో ప్రేమికులు మాట్లాడుకోవడంతో ఈ వీడియో సాగుతుంది. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.⇒ గ్రామీణ నేపథ్యంలో రూ పొందుతోన్న ఎమోషనల్ మూవీ. ‘రోలుగుంట సూరి’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. నాగార్జున పల్లా, ఆధ్యారెడ్డి, భావన నీలిపి హీరో హీరోయిన్లు. చక్కని భావోద్వేగాలతో, జీవిత సత్యాలు మిళితమైన కథతో అనిల్ కుమార్ పల్లా దర్శకత్వంలో సౌమ్య చాందిని పల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
పాక్ను వణికించిన దీపావళి.. యాంటీ స్మోగ్ గన్లతో తక్షణ చర్యలు
న్యూఢిల్లీ: భారతదేశం అంతటా దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. దేశప్రజలంతా ఉత్సాహంగా టపాసులు కాల్చారు. అయితే వీటి ప్రభావం పొరుగునున్న పాకిస్తాన్పై పడింది. దేశ సరిహద్దు ప్రాంతాల్లో కాల్చిన బాణసంచా పాక్వైపు పొగమంచుగా వెళ్లింది. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్, రాజధాని నగరం లాహోర్లో గాలి నాణ్యత బాగా క్షీణించిందని పాక్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణం కాలుష్య నివారణ చర్యలు చేపట్టింది.దీపావళి నేపధ్యంలో భారత్లో విడుదలైన ఉద్గారాలు, కాలుష్యకారకాలు పాక్లోకి ప్రవేశించి, అక్కడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని కరాచీలోని డాన్ పత్రిక పేర్కొంది. పంజాబ్ పర్యావరణ పరిరక్షణ విభాగం (ఈపీడీ) తెలిపిన వివరాల ప్రకారం న్యూఢిల్లీ, ఇతర ఉత్తర భారత నగరాల నుండి విడుదలైన కాలుష్య కారకాలను మోసుకెళ్లే గాలులు.. పాకిస్తాన్ పంజాబ్లో వాయు పరిస్థితులు దిగజారడానికి గణనీయంగా దోహదపడ్డాయి. మంగళవారం ఉదయం నాటికి లాహోర్ లో గాలినాణ్యత(ఏక్యూఐ)266కు దిగజారింది. దీంతో ప్రపంచంలో రెండవ అత్యంత కలుషిత నగరంగా లాహార్ మారిపోయింది. న్యూఢిల్లీ తర్వాత ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరింది. پنجاب حکومت نے دیوالی کے دوران فضائی آلودگی سے نمٹنے کے لئے جامع پلان پر عملدرآمد شروع کر دیا امرتسر، لدھیانہ اور ہریانہ سے آنے والی ہوائیں فضا میں آلودگی لائیں گی، لاہور کا AQI 210 سے 230 تک رہنے کا امکان، آلودہ ہاٹ اسپاٹس پر اینٹی سموگ گنز اور پانی کے چھڑکاؤ کا آپریشن رات سے… pic.twitter.com/IkqtTdyTkJ— Marriyum Aurangzeb (@Marriyum_A) October 20, 2025విషపూరిత గాలిని తట్టకునేందుకు పాకిస్తాన్లోని పంజాబ్ ప్రభుత్వం లాహోర్లోని ముఖ్య రహదారులపై యాంటీ స్మోగ్ గన్లను వినియోగించడం, నీరు చల్లడం లాంటి అత్యవసర చర్యలను ప్రారంభించింది. కాలుష్య నియంత్ర కార్యకలాపాల కోసం తొమ్మిది విభాగాలను ఏర్పాటు చేశారు. స్మోగ్ రెస్పాన్స్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేయడంతో పాటు, గాలిని కలుషితం చేస్తున్న వారిపై అధికారులు దాడులకు ఉపక్రమించారు. గంటకు 4 నుండి 7 కి.మీ వేగంతో గాలి వీచడంతో, గాలిలోని కణాలు సరిహద్దులు దాటి లాహోర్, ఫైసలాబాద్, గుజ్రాన్వాలా, సహివాల్, ముల్తాన్ తదితర పాకిస్తాన్ నగరాలను ప్రభావితం చేస్తున్నాయి.పాక్ మంత్రి మరియం ఔరంగజేబ్ ప్రస్తుత పరిస్థితిని పెను పర్యావరణ సవాలుగా అభివర్ణించారు. అమృత్సర్, లూథియానా, హర్యానా నుండి వచ్చే గాలులు కాలుష్యాన్ని మోసుకొస్తున్నాయని ఆరోపించారు. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా బహిరంగ ప్రాంతాలలో నిర్మాణాలను నిలిపివేయనున్నామని, కీలక రహదారుల్లో ట్రాఫిక్ను పరిమితం చేస్తామని, పొగను విడుదల చేసే వాహనాలపై జరిమానా విధించనున్నమని ఆమె హెచ్చరించారు. మరోవైపు లాహోర్ పోలీసులు పలు ప్రాంతాల్లో కాలుష్యాన్ని వ్యాప్తిచేస్తున్న 83 మందిని అరెస్టు చేశారు. వీరిలో పరిశ్రమల నిర్వాహకులు, టైర్లు లాంటివి తగలబెడుతున్నవారు ఉన్నారు. ఇది కూడా చదవండి: Karnataka: ‘వరల్డ్ రికార్డు’తో సీఎం సిద్దరామయ్య నవ్వులపాలు? -
పెళ్లి తర్వాత శోభితా తొలి దీపావళి కళ్లు తిప్పుకోలేకపోతున్న నాగ చైతన్య (ఫోటోలు)
-
దీపావళి వేడుకల్లో నాగచైతన్య-శోభిత.. పెళ్లి తర్వాత తొలిసారిగా..!
అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) దంపతులు దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరు జంటగా తొలిసారి దివాళీని జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను చైతూ సతీమణి శోభిత ధూలిపాల సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా.. గతేడాది డిసెంబర్లో చైతూ-శోభిత వివాహం చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులంతా సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు వెంకటేశ్ కూడా పాల్గొన్నారు. కాగా.. అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) గతేడాది తండేల్ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం చైతూ విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు డైరెక్షన్లో పని చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి వృషకర్మ అనే (వర్కింగ్ టైటిల్) ఖరారు చేశారు. ఇది నాగచైతన్య కెరీర్లో 24వ చిత్రంగా నిలవనుంది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారని టాక్. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) -
గౌరీ లక్ష్మీపూజ, షారూఖ్ ఖాన్ దీపావళి శుభాకాంక్షలు, నెటిజన్లు ఫిదా!
దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తన ఇంట్లో జరిగిన దీపావళి పూజ వివరాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రతీ ఏడాదిలాగానే బాద్షా దీపావళి వేడుకలను నిర్వహించారు. తన భార్య గౌరీ ఖాన్ పూజ చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. "అందరికీ దీపావళి శుభాకాంక్షలు! లక్ష్మీదేవి మీకు శ్రేయస్సు మరియు ఆనందాన్ని ప్రసాదించాలి. అందరికీ ప్రేమ, కాంతి మరియు శాంతిని కోరుకుంటున్నాను" అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఖాన్ కుటుంబానికి నెటిజన్లు దీపావళి శుభాకాంక్షలు అందించారు. ప్రతీ ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా అన్నీ శుభాలే జరగాలని ఫ్యాన్స్ ఆయనను అభినందించారు. అలాగే షారూఖ్ మతసామరస్యంపై ప్రశంసలు కురిపించారు. ఇదీ చదవండి: ముచ్చటగా మూడోసారి: తన రాక్స్టార్స్కు బ్రాండ్ న్యూ కార్లు గిఫ్ట్స్కాగా షారూఖ్ 60వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది నవంబర్ 2 ఆయనను ఫిల్మ్ ఫెస్టివల్తో సత్కరిస్తారు. అక్టోబర్ 31 నుంచి PVR INOX ఒక ప్రత్యేక ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో షారూఖ్ సినీ జీవితంలో బ్లాక్బస్టర్ చిత్రాలను ప్రదర్శిస్తారు. రెండు వారాల పాటు జరిగే ఫిల్మ్ ఫెస్టివల్, 30 కి పైగా నగరాలు , దాదాపు View this post on Instagram A post shared by Shah Rukh Khan (@iamsrk) -
ముచ్చటగా మూడోసారి: తన రాక్స్టార్స్కు బ్రాండ్ న్యూ కార్లు గిఫ్ట్స్
దీపావళికి బోనస్లు, స్వీట్లు, గిఫ్ట్లు సహజమే. కానీ ఖరీదైన బహుమతు లివ్వడం వార్తల్లో నిలుస్తాయి. తాజాగా హెల్త్కేర్ సంస్థ వ్యవస్థాపకుడు సామాజిక కార్యకర్త ఎంకే భాటియా ముచ్చటగా మూడోసారి తన ఉద్యోగులకు వచ్చిన విలువైన బహుమతులు నెట్టింట సందడిగా మారాయి.చండీగఢ్కు చెందిన వ్యాపారవేత్త ‘మిట్స్ నేచురా లిమిటెడ్’ కంపెనీ అధినేత ఎంకే భాటియా దీపావళి వేడుకల్లో భాగంగా తన ఉద్యోగుల పట్ల కృతజ్ఞతా భావంతో ఉద్యోగులకు 51 సరికొత్త కార్లను బహుమతిగా ఇచ్చారు. స్వయంగా తాళాలు అందజేసి వారిని అభినందించారు. అత్యుత్తమ పనితీరు కనబరిచిన బృంద సభ్యులకు ఎస్యూవీ, స్కార్పియో వంటి ఖరీదైన కార్లను అందించారు. ఎంకే బాటియా ఇలా కార్లను బహుమతిగా ఇవ్వడం వరుసగా ఇది మూడోసారి. ఇదీ చదవండి: గౌరీ పూజ, షారూఖ్ ఖాన్ దీపావళి శుభాకాంక్షలు, నెటిజన్లు ఫిదా!లింక్డ్ఇన్ పోస్ట్లో, భాటియా ఏమన్నారంటే. ‘‘గత రెండు సంవత్సరాలుగా, అత్యంత అంకితభావంతో పనిచేసే ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చాం. అసలు వారిని ఉద్యోగులు లేదా సిబ్బంది అని ఎప్పుడూ పిలవలేదు. వారు నా జీవితంలో రాక్స్టార్ సెలబ్రిటీలు, మా ప్రయాణంలోని ప్రతి దశనూ బ్లాక్బస్టర్గా మార్చేసే తారలు. ఈ దీపావళి ఎక్స్ట్రా స్పెషల్" అంటూ కార్లను హ్యాండ్ఓవర్ చేసిన ఫోటోలను షేర్ చేశారు. తన కంపెనీకి వారే వెన్నెముక అనీ, వారి కృషి, నిజాయితీ, అంకితభావమే తమ కంపెనీవిజయానికి పునాది. అందుకే వారి శ్రమను గుర్తించడం, ప్రోత్సహించడం, కంపెనీని మరింత అభివృద్ధి దిశ,ఉన్నత శిఖరాలకు నడిపించడం ఏకైక లక్ష్యమని తెలిపారు. వార్తా సంస్థ PTI ప్రకారం, భాటియా ఈ వారంలో ఉద్యోగులకు వాహనాలను అందజేశారు. ఆ తర్వాత షోరూమ్ నుండి కంపెనీ మిట్స్ హౌస్ ఆఫీస్ వరకు వేడుకగా "కార్ గిఫ్ట్ ర్యాలీ" కూడా జరిగిందట.మీ విజయాన్ని లాభాలను ఉద్యోగులతో పంచుకోవడం చాలా సంతోషం అంటూ భాటియాను చాలామంది నెటిజన్లు ప్రశంసించారు. అంతేకాదు ఈ వీడియోను తన మేనేజర్కి చూపిస్తే ఏఐ జనరేటెడ్ వీడియో అన్నారనీ, ఆ తరువాత డ్రైఫ్రూట్స్, 4 దీపాలు ఇచ్చారంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు. వరుసగా మూడోసారిగత ఏడాది 15 కార్లను, అంతకు ముందు సంవత్సరం, 12 కార్లను బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అంతేకాదు రాబోయే సంవత్సరంలో 50 కార్లను బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నట్టు భాటియా గత దీపావళికే ప్రకటించడం విశేషం. -
Pakistan: శుభాకాంక్షలకు ‘ఏఐ’.. ప్రధానిపై నెటిజన్ల ఆగ్రహం
న్యూఢిల్లీ: పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దీపావళి సందర్భంగా హిందువులకు అందించిన శుభాకాంక్షలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విమర్శలతో విరుచుకు పడుతున్నారు. ఒకవైపు పాకిస్తాన్లోని మైనారిటీలైన హిందువులపై దాడులు జరుగుతుండగా, మరోవైపు ఈ రకంగా ఈ శుభాకాంక్షలు చెప్పడమేమిటని ప్రశ్నిస్తున్నారు. పైగా దీపావళి శుభాకాంక్షలు చెప్పేందుకు ప్రధాని షరీఫ్ ‘ఏఐ’ వినియోగించారని ఆరోపిస్తున్నారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన సోషల్ మీడియా ఖాతాలో హిందువులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి దీపావళి ఒక గుర్తు. ఈ పండుగ శాంతి, సామరస్యం, కరుణలను మనలో పెంపొందించి, ఉమ్మడి శ్రేయస్సు వైపు నడిపించాలి’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ప్రధాని షరీఫ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్లో హిందువులు ఎదుర్కొంటున్న హింసను గుర్తు చేస్తూ, ప్రధాని అందించిన ఈ సందేశానికి ఏమైనా అర్థం ఉందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. On the auspicious occasion of Diwali, I extend my heartfelt greetings to our Hindu community in Pakistan and around the world.As homes and hearts are illuminated with the light of Diwali, may this festival dispel darkness, foster harmony, and guide us all toward a future of…— Shehbaz Sharif (@CMShehbaz) October 20, 2025ఒక యూజర్ ‘అసలు పాకిస్తాన్లో హిందువులెవరైనా మిగిలి ఉన్నారా? అని ప్రశ్నించగా, మరొకరు అక్కడి బలవంతపు మతమార్పిడులు, దేవాలయాలపై దాడుల ఘటనలను ప్రస్తావించారు. ‘పహల్గామ్లో హిందువులను హత్య చేశాక ఇలా దీపావళి శుభాకాంక్షలు చెప్పడం సిగ్గుచేటంటూ మరొకరు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక యూజర్ ‘ఇది దౌత్యమా? లేక చాట్ జీపీటీ మీ ఖాతాను హ్యాక్ చేసిందా?’ అని ప్రశ్నించారు. On the auspicious occasion of Diwali, I extend my heartfelt greetings to our Hindu community in Pakistan and around the world.As homes and hearts are illuminated with the light of Diwali, may this festival dispel darkness, foster harmony, and guide us all toward a future of…— Shehbaz Sharif (@CMShehbaz) October 20, 2025 -
నటి అనసూయ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా డబ్లిన్లో ఘనంగా దీపావళి వేడుకలు
-
ఆపరేషన్ సిందూర్కు ఆయనే స్ఫూర్తి.. ప్రధాని మోదీ లేఖ
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్కు రాముడే స్ఫూర్తి అంటూ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. దీపావళి సందర్భంగా ఆయన లేఖ రాస్తూ.. ఈ ఆపరేషన్లో భారత్ తన ధర్మాన్ని నిలబెట్టుకొంటూనే.. ఉగ్రవాదంపై ప్రతీకారం కూడా తీర్చుకొందన్నారు. అయోధ్యలో శ్రీరాముని ఆలయం నిర్మాణం తర్వాత ఇది రెండో దీపావళి. శ్రీరాముడు ధర్మాన్ని నిలబెట్టాలని మనకు బోధిస్తారు, అదే సమయంలో అన్యాయంపై పోరాడే ధైర్యాన్ని కూడా ఇస్తారు. దీనికి సజీవ ఉదాహరణను మనం కొన్ని నెలల క్రితం ఆపరేషన్ సింధూర్ సమయంలో చూశాం’’ అంటూ ప్రధాని లేఖలో పేర్కొన్నారు.‘‘ఈ దీపావళి ప్రత్యేకమైంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా, మారుమూల ప్రాంతాలతో సహా దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో దీపాలు వెలిగించబడ్డాయి. ఈ జిల్లాల నుంచి మావోయిస్టులను నిర్మూలించాం. ఇటీవల కాలంలో మావోయిస్టులు హింస మార్గాన్ని విడిచిపెట్టి.. మన దేశ రాజ్యాంగంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ జనజీవన స్రవంతిలోకి చేరడాన్ని మనం చూశాము. ఇది దేశానికి ఒక పెద్ద విజయం...ప్రపంచ సంఘర్షణలు ఉన్నప్పటికీ, దేశం స్థిరత్వం, సున్నితత్వం రెండింటికీ చిహ్నంగా ఉద్భవించింది. సమీప భవిష్యత్తులో మనం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా అవతరించబోతున్నాం’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
‘త్వరలో రాహుల్ పెళ్లి.. స్వీట్స్కు ఆర్డర్’?.. సంబరంగా చెప్పిన దుకాణదారు
న్యూఢ్లిలీ: దేశమంతటా దీపావళి వేడుకలు ఎంతో ఆనందంగా జరిగాయి. ఈ సందర్భంగా చాలామంది పరస్పరం స్వీట్లను పంచుకుని అభినందనలు తెలియజేసుకున్నారు. ఈ నేపధ్యంలో ఒక ఆసక్తికర ఉదంతం వెలుగు చూసింది. దీపావళి వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముందుకు మరోమారు పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఒక మిఠాయి దుకాణం యజమాని ఆ వివరాలు వెల్లడించారు.దీపావళి వేళ ఓల్డ్ ఢిల్లీలోని ప్రముఖ ఘంటేవాలా స్వీట్స్ దుకాణానికి మిఠాయిలు కొనుగోలు చేసేందుకు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వచ్చారు. ఈ సందర్భంగా రాహుల్తో జరిగిన సంభాషణను యజమాని సుశాంత్ జైన్ మీడియాకు తెలిపారు. ముందుగా ఆయన రాహుల్ గాంధీని భారతదేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా అభివర్ణించారు. ఆయన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, తనకు అతని వివాహ స్వీట్ల ఆర్డర్ అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ దుకాణానికి ఎన్నో ఏళ్లుగా గాంధీ కుటుంబంతో అనుబంధం ఉందని, వారికి స్వీట్లు కావాల్సినప్పుడు తామే అందిస్తామని తెలిపారు. पुरानी दिल्ली की मशहूर और ऐतिहासिक घंटेवाला मिठाइयों की दुकान पर इमरती और बेसन के लड्डू बनाने में हाथ आज़माया।सदियों पुरानी इस प्रतिष्ठित दुकान की मिठास आज भी वही है - ख़ालिस, पारंपरिक और दिल को छू लेने वाली।दीपावली की असली मिठास सिर्फ़ थाली में नहीं, बल्कि रिश्तों और समाज… pic.twitter.com/bVWwa2aetJ— Rahul Gandhi (@RahulGandhi) October 20, 2025రాహుల్ తమ దుకాణానికి రాగానే తాను.. ‘రాహుల్ జీ.. దయచేసి త్వరలోనే పెళ్లి చేసుకోండి. మీ వివాహ స్వీట్ల ఆర్డర్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నామని’ అన్నానని తెలిపారు. రాహుల్ తమ దుకాణంలోకి వచ్చిక అతని తండ్రి, దివంగత ప్రధాని రాజీవ్ను గుర్తుచేసుకుంటూ, అతనికి ‘ఇమారి’ స్వీట్ ఇష్టమని చెప్పారన్నారు. అలాగే ఆయన దానిని తయారు చేసేందుకు ప్రయత్నించారన్నారు. రాహుల్కు బేసన్ లడ్డూ ఇష్టమని తెలుసుకున్న తాను.. అతనితో దానిని కూడా తయారు చేసేందుకు కూడా ప్రయత్నించమని చెప్పానని సుశాంత్ జైన్ తెలిపారు.దుకాణానికి వచ్చిన రాహుల్ అక్కడి సిబ్బంది ఆప్యాయంగా పలుకరించారు. పండుగను ఎలా చేసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. ‘పాత ఢిల్లీలోని చారిత్రక ఘంటేవాలా స్వీట్ దుకాణంలో ఇమార్తి, బేసన్ లడ్డూలు తయారుచేశాను. ఈ షాపులోని శతాబ్దాల నాటి తీపిదనం ఇప్పటికీ మనసుకు హత్తుకునేలా ఉంది. అసలైన దీపావళి గొప్పదనం స్వీట్లలోనే కాదు, సంబంధాలు, సమాజంలో కూడా ఉంటుంది" అని రాహుల్ రాశారు. -
డేటింగ్ వార్తల వేళ.. రాజ్ కుటంబంతో సమంత దీపావళి సెలబ్రేషన్స్
సౌత్ ఇండియా నటి సమంతతో బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru) డేటింగ్లో ఉన్నారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై వారిద్దరూ క్లారిటీ ఇవ్వకపోడం తరుచుగా కలిసి కెమెరా కంటపడుతున్నడంతో నిజమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే, తాజాగా రాజ్ కుటుంబంతో పాటుగా సమంత(Samantha) దీపావళి సెలబ్రేట్ చేసకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్మీడియాలో పంచుకోవడంతో వైరల్ అవుతున్నాయి. ఈ డేటింగ్ రూమర్స్ విషయంలో ఇప్పుడు మరింత ప్రాధాన్యం ఇచ్చేలా సమంత పోస్ట్ చేశారని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 నుంచి రాజ్ నిడిమోరుతో సమంతకు పరిచయం ఉంది. ఈ క్రమంలోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తోంది.ఈ దీపావళి సందర్బంగా పలు ఫోటోలతో పాటు నా హృదయం ఎంతో కృతజ్ఞతతో నిండిపోయిందని సమంత ఒక క్యాప్షన్ ఇచ్చింది. ఆపై ఆమె షేర్ చేసిన ఫోటోలలో రాజ్ తల్లిదండ్రులు ఉన్నారు. కానీ, అతని సతీమణి శ్యామాలి లేదు. దీంతో ఈ రూమర్స్కు మరింత బలాన్ని ఇచ్చేసినట్లు అయింది. శ్యామాలి కూడా రాజ్తో దూరంగా ఉన్నారని సమాచారం. అయితే, సమంత- రాజ్ రిలేషన్ గురించి ఆమె అప్పుడప్పుడు పరోక్షంగా పోస్టులు చేసేవారు. శ్యామాలి చివరిసారి 2023లో రాజ్తో దిగిన ఒక ఫొటోను పంచుకున్నారు. ఆ సమయం తర్వాత వారిద్దరు కలిసి ఎక్కడా కూడా కనిపించలేదు. రాజ్తో ఆమె విడిపోతున్నారంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు కూడా వచ్చాయి. ఆ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఆపై సమంత- రాజ్లు కూడా డేటింగ్ అంశంపై స్పందించలేదు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
‘పట్టపగలు కూడా ఇళ్లలోంచి బయటకు రావొద్దు’
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం (Air Pollution) రెడ్ జోన్ను తాకింది. దీపావళి వేడుకల అనంతరం వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇవాళ ఉదయం (అక్టోబర్ 21, మంగళవారం) 7 గంటల సమయానికి గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 347 పాయింట్లకు పెరిగింది. వెరీ పూర్ కేటగిరిలో గాలి నాణ్యత కొనసాగుతోంది. ఇది చాలా ప్రమాదకరమని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) పేర్కొంది. కాలుష్యం పెరగడంతో ప్రజలు కళ్లు, ముక్కు, గొంతులో మంట, దురద సమస్యలు తలెత్తుతున్నాయి. మాస్క్ ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ఊపిరి ఆడక ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పట్టపగలు కూడా ఇళ్లలోంచి బయటకు రావొద్దని ప్రజలకు అధికారులు సూచించారు. బుధవారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పలు ప్రాంతాల్లో AQI 400 దాటింది. పలు ప్రాంతాలను రెడ్జోన్గా అధికారులు ప్రకటించారు. 38 ఎయిర్ మానిటరింగ్స్టేషన్లలో 36 రెడ్జోన్లోనే ఉన్నాయి. వజీర్పూర్ 423, ద్వారకా 417, అశోక్ విహార్ 404, ఆనంద్ విహార్లో 404గా AQI నమోదైంది.గత ఏడాది దీపావళి మరుసటి రోజు ఉదయం నమోదైన 296 ఏక్యూఐతో పోలిస్తే ఈసారి కాలుష్యం మరింత పెరిగింది. నిన్న సాయంత్రం (సోమవారం) సాయంత్రం 4 గంటలకే ఢిల్లీలో ఏక్యూఐ 345గా 'వెరీ పూర్' కేటగిరీలో నమోదైంది. బాణాసంచా మోతతో రాత్రికి రాత్రే గాలి నాణ్యత మరింత క్షీణించింది.పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది అక్టోబర్ 15న సుప్రీంకోర్టు గ్రీన్ క్రాకర్స్ కాల్చడానికి మాత్రమే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, కోర్టు ఆదేశాలను ప్రజలు పట్టించుకోలేదు. దీంతో కాలుష్య తీవ్రత మరింత పెరిగింది.#WATCH | Visuals from the India Gate as GRAP-2 invoked in Delhi. The Air Quality Index (AQI) around the India Gate was recorded at 342, in the 'Very Poor' category, in Delhi this morning as per the Central Pollution Control Board (CPCB). pic.twitter.com/ITc38aoGgQ— ANI (@ANI) October 21, 2025గత ఆరు రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థితిలో కొనసాగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి కాలుష్యం లేదని.. అదే 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని.. ఇక 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ చెబుతుంది. -
మెగాస్టార్ ఇంట దీపావళి వేడుక.. హాజరైన టాలీవుడ్ ప్రముఖులు
మెగాస్టార్ చిరంజీవీ ఈ దీపావళిని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఏడాది హైదరాబాద్లోని తన నివాసంలో టాలీవుడ్ ప్రముఖులతో జరుపుకున్నారు. ఈ వేడుకల్లో విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగార్జున, నయనతార సైతం పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను చిరంజీవి ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.కాగా.. మెగాస్టార్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే మనశివశంకరవరప్రసాద్గారు మూవీ నుంచి సూపర్ సాంగ్ను రిలీజ్ చేశారు. మీసాల పిల్లా అంటూ సాగే పాటను విడుదల చేయగా..యూట్యూబ్లో దూసుకెళ్తోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. Very delighted to have celebrated the Festival of Lights with my dear friends, @iamnagarjuna, @VenkyMama and my co-star #Nayanthara, along with our families 🤗✨Moments like these fill the heart with joy and remind us of the love, laughter, and togetherness that make life truly… pic.twitter.com/qJHpVkk9og— Chiranjeevi Konidela (@KChiruTweets) October 20, 2025 -
సెలవున్నా స్టాక్ మార్కెట్లు పని చేస్తాయ్!
స్టాక్మార్కెట్ ఇన్వెస్టర్లలో దీపావళి అంటేనే ప్రత్యేక సందడి నెలకొంటుంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 21న లక్ష్మీ పూజ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు మార్కెట్లకు సెలవు. అయినా మధ్యాహ్నం సమయంలో మదుపుదారులు, ట్రేడర్లకు వీలుగా గంటసేపు స్టాక్ ఎక్స్ఛేంజీలు ముహూరత్ ట్రేడింగ్ను నిర్వహిస్తాయని గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో ఇలాంటి ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించే ఏకైక దేశం మనదే. ఈ ముహూరత్ ట్రేడింగ్ రోజును ఇన్వెస్టర్లు, వ్యాపారులు శుభదినంగా భావిస్తారు.ముహూరత్ ట్రేడింగ్ఈ ముహూరత్ ట్రేడింగ్ అనవాయితీ ఏళ్లనాటిదే. 1957లో బీఎస్ఈ ముహూరత్ ట్రేడింగ్ సంప్రదాయాన్ని ప్రారంభించింది. 1992లో ఎన్ఎస్ఈ దీన్ని అందిపుచ్చుకుంది. మార్కెట్ పెట్టుబడిదారులకు అదృష్టాన్ని తెచ్చే విధంగా అన్ని గ్రహాలు, నక్షత్రాలను గమనించి నిర్వహించే శుభ ముహూర్తంగా దీన్ని పరిగణిస్తారు. ఈ సందర్భంగా వ్యాపారులు పెట్టుబడికి అనుకూలమైనదిగా భావిస్తారు. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ సెగ్మెంట్ విభాగాల్లో ట్రేడింగ్ నిర్వహిస్తారు.ఈ ఏడాది క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 21న ఈ ముహూరత్ ట్రేడింగ్ జరుగనుంది. సాధారణంగా దేశంలోని వ్యాపార సంఘాలు కొత్త ఖాతాలను తెరవడంతోపాటు ఈ రోజున మునుపటి బ్యాలెన్స్ షీట్ను క్లోజ్ చేస్తారు. అంటే ఈ రోజును వ్యాపారులు కొత్త వ్యాపార సంవత్సరంగా పరిగణిస్తారు. అలాగే ట్రేడ్ ఎక్స్పర్ట్లు, ఎనలిస్టులు, బ్రోకరేజ్ సంస్థలు పలు స్టాక్స్ను ట్రేడర్లకు రికమెండ్ చేస్తారు. దీపావళి బలిప్రతిపద సందర్భంగా అక్టోబర్ 22న ఎక్స్ఛేంజీలు పనిచేయవు.ఇదీ చదవండి: నా సోదరుడి ఆత్మహత్యకు ఓలా సీఈఓ కారణంముహూరత్ ట్రేడింగ్ సెషన్ సమయాలుఅక్టోబర్ 21 మధ్యాహ్నం 1:45కు మార్కెట్ ఓపెన్ అవుతుంది.మధ్యాహ్నం 2:45కు ముగుస్తుంది.అక్టోబర్ 22న బలిప్రతిపద సందర్భంగా స్టాక్ మార్కెట్ సెలవు. -
దీపావళి పండుగ.. ఆ స్థానమేంటో ఇప్పుడు అర్థమైంది.. అనసూయ పోస్ట్ వైరల్
టాలీవుడ్ నటి అనసూయ దీపావళి వైబ్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. పండుగను సెలబ్రేట్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ఇంట్లో నా సోదరీమణులతో కలిసి ఎంతో ఉత్సాహంగా దీపావళిని జరుకునేదాన్ని అని పోస్ట్ చేసింది. కానీ ఇప్పుడేమే ఒక భార్యగా, తల్లిగా.. నేను అన్నింటినీ చాలా భిన్నంగా చూస్తున్నట్లు అనసూయ తన ఇన్స్టాలో రాసుకొచ్చింది.అనసూయ ఇన్స్టాలో రాస్తూ.. 'నా చిన్నప్పుడు దీపావళి కోసం ఏడాది పొడవునా నా కళ్లు ఎదురు చూసేవి. ఆ రోజుల్లో తెల్లవారుజామునే మంగళారతి.. పాపాజీ ఆశీస్సులు ఇచ్చే ఆ మధురమైన క్షణం.. అలాగే పాకెట్ మనీ.. నేను, నా సోదరీమణులు దాని కోసం ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఎదురు చూసేవాళ్లం. ఇంట్లో తయారుచేసిన స్వీట్ల వాసనతో ఆనందంతో నిండిపోయేది. కొత్త బట్టలు.. రంగురంగుల రంగోలి.. ఇంటిని వెలిగించే దీపాల వరుసలు.. క్రాకర్స్, చిచ్చుబుడ్డీలు, ఉల్లిపాయ బాంబులతో సంతోషంగా జరుపుకునేవాళ్లం. కానీ నేడు.. ఒక భార్యగా, తల్లిగా అన్నింటినీ చాలా భిన్నంగా చూస్తున్నా. అప్పుడు అమ్మ అన్ని చిరునవ్వుల వెనుక కొంచెం ఆందోళన చెందుతున్నట్లు నాకిప్పుడు అర్థమైంది.. ఆమె మా బాల్యంలో కురిపించిన ఆనందం, ప్రేమ, వెలుగు అంతా మేము అస్వాదించామని' పోస్ట్ చేసింది.కానీ ఇప్పుడు నేను అమ్మ స్థానంలో ఉన్న వ్యక్తినని.. అది ఒక అందమైన అనుభవమని గ్రహించానని అనసూయ రాసుకొచ్చింది. ప్రతి ఇంట్లోని మహిళలకు అపారమైన గౌరవం మన పండుగలను జ్ఞాపకాలుగా మార్చిందని వెల్లడించింది. ఈ రోజు.. నేను అలసిపోయినా చాలా సంతృప్తిగా ఉన్నా.. నా చిన్ననాటి దీపావళిని మిస్ అవుతున్నా. కానీ ఏదో ఒక రోజు.. నా పిల్లలు ఈ దీపావళిని తిరిగి చూసుకుని.. నాలాగే అదే రకమైన ఫీలింగ్ను అనుభవిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఈ దీపాల కాంతి అందరి జీవితాల్లో చాలా కాలం పాటు నిలిచి ఉండాలని, ప్రేమ, ఆనందంతో నిండిన మీ అందరికీ, మీ ప్రియమైన వారికి సంతోషకరమైన, ప్రకాశవంతమైన, సురక్షితమైన దీపావళి శుభాకాంక్షలు అంటూ అనసూయ విషెస్ తెలిపింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
విషాదాలకు దూరంగా.. వెలుగులు పంచుదాం!
వెలుగులు విరజిమ్మే దీపావళి కాంతులు ప్రతి ఒక్కరి జీవితాల్లో చీకట్లను పారదోలి సంతోషాలను పంచుతుంది. అయితే అలాంటి దీపావళికి ప్రతి ఒక్కరూ అప్రమత్తతతో వ్యవహరించాలి. మన ఆనందం మరొకరికి బాధ కలిగించొద్దని, వ్యక్తిగత బాధ్యత, శ్రద్ధ, జాగ్రత్తలతో పాటు, పర్యావరణ స్పృహ, సామాజిక బాధ్యతను గుర్తించాలని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా టపాసులు కాల్చే క్రమంలో చుట్టుపక్కల వారికి హాని కలుగకుండా జాగురూకతతో మెలగాలి. భారీ శబ్దాలతో చిన్నపిల్లలు, వృద్ధులు, హార్ట్ పేషెంట్లకు ఇబ్బంది కలుగుతుంది. పశువులు, పెంపుడు జంతువులు, పక్షులకు ఇబ్బంది కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తెరగాలి. వీటితో పాటు టపాసుల నుంచి వచ్చే పొగ, స్పార్క్స్ వల్ల కళ్లకు, ఊపిరితిత్తులకు ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉంది. అగ్ని ప్రమాదాలు సంభవించే ఆస్కారం ఉందని గ్రహించి తదనుగుణంగా వ్యవహరించి సహజమైన, సంప్రదాయ వెలుగులతో పండుగను ఆస్వాదించాలని పర్యావరణ వేత్తలు, నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో మన జీవితాల్లో వెలుగులు పంచే దీపావళి మరొకరి జీవితాల్లో చీకట్లు నింపకుండా జాగురూకతతో వ్యవహరించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. నేడు దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటనున్నాయి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా పండుగల్లోనూ అధునాత పోకడలు సంతరించుకుంటున్నాయి. ఈ దీపావళికి ముఖ్యంగా యువత పర్యావరణ సంరక్షణ, జంతు సంక్షేమం వంటి అంశాలను గౌరవిస్తూ.. నవ సమాజ నిర్మాణానికి నాంది పలుకుతున్నారు. సంబంధిత అధికారులు సైతం పండుగ నియమావళి, సూచనలపై ముందస్తుగానే ప్రచారం చేశారు. పండుగ ఉత్సాహం, సంతోషం బాధ్యతతో కూడిన సమతుల్యాన్ని పాటించాలని నగర పోలీసు శాఖ, పర్యావరణ సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. జంతు సంరక్షణ, పర్యావరణ బాధ్యత.. భారీ శబ్దాల వల్ల జంతువులు భయపడి జనాలపై దాడికి దిగే ప్రమాదం ఉంది. ఒక్కోసారి మనం కాల్చిన టపాసుల కారణంగా అవి గాయపడే ప్రమాదం ఉంది. వీటిని గుర్తించాలి. ముందుగా ఇళ్లలోని పెంపుడు జంతువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలి. దీంతో పాటు వీధుల్లోని జంతువులకు హాని కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తించాలి. మన చుట్టూ ఉండే ప్రదేశాల పట్ల కూడా బాధ్యతతో మెలగాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మనతో పాటు ఇతర పౌరులూ ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. కొద్దిసేపు ఆనందాన్ని ఇచ్చే స్మోక్ క్రాకర్స్ దీర్ఘకాలం పాటు మనకు హాని కలిగిస్తాయని గ్రహించాలి. ప్రభుత్వం సూచించిన గ్రీన్, ఎకో ఫ్రెండ్లీ క్రాకర్లను మాత్రమే వినియోగించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలి. ఇదీ చదవండి: 35 మంది, 3,670 గంటలు : పింక్ బాల్ ఈవెంట్లో మెరిసిన ఇషా అంబానీనిబంధనలు ఇవే.. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు టపాసుల అమ్మకాలు, వినియోగానికి ప్రత్యేక నియమాలు అమలు చేస్తున్నాయి. అనుమతులు లేని చోట టపాసులు నిల్వ చేయడం, అమ్మకం చట్టరీత్యా నేరం. భారీ శబ్దాలు చేసే, అధికంగా పొగను విడుదల చేసే టపాసులకు పరిమితులు పెట్టారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రాత్రి 10 గంటల తర్వాత టపాసులు పేల్చకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అపార్ట్మెంట్లలో, బహిరంగ ప్రదేశాల్లో టపాసులు పేల్చేటప్పుడు ఇతరుల ప్రైవసీ, వృద్ధులు, చిన్నపిల్లలు, రోగులను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నగరంలోని పలు హౌసింగ్ సొసైటీలు, యువజన సంఘాలు ‘గ్రీన్ దీపావళి’ కార్యక్రమాలను చేపట్టాయి. క్రాకర్ ఫ్రీ జోన్లను ఏర్పరచి, పర్యావరణ స్నేహపూర్వక పండుగకు ఆయా కమ్యూనిటీలు ప్రోత్సహిస్తున్నాయి. కేవలం విద్యుత్ కాంతులు, లేదా సంప్రదాయంగా వస్తున్న నూనె దీపాలు, కొవ్వుతులను వినియోగించి పండుగను జరుపుకోవాలని, పిల్లల్లోనూ ఆ దిశగా చైతన్యం తీసుకురావాలని, ఆటపాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగను చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. చదవండి: ఈ తియ్యటి పండుతో షుగర్కి చెక్ : తాజా అధ్యయనంప్రజల్లో కొత్త చైతన్యం.. అగ్నిమాపక సూచనలు.. నగరంలోని అగి్నమాపక శాఖ, వైద్యులు పౌరులకు పలు సూచనలు జారీ చేశారు. టపాసులు వాడేటప్పుడు పిల్లల పక్కన పెద్దవారు తప్పనిసరిగా ఉండాలి. వదులుగా ఉండే దుస్తులు, పొడవైన దుపట్టాలు ధరించడం ప్రమాదకరం. ఇళ్లల్లో దీపాల వద్ద కర్టెన్లు, పేపర్ అలంకరణల విషయంలో జాగ్రత్త పాటించాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్, నీటి బకెట్, ఫైర్ కంట్రోలర్స్ వంటి భద్రతా సామగ్రి ఇళ్లల్లో, గేటెడ్ కమ్యూనిటీల్లో సిద్ధంగా ఉంచుకోవాలి. ఏదైనా ప్రమాదవ శాత్తూ గాయాలైతే తక్షణ వైద్య సహాయం పొందలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పొగతో కళ్లకు ప్రమాదం.. క్రాకర్స్ కాల్చే సమయంలో వచ్చే ప్రమాదకరమైన పొగ వల్ల కళ్లు దెబ్బతినే అవకాశం ఉంది. ఆ పొగ నేరుగా కంటికి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కంటికి వీలైనంత దూరంగా కాల్చాలి. కొన్ని రకాల క్రాకర్స్ నుంచి వెలువడే నిప్పు రవ్వలు కంట్లో పడే ప్రమాదం ఉంటుంది. వీటితో పాటు క్రాకర్స్ నుంచి వెలువడే కాంతి కూడా కంటిలోని నల్లగుడ్డుని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందుకే అదే పనిగా ఆ వెలుగును చూడకుండా ఉంటే మంచిది. ఏవైనా జరిగి కళ్లు మండుతున్నట్లు అనిపిస్తే వెంటనే వాటిని నలపకుండా స్వచ్ఛమైన చల్లటి నీటితో కడుక్కోవాలి. కొద్ది సేపటి తర్వాత కూడా అదే పరిస్థితి ఉంటే వైద్యులను సంప్రదించాలి. కళ్లలో దురద వస్తే వైద్యుల సూచన మేరకు చుక్కల మందు స్వేస్తే సరిపోతుంది. కొందరు ఏడాది పిల్లలతో కూడా క్రాకర్స్ కాలి్పస్తుంటారు.. ఇది ప్రమాదకరమైన చర్యగా గుర్తించాలి. వీలైతే సన్గ్లాస్, సాధారణ కళ్ల జోడు పెట్టుకుంటే మంచిది.– పి.సత్యవాణి, ప్రొఫెసర్, సరోజినీదేవి నేత్రాలయం, మెహిదీపట్నం -
ప్రతీ కుక్కకూ ఓ దీపావళి..దివాలీ శునకపూజ..ఎక్కడంటే..
ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదని, ప్రతీ పనికిరాని అని మనం అనుకునే వ్యక్తికీ కూడా ఒక రోజంటూ వస్తుందని వాడుకగా చెప్పుకుంటాం. అయితే నేపాల్లో నిజంగానే కుక్కలకు అంటూ ఒక రోజు వస్తుంది. కుక్కలకే కాదు కాకులకు కూడా. ఈ వివరాలు తెలియాలంటే దీపావళి సందర్భంగా నేపాల్ లో కనిపించే ఆచార వ్యవహారాలు తెలుసుకోవాలి.యమ పంచక్ లేదా దీపావళి అని కూడా పిలిచే తీహార్ , నేపాల్లో జరుపుకునే అత్యంత ముఖ్యమైన హిందూ పండుగలలో ఒకటి. తరచుగా లైట్ల పండుగ అని కూడా పేర్కొనే తీహార్, ఉత్సాహభరితమైన ఆచారాలు, కుటుంబ బంధాలు ప్రకృతితో సహజీవనపు వేడుకగా గుర్తింపు పొందింది. నేపాల్ అంతటా హిందువులు, బౌద్ధులు కూడా జరుపుకునే పండుగ ఇది. ఐదు రోజుల పాటు దేవతలు, జంతువులు సోదర సోదరీమణుల మధ్య అను బంధాన్ని ఈ పండుగ గౌరవిస్తుంది. హిందూ చాంద్రమాన క్యాలెండర్ (కార్తీక మాసం) ఆధారంగా ఈ ఏడాది అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 23 వరకు తీహార్ వేడుకలు జరుపు కుంటున్నారు. ఈ ఉత్సవం నేపాల్ ఇళ్లు, వీధులను కాంతులతో, సంగీత సంబరాలతో నింపుతుంది. దాదాపుగా మన దగ్గర జరిగే దీపావళి తరహాలోనే ఈ పండుగ కూడా ఉంటుంది. రంగు రంగుల లైట్లు రంగులను ఆస్వాదించడం, లక్ష్మీ దేవిని పూజించడం, రుచికరమైన ఆహారాన్ని తయారు చేయడం వరకూ కాకపోతే.. మానవులు జంతువులు, సోదరులు సోదరీ మణుల మధ్య బలమైన సంబంధాన్ని ప్రదర్శించడం ప్రత్యేకత అని చెప్పాలి.తీహార్ అంటే?కాంతి ప్రేమ ల పండుగ, ఇది జంతువుల ప్రాముఖ్యత, కుటుంబ సంబంధాల విలువలను, దైవిక ఆశీర్వాదాలను నొక్కి చెబుతుంది. ఇది యముడు (మరణ దేవుడు) , లక్ష్మీదేవి (సంపద శ్రేయస్సు నిచ్చే దేవత) లను గౌరవించడానికి ప్రకృతిలో అంతర్భాగంగా ఉన్న జంతువుల పట్ల కృతజ్ఞతను తెలియజేయడానికి జరుపుకుంటారు. చెడుపై మంచి విజయంపై సాధించే మాదిరిగా కాకుండా, తీహార్ పండుగ ఐక్యత, శ్రేయస్సు మానవులు, దేవతల మధ్య అనుబంధాన్ని చూపించేదిగా ఉంటుంది. చదవండి: ఈ తియ్యటి పండుతో షుగర్కి చెక్ : తాజా అధ్యయనంప్రత్యేకం ‘‘కుకర్ తిహార్’’ (Kukur Tihar )ఐదు రోజుల పాటు జరిగే పండుగలో రెండవ రోజు కుకర్ తిహార్ గా జరుపుకుంటారు. ఆ రోజు కుక్కలకు గజ్రాలు (పూల హారం) వేసి అలంకరిస్తారు, తిలకం (కుంకుమ బొట్టు) పెడతారు, ప్రత్యేకమైన ఆహారం ఇస్తారు. ఈ ఆచారం వెనుక భావన ఏమిటంటే హిందూ పురాణాల్లో కుక్కలను యమ« దర్మరాజు దూతలుగా పరిగణిస్తారు. కాబట్టి వాటిని గౌరవిస్తే మనకు రక్షణ లభిస్తుందని నమ్మకం. విశేషం ఏమిటంటే ఆ రోజున వీధి కుక్కలకు సైతం పూజ చేస్తారు మన దేశంలోనూ గోవులకు పూజలు చేసే సంప్రదాయం ఉన్నా ఈ విధంగా కుక్కలకు పూజ చేయడం మాత్రం ఒక్క నేపాల్లో తప్ప మరెక్కడా లేదు.ఐదు రోజులు ఐదు విధాలుగా...–1వ రోజున కాగ్ తిహార్ జరుపుతారు. ఆ రోజున కాకులకు, గద్దలకు పూజ చేస్తారు. అన్నం, తీపి పదార్థాలు ఇస్తారు. వీటిని గౌరవిస్తే చెడు శకునాలు దరిచేరవనీ నమ్మకం.–2వ రోజు కుకర్ తీహార్ పేరుతో కుక్కలకు పూల హారం, తిలకం వేసి పూజ చేస్తారు. వీటిని కూడా యమధర్మరాజు దూతలుగా పరిగణిస్తారు.–3వ రోజు గై తిహార్ పేరుతో ఉదయం వేళలో ఆవులను పూజిస్తారు. ఆవు సంపద, శాంతి, మాతృత్వానికి చిహ్నం గా నమ్ముతారు. అదే రోజునసాయంత్రం ఇళ్లు శుభ్రపరచి దీపాలతో అలంకరించి లక్ష్మీ పూజ చేస్తారు.–4వ రోజున గోవర్ధన్ పూజ / ‘మ్హ ’ పూజ చేస్తారు. ఆ రోజున ఎద్దులను పూలతో, పసుపుతో అలంకరించి పూజిస్తారు.. అంతేకాదు అదే రోజు ‘‘మ్హా పూజ’’ అంటే స్వశరీరాన్ని పూజించి ఆత్మశుద్ధి పొందడం.ఇదీ చదవండి: 35 మంది, 3,670 గంటలు : పింక్ బాల్ ఈవెంట్లో మెరిసిన ఇషా అంబానీ–5వ రోజున భాయ్ తికా పేరుతో అక్కాచెల్లెమ్మలు, అన్నా తమ్ముళ్ల అనుబంధంను వేడుకగా జరుపుకుంటారు.ఆ రోజు అక్కాచెల్లెమ్మలు తమ అన్నల తలపై రంగురంగుల తికా (ఏడు రంగులతో) వేస్తారు. అన్నలు చెల్లెమ్మలకు బహుమతులు ఇస్తారు. ఇది ప్రేమ, రక్షణ, బంధుత్వానికి ప్రతీకగా భావిస్తారు. -
దీపావళి కానుక.. బ్యాంకులు అదిరిపోయే ఆఫర్లు..
బ్యాంకులు తమ వినియోగదారులకు దీపావళి ధమాకా ఆఫర్లను ప్రకటించాయి. అందులో కొత్తగా వస్తువులు కొనుగోలు చేసే వారి నుంచి పర్సనల్ లోన్లు తీసుకునే వారి వరకు బ్యాంకును అనుసరించి చాలా ఆఫర్లు అందిస్తున్నాయి. వీటిలో క్యాష్బ్యాక్ ఆఫర్లు, వడ్డీ రేట్ల తగ్గింపులు కూడా ఉన్నాయి. ఏయే బ్యాంకులు ఎలాంటి ఆఫర్లు ఇస్తున్నాయో తెలుసుకుందాం.హెచ్డీఎఫ్సీ బ్యాంక్దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయిన HDFC బ్యాంక్ కార్డులు, రుణాలు, పేజాప్, ఈజీ ఈఎంఐల్లో 10,000 కంటే ఎక్కువ ఆఫర్లను ప్రకటించింది. 9.99% వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణాలు, 72 నెలల వరకు కాలపరిమితి, జీరో ఫోర్క్లోజర్ ఫీజు (రుణ మొత్తం రూ. 15 లక్షలకు పైన, కస్టమర్ సిబిల్ స్కోర్ 730 కంటే ఎక్కువ ఉంటే)ను ఆఫర్ చేస్తుంది. అక్టోబర్ చివరి వరకు 7.4% నుంచి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లను ప్రకటించింది.ఈ సందర్భంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ & సీఈఓ శశిధర్ జగదీషన్ మాట్లాడుతూ..‘జీఎస్టీ, వడ్డీ రేట్ల తగ్గింపు కారణంగా ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి. రుణ వృద్ధిని వేగవంతం చేయడానికి ఇదే సరైన సమయం’ అన్నారు.ఐసీఐసీఐ బ్యాంక్గృహ రుణాలు: ప్రత్యేక ప్రాసెసింగ్ ఫీజు రూ.5,000.ఆటో రుణాలు: ప్రాసెసింగ్ ఫీజు రూ.999.క్యాష్బ్యాక్ ఆఫర్లు: ఐఫోన్ 17 కొనుగోలుపై రూ.6,000 తక్షణ క్యాష్బ్యాక్.ఎల్జీ, హైయర్, పానాసోనిక్, బ్లూస్టార్, జేబీఎల్ వంటి ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ల వస్తువుల కొనుగోలుపై రూ.50,000 వరకు క్యాష్బ్యాక్, డిస్కౌంట్లు.బ్యాంక్ ఆఫ్ బరోడాగృహ రుణాలు: సున్నా ప్రాసెసింగ్ ఫీజుతో 7.45% నుంచి ప్రత్యేక వడ్డీ రేట్లు.మహిళా రుణగ్రహీతలకు, జన్ జీ(2000 తర్వాత పుట్టినవారు), మిలీనియల్స్ (40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు)కు వడ్డీ రేటులో రాయితీలు ఇస్తోంది.ఇండస్ఇండ్ బ్యాంక్గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు, ఆస్తిపై రుణాలు వంటి రుణ ఉత్పత్తులన్నింటిపై ప్రాసెసింగ్ ఫీజుపై 50% వరకు తగ్గింపు.వ్యక్తిగత రుణాలు: 10.49% నుంచి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లు, రూ.50 లక్షల వరకు రుణ మొత్తాలు, 84 నెలల వరకు కాలపరిమితి ఆఫర్ చేస్తుంది.దీర్ఘకాలిక గృహ రుణాలు: రూ.10 కోట్ల వరకు రుణ మొత్తాలకు రూ.10,000 ఫ్లాట్ ప్రాసెసింగ్ ఫీజుతో పాటు పొడిగించిన కాలపరిమితులు, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్లన్లు ఉంటాయి.ఇదీ చదవండి: ఆన్లైన్ షాపింగ్.. డబ్బు మిగలాలంటే ఇలా చేయాల్సిందే.. -
'దీపావళి' బ్లాస్ట్.. కొత్త సినిమా పోస్టర్లు చూసేయండి (ఫోటోలు)
-
అధ్బుతమైన దీపోత్సవంతో రెండు ప్రపంచ రికార్డులు
ఉత్తరప్రదేశ్లోని పవిత్ర నగరం అయోధ్య ఆదివారం 2025 దీపోత్సవంలో సరికొత్తగారెండు ప్రపంచ రికార్డును సృష్టించింది. 2.6 మిలియన్ల దీపాల ప్రదర్శనతో గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించింది. దీంతో గత ఏడాది అక్టోబర్లో అయోధ్యలో 25.12 లక్షల దీపాలను సాధించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను తిరిగ రాసింది. రెండోది 2,128 మంది పూజారులు , భక్తులు ఒకేసారి మా సరయు ఆరతి ప్రదర్శించడం మరో విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా బాణా సంచా పేలుళ్లతో ఆకాశం మిరుమిట్లు కాంతులతో వెలిగిపోయింది.వేలాది మంది భక్తులు, యాత్రికులు , సందర్శకులు ఈ వేడుకలలో పాల్గొనేందుకు తరలి వచ్చారు. ఇది ఇది భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ సాంస్కృతిక ,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఒకటిగా నిలిచింది. ఉత్తరప్రదేశ్ పర్యాటక , సాంస్కృతిక శాఖ నిర్వహించిన ఈ ప్రత్యేక వేడుకలో లక్షలాది దీపాలు (మట్టి దీపాలు) సరయు నదీ ఒడ్డు దీదీప్య మానంగా వెలిగిపోయింది. భక్తులకు అద్భుతమైన ఆనందాన్ని పంచింది. ఈ సందర్బంగా ఈ ఏడాది 2100 మంది భక్తులు సరయూ నదీ తీరాన దీపాలను వెలిగించి తరించారు. అయోధ్య అభివృద్ధి అథారిటీ ఏర్పాటు చేసిన ఘాట్లలో 26,17,215 దివ్య దీపాలు వెలిగించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. డ్రోన్ల సాయంతో ప్రమిదలను లెక్కించి గిన్నిస్ పుస్తక ప్రతినిధులు ప్రపంచ రికార్డ్ను ధ్రువీకరించారు. ఇది 14 సంవత్సరాల వనవాసం ,రావణుడిపై విజయం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి రావడాన్ని గౌరవంగా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు.2017లో మొదలైన ఈ వేడుక ఇలా సాగింది. యూపీ ముఖ్యమంత్రి యోగి నాయత్వంలో 2025లో తొమ్మిదవ ఎడిషన్ 26.17 లక్షలకు పైగా దీపాలతో రికార్డు సృష్టించింది. 2017లో 1.71 లక్షల దీపాల నుండి 2018లో 3.01 లక్షలు, 2019లో 4.04 లక్షలు, 2020లో 6.06 లక్షలు, 2021లో 9.41 లక్షలు, 2022లో 15.76 లక్షలు, 2023లో 22.23 లక్షలు , 2024లో 25.12 లక్షలకు చేరింది. 2025లో తొమ్మిదవ ఎడిషన్ 26.17 లక్షలకు పైగా దీపాలతో రికార్డు సృష్టించిన సంగతి తె లిసిందే. Ayodhya lit up with 26 lakh diyas this Deepotsav 2025, making two world records! 🪔Diwali celebrates Lord Ram’s return and the victory of light over darkness. ✨Happy Deepawali! 🪔 💫#Diwali #Deepotsav #Ayodhyapic.twitter.com/oaQLbLWsuR— Swapnil Srivastav (@theswapnilsri) October 20, 2025 -
దీపావళి పూట...శివాజీ కోట, పేడ దీపావళి, దివ్య దీపావళి!
భారతీయులందరూ అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి దీపావళి.మన మహర్షులు ఏర్పరచిన పండుగలన్నీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలు కలిగి, ఆచార వ్యవహారాలతో కలిసి ఉంటాయి. ఈ పండుగల వెనుక అపారమైన శాస్త్రీయత, సమాజానికి హితకరమైన అంశాలు అనేకం దాగి ఉంటాయి. ఈనేపథ్యంలో వివిధ ప్రాంతాల్లోజరుపుకునే వేడుకల గురించి తెలుసుకుందాం.దీపావళి పూట...శివాజీ కోట! దీపావళి సీజన్లో మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో శివాజీ పాలించిన కోటకు ప్రతిరూపంగా మట్టికోటలను తయారుచేయడం అనేది ఆచారం. ఈ కోటను నిర్మించే క్రమంలో బురదలో విత్తనాలు నాటుతారు. కోట చుట్టూ పచ్చదనం ఉండేలా చేస్తారు. రాత్రివేళల్లో ఈ మట్టి కోటపై చిన్న చిన్న దీపాను వెలిగిస్తారు.జార్ఖండ్లో దీపావవళి పండగ సందర్భంగా సోహ్రై వేడుకను జరుపుకుంటారు.ఈ వేడుకలో భాగంగా దేవతలను స్వాగతించడానికి ఘరోండాలు(మట్టి బొమ్మల ఇళ్ళు) తయారు చేస్తారు. లక్ష్మీదేవిని స్వాగతించడానికి అగరువత్తులు కాల్చుతారు. సోహ్రై వేడుకలలో పశువులకు స్నానం చేయించి పూజలు చేస్తారు.పేడ పూసుకునివేడుక చేసుకుంటారు: కర్నాటక, తమిళనాడు సరిహద్దులలోని గుమతాపుర గ్రామంలో దీపావళి ముగింపును పురస్కరించుకొని ‘గోరెహబ్బ’ వేడుక జరుపుకుంటారు. ఈ వేడుకలో భాగంగా మగవాళ్లు ఆవు పేడను ఒకరిపై ఒకరు విసురుకుంటారు. ఆడవాళ్లు ఒంటికి రాసుకుంటారు. ఆవుపేడలో ఔషధగుణాలు ఉన్నాయనే నమ్మకంతో ఏర్పడిన శతాబ్దాల నాటి సంప్రదాయం ఇది.దీపావళి తరువాత పదిహేను రోజులకు వారణాసిలో దేవ దీపావళిని జరుపుకుంటారు. కార్తిక పూర్ణిమ రాత్రి గంగానది వెంబడి ఉన్న ఘాట్లు లక్షలాది దీపాలతో వెలుగుతాయి. ఆ వెలుగులప్రతిబింబాలు నదిలో అందమైన చిత్రాలను ఆవిష్కరిస్తాయి. గంగానదిలో స్నానం చేయడానికి దేవతలు భూమి మీదికి దిగి వచ్చిన రోజుగా ఈ రోజును జరుపుకుంటారు.ఈ సారి రికార్డ్ బ్రేక్ : గత సంవత్సరం అక్టోబర్లో అయోధ్యలో 25.12 లక్షల దీపాలను వెలిగించి ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను సెట్ చేసింది. తాజాగా...28 లక్షల దీపాలను వెలిగించి తన రికార్డ్ను తానే బ్రేక్ చేయాలనుకుంటోంది. -
పసిడి ప్రియులకు ‘పండుగ’.. మళ్లీ తగ్గిన బంగారం
గత కొన్ని రోజులుగా ఆగకుండా దూసుకెళ్తున్న పసిడి ధరలు (Gold Price) ఎట్టకేలకు దిగివచ్చాయి. ధనత్రయోదశి (Dhanteras) రోజున కొనుగోలుదారులకు భారీ ఉపశమనాన్ని కలిగించిన బంగారం ధరలు దీపావళి (Diwali) రోజున కూడా ఊరట కలిగించాయి. వెండి ధరలు (Silver Price) కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయి.. దేశంలోని వివిధ నగరాల్లో ప్రస్తుతం వాటి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఆ ఊళ్లే దీపావళి
గార, టెక్కలి: శ్రీకాకుళం జిల్లాలో దీపావళి పేరిట రెండు గ్రామాలు ఉన్నాయి. గార మండలంలోని ఓ గ్రామం ఉంటే.. టెక్కలి మండలంలో మరో గ్రామం ఉంది. గార మండలంలోని దీపావళి గ్రామానికి ఆ పేరు రావడానికి ఓ కథ ప్రచారంలో ఉంది. దాని ప్రకారం.. ఓ కళింగ రాజు ఇటుగా వస్తూ ఈ గ్రామానికి దీపావళి అనే పేరు పెట్టారు. అప్పటి వరకు ఈ ప్రాంతాన్ని గూడెం అని పిలిచేవారట. ఆ రాజు ప్రతి రోజూ శ్రీకాకుళం నుంచి శ్రీకూర్మం వరకు గుర్రంపై వెళ్లేవారట. మార్గం మధ్యలో లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వద్ద ఆగి స్వామిని దర్శించుకునేవారు. ఒక రోజు శ్రీకూర్మం వెళ్లి వస్తూ ఇక్కడ సొమ్మసిల్లి పడిపోయారు. ఇక్కడి వారు ఆయనకు సాయం చేయగా కోలుకున్నారు. ఊరి వారిని గ్రామం పేరు అడగ్గా పేరేమీ లేదని చెప్పారు. ఆ రోజు దీపావళి కావడంతో ఆ ఊరికి దీపావళి అనే పేరును పెట్టారు. రెవెన్యూ రికార్డుల్లోనూ ఈ పేరే ఉంది. టెక్కలి మండలం అయోధ్యపురం పంచాయతీ పరిధిలో ‘దీపావళి’ గ్రామం ఒకటి. టెక్కలి నుంచి బన్నువాడ గ్రామం మీదుగా సుమారు 7 కిలోమీటర్ల దూరంలో మారుమూల ప్రాంతంలో ఈ దీపావళి గ్రామం ఉంది. పండగ పేరుతో ఉన్న ఈ గ్రామంలో మొత్తం 50 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. దీపావళి పేరుతో గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. -
దీపావళి కోణంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడులు..
దీపావళి పండగకి సంబంధించి తినుబండారాల కోణంలో మార్కెట్లను అభివర్ణించాల్సి వస్తే .. జిలేబీగా అభివర్ణించవచ్చు. అవును, మార్కెట్లు కూడా జిలేబీలాగే మెరిసిపోతూ, వంకర్లు తిరుగుతూ, అనూహ్యమైన విధంగా ఉంటాయి. వీటిని అర్థం చేసుకోవాలంటే బోలెడంత సహనం ఉండాల్సిందే.జిలేబీ ఆకారంలాగే ఈ ఏడాదంతా అంతర్జాతీయంగా ఒడిదుడుకులు, వడ్డీ రేట్ల అంచనాల్లో మార్పులు, భౌగోళికరాజకీయపరంగా ఆశ్చర్యపర్చే పరిణామాలు, సోషల్ మీడియా ప్లాట్ఫాంలలో రణగొణ ధ్వనులతో గడిచింది. అయినప్పటికీ ప్రశాంతంగా, పెట్టుబడులను కొనసాగించిన ఇన్వెస్టర్లకు చాలా తియ్యని అనుభవాలే ఎదురయ్యాయి. స్పెక్యులేషన్కి పోకుండా క్రమశిక్షణతో ఉంటూ, ఓర్పు వహించినందుకు బహుమతిగా చిన్న చిన్న విజయాలు, నేర్చుకునే అవకాశాలు లభించాయి.ఈ ఏడాది బంగారం, వెండి టపాసుల్లాగా పేలాయి. సంప్రదాయ సిద్ధంగా సురక్షిత పెట్టుబడి సాధనంగా పసిడి తన పాత్రను చక్కగా పోషించింది. అనిశ్చితి నెలకొన్న తరుణంలో స్థిరత్వాన్ని అందించింది. ఒక్కసారిగా ఎగిసిన వెండి దీనికి మరింత హంగులు దిద్దింది. పాతతరం వివేకం, కొత్త తర పు ఉత్సాహం రెండూ కూడా కలిసి మెరిసేందుకు అవకాశం ఉందని ఇవి తెలియజేశాయి. అవకాశం, భద్రత మధ్య సమతుల్యతను పాటించడమే పోర్ట్ఫోలియో పటిష్టతకు కీలకమని తెలియజేశాయి. ఒకవేళ దీపావళి బహుమతులను తనదైన ప్రత్యేకత ఉన్న అసెట్ క్లాస్గా వరి్ణంచాల్సి వస్తే బంగారాన్ని వారసత్వ నెక్లెస్గా అభివరి్ణంచవచ్చు. కాలాతీతమైనదై, భావోద్వేగాలతో కూడుకున్నదై, తరతరాలుగా తన విలువను కాపాడుకుంటూ వస్తోంది పసిడి. ఇక బాండ్లను డ్రై ఫ్రూట్ బాక్సుగా అభివర్ణించవచ్చు. ఆకట్టుకునే మెరుపులు ఉండకపోయినా, ఇవి నమ్మకమైనవిగా, నిశ్శబ్దంగా అండగా నిలుస్తాయి.ఈక్విటీల విషయానికొస్తే.. ఇంట్లో తయారు చేసిన స్వీట్లలాంటి. చాలా ఓపిగ్గా, నమ్మకంతో, ఆశాభావంతో ఇవి తయారవుతాయి. అప్పుడప్పుడు గందరగోళంగా అనిపించినా ఆ తర్వాత చాలా సంతృప్తిని కలిగిస్తాయి. మరి క్రిప్టో విషయమేంటి? ఇవి పక్కింటివాళ్ల డ్రోన్ షో లాంటివి. చాలా ఆర్భాటంగా, పట్టించుకోకుండా ఉండలేని విధంగా ఉంటాయి. కానీ వీటిని కాస్త సురక్షితమైన దూరం నుంచే ఆస్వాదించడం మేలు. సంక్షోభ సమయాల్లోనే పసిడి రాణిస్తుందనే అపోహ ఒకటుంది. ఈ పండుగ సీజన్లో దాన్నుంచి బైటపడాలి. వాస్తవానికి బంగారమంటే, మార్కెట్లు బాగా లేనప్పుడు నీడనిచ్చే సాధనం మాత్రమే కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోర్ట్ఫోలియోకు స్థిరత్వాన్నికూడా అందిస్తుంది. పర్ఫెక్ట్ దీపావళి పోర్ట్ఫోలియో ఎలా ఉంటుందంటే.. సమతూకంగా గల మల్టీ–అసెట్ థాలీలాగా ఉంటుంది. వృద్ధి కోసం ఈక్విటీలు .. స్థిరత్వం కోసం పసిడి .. క్రమశిక్షణ కోసం బాండ్లు .. ఇక సమర్ధత, డైవర్సిఫికేషన్, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ కోసం మ్యుచువల్ ఫండ్లో చక్కగా చుట్ట చుట్టినట్లుగా ఉంటుంది. సాధారణంగా పండుగల సందర్భంలో మార్కెట్ సెంటిమెంటు ఉత్సాహంగా ఉంటుంది. కానీ, ఊదరగొట్టే అన్లిస్టెడ్ ఐడియాలు, సైక్లికల్ థీమ్లు ఇక ముగింపు దశకొస్తున్నాయనే వార్తలు, ‘దీపావళి టిప్’ స్టాక్లు మొదలైన వాటి విషయంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్లు ఉత్సాహభరిత వాతావరణాన్ని ప్రతిబింబించవచ్చు కానీ అంతిమంగా మాత్రం ఎమోషన్లను కాకుండా ఆదాయాలనే ఫాలో అవుతాయి. వచ్చే దశాబ్దకాలం కోసం పోర్ట్ఫోలియోను రూపొందించుకోవడమే ఈ దీపావళికి మీకు మీరు ఇచ్చుకునే అత్యుత్తమ బహుమతి అవుతుంది. ఎందుకంటే సిసలైన సంపద కూడా, అందమైన రంగవల్లిలాంటిదే. ఓ లక్ష్యం పెట్టుకుని, ఎంతో ఓపిగ్గా, సమతూకాన్ని పాటిస్తూ డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నాళ్లకి దీపం కొండెక్కినా, ఈ సుగుణాలే దీర్ఘకాలం పాటు నిలిచి ఉంటాయి. -
శుభాకాంక్షల మాటున సైబర్ మోసాలు
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షల సందేశాలు పంపుకోవడం అత్యంత సాధారణం. ఇటీవల వాట్సాప్లో ఇలాంటి సందేశాలు ట్రెండీగా మారాయి. తమ బంధువులు, స్నేహితులకు వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పాలన్న తొందరలో కొందరు సైబర్ భద్రతా మరుస్తున్నారు. పండుగ శుభాకాంక్షల పేరిట సైబర్ నేరగాళ్లు ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్) ఫైల్స్ పంపుతున్నట్టు సైబర్ భద్రత నిపుణులు హెచ్చరి స్తున్నారు. దీపావళి ఆఫర్లు, గిఫ్ట్ కూపన్లతోపాటు ఇప్పుడు శుభాకాంక్షలకు సంబంధించిన మోసపూ రిత లింక్లు పంపుతున్నట్టుగా వారు చెపుతున్నారు.ఏదైనా కంపెనీ తరఫున మీకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టుగా పంపే ఈ లింక్లలో ‘మీ పేరు, ఫొటోతో మీకు తెలిసిన వారికి శుభాకాంక్షలు వినూత్నంగా చెప్పండి’అనే సందేశాన్ని జోడిస్తున్న ట్టు తెలిపారు. ఇలాంటి లింక్లపై క్లిక్ చేయగానే మన మొబైల్ ఫోన్ సైబర్ నేరగాళ్ల అధీనంలోకి వెళ్లడంతోపాటు వారు మన ఫోన్లో మాల్వేర్ యాప్లు ఇన్స్టాల్ చేసి ఆన్లైన్ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొల్లగొట్టే ప్రమాదం ఉందని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్బీ) సమాచా రం ప్రకారం అక్టోబర్ 1 నుంచి ఈనెల 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 390 మంది బాధితులు ఈ తరహా నకిలీ లింక్లపై క్లిక్ చేయడం ద్వారా రూ.8.5 లక్షలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో తెలియనివారి వాట్సాప్ నంబర్ల నుంచి వచ్చే సందేశాల్లోని లింకులపై క్లిక్ చేయవద్దని, ఏపీకే ఫైళ్లను డౌన్లోడ్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. -
'వెలుగులు' పంచుదాం..
వెలుగులు విరజిమ్మే దీపావళి కాంతులు ప్రతి ఒక్కరి జీవితాల్లో చీకట్లను పారదోలి సంతోషాలను పంచుతుంది. అయితే అలాంటి దీపావళికి ప్రతి ఒక్కరూ అప్రమత్తతతో వ్యవహరించాలి. మన ఆనందం మరొకరికి బాధ కలిగించొద్దని, వ్యక్తిగత బాధ్యత, శ్రద్ధ, జాగ్రత్తలతో పాటు, పర్యావరణ స్పృహ, సామాజిక బాధ్యతను గుర్తించాలని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా టపాసులు కాల్చే క్రమంలో చుట్టుపక్కల వారికి హాని కలుగకుండా జాగురూకతతో మెలగాలి. భారీ శబ్దాలతో చిన్నపిల్లలు, వృద్ధులు, హార్ట్ పేషెంట్లకు ఇబ్బంది కలుగుతుంది. పశువులు, పెంపుడు జంతువులు, పక్షులకు ఇబ్బంది కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తెరగాలి. వీటితో పాటు టపాసుల నుంచి వచ్చే పొగ, స్పార్క్స్ వల్ల కళ్లకు, ఊపిరితిత్తులకు ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉంది. అగ్ని ప్రమాదాలు సంభవించే ఆస్కారం ఉందని గ్రహించి తదనుగుణంగా వ్యవహరించి సహజమైన, సంప్రదాయ వెలుగులతో పండుగను ఆస్వాదించాలని పర్యావరణ వేత్తలు, నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో మన జీవితాల్లో వెలుగులు పంచే దీపావళి మరొకరి జీవితాల్లో చీకట్లు నింపకుండా జాగురూకతతో వ్యవహరించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. నేడు దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటనున్నాయి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా పండుగల్లోనూ అధునాత పోకడలు సంతరించుకుంటున్నాయి. ఈ దీపావళికి ముఖ్యంగా యువత పర్యావరణ సంరక్షణ, జంతు సంక్షేమం వంటి అంశాలను గౌరవిస్తూ.. నవ సమాజ నిర్మాణానికి నాంది పలుకుతున్నారు. సంబంధిత అధికారులు సైతం పండుగ నియమావళి, సూచనలపై ముందస్తుగానే ప్రచారం చేశారు. పండుగ ఉత్సాహం, సంతోషం బాధ్యతతో కూడిన సమతుల్యాన్ని పాటించాలని నగర పోలీసు శాఖ, పర్యావరణ సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. జంతు సంరక్షణ, పర్యావరణ బాధ్యత.. భారీ శబ్దాల వల్ల జంతువులు భయపడి జనాలపై దాడికి దిగే ప్రమాదం ఉంది. ఒక్కోసారి మనం కాలి్చన టపాసుల కారణంగా అవి గాయపడే ప్రమాదం ఉంది. వీటిని గుర్తించాలి. ముందుగా ఇళ్లలోని పెంపుడు జంతువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలి. దీంతో పాటు వీధుల్లోని జంతువులకు హాని కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తించాలి. మన చుట్టూ ఉండే ప్రదేశాల పట్ల కూడా బాధ్యతతో మెలగాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మనతో పాటు ఇతర పౌరులూ ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. కొద్దిసేపు ఆనందాన్ని ఇచ్చే స్మోక్ క్రాకర్స్ దీర్ఘకాలం పాటు మనకు హాని కలిగిస్తాయని గ్రహించాలి. ప్రభుత్వం సూచించిన గ్రీన్, ఎకో ఫ్రెండ్లీ క్రాకర్లను మాత్రమే వినియోగించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలి. ప్రజల్లో కొత్త చైతన్యం.. నగరంలోని పలు హౌసింగ్ సొసైటీలు, యువజన సంఘాలు ‘గ్రీన్ దీపావళి’ కార్యక్రమాలను చేపట్టాయి. క్రాకర్ ఫ్రీ జోన్లను ఏర్పరచి, పర్యావరణ స్నేహపూర్వక పండుగకు ఆయా కమ్యూనిటీలు ప్రోత్సహిస్తున్నాయి. కేవలం విద్యుత్ కాంతులు, లేదా సంప్రదాయంగా వస్తున్న నూనె దీపాలు, కొవ్వుతులను వినియోగించి పండుగను జరుపుకోవాలని, పిల్లల్లోనూ ఆ దిశగా చైతన్యం తీసుకురావాలని, ఆటపాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగను చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. నిబంధనలు ఇవే.. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు టపాసుల అమ్మకాలు, వినియోగానికి ప్రత్యేక నియమాలు అమలు చేస్తున్నాయి. అనుమతులు లేని చోట టపాసులు నిల్వ చేయడం, అమ్మకం చట్టరీత్యా నేరం. భారీ శబ్దాలు చేసే, అధికంగా పొగను విడుదల చేసే టపాసులకు పరిమితులు పెట్టారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రాత్రి 10 గంటల తర్వాత టపాసులు పేల్చకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అపార్ట్మెంట్లలో, బహిరంగ ప్రదేశాల్లో టపాసులు పేల్చేటప్పుడు ఇతరుల ప్రైవసీ, వృద్ధులు, చిన్నపిల్లలు, రోగులను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అగ్నిమాపక సూచనలు..నగరంలోని అగ్నిమాపక శాఖ, వైద్యులు పౌరులకు పలు సూచనలు జారీ చేశారు. టపాసులు వాడేటప్పుడు పిల్లల పక్కన పెద్దవారు తప్పనిసరిగా ఉండాలి. వదులుగా ఉండే దుస్తులు, పొడవైన దుపట్టాలు ధరించడం ప్రమాదకరం. ఇళ్లల్లో దీపాల వద్ద కర్టెన్లు, పేపర్ అలంకరణల విషయంలో జాగ్రత్త పాటించాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్, నీటి బకెట్, ఫైర్ కంట్రోలర్స్ వంటి భద్రతా సామగ్రి ఇళ్లల్లో, గేటెడ్ కమ్యూనిటీల్లో సిద్ధంగా ఉంచుకోవాలి. ఏదైనా ప్రమాదవ శాత్తూ గాయాలైతే తక్షణ వైద్య సహాయం పొందలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పొగతో కళ్లకు ప్రమాదం.. క్రాకర్స్ కాల్చే సమయంలో వచ్చే ప్రమాదకరమైన పొగ వల్ల కళ్లు దెబ్బతినే అవకాశం ఉంది. ఆ పొగ నేరుగా కంటికి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కంటికి వీలైనంత దూరంగా కాల్చాలి. కొన్ని రకాల క్రాకర్స్ నుంచి వెలువడే నిప్పు రవ్వలు కంట్లో పడే ప్రమాదం ఉంటుంది. వీటితో పాటు క్రాకర్స్ నుంచి వెలువడే కాంతి కూడా కంటిలోని నల్లగుడ్డుని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందుకే అదే పనిగా ఆ వెలుగును చూడకుండా ఉంటే మంచిది.ఏవైనా జరిగి కళ్లు మండుతున్నట్లు అనిపిస్తే వెంటనే వాటిని నలపకుండా స్వచ్ఛమైన చల్లటి నీటితో కడుక్కోవాలి. కొద్ది సేపటి తర్వాత కూడా అదే పరిస్థితి ఉంటే వైద్యులను సంప్రదించాలి. కళ్లలో దురద వస్తే వైద్యుల సూచన మేరకు చుక్కల మందు స్వేస్తే సరిపోతుంది. కొందరు ఏడాది పిల్లలతో కూడా క్రాకర్స్ కాల్పిస్తుంటారు.. ఇది ప్రమాదకరమైన చర్యగా గుర్తించాలి. వీలైతే సన్గ్లాస్, సాధారణ కళ్ల జోడు పెట్టుకుంటే మంచిది. – పి.సత్యవాణి, ప్రొఫెసర్, సరోజినీదేవి నేత్రాలయం, మెహిదీపట్నం -
పోస్టల్ ఉద్యోగులకు బిగ్ న్యూస్.. దీపావళి కానుక ప్రకటన
దీపావళికి ముందు కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఆనందకరమైన బహుమతిని ప్రకటించింది. కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉత్పాదకత-లింక్డ్ బోనస్ను ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పోస్టల్ ఉద్యోగులకు 60 రోజుల వేతనానికి సమానమైన బోనస్ లభిస్తుంది.ఈ బోనస్ను పొందే ఉద్యోగుల వర్గాలుపోస్టల్ శాఖ ఉత్తర్వుల ప్రకారం.. ఈ బోనస్ పొందడానికి ఈ కింది వర్గాల ఉద్యోగులు అర్హులురెగ్యులర్ ఉద్యోగులు - గ్రూప్ సి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్), నాన్ గెజిటెడ్ గ్రూప్ బి ఉద్యోగులు.గ్రామీణ డాక్ సేవకులు - రెగ్యులర్ సర్వీస్లో ఉన్నవారుతాత్కాలిక, ఫుల్టైమ్ క్యాజువల్ ఉద్యోగులుఅదనంగా, 2025 మార్చి 31 తర్వాత పదవీ విరమణ చేసిన, రాజీనామా చేసిన లేదా డిప్యుటేషన్కు వెళ్లిన ఉద్యోగులు కూడా ఈ బోనస్ కు అర్హులు.బోనస్ లెక్కింపు విధానంబోనస్ లెక్కించడానికి పోస్టల్ శాఖ స్పష్టమైన ఫార్ములాను కూడా అందించింది. రెగ్యులర్ ఉద్యోగులకు బోనస్ = (సగటు వేతనం × 60 రోజులు ÷ 30.4). అయితే, బోనస్ లెక్కించడానికి గరిష్ట జీతం పరిమితిని నెలకు రూ .7,000 గా నిర్ణయించారు.గ్రామీణ డాక్ సేవకులకు (జీడీఎస్)కు వారి టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ (టీఆర్సీఏ), డియర్ నెస్ అలవెన్స్ ఆధారంగా బోనస్ నిర్ణయిస్తారు.తాత్కాలిక లేదా ఫుల్ టైమ్ క్యాజువల్ వర్కర్లకు వారి అంచనా వేతనం రూ.1,200 ఆధారంగా వారికి అడ్హాక్ బోనస్ ఇస్తారు.సర్వీసు విడిచిపెట్టిన అంటే 2025 మార్చి 31 తర్వాత పదవీ విరమణ చేసిన, రాజీనామా చేసిన లేదా బదిలీ అయిన ఉద్యోగులకు కూడా ప్రో-రేటా ప్రాతిపదికన బోనస్ లభిస్తుందని ఉత్తర్వులో పోస్టల్ శాఖ పేర్కొంది. -
అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. కానీ ఓ చిన్న రిక్వెస్ట్: రేణు దేశాయ్
హీరోయిన్ రేణు దేశాయ్ తన అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సమయంలో అందరూ పండుగను సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆకాంక్షించింది. అదే సమయంలో ప్రజలకు ఓ చిన్న విజ్ఞప్తి చేసింది. దయచేసి రాత్రి 9 గంటల తర్వాత ఎక్కువ శబ్దం వచ్చే క్రాకర్స్ను పేల్చవద్దని కోరింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.రేణు దేశాయ్ తన ఇన్స్టాలో రాస్తూ..' మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇది అందరూ సంతోషంగా పండుగ జరుపుకునే సమయమని నాకు కూడా తెలుసు. కానీ రాత్రి 9 గంటల తర్వాత చాలా ఎక్కువుగా శబ్ధం వచ్చే క్రాకర్లు పేల్చకండి. ఎందుకంటే చాలా మంది వృద్ధులు, చిన్న పిల్లలు నిజంగా ఆ విపరీతమైన శబ్దాలకు ప్రభావితమవుతారు. ఈ సమయంలో మీరు చాలా మెరుపులు, పూల కుండలు, చక్రాలతో ఆనందించండి. ఎక్కువ శబ్దం చేయకుండా కేవలం లైటింగ్తో పండుగను మరింత ఆనందంగా జరుపుకోండి' అంటూ విజ్ఞప్తి చేసింది.కాగా.. రేణు దేశాయ్, పవన్ కల్యాణ్ బద్రి, జానీ చిత్రాల్లో జంటగా నటించారు. 2009లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఈ జంటకు అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే ఇద్దరి మధ్య రిలేషన్లో మనస్పర్థలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. ఆమె చివరిసారిగా రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో కనిపించింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: దీపావళిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారాయన.‘ప్రతి ఇంటా దీపాలు వెలగాలి. ఆనందాలు వెల్లువలా పొంగాలి’.వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని కోరుకుంటున్నాను. దీపావళి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు. దీపావళి అంటేనే కాంతి, వెలుగుతో పాటు, చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్టశక్తులపై దైవశక్తి .. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ. ఈ దీపావళి పండుగ, ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలి. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగులలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో విరాజిల్లాలని కోరుకుంటున్నా. చీకటిని జయించిన వెలుగుల పండుగ దీపావళి. అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు అని ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. చీకటిని జయించిన వెలుగుల పండుగ దీపావళి. అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు.#Deepavali— YS Jagan Mohan Reddy (@ysjagan) October 20, 2025 -
దివాళీ పటాకాలా వెలిగిపోతున్న హీరోయిన్ మన్నారా చోప్రా లుక్.. ఫోటోలు
-
పిల్లలతో కలిసి సమంత దీపావళి సెలెబ్రేషన్స్ (ఫోటోలు)
-
రావణుడు... మా ఊరి అల్లుడు!
దీపావళి అంటేనే సంబరాలు అంబరాన్ని అంటుతాయి. అయితే రాజస్థాన్లోని జోద్పూర్కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మండోల్లో దీపావళి రోజు దీపాలు వెలిగించడం, బాణసంచ కాల్చడం ఉండదు. నిశ్శబ్దాన్ని పాటిస్తారు. కారణం ఏమిటి? అనే విషయానికి వస్తే స్థానిక పురాణం తెలుసుకోవాల్సిందే. దీని ప్రకారం... రావణుడి భార్య మండోదరి జన్మస్థలం మండేరే. రావణుడు మండోదరిని ఈ గ్రామంలోనే వివాహం చేసుకున్నాడని నమ్ముతారు. మండేరేకి చెందిన మౌద్గిల్ బ్రాహ్మణులు తమను తాము మండోదరి కుటుంబ వారసులుగా భావిస్తారు. అందువల్ల వారు రావణుడిని రాక్షస రాజుగా కాకుండా గౌరవనీయమైన బంధువుగా చూస్తారు! (చదవండి: మధుమేహ వ్యాధిగ్రస్తులకు దీపావళి ‘స్వీట్’ వార్నింగ్..!) -
‘దీపోత్సవ్’కు అయోధ్య ముస్తాబు.. ఈసారి ప్రత్యేకతలివే..
అయోధ్య: శ్రీ రాముని జన్మస్థలమైన అయోధ్య నేడు (ఆదివారం) జరిగే ‘దీపోత్సవ్’కు ముస్తాబయ్యింది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఈ వేడుక ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘దీపోత్సవం-2025’కు అందరినీ ఆహ్వానించింది.2017లో ఆదిత్యనాథ్ నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అయోధ్యలో దీపోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది తొమ్మిదవ దీపోత్సవానికి విస్తృత సన్నాహాలు చేశారు. ధరంపత్ నుండి లతా చౌక్, రామ్కథా పార్క్, సరయు ఘాట్ వరకు అంతటా వెలుగులు విరజిమ్మనున్నాయని ఒక అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో 33 వేల మంది వాలంటీర్లు పాల్గొననున్నారు. 26 లక్షల11 వేల 101 దీపాలను వెలిగించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించనున్నారు.దీపోత్సవ్ నోడల్ అధికారి ప్రొఫెసర్ సంత్ శరణ్ మిశ్రా మాట్లాడుతూ ఇప్పటికే రెండు లక్షలకు పైగా దీపాలను వెలిగించారని తెలిపారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బృందం ఘాట్ల వారీగా దీపాల సంఖ్యను లెక్కిస్తోందన్నారు. ఘాట్ నంబర్ 10 వద్ద, విశ్వవిద్యాలయ వాలంటీర్లు 80 వేల దీపాలతో స్వస్తిక్ చిహ్నాన్ని రూపొందించడానికి ఏర్పాట్లు చేశారు. కాగా ఐడి కార్డు లేకుండా ఘాట్లలోకి ప్రవేశించడాన్ని నిషేధించారు. ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాత్రి 8:30 గంటలకు రామ్ కీ పైడిలో లేజర్ షో, లైట్ అండ్ సౌండ్ షో, డ్రోన్ షో నిర్వహించనున్నారని మీడియాకు అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ నిఖిల్ తెలిపారు. -
కలర్ఫుల్ స్వింగ్ 'దివాలి' డ్రెస్సింగ్..!
దీపావళి అంటే ఒక పండుగ మాత్రమే కాదు.. విభిన్న రకాల సంబరాల కలగలుపు వేడుక. బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం మొదలు.. క్రాకర్స్ కాల్చడం వరకూ ఈ పండుగ ఆస్వాదించదగిన ఎన్నో అనుభూతులను మనకు అందిస్తుంది. అందుకే ఈ ఫెస్టివల్లో మన లుక్స్ ద్వారా గుడ్విల్ అందుకోవాలంటే, తగిన వస్త్రధారణ తప్పనిసరి. ఇందుకోసం తరచూ బాలీవుడ్ నటీనటుల స్టైల్స్ను సిటీ యూత్ అనుసరిస్తుంటారు. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన హామ్స్టెక్ కాలేజ్ ఆఫ్ క్రియేటివ్ ఎడ్యుకేషన్కు చెందిన ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాకల్టీ అందిస్తున్న కొన్ని సూచనలు.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ధరించిన ఒక డ్రెస్.. ఒక టాంగీ నారింజ మిర్రర్–వర్క్ బ్లేజర్ కోర్డ్ సెట్ దీపావళి పార్టీకి సరైన ఎంపిక. ముఖ్యంగా పండుగ వేళ మెరుపులు విరజిమ్ముతూ.. అదే సమయంలో సౌకర్యవంతంగా ఉండాలనుకునేవారికి ఇవి సరైనవి. మినిమలిస్ట్ లుక్.. ఉత్తరాది ప్రేక్షకుల్ని ఉర్రూతలూంచే అనన్య పాండే దీపావళి కోసం మినిమలిజాన్ని సూచిస్తున్నారు. సున్నితమైన తెల్లటి ఎంబ్రాయిడరీతో అలంకరించిన లేత గులాబీ రంగు స్లీవ్లెస్ కుర్తాను, మ్యాచింగ్ పలాజో ప్యాంటు జత చేశారు. ఓపెన్ హెయిర్ మినిమల్ మేకప్తో, పండుగ డ్రెస్సింగ్కు ‘తక్కువలో ఎక్కువ’ విధానాన్ని సంపూర్ణంగా ప్రతిబింబిస్తున్నాయి. రెడ్ గ్లామ్ లుక్.. దీపావళికి మరో సిల్వర్ స్క్రీన్ క్వీన్ మౌని రాయ్ లాగా ఆల్–రెడ్ లెహంగాలో అబ్బురపరిచవచ్చు. కాంబినేషన్గా ఫుల్–స్లీవ్డ్ బ్లౌజ్, ప్రింటెడ్ బోర్డర్లతో మ్యాచింగ్ స్కర్ట్, గోల్డెన్ షిమ్మర్తో అంచులున్న కో–ఆర్డినేటింగ్ దుపట్టా ఉన్నాయి. బంగారు చోకర్ నెక్లెస్, మాంగ్ టిక్కాతో తన అద్భుతమైన ఎథి్నక్ లుక్ కంప్లీట్గా తీర్చిదిద్దుకుంది. లాంగ్ ఎథినిక్ జాకెట్లు.. పొడవాటి ఎథ్నిక్ జాకెట్లు పండుగ వార్డ్రోబ్కు చక్కదనాన్ని జోడిస్తాయి. సరళమైన కుర్తాపై అందంగా ఎంబ్రాయిడరీ చేసిన జాకెట్ను జత చేయాలి లేదా క్యాజువల్, చిక్ ఫ్యూజన్ లుక్ కోసం క్రాప్ టాప్ స్కర్ట్తో స్టైల్ సెట్ చేసుకోవచ్చు. ఈ స్టైలిష్ లేయర్ డ్రెస్సింగ్.. ట్రెండీగా సాయంత్రపు సమావేశాలకు సౌకర్యవంతంగా ఉంటూనే సంప్రదాయాన్ని జోడిస్తుంది.సింపుల్ లాంగ్ గౌన్లు.. సొగసైన పాస్టెల్ లేదా మ్యూట్ షేడ్స్లో ఉన్న పొడవైన, తక్కువగా అలంకరించిన గౌన్లు దీపావళికి స్టైలిష్ ఎంపిక. అవి చక్కదనంపై రాజీ పడకుండా సౌకర్యంపై దృష్టి పెడతాయి. పండుగ రూపాన్ని పూర్తిగా ప్రతిబింబించాలంటే.. దీనికి దుపట్టా లేదా లైట్ జ్యువెలరీ జోడించాలి. పాతవే కొత్తగా.. ప్రస్తుత వార్డ్రోబ్ నుంచి కొన్నింటిని విడివిడిగా తీసి కలపడం ద్వారా అదనపు ఖర్చు చేయకుండా కూడా తాజా పండుగ స్టైల్ను సృష్టించవచ్చు. కొత్త పలాజోలతో పాత కుర్తీని జత చేయడం లేదా సరదాగా ఫ్యూజన్ వైబ్ కోసం జీన్స్తో భారీ దుపట్టాను కలిపేయడం.. వంటి ట్రిక్స్ ఫాలో అవ్వవచ్చు. ఇది మన డబ్బు ఆదా చేయడమే కాకుండా దుస్తులకు వ్యక్తిగత సృజనాత్మక ట్విస్ట్ను అందిస్తుంది. దేశీ డ్రీమ్.. మరీ సింపుల్గా వద్దు అనుకుంటే, అలంకరించబడిన షరారా సెట్లు రెడీగా ఉన్నాయిు. సీక్విన్స్, జెమ్స్ మెరుపులతో ఇవి లేట్–నైట్ డిన్నర్లు, రూఫ్టాప్ పార్టీలకు బెస్ట్. దీని కోసం నటి జాన్వి కపూర్ డ్రెస్ స్టైల్ పరిశీలించవచ్చు. ఆధునిక, ఆకర్షణీయమైన ట్విస్ట్ కోసం దుపట్టాను కేప్గా ధరించవచ్చు. బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది లాగా నల్ల కుర్తా స్ట్రెయిట్–ఫిట్ ప్యాంటు లుక్ కూడా బాగుంటుంది. లీనియర్ రెడ్ మోటిఫ్ డీటెయిలింగ్తో అలంకరించిన, వదులుగా ఓపెన్ జాకెట్తో పొరలుగా ధరించడం ఆధునిక సంప్రదాయాల స్టైలిష్ మిశ్రమం.వేదంగ్ రైనా లా నల్ల కుర్తా స్ట్రెయిట్ ప్యాంటులో మెరిసిపోవచ్చు, సమకాలీన పండుగ లుక్ కోసం మెరిసే నల్ల బ్లేజర్తో లుక్ను మరింత మెరిపించవచ్చు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ని గమనిస్తే.. తరచూ క్లాసిక్ సిల్హౌట్లతో సమకాలీన కట్లను మిళితం చేస్తాడు. ఇటీవలి దీపావళి లుక్లో పొట్టి కుర్తా ఎరుపు రంగు స్ట్రెయిట్ ప్యాంటు నమూనా నెహ్రూ జాకెట్తో కలిగి ఉంది ఆధునిక పండుగ డ్రెస్సింగ్కి ఇది సరైన ఉదాహరణ. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్లా చాలా సింపుల్ స్టైల్ని ఎంచుకోవచ్చు. ఆయన ధరించిన పాస్టెల్–రంగు లినెన్ కుర్తా–పైజామా సౌకర్యం, సరళమైన కాలాతీత శైలి అని చెప్పొచ్చు. -
ఆ రాష్ట్రాల్లో దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారంటే..!
దీపాల కాంతితో ధగధగ మెరిసే ఈ దీపాల పండుగ ఇష్టపడని వారుండరు. అలాంటి మిరుమిట్లు గొలిపే ఈ పండుగ.. టపాసుల మోత మోగిపోయేలా ఆనందహేలి తాండవించేలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మరి అలాంటి పండుగా మన దేశంలోనే పలు రాష్టాలు అత్యంత విభిన్నంగా జరుపుకుంటాయి. ఈ దీపావళి పండుగ నేపథ్యంలో ఆ విశేషాలు గురించి సవిరంగా తెలుసుకుందామా..!చీకటి దీపావళి!దీపావళి వేడుకల తర్వాత హిమాచల్ప్రదేశ్లో బుద్ది దీపావళి(చీకటి దీపావళి లేదా పాత దీపావళి) జరుపుకుంటారు. దీపావళి తర్వాత మొదటి అమావాస్య రోజు బుద్ది దీపావళి వేడుకలు మొదలవుతాయి. రాముడి రాక వార్త ఒక నెల తర్వాత మాత్రమే హిమాచల్ప్రదేశ్కు చేరిందట. అందుకే ఆలస్యంగా పండగ జరుపుకునే సంప్రదాయం మొదలైంది అంటారు.దేవరి రాత్రిఛత్తీస్ఘడ్లోని గోండు తెగలు దీపావళిని ‘దేవరి’గా జరుపుకుంటాయి. దేవరి రాత్రి గ్రామంలోని మహిళలు తలలపై ఒక కుండలో నూనె దీపాన్ని వెలిగించి శ్రావ్యంగా పాటలు పాడుతూ, ప్రతి ఇంటి తలుపు తడుతూ తమతో చేరాలని ఆ ఇంటి మహిళలను అభ్యర్థిస్తారు. బియ్యపు పిండితో చేసిన దీ΄ాలను ప్రతి ఇంటి ముందు ఉంచుతారు.ఆవులను తమపై నడిపించి..మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లాలోని బిదావాద్ గ్రామంలో ఒక వింత ఆచారం ఉంది. దీ΄ావళి రోజు తరువాత నేలపై పడుకొని ఆవులను తమపై నడిపించుకుంటారు. 33 కోట్ల దేవుళ్లు, దేవతలు ఆవులో కొలువై ఉన్నారని, వాటిని తమపై నడిపించుకోవడం ద్వారా దేవతల ఆశీర్వాదం దొరుకుతుందనేది భక్తుల నమ్మకం.భర్త కోసం రాత్రంతా దీపాలు...మహారాష్ట్రలో దీపావళి వేడుకలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన జానపద కథ ప్రచారంలో ఉంది. వివాహం జరిగిన నాలుగు రోజుల తరువాత చనిపోతాడని యువ రాజుకు శాపం. విషయం తెలిసిన వధువు తన భర్త ప్రాణాలు రక్షించుకోవడం కోసం రాత్రంతా అవిశ్రాంతంగా దీపాలు వెలిగిస్తూనే ఉంటుంది. ఆమె ప్రయత్నాల వల్ల భర్త బతుకుతాడు.శ్రీవిష్ణువు భూలోకానికి...గుజరాత్లో దీపావళి రోజు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం అనేది తరతరాలుగా వస్తోంది. మహాలక్ష్మీదేవి భర్త విష్ణువు భూలోకానికి వచ్చిన గుర్తుగా మధ్యప్రదేశ్లో దీపావళి జరుపుకుంటారు. కోల్కత్తాలో దీపావళికి కాళీపూజ చేస్తారు.సోదర, సోదరీమణులు...మన దేశంలోని కొన్ని ప్రాంతాలలో దీపావళి అనేది సోదర, సోదరీమణుల అనుబంధానికి ముడి పడి ఉన్న పండగగా జరుపుకుంటారు. దీపావళి తర్వాత రోజు జరుపుకునే ఈ పండగను ‘యమ–ద్విత్య’ అని పిలుస్తారు. యమున తన సోదరుడు, మృత్యుదేవుడు యముడికి ఆతిథ్యం ఇచ్చిన రోజు ఇదే అని పురాణ కథలు చెబుతాయి.లక్ష దీపాల ఆగ్రా కోట అక్బర్ చక్రవర్తి పాలనలో దీపావళిని ఆనందోత్సాహాలతో జరుపుకునేవారు. ఈ సంప్రదాయాన్ని ‘జష్నే చిరాఘన్’ అని పిలిచేవారు. లక్షలాది దీపాలతో ఆగ్రా కోట వెలిగి΄ోయేది. కోట ముందు ఉన్న మైదానంలో బాణసంచా కాల్చేవారు. -
దీపావళి వచ్చేసింది..అందాల భామ రకుల్ ‘పటాకా’ లుక్ (ఫోటోలు)
-
Diwali 2025: ఇంటికి వెలుగుల మెరుపులు తెప్పిద్దాం ఇలా..!
దీపాలే అనేది దీపావళి పండుగ అలంకరణకు ప్రాణం. ఆ మెరుపు మన ఇంటిని వెచ్చగా, ఉత్సాహంగా, తక్షణమే పండుగ కళను తీసుకువచ్చేస్తుంది. దీపావళి సమయంలో లైటింగ్ అనే ప్రకాశం నుండి మన జీవనశైలిని కాంతిమంతం చేస్తుంది. దీపావళి అలంకరణను మెరుగుపరచడానికి ఇంటీరియర్ డిజైన్ స్టూడియో క్రిడ్ అఫ్ లైస్ ఫౌండర్ తన్వీ పోర్వాల్, దట్ యెల్లో ట్రంక్ ఆర్కిటెక్ట్, ఫౌండర్ అంజరి గంగూలీ చేస్తున్న సూచనలివి..దీపాలే అనేది దీపావళి పండుగ అలంకరణకు ప్రాణం. ఆ మెరుపు మన ఇంటిని వెచ్చగా, ఉత్సాహంగా, తక్షణమే పండుగ కళను తీసుకువచ్చేస్తుంది. దీపావళి సమయంలో లైటింగ్ అనే ప్రకాశం నుండి మన జీవనశైలిని కాంతిమంతం చేస్తుంది. దీపావళి అలంకరణను మెరుగుపరచడానికి ఇంటీరియర్ డిజైన్ స్టూడియో క్రిడ్ అఫ్ లైస్ ఫౌండర్తన్వీ పోర్వాల్, దట్ యెల్లో ట్రంక్ ఆర్కిటెక్ట్, ఫౌండర్ అంజరి గంగూలీ చేస్తున్న సూచనలివి..ఆహ్లాదకరమైన ప్రకాశం: ఆధునికమైన, విలాసవంతమైన టచ్ కోసం వెచ్చని ఎల్ఈడీ లైట్లను ఉపయోగించవచ్చు. ఇంటి లోపల, మెట్ల భాగంలో ఈ లైట్లను ఏర్పాటు చేస్తే అధిక విద్యుత్తు ఖర్చు కాకుండానే పరిసరాలను ఆహ్లాదకరంగా, కాంతివంతం చేస్తాయి.లైట్ల తోరణం: ప్రకాశవంతమైన తోరణాన్ని గుమ్మానికి ఏర్పాటు చేస్తే, పండగ ముంగిట్లోకి ఇట్టే వస్తుంది. ఇక సిల్క్ టాసెల్స్, పూసలు లేదా ఫెయిరీ లైట్లతో కూడిన స్ఫటికాలనూ ఎంచుకోవచ్చు, ఇది సంప్రదాయాన్ని అధునాతనంగా చూపడంతో పాటు అతిథుల స్వాగతానికి అందమైన కాంతిని అందిస్తుంది.పేపర్ లాంతర్లు: రంగు రంగుల కాగితపు పొరలతో చేసే ఈ లాంతర్లు కాంతిని వినూత్నంగా వెదజల్లుతుంటాయి. ఈ లాంతర్లు బాల్కనీలు, ఇంటి ముందు వసారాలాంటి స్థలాల్లో వేలాడదీయాలి. మెటాలిక్ గోల్డ్, క్రీమ్ లేదా పేస్టెల్ షేడ్స్లో వీటిని మనమే తయారు చేసుకోవచ్చు. కొవ్వొత్తి స్టాండ్లు: కలప, ఇత్తడి లేదా పాలరాతి శిల్పాకృతులను పోలి ఉండే కొవ్వొత్తి స్టాండ్లు మార్కెట్లో లభిస్తున్నాయి. అవి వెదజల్లే అందం ఇంటికి మెరుపును తీసుకువస్తుంది. పండుగ వాతావరణానికి ఈ కొవ్వొత్తుల స్టాండ్లు మేలైన ఎంపిక. వారసత్వంగా వస్తున్న కొన్ని గృహాలంకరణ వస్తువులను, తిరిగి బాగు చేయించి కొవ్వొత్తుల స్టాండులుగా ఉపయోగించవచ్చు. మట్టి దీపాలు: టెర్రకోట దీపాలు ఆధునిక ఇంటీరియర్లను వారసత్వ సౌందర్యానికి అనుసంధానిస్తాయి. విలాసవంతమైన టచ్ కోసం వాటిని హైలైట్ చేయవచ్చు. వీటిని కిటికీలు, బాల్కనీలు, లివింగ్రూమ్లు, ఇంటి ముందు అందంగా తీర్చిదిద్దవచ్చు. కొబ్బరి చిప్పలను ప్రమిదలుగా తయారు చేసుకొని, ఉపయోగించవచ్చు. పర్యావరణానికి మేలు చేసేవే కాదు, రీ సైక్లింగ్ పద్ధతుల వల్ల కూడా మేలైన ఫలితాలను పొందవచ్చు. ఎన్నార్ -
వరుస సెలవులు.. ఐదు రోజులు బ్యాంకులు బంద్!
భారతదేశంలో ఎక్కువమంది జరుపుకునే పండుగలలో.. దీపావళి ఒకటి. ఈ ఫెస్టివల్ సమయంలో అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 23 వరకు.. బ్యాంకులకు వరుసగా సెలవులు ఉన్నాయి. ఈ కథనంలో ఈ సెలవులకు సంబంధించిన మరిన్ని వివరాలు చూసేద్దాం.➤అక్టోబర్ 19, ఆదివారం: (దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు).➤అక్టోబర్ 20, సోమవారం: దీపావళి (ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో సహా.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు).➤అక్టోబర్ 21, మంగళవారం: గోవర్ధన్ పూజ / లక్ష్మీ పూజ (మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, సిక్కిం, మణిపూర్, జమ్మూ, శ్రీనగర్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు).➤అక్టోబర్ 22, బుధవారం: బలిపాడ్యమి (గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ, రాజస్థాన్, సిక్కింలోని బ్యాంకులకు సెలవు).➤అక్టోబర్ 23, గురువారం: భాయ్దూజ్, చిత్రగుప్త్ జయంతి, లక్ష్మీ పూజ (అహ్మదాబాద్, గ్యాంగ్టక్, ఇంఫాల్, కాన్పూర్, కోల్కతా, లక్నో, సిమ్లాలలో బ్యాంకులుకు సెలవు).అందుబాటులో ఆన్లైన్ సేవలుబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్డ్రా వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు.ఇదీ చదవండి: దీపావళికి.. ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ గిఫ్ట్ -
దివాలీ నైట్ పార్టీలో నమ్రతా శిరోద్కర్ (ఫోటోలు)
-
దీపావళి వేళ ఏరో ఎడిషన్ లాంచ్: స్పెషల్ కిట్ కూడా
టయోటా హైరైడర్.. స్పెషల్ ఎడిషన్ను లాంచ్ చేసింది. ఈ కొత్త కారు పేరు 'హైరైడర్ ఏరో ఎడిషన్' (రూ.10.94 లక్షలు). ఇది స్టాండర్డ్ హైరైడర్ కంటే రూ. 31,999 ఎక్కువ ధరలో ప్రత్యేకమైన స్టైలింగ్ కిట్ను పొందుతుంది.కంపెనీ అందించే ఈ ప్రత్యేకమైన స్టైలింగ్ కిట్లో.. బంపర్కు మరింత దూకుడుగా ఉండే లుక్ని ఇచ్చే ఫ్రంట్ స్పాయిలర్, వెనుక భాగంలో స్పాయిలర్, హైరైడర్కు మొత్తం మీద స్పోర్టియర్ లుక్ని తెచ్చే సైడ్ స్కర్ట్లు వంటివి ఉన్నాయి. ఈ కిట్ కూడా పరిమిత సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఇదీ చదవండి: ఇందులో భారత్ అభివృద్ధి ఆగిపోతోంది!: గౌతమ్ సింఘానియాహైరైడర్ ఏరో ఎడిషన్ తెలుపు, సిల్వర్, నలుపు, ఎరుపు అనే నాలుగు రంగులలో లభిస్తుంది. కాగా టయోటా హైరైడర్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్, సీఎన్జీ పవర్ట్రెయిన్తో అందుబాటులో ఉంది. ఇందులోని 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్, 103 హార్స్ పవర్, 136 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ 116 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది e-CVTతో లభిస్తుంది. CNG ఇంజిన్ 87 హార్స్ పవర్, 121 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. -
బాస్ అంటే ఇలా ఉండాలి: ఉద్యోగులకు 51 కార్లు గిఫ్ట్
దసరా, దీపావళి పండుగలు వచ్చాయంటే.. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్లు ఇస్తాయి, మరికొన్ని ఊహకందని గిఫ్ట్స్ ఇచ్చి సంతోషపెడుతుంటాయి. ఇలాంటి కోవకు చెందిన కంపెనీలలో ఒకటి.. 'మిట్స్ నేచురా లిమిటెడ్' (Mits Natura Limited). ఈ కంపెనీ బాస్ తన ఉద్యోగులు గత రెండేళ్లుగా కార్లను గిఫ్ట్గా ఇస్తున్నారు. ఇప్పుడు మూడోసారి కూడా ఇదే విధానం కొనసాగించారు. ఈసారి ఏకంగా 51 మందికి కార్లను గిఫ్ట్ ఇచ్చారు.ప్రముఖ ఔషదాల తయారీ సంస్థ.. మిట్స్ నేచురా లిమిటెడ్ కంపెనీ ఫౌండర్ ఎంకే భాటియా ఈ దీపావళికి.. తమ సంస్థలో పనిచేస్తూ ఉత్తమ పనితీరును కనపరిచిన 51 మంది ఉద్యోగులకు కార్లను గిఫ్ట్ ఇస్తూ.. వాటి తాళాలను తానే స్వయంగా అందజేసి.. ప్రతి ఒక్కరినీ అభినందించారు.ప్రతి సంవత్సరం ఇంత ఖరీదైన కార్లను ఎందుకు బహుమతిగా ఇస్తారని భాటియాను అడిగినప్పుడు.. నా ఉద్యోగులే నా ఫార్మాస్యూటికల్ కంపెనీలకు వెన్నెముక. వారి కృషి, నిజాయితీ, అంకితభావం మా విజయానికి పునాది. వారి ప్రయత్నాలను గుర్తించడం.. వారిని కూడా ఎదిగేలా చేయడం మా విధి అని ఆయన అన్నారు.కార్లను గిఫ్ట్ ఇవ్వడం అనేది ప్రదర్శించుకోవడానికి కాదు. జట్టులో స్ఫూర్తిని నింపడానికి, సంస్థను ఒక కుటుంబంలా ముందుకు తీసుకెళ్లడానికి అని ఆయన అన్నారు. టీమ్ లేదా ఉద్యోగులు సంతోషంగా ఉన్నప్పుడు.. కంపెనీ తప్పకుండా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. అయితే ఈ సారి బ్రాండ్ కార్లను గిఫ్ట్ ఇచ్చారు అనే విషయం అధికారికంగా వెలువడలేదు.ఇదీ చదవండి: తారాస్థాయికి చేరిన బంగారం, వెండి: ధరలు పెరగడానికి కారణాలు! -
పండగవేళ దివ్యమైన కానుకలు : టాప్ ఐడియాలివిగో!
దీపావళి అంటే ఒక ఆసక్తి. ఒక అభిమానం. అంతకు మించి చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ ఎంతో సరదా. ఆ సరదాల పండగ అతి సమీపంలోకి వచ్చేసింది. ఇంకేం... మెరిసే లైట్లు, రంగురంగుల దీపాలు, రుచికరమైన స్వీట్లు, వివిధ రకాల చాక్లెట్లు, టన్నుల కొద్దీ బహుమతులకు ఒక్కసారిగా కాళ్లొచ్చేశాయి. సాధారణంగా దీపావళికి కుటుంబ సభ్యులు ఒకరికొకరు కానుకలు ఇచ్చుకుంటూ ఉంటారు. తమ వద్ద పని చేసే వారికి యజమానులు స్వీట్లతోపాటు కానుకలూ ఇస్తుంటారు. రెగ్యులర్ ఖాతాదారులకు దుకాణాల వారు కాంప్లిమెంటరీ కానుకలు ఇస్తారు. ఈ సంతోష సమయంలో ఎప్పుడూ ఇచ్చే స్వీట్లు, డ్రై ప్రూట్స్ కన్నా కాస్త విభిన్నమైన బహుమతి ఇస్తే బాగుంటుంది కదా... మీకేదైనా ఆలోచన వస్తే సరే.. లేదంటే మేం చెబుతున్న విధంగా బహుమతులు ఇస్తే ఎలా ఉంటుందో కాస్త ఆలోచించండి. సన్నిహితులకు, మిత్రులకు, ప్రియమైన వారికి మీ శైలిలో ప్రత్యేకమైన దీపావళి కానుకలు ఇచ్చి వారి ముఖాలలో మతాబాల వెలుగులు చూసి మురిసిపోవాలనుకుంటున్నారా? ఇవి ప్రయత్నించండి మరి! మీరు ఎంచుకునే దీపావళి బహుమతులకు సాంప్రదాయక స్పర్శను తిరిగి తీసుకురండి. లాంతరు సాంప్రదాయమైనది, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఈ పండుగ సీజన్లో, మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు వేలాడే లాంతరును బహుమతిగా ఇవ్వండి. మీరు దానిని కొన్ని స్వీట్లు లేదా డ్రై ఫ్రూట్స్తో జత చేస్తే మీ ప్రియమైన వారిని ఆకట్టుకోవడానికి ఇది బడ్జెట్లో ఉత్తమమైన దీపావళి బహుమతి అవుతుంది. దేవుని ప్రతిమలుసంప్రదాయం ప్రకారం, దీపావళి పండుగ లక్ష్మీదేవి, గణేశ విగ్రహ పూజతో ప్రారంభమవుతుంది. మీరు మీ సన్నిహితులకు పవిత్రమైన, సంప్రదాయకరమైన బహుమతి ఇవ్వాలని చూస్తున్నట్లయితే అందంగా ప్యాక్ చేసిన దేవుని విగ్రహాలు, డాలర్లు, ప్రతిమలను ప్రయత్నించవచ్చు. మీ చేతితో మీరే స్వయంగా... మంచి మనసున్న మీకు ప్రియమైన వారు కానిదెవరు? అందరికీ బహుమతులు కొనడం మీ జేబులకు భారంగా అనిపించవచ్చు. కాబట్టి, మీరే తయారు చేసుకోగలిగినప్పుడు దాని గురించి ఎందుకు చింతించాలి? అవును, మీ ప్రియమైనవారిపై శాశ్వత ముద్ర వేయడానికి చేతితో తయారు చేసిన బహుమతులు ఎల్లప్పుడూ ఉత్తమ ఎంపిక. మీరు ప్రియుడు, స్నేహితురాలు, భర్త లేదా ప్రత్యేకమైన వాటి కోసం నిజమైన, హృదయాన్ని హత్తుకునే దీపావళి బహుమతి కోసం చూస్తున్నట్లయితే, మీరు చేతితో తయారు చేసిన పర్యావరణ అనుకూల దీపావళి బహుమతులైన దియాలు, టీలైట్ కొవ్వొత్తులు మొదలైన వాటిని లెక్కలోకి తీసుకోవచ్చు.చదవండి: ఫ్రెంచ్ సూపర్ బ్రాండ్ తొలి స్టోర్ : ఎవరీ బ్యూటీ విత్ బ్రెయిన్బహుమతి వోచర్లువారి అభిరుచి, ప్రాధాన్యతల ప్రకారం బహుమతిని ఎంచుకోవడం ఎల్లప్పుడూ కఠినమైనదే. ఏమి బహుమతిగా ఇవ్వాలో సందేహం ఉన్నప్పుడు, గిఫ్ట్ వోచర్ల కోసం వెళ్ళండి. మీ ప్రియమైన వారిని ప్రత్యేకంగా భావించేలా చేయడానికి ఉత్తమమైన, ఉపయోగకరమైన దీపావళి బహుమతులలో ఇది ఒకటి.ఇదీ చదవండి: దివాలీకి స్వీట్లు లేకపోతే ఎలా? ఈజీగా ఇలా చేసేయ్యండి!టీలైట్ కొవ్వొత్తులుదీపావళి అంటే దివ్వెలే కదా...దివ్వెలు, కొవ్వొత్తులు కాకుండా ఉత్తమ బహుమతి ఏమిటి? మార్కెట్లో వివిధ డిజైన్లు, ఆకారాలలో అనేక టీలైట్ కొవ్వొత్తులను అందించే అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. టీలైట్ కొవ్వొత్తులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మీ ప్రియమైనవారి జీవితంలో ఆశల వెలుగును నింపచ్చు.దీపావళి పూజా థాలీమీ సన్నిహిత కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దీ΄ావళి పండుగను మరింత పవిత్రంగా, దివ్యంగా చేయండి మీ ప్రేమకు చిహ్నంగా వారికి వెండి లేదా బంగారు పూత పూసిన పూజా థాలీని బహుమతిగా ఇవ్వండి. చక్కగా అలంకరించబడిన థాలీ వేడుకకు ఉత్సాహాన్ని ఇస్తుంది.కార్పొరేట్ బహుమతులుమీ ఉద్యోగులు, సహోద్యోగులు, క్లయింట్ల కృషికి వారికిచ్చే కానుకలతోపాటు ఒక మంచి ప్రశంస, వారి మనోధైర్యాన్ని పెంచడానికి, కార్యాలయ వాతావరణాన్ని మెరుగుపరచడానికీ సహాయపడుతుంది. వెండి లేదా బంగారు నాణేలు దీపావళి సమయంలో వెండి, బంగారం వంటి విలువైన లోహాలను శుభప్రదంగా భావిస్తారు. ధంతేరస్ రోజున, లోహంతో తయారు చేసిన వస్తువును కొనడం శ్రేయస్సు, అదృష్టానికి సంపదకు సంకేతంగా భావిస్తారు. దీపావళి, ధన్తేరస్ రెండింటిలోనూ మీరు ఉపయోగించగల ఉత్తమ దీపాళి బహుమతి ఆలోచనలలో ఇది ఒకటి.వివిధ రకాల చాక్లెట్లుఈ దీపావళికి, మీ ప్రియమైన వారికి వివిధ రకాల చాక్లెట్ల ప్యాక్ పంపడం ద్వారా వారి నోరు తీపి చేయండి. చాక్లెట్లు ఎవరినీ ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విఫలం కావు. కాబట్టి, బహుమతిగా చాక్లెట్లను అందమైన రేపర్తో చుట్టి వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేయండి.సుమగంధంసహజసిద్ధమైన పూలతో తయారు చేసిన సెంటు, స్ప్రే లేదా అగరుబత్తుల ΄్యాకెట్లను కూడా బహూకరిస్తే ఆ సుమగంధంలాగే మీ స్నేహ బంధమూ పరిమళిస్తుంది. -
భారతీయులకు థాయ్ వెలుగుల ఆహ్వానం
భారత పర్యాటకులను భారీగా ఆకర్షించడం, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్దఎత్తున ఆదాయాన్ని సమకూర్చుకోవడం లక్ష్యంగా థాయిలాండ్ వ్యూహరచన చేసింది. ఇందుకు వెలుగుల పండుగ దీపావళిని వేదికగా చేసుకుంది. ‘గ్రాండ్ దివాళిృ2025’ వేడుకలను భారీగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నెల 16 నుంచి 31 వరకు ప్రతిష్టాత్మకంగా థాయ్ - భారత్ సాంస్కృతిక మేళవింపులతో వెలుగుల పండుగకు ఏర్పాట్లు చేస్తోంది. అద్భుత లైటింగ్ ప్రదర్శనలకు తోడు సాంస్కృతిక కార్యక్రమాల్లో లీనమయ్యే ప్రత్యేక అనుభవాలను పర్యాటకులకు అందించేలా షెడ్యూల్ను ప్రకటించింది. భారతదేశం వెలుపల అతిపెద్ద దీపావళి వేడుకను ‘ఫెస్టివల్ ఆఫ్ లైట్స్’గా పిలుస్తోంది. ఈ ఘట్టానికి ‘ఐకానిక్ ఓంగ్ ఆంగ్ కెనాల్, ఫహురత్ ప్రాంతాలను కేంద్ర బిందువులుగా మారుస్తోంది. - సాక్షి, అమరావతిఈ నెల 16 నుంచి 31 వరకు థాయిలాండ్లో గ్రాండ్ దివాళి వేడుక భారత పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రణాళిక తద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఆదాయం వచ్చేలా వ్యూహ రచన లైట్ షోలు, స్థానికృభారతీయ మేళవింపుతో సాంస్కృతిక ప్రదర్శనలు విమానాశ్రయాల నుంచే పర్యాటక సేవలపై రాయితీల జల్లు కృత్రిమ మేధ కెమెరాలు, వాహనాలతో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు దీపావళి వెలుగుల వేడుక ఇలా.. మధురానుభూతి మిగిలిపోయేలా.. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫహురత్, ఓంగ్ ఆంగ్ కెనాల్ ప్రాంతాల్లో వేడుకలు రాత్రిళ్లు ఆకర్షణీయమైన సౌండ్ అండ్ లైటింగ్ షోలు. కమ్యూనిటీ ఈవెంట్లు రాత్రిళ్లు ఆకర్షణీయమైన సౌండ్ అండ్ లైటింగ్ షోలు. కమ్యూనిటీ ఈవెంట్లు ప్రధాన ఆకర్షణగా థాయ్-ఇండియన్ రామాయణ ప్రదర్శన లాంతర్ నృత్యాలు, భరత నాట్యం, అసోం నుంచి బిహు జానపద నృత్యం, బాలీవుడ్ నృత్యం, భారత సమకాలీన నృత్య ప్రదర్శనలుసహా రెండు దేశాల శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు గోరింట (మెహందీ), లాంతరు పెయింటింగ్, పూసలుృబుట్ట నేయడం వంటి ఆటవిడుపు వర్క్షాపుల నిర్వహణ ప్రాన్ బిర్యానీ, మసాలా దోస, పానీపూరిసహా నోరూరించే ఇతర భారతీయ వంటకాలు ఆధ్యాత్మిక అనుభూతిని కల్పించే లక్ష్మీదేవి, గణేశుడి ఆరాధన కార్యక్రమాలు ఓంగ్ ఆంగ్ కెనాల్ తీరంలో రంగోలి, నీటిపై తేలియాడేనూనె దీపాల ప్రదర్శనలు లక్ష మంది హాజరు! ‘అమేజింగ్ థాయిలాండ్ గ్రాండ్ దీపావళి ఫెస్టివల్’కు లక్ష మందికిపైగా హాజరవుతారని థాయ్ టూరిజం అథారిటీ ప్రకటించింది. ఈ ఒక్క వేడుక ద్వారానే ఆ దేశానికి 650 మిలియన్ బాట్ల (దాదాపు 20 మిలియన్ డాలర్లు) రెవెన్యూ వస్తుందని అంచనా వేసింది. దీనికి తోడు పర్యాటకులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తోంది. డాన్ ముయాంగ్, సువర్ణభూమి విమానాశ్రయాల నుంచి వేడుక నిర్వహించే వేదికల వరకూ కీలక ప్రదేశాల్లో పర్యాటక సేవల వ్యయాలపై రాయితీలు కురిపిస్తోంది. భద్రతను దృష్టిలో పెట్టుకుని కృత్రిమ మేధ కెమెరాలు, వాహనాలను వినియోగించనుంది. ఒక్క ఈ నెలలోనే భారతీయ సందర్శకుల సంఖ్య 30 శాతం పెరుగుతుందనే ధీమా వ్యక్తం చేస్తోంది. 60 రోజుల పాటు వీసా మినహాయింపు కల్పిం చింది. వ్యక్తికి రూ.90 వేల వరకు వ్యయం! ప్రతి ఏటా థాయిలాండ్ను సందర్శిస్తున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్లో ఇప్పటి వరకు థాయిలాండ్లో దాదాపు 18 లక్షల మంది భారతీయులు పర్యటించారు. థాయ్కు అత్యధికంగా వచ్చే సందర్శకుల సంఖ్యలో మొదటి మూడు దేశాల్లో భారత్ ఒకటి. బ్యాంకాక్, ఫుకెట్, క్రాబీ, కో స్మామ్యూయ్ వంటి థాయ్ గమ్యస్థానాలు భారతీయ పర్యాటకుల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. దీనిని మరింత విస్తృతం చేసుకోవడం ద్వారా ఈ ఏడాది నాటికి 25 లక్షల మంది భారతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా థాయ్ ప్రణాళికలు రూపొందిస్తోంది. థాయ్కి వచ్చే భారతీయ సందర్శకులు సాధారణంగా సగటున ఒక వ్యక్తికి రూ.90 వేల వరకు ఖర్చు చేస్తారని, దాదాపు 6–7 రాత్రులు బస చేస్తారని తేలింది. -
దివాళీ మోడ్లో సింగర్ శ్రియా ఘోషల్ (ఫోటోలు)
-
ధన త్రయోదశి రోజున బంగారంపై పెట్టుబడా?
ప్రతి సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా వచ్చే ధన త్రయోదశి (ధన్తేరాస్) రోజున బంగారం కొనడం భారతదేశంలో ఒక శుభప్రదమైన సంప్రదాయం. ఈ రోజున పసిడిని కొనుగోలు చేయడం ద్వారా సంవత్సరం పొడవునా సంపద సమకూరుతుందని ప్రజలు బలంగా నమ్ముతారు. అయితే ఈ ఏడాది కాలంలో బంగారం, వెండి ధరలు సామాన్యులు కొనలేనంత భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి, రూపాయి విలువ పతనం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా బంగారు ఆభరణాలు కొనడం కంటే మెరుగైన, ఆర్థికపరంగా లాభదాయకమైన పెట్టుబడి మార్గాలను ఎంచుకోవడం ఉత్తమం.నేరుగా ఆభరణాలు కొంటే..ధరలు భారీగా పెరగడంతో ఆభరణాల రూపంలో బంగారం కొనుగోలు చేయాలనుకోవడం చాలా మందికి ఆర్థిక భారంగా ఉంటుంది. రికార్డు స్థాయిలో ఉన్న ధరల కారణంగా చిన్న వస్తువు కొనుగోలుకు కూడా ఎక్కువ మొత్తంలో చెల్లించాలి. బంగారు ఆభరణాల తయారీలో తరుగు రూపంలో కొంత మొత్తాన్ని అదనంగా చెల్లించాలి. వీటికి తయారీ ఛార్జీలు (Making Charges) అదనం. బంగారం ధర, తయారీ ఛార్జీలపై జీఎస్టీ వర్తిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆభరణాలు అమ్మినప్పుడు తయారీ ఛార్జీలు, తరుగు కారణంగా కొనుగోలు ధర కంటే తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తుంది.ఈ ఛార్జీలు, నష్టాల నేపథ్యంలో బంగారంలో పెట్టుబడి పెట్టడానికి నిపుణులు మెరుగైన ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నారు. బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి భౌతిక బంగారాన్ని నిల్వ చేయాల్సిన అవసరం లేకుండా సురక్షితమైన, పారదర్శకమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న కొన్ని మార్గాలు అందుబాటులో ఉన్నాయి.గోల్డ్ ఈటీఎఫ్లుగోల్డ్ ఈటీఎఫ్లు అనేవి స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో షేర్ల మాదిరిగా ట్రేడ్ చేయబడే ఫండ్లు. ఇవి దేశీయ భౌతిక బంగారం ధరను ట్రాక్ చేస్తాయి. వీటిని లైవ్ మార్కెట్ నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల తయారీ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు ఛార్జీలు ఉండవు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వేళల్లో ఎప్పుడైనా సులభంగా కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు. భౌతిక బంగారంలాగా దొంగిలించబడుతుందనే భయం ఉండదు. రియల్ టైమ్ మార్కెట్ ధరలకు అనుగుణంగా వీటి ధరలు ఉంటాయి. వీటిని కొనుగోలు చేయడానికి డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతా అవసరం.డిజిటల్ గోల్డ్PhonePe, Paytm వంటి యాప్ల ద్వారా 99.9% స్వచ్ఛమైన బంగారాన్ని కొద్ది మొత్తంలో డిజిటల్ రూపంలో కొనుగోలు చేయవచ్చు. ఈ బంగారం మీ తరపున భౌతిక రూపంలో లాకర్లో నిల్వ చేస్తారు. అయితే అమ్మాలనుకుంటే మాత్రం జీఎస్టీ వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. ఈ విధానంలో చాలా తక్కువ డబ్బుతో కూడా కొంత మొత్తంలో కొనుగోలు చేయవచ్చు. భౌతికంగా నిల్వ చేయాలనే ఆందోళన అవసరం లేదు. అయితే దీనికి కొనుగోలు పరిమితులు ఉంటాయి. ఈ పెట్టుబడి RBI లేదా SEBI నియంత్రణలో ఉండదని గమనించాలి.ఇదీ చదవండి: లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలింది.. ఏం జరిగిందంటే.. -
దీపావళి ఆఫర్.. కార్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్!
భారతదేశంలో కొత్త జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత వాహన అమ్మకాలు బాగా పెరిగాయి. కాగా ఇప్పుడు కొన్ని వాహన తయారీ సంస్థలు కొన్ని ఎంపిక చేసిన కార్లపై లక్షల రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో వీటి ప్రారంభ ధరలు (ఎక్స్ షోరూమ్) చాలా వరకు తగ్గుతాయి. ఈ కథనంలో ఏ మోడల్పై ఎంత రేటు తగ్గిందనే విషయాలను చూసేద్దాం.మోడల్ వారీగా తగ్గిన ధరలు➤కియా సోనెట్: రూ. 1.02 లక్షలు➤మారుతి బాలెనొ: రూ. 1.05 లక్షలు➤హోండా సిటీ: రూ. 1.27 లక్షలు➤మారుతి ఇన్విక్టో: రూ. 1.40 లక్షలు➤కియా కారెన్స్ క్లావిస్: రూ. 1.41 లక్షలు➤కియా సెల్టోస్: రూ. 1.47 లక్షలు➤ఫోక్స్వ్యాగన్ వర్టస్: రూ. 1.50 లక్షలు➤హోండా ఎలివేట్: రూ. 1.51 లక్షలు➤కియా సిరోస్: రూ. 1.6 లక్షలు➤ఫోక్స్వ్యాగన్ టైగన్: రూ. 1.80 లక్షలు➤మారుతి గ్రాండ్ విటారా: రూ. 1.80 లక్షలు➤స్కోడా స్లావియా: రూ. 2.25 లక్షలు➤మహీంద్రా XUV400: రూ. 2.50 లక్షలు➤స్కోడా కుషాక్: రూ. 2.50 లక్షలు➤మహీంద్రా మరాజో: రూ. 3 లక్షలుఇదీ చదవండి: ఆక్టావియా ఆర్ఎస్ లాంచ్: అప్పుడే అన్నీ కొనేశారు!వాహన తయారీ సంస్థలు ప్రకటించే ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారే అవకాశం ఉంది. కాబట్టి పండుగల సమయంలో కారు కొనాలనుకునే కస్టమర్లు.. తగ్గింపులకు సంబంధించిన కచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవడం ఉత్తమం. అంతే కాకుండా ఈ తగ్గింపులు బహుశా.. పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. -
అవసరాలకు అనువైన బహుమతులు.. తీరు మార్చుకున్న కంపెనీలు
ప్రతి సంవత్సరం దీపావళి వచ్చిందంటే దాదాపు చాలా కంపెనీల ఉద్యోగుల చేతుల్లో పండుగ బహుమతులు ఉండడం ఖాయం. ఈ దీపావళి బహుమతుల ప్రదానంలో ఇటీవలి కాలంలో మార్పులు వస్తున్నాయి. గతంలో కేవలం సాంప్రదాయ స్వీట్ బాక్స్లు, చాక్లెట్లకే పరిమితమైన కార్పొరేట్ గిఫ్టింగ్ సంస్కృతి ఇప్పుడు ఉద్యోగుల అవసరాలు, వినియోగానికి ఉపయోగపడే కన్స్యూమర్ వస్తువుల వైపు మళ్లుతోంది.కొత్త ట్రెండ్గతంలో దీపావళి బహుమతులు అంటే ఖరీదైన మిఠాయిలు, డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్లు ఇవ్వడం ఆనవాయితీగా ఉండేది. అయితే నేటి తరం కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగుల దైనందిన జీవితంలో ఉపయోగపడే వస్తువులను అందించడానికి మొగ్గు చూపుతున్నాయి. ఈ మార్పునకు నిదర్శనంగా ఇటీవల కొన్ని ఉదాహరణలు కనిపిస్తున్నాయి.ఇటీవల ఒక ప్రముఖ టెక్నాలజీ సంస్థ తన ఉద్యోగులందరికీ ప్రయాణాలకు ఉపయోగపడే వీఐపీ (VIP) బ్యాగులను బహుమతిగా అందించింది. ఇది ఉద్యోగులకు వ్యక్తిగతంగా ఎంతగానో ఉపయోగపడుతుంది.తాజాగా మరో కంపెనీ ఉత్తమ నాణ్యత గల కిచెన్వేర్ సెట్లను దీపావళి కానుకగా ఇచ్చింది. దీనితో పాటు కొంతమంది ఉద్యోగులకు విలువైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను కూడా అందించినట్లు సమాచారం. View this post on Instagram A post shared by Bhavika Goyal (@bhavika.inframes)బహుమతుల ఎంపికలో కంపెనీలు కేవలం లాంఛనాన్ని కాకుండా ఉద్యోగుల అవసరాన్ని ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి.ట్రెండ్ మార్పునకు కారణాలుస్వీట్ బాక్స్లు తాత్కాలిక సంతోషాన్ని ఇస్తే కన్స్యూమర్ వస్తువులు దీర్ఘకాలికంగా ఉపయోగపడతాయి. ఉద్యోగులకు ఇవి తమ రోజువారీ జీవితంలో ఉపయోగపడే విలువైన కానుకగా నిలుస్తాయి.పెరుగుతున్న ఆరోగ్య స్పృహ కారణంగా చాలా మంది ఉద్యోగులు అధిక షుగర్, క్యాలరీలు ఉన్న స్వీట్ బాక్స్లను పక్కన పెట్టేస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే వస్తువుల పంపిణీకి కంపెనీలు ప్రాధాన్యతనిస్తున్నాయి.మంచి నాణ్యత గల కన్స్యూమర్ వస్తువులను అందించడం ద్వారా కంపెనీలు తమ ఉద్యోగులపై శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా ఒక సానుకూల బ్రాండ్ ఇమేజ్ను సృష్టించుకోవచ్చు.ఉద్యోగికి ఉపయోగపడే బహుమతిని ఇవ్వడం వల్ల సంస్థ పట్ల వారి విధేయత పెరుగుతుంది. ఇది ఉద్యోగులు సంస్థలో కొనసాగడానికి దోహదపడుతుంది.కేవలం లాంఛనం కాకుండా ఇలాంటి బహుమతులు పండుగ వాతావరణంలో సంస్థ గౌరవాన్ని, ప్రోత్సాహాన్ని ప్రతిబింబిస్తాయి.బహుమతుల ఎంపికలో క్రియేటివిటీని చూపడం ద్వారా కంపెనీ తమ అంతర్గత ఆవిష్కరణ సామర్థ్యాన్ని కూడా చూపుతుంది.ఇదీ చదవండి: ఆన్లైన్ షాపింగ్.. డబ్బు మిగలాలంటే ఇలా చేయాల్సిందే.. -
దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: దీపావళి, ఛట్ పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడప నున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు తిరుపతి–సికింద్రాబాద్ (07497/ 07498), విజయవాడ–సికింద్రాబాద్ (0721 3/07214) మధ్య ఈ నెల 17, 18 తేదీల్లో రాకపోకలు సాగించనున్నాయి. అలాగే హైదరాబాద్–భువనేశ్వర్ (07165/07166) ఎక్స్ప్రెస్ నవంబర్ 4వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రాకపోకలు సాగించనుంది. -
ఇదే ఆఖరి దీపావళి పండుగ..! మళ్లీ ఏడాది..
దీపావళి పండుగ అంటే చిన్నా పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. అలాంటి పండుగను ఈ యువకుడు ఇదే తనకు ఆఖరి దీపావళి ఏమో అంటూ భావేద్వేగంగా పోస్టు పెట్టాడు. హృదయాన్ని మెలిపెట్టే అతడి కథ నెట్టింట వైరల్గా మారడమే కాదు ప్రతి ఒక్కరిని కదిలించింది. పైగా బ్రో నీకేంకాదు అంటూ..ధైర్యం చెబుతూ పోస్టులు వెల్లువెత్తాయి. అసలేం జరిగిందంటే..21 ఏళ్ల వ్యక్తి హృదయ విదారక పోస్ట్ నెట్టింట ప్రతి ఒక్కరిని కంటతడిపెట్టేలా చేసింది. ఆ పోస్ట్లో అంతలా ఏముందంటే..అతడు 2023 నుంచి స్టేజ్4 కొలొరెక్టల్ కేన్సర్(colorectal cancer)తో పోరాడుతున్నట్లు వెల్లడించాడు. నెలలతరబడి కీమోథెరపీలు, ఆస్పత్రుల్లో గడిపిన తదనంతరం వైద్యులు ఈ ఏడాదికి మించి బతకలేడని నిర్థారించారని షేర్ చేసుకున్నాడు. "దీపావళి పండుగ సమీపిస్తుండటంతో బహుశా ఇదే నా చివరి దీపావళి పండుగ అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. త్వరలో దీపావళి రాబోతోంది అంతా దీపాలు వెలిగించి..సందడిగా ఉంటే..తన హృదయ దీపం ఆరిపోయి..జీవితం ముగిసిపోనుంది అని భావోద్వేగంగా పోస్ట్లో రాసుకొచ్చాడు. నా జీవితం ముగిసిపోతుంది అని తెలిసి కూడా ఎలా సాగుతుందో చూడటం వింతగా ఉంది. వచ్చే ఏడాది నా స్థానంలో మరొకరు దీపాలు వెలిగిస్తారు. సొంత వ్యాపారాన్ని ప్రారంభించి, ఓ కుక్కను పెంచుకోవాలనుకున్నా నా కల, ఆకాంక్షలు అన్ని జారిపోతున్నట్లుగా ఉంది. ఆలోచనలన్నీ మసకబారుతున్నాయి. నా తల్లిదండ్రుల ముఖాలో తీవ్ర దుఃఖం కనిపిస్తుంది. అయినా ఇదంతా నేనెందుకు పోస్ట్ చేస్తున్నానో కూడా నాకు నిజంగా తెలియదు. బహుశా నిశబ్దంగా వెళ్లిపోవడం ఇష్టం లేక ఇలా పోస్ట్లో బిగ్గరగా చెప్పలనేమో." అంటూ తన పోస్ట్ని ముగించాడు. ఈ పోస్ట్ నెట్టింట వేలాదిమంది నెటిజన్ల హృదయాలను తాకింది. చాలామంది ఉన్న సమయం ఉపయోగించుకోండి, ధైర్యంగా ఉండండి అని భరోసా ఇవ్వగా మరికొందరూ మాత్రం ఏదైనా మిరాకిల్ జరగొచ్చు కేన్సర్ మీ నుంచి దూరంగా వెళ్లిపోవచ్చు అని ఆశను రెకెత్తించేలా పోస్టుల పెట్టారు. (చదవండి: జోంబీ' డ్రగ్ జిలాజైన్: అచ్చం 'జాంబీ రెడ్డి' మూవీ సీన్ని తలపించేలా..) -
దీపావళి సెలవులు: ఏ రాష్ట్రాల్లో ఎన్ని రోజులు?.. తెలంగాణ, ఏపీల సంగతేంటి?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి సందడి మొదలయ్యింది. దీపాల పండుగను దేశమంతటా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా పాఠశాలలకు, విద్యాసంస్థలకు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటిస్తుంటారు. దీపావళి వేళ ఏ రాష్ట్రంలో ఎన్నిరోజులు సెలవులు ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.ఢిల్లీలో..దేశ రాజధాని ఢిల్లీలోని దీపావళి వేడుకలను అక్టోబర్ 20న జరుపుకుంటున్నారు. గోవర్ధన్ పూజకు అక్టోబర్ 22న జరుపుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ రెండు రోజులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కాగా దీపావళి సందర్భంగా నోయిడాలోని పాఠశాలలను అక్టోబర్ 20 నుండి 23 వరకు మూసివేయనున్నారు. గురుగ్రామ్లో అక్టోబర్ 19 నుండి అక్టోబర్ 23 వరకూ సెలవులు ప్రకటించారు.ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని పాఠశాలలకు అక్టోబర్ 20 నుండి 23 వరకు దీపావళి సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 24న పాఠశాలలను తిరిగి తెరవనున్నారు. అక్టోబర్ 19 ఆదివారం కావడంతో యూపీలోని విద్యార్థులు ఐదు రోజుల సెలవులు ఎంజాయ్ చేయనున్నారు. ఈ సారి చిన్నారులకు దీపాల పండుగను జరుపుకునేందుకు తగినంత సమయం దొరికింది.హర్యానా హర్యానాలోని పాఠశాలలకు అక్టోబర్ 19 నుండి 23 వరకు దీపావళి పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.రాజస్థాన్రాజస్థాన్లోని పాఠశాలలకు దీపావళి సందర్భంగా అక్టోబర్ 13 నుండి 24 వరకు సెలవులు ప్రకటించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు మొత్తం 12 రోజుల పాటు దీపావళి సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు.బీహార్ దీపావళి,ఛట్ పూజల సందర్భంగా బీహార్లోని పాఠశాలలు అక్టోబర్ 18 నుండి 29 వరకు మూసివేయనున్నారు. ఈ సెలవులను ఇంకా పొడిగించనున్నారని తెలుస్తోంది.పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లోని పాఠశాలలను అక్టోబర్ 24 వరకు మూసివేయనున్నారు. స్థానిక విద్యార్థులు ఇటీవలే దుర్గా పూజ సెలవులను ఎంజాయ్ చేశారు.కర్ణాటకరాష్ట్ర సామాజిక, విద్యా సర్వేలో ఉపాధ్యాయులు పాల్గొనేందుకు వీలుగా కర్ణాటకలోని పాఠశాలలు అక్టోబర్ 18 వరకు మూసివేశారు ఇప్పుడు అదనంగా అక్టోబర్ 20 (నరక చతుర్దశి), అక్టోబర్ 22 (బలిపాడ్యమి/ దీపావళి) తేదీలలో పాఠశాలలు మూసివేయనున్నారు.జమ్ముకశ్మీర్ జమ్ముకశ్మీర్లోని అధికారులు వాతావరణ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు. జమ్ము డివిజన్లోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి పాఠశాల కార్యకలాపాలను ప్రభావితం చేస్తున్నాయి. వాతావరణ పరిస్థితుల ఆధారంగా పాఠశాలకు సెలవులు ప్రకటించనున్నారు.ఒడిశాదీపావళి, కాళి పూజ వేడుకల కోసం ఒడిశాలోని పాఠశాలలను అక్టోబర్ 20న మూసివేయనున్నారు.అసోందీపావళి, కాళి పూజ వేడుకల కోసం అక్టోబర్ 20న అసోంలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.తెలుగు రాష్ట్రాలలో..రాబోయే దీపావళికి.. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లలో ఒకేరోజు(అక్టోబర్ 20 సోమవారం) అధికారిక సెలవు ప్రకటించారు. అయితే దానికి ముందు రోజు ఆదివారం రావడంతో రెండు రోజులు సెలవులు వస్తున్నాయి. -
Diwali 2025: దీపావళికి అలరించనున్న గిఫ్ట్ ఫ్యాక్స్
దీపావళి పండుగకు నగరం ముస్తాబవుతోంది.. ముఖ్యంగా ఈ పండుగలో స్వీట్స్దే అగ్రభాగం.. ఈ సందర్భంగా ఇచ్చిపుచ్చుకునే గిఫ్ట్స్ ప్యాకింగ్ కూడా ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా పలుకరించుకుని స్వీట్స్, లేదా డ్రైఫ్రూట్స్ వంటి గిఫ్ట్ బాక్సులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ సారి దీపావళికి అందమైన ర్యాపింగ్తో ఆకట్టుకునే గిఫ్ట్ ప్యాక్స్ హడావుడి మొదలైంది.. మార్కెట్లో వివిధ రకాల స్వీట్స్, డ్రైఫ్రూట్స్ వంటి వాటితో ఈ గిఫ్ట్ ప్యాకింగ్స్ అందుబాటులో ఉన్నాయని పలువురు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రంగు రంగుల ర్యాపింగ్, రకరకాల మోడళ్లలో గిఫ్ట్ ప్యాకింగ్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే పలువురు ఔత్సాహికులతో నగరంలోని బేగంబజార్ సందడిగా కనిపిస్తోంది. సంప్రదాయ వెరైటీ డిజైన్లలో తయారు చేసిన డ్రైఫ్రూట్స్, స్వీట్ బాక్సులు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. ఇవి వివిధ రకాల ఆకారాల్లో, వివిధ రకాల సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. ఇమిడిపోయిన సంప్రదాయం.. దీపావళికి గిఫ్ట్ బాక్సులు ఇచ్చే సంస్కృతిని మార్వాడీలు, గుజరాతీలు ఎక్కువగా పాటిస్తారు. ఇదే పద్ధతి ప్రస్తుతం నగరంలోని ప్రజల్లోనూ క్రమంగా ఇమిడిపోయింది. దీంతో పండుగ పూట ఇంటికి వచ్చే అతిథులకు, లేదా ఇరుగు పొరుగు వారికి, మరీ ముఖ్యంగా సన్నిహితులకు ఈ గిఫ్ట్ బాక్సులు అందజేస్తుంటారు. కొనుగోళ్లు షురూ.. ఇప్పటికే బేగంబజార్లో కొనుగోళ్లు షురూ అయ్యాయి. డ్రై ఫ్రూట్ మార్కెట్ కిటకిటలాడుతోంది. స్వీట్షాపుల నిర్వాహకులు, సాధారణ ప్రజలు కొనుగోళ్లకు వస్తున్నారు. ఆకర్షణీయమైన ప్యాకింగ్స్ అందుబాటులో ఉన్నాయి. నగరంలో ఉద్యోగులు, వ్యాపారుల్లో ఈ గిఫ్ట్స్ ఇచ్చే సంస్కృతి పెరిగిపోయింది. దీంతో గిఫ్ట్ బాక్సుల అమ్మకాలకు డిమాండ్ ఏర్పడింది. – రాజ్కుమార్ టండన్, కశ్మీర్ హౌస్ యజమాని బాక్స్ల ధరలు ఇలా.. సాధారణంగా ఈ గిఫ్ట్ బాక్స్ల ధరలు రూ.250 నుంచి రూ.2 వేల వరకూ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆకర్షణీయమైన బాక్స్ల్లో బాదం, కాజు, కిస్మిస్, పిస్తా, ఆప్రికాట్తో పాటు అంజీర వంటి డ్రై ఫ్రూట్స్ పెడుతుంటారు. వీటితో పాటు కొందరు వివిధ రకాల స్వీట్లు కూడా ప్యాక్ చేస్తుంటారు. ఈ బాక్స్ల్లో డ్రైఫ్రూట్స్ 750 గ్రాములు, 500 గ్రాములు, 250 గ్రాములు ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. -
Delhi: గ్రీన్ క్రాకర్స్కు సుప్రీంకోర్టు అనుమతి
న్యూఢిల్లీ: దేశరాజధాని ప్రజలకు దీపావళికి ముందుగానే పండుగలాంటి వార్త వెలువడింది. ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కు అనుమతిస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఐదేళ్ల నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీపావళిని పురస్కరించుకొని అక్టోబర్ 18 నుంచి, 21వ తేదీ వరకు గ్రీన్ క్రాకర్స్ వెలిగించేందుకు అనుమతులు మంజూరు చేసింది. అయితే రాత్రి 8 నుంచి 10 గంటల వరకే బాణసంచా కాల్చేందుకు అనుమతిచ్చింది. ఇదేవిధంగా సర్టిఫైడ్ క్రాకర్స్ దుకాణాలవారు మాత్రమే గ్రీన్ క్రాకర్స్ విక్రయించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయి ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.ఢిల్లీ–ఎన్సీఆర్లో గ్రీన్ పటాకుల విక్రయానికి సుప్రీం కోర్టు అనుమతి మంజూరు చేసింది. అయితే ఈ-కామర్స్ ద్వారా పటాకుల విక్రయంపై నిషేధం విధించింది. అలాగే క్యూఆర్ కోడ్ ఉన్న గ్రీన్ పటాకుల విక్రయానికే అనుమతులిచ్చింది. పటాకులు విక్రయాలతో పాటు వాటిని వెలిగించే సమయంలో పోలీస్ అధికారులు ప్రత్యేక పహారా బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది. సాంప్రదాయ పటాకులు అక్రమంగా విక్రయిస్తున్నారని, వీటివలన కాలుష్యం పెరిగిపోతున్నదని కోర్టు వ్యాఖ్యానించింది. ‘అర్జున్ గోపాల్’ కేసు తీర్పు దరిమిలా అందుబాటులోకి వచ్చిన గ్రీన్ పటాకుల కారణంగా ఉద్గారాలు తగ్గినట్లు కోర్టు అభిప్రాయపడింది. నీరీ సంస్థ గ్రీన్ పటాకుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని సుప్రీంకోర్టు ప్రశంసించింది. పర్యావరణ పరిరక్షణ–సాంప్రదాయ ఉత్సవాల మధ్య సమతౌల్యం సాధించడమే లక్ష్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.గ్రీన్ క్రాకర్స్ అంటే..కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)–నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్ఈఈఆర్ఐ) ప్రకారం తక్కువ షెల్ సైజుతో, రసాయనాలు తక్కువగా వినియోగిస్తూ, బూడిద వాడకుండా తయారు చేసే బాణసంచాను గ్రీన్ క్రాకర్స్గా పిలుస్తున్నారు.మామూలుగా వాడే హానికరమైన సల్ఫర్ నైట్రేట్స్, సోడియం, లెడ్, మెగ్నీషియం, బేరియం, అత్యంత హానికరమైన బ్లాక్ పౌడర్ను వీటిలో వాడరు. అందుకే వీటితో కాలుష్యం 30% తక్కువగా ఉంటుంది. శబ్ద కాలుష్యమూ తక్కువే. సాధారణ బాణసంచా 160 డెసిబుల్ శబ్దంతో పేలితే ఇవి 110 డెసిబుల్ శబ్దం చేస్తాయి. వాయు కాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లో గ్రీన్ క్రాకర్స్కు మాత్రమే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అనుమతినిచ్చింది.గ్రీన్ క్రాకర్స్ను గుర్తించడం ఎలా ?.. ఎన్ఈఈఆర్ఐ ఫార్ములా ప్రకారం ప్రస్తుతం తమిళనాడులో ప్రఖ్యాత బాణాసంచా కేంద్రమైన శివకాశీలోనే తయారు చేస్తున్నారు. వీటిని గుర్తించడానికి వీలుగా సీఎస్ఐఆర్–ఎన్ఈఈఆర్ఐ ఆకుపచ్చ రంగు లోగోను బాణాసంచా బాక్సులపై ముద్రిస్తున్నారు. క్యూఆర్ కోడ్ కూడా ఈ బాక్సులపై ఉంటుంది. గ్రీన్ క్రాకర్స్ మూడు రకాలున్నాయి. స్వాస్: వీటిని కాల్చినప్పుడు నీటి ఆవిరి కూడా విడుదలై గాల్లో ధూళిని తగ్గిస్తుంది. గాలిలో సూక్ష్మ ధూళికణాలు 30% తగ్గుతాయిస్టార్: వీటిలో పొటాషియం నైట్రేట్, సల్ఫర్ వాడరు వాయు కాలుష్యానికి కారణమైన పర్టిక్యులర్ మేటర్ (పీఎం)ని తగ్గించడంతో పాటు శబ్ద కాలుష్యాన్ని కూడా నివారిస్తాయిసఫల్: ఈ రకమైన గ్రీన్ క్రాకర్స్లో మెగ్నీషియమ్కు బదులుగా అల్యూమినియమ్ తక్కువ మోతాదులో వాడతారు.సంప్రదాయ బాణాసంచాతో పోలిస్తే శబ్ద కాలుష్యం తక్కువ. కేంద్రం లైసెన్స్ ఇచ్చిన కేంద్రాల్లోనే గ్రీన్ క్రాకర్స్ కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. -
మరింత తగ్గిన ఈ కారు ధర: రూ.3.70 లక్షలు!
భారతదేశంలో ఎక్కువమంది మారుతి సుజుకి కార్లను కొనుగోలు చేస్తుంటారు. దీనికి కారణం మల్టిపుల్ మోడల్స్ ఉండటం, ధరలు కొంత తక్కువ కావడం. ఇందులో చెప్పుకోదగ్గ కారు.. దశాబ్దాల చరిత్ర కలిగిన మోడల్ మారుతి ఆల్టో కే10. జీఎస్టీ తగ్గింపు, పండుగ ఆఫర్స్ కలిసి రావడంతో దీని ధర ఇప్పుడు మరింత తగ్గిపోయింది.రూ. 4.23 లక్షల ధర వద్ద లభిస్తున్న మారుతి ఆల్టో కే10 బేస్ వేరియంట్ ఇప్పుడు రూ. 3.70 లక్షల ధరకే లభిస్తుంది. అంటే దీని ధర మునుపటి కంటే రూ. 53000 తక్కువ. టాప్ వేరియంట్ అయిన VXi Plus (O) AMT ధర ఇప్పుడు రూ. 64000 తగ్గి.. రూ. 5.45 లక్షలకు అందుబాటులో ఉంది. జీఎస్టీ 2.0 కంటే ముందు దీని ధర రూ. 6.09 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).ఇదీ చదవండి: ఎన్ని కార్లు ఉన్నా.. బ్లాక్ బీస్ట్ అంటేనే ఇష్టం: ఆనంద్ మహీంద్రామారుతి ఆల్టో కే10 మల్టిపుల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. కంపెనీ అన్ని వేరియంట్ల ధరలను.. కొత్త జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత తగ్గించింది. ఈ కారు చూడటానికి పరిమాణంలో కొంత చిన్నగా ఉన్నప్పటికీ.. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి రోజువారీ వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కారణంగానే.. ఈ కారును చాలామంది ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. -
దీపావళి కానుకగా రూ. 2 లక్షల నగదు..!
పండుగ సమీపిస్తున్న వేళ ఎప్పుడో దాచిన డబ్బు అనుకోకుండా బయటపడితే..ఆ సంతోషమే వేరేలెవల్. అందులోనూ దీపావళి అంటే మహాలక్ష్మీదేవి పండుగ..అమ్మ ముందుగానే ఇలా కనక వర్షం కురిపిస్తే..ఆ సంతోషం మాటలకందనిది. అలాంటి ఆనందంలోనే తడిసిముద్దవుతోంది ఈ కుటుంబం.దీపావళి పండుగ సమయం అని ఇల్లంతా క్లీన్ చేస్తుండగా..ఎప్పుడో దాచిన డబ్బులు బయటపడ్డాయి. ఆ సంగతే మర్చిపోయింది ఆ ఫ్యామిలీ. అనుకోకుండా పండుగ నేపథ్యంలో ఇల్లు శుభ్రం చేస్తుండగా పాత డీటీహెచ్ బాక్స్లో దాచిన సొత్తు బయటపడింది. దగ్గర దగ్గర రెండు లక్షలు ఉండటంతో ఆ కుంటుంబం సంతోషానికి అవధులే లేకుండా పోయింది. "మహాలక్ష్మీ ముందుగానే మమ్మల్ని కటాక్షించింది. ఇది దీపావళి పండుగ ఆశీర్వాదమే అంటూ పట్టరాని ఆనందంతో ఉబ్బితబ్బిబవ్వుతోంది ఆ కుటుంబం". అయితే అందులో ఉన్నవన్నీ రూ. 2 వేలు నోట్లు కావడం గమనార్హం. బహుశా ఈ డబ్బుని మా నాన్నగారు నోట్లు రద్దు చేయకమునుపు దాచి ఉంచి ఉండొచ్చుని..ఆయనకి ఈ సంగతి ఇంకా తెలియదంటూ రెడ్డిట్లో ఈ సంగతిని షేర్ చేయడంతో నెట్టింట ఈ విషయం వైరల్గా మారింది. అయితే నెటిజన్లు తక్షణమే ఆ నోట్లను మార్చుకోండి. ఆర్బీఐని సంప్రదించే మందు ఆ డబ్బు ఎక్కడిది ఇప్పుడే ఎందుకు మార్చాల్సి వచ్చిందో తెలియజేయాలన్న విషయం మర్చిపోకండి బీకేర్ఫుల్ అని సూచిస్తూ పోస్టులు పెట్టారు. కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మే 19, 2023న చలామణి నుంచి రూ.2000 డినామినేషన్ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం, రూ.5,884 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ఇప్పటికీ చెలామణిలో ఉన్నాట్లు సమాచారం.(చదవండి: ఇదేందీ ఇది.. చనిపోయిన వాళ్లతో జీవించడమా..?! పర్యాటకులు సైతం..) -
చిన్న కారు.. పెద్ద డిస్కౌంట్!
2025 ఆర్థిక సంవత్సరంలో 1,98,451 యూనిట్ల అమ్మకాలతో, మారుతి సుజుకి వేగన్ ఆర్.. టాటా పంచ్ వంటి పోటీదారులను అధిగమించి నాలుగో సారి అత్యధికంగా అమ్ముడైన కారుగా తన కిరీటాన్ని నిలుపుకొంది. ఎస్యూవీలు డిమాండ్లో ఉన్నా, ఈ ప్రాక్టికల్ హ్యాచ్బ్యాక్ తన ప్రత్యేక స్థానాన్ని నిలుపుకొంటోంది.జీఎస్టీ 2.0 అమలుతో మారుతీ సుజుకీ ధరల నిర్మాణాన్ని మారుస్తూ వాగన్ ఆర్ మోడళ్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. ఇది పండుగ సీజన్లో బడ్జెట్ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. దీంతో ఈ దీపావళికి కారు కొనాలనుకుంటున్నవారికి మంచి అవకాశంగా భావిస్తున్నారు.వాగన్ ఆర్ ధరల తగ్గింపులు1.0L LXI (మ్యాన్యువల్) – రూ.5,78,500 నుండి రూ.4,98,900 (రూ.79,600 తగ్గింపు)1.0L VXI (మ్యాన్యువల్) – రూ.6,23,500 నుండి రూ.5,51,900 ( రూ.71,600 తగ్గింపు)1.2L ZXI (మ్యాన్యువల్) – రూ.6,52,000 నుండి రూ.5,95,900 ( రూ.56,100 తగ్గింపు)1.2L ZXI+ (మ్యాన్యువల్)– రూ.6,99,500 నుండి రూ.6,38,900 (రూ.60,600 తగ్గింపు)1.0L VXI AMT – రూ.6,73,500 నుండి రూ.5,96,900 ( రూ.76,600 తగ్గింపు)1.2L ZXI AMT– రూ.7,02,000 నుండి రూ.6,40,900 (రూ.61,100 తగ్గింపు)1.2L ZXI+ AMT– రూ.7,49,500 నుండి రూ.6,83,900 ( రూ.65,600 తగ్గింపు)1.0L LXI CNG– రూ.6,68,500 నుండి రూ.5,88,900 ( రూ.79,600 తగ్గింపు)1.0L VXI CNG – రూ.7,13,500 నుండి రూ.6,41,900 ( రూ.71,600 తగ్గింపు)వాగన్ ఆర్ ప్రత్యేకతలు341 లీటర్ల బూట్ స్పేస్ (సెగ్మెంట్లో టాప్)1.0L (67 BHP), 1.2L (89 BHP) ఇంజిన్లుసీఎన్జీ మోడల్ – 32 km/kg మైలేజ్ప్రాక్టికల్ డిజైన్, సులభమైన ఎంట్రీ/ఎగ్జిట్ -
వెలుగుల పండుగ : రంగు రంగుల ప్రమిదలు రెడీ!
దీపావళి పర్వదినాన్న పురస్కరించుకుని ప్రమిదలతో పాటు బొమ్మల కొలువులు, వ్రతాలకు ఉపయోగించు కునే కుందుల తయారీలో మహిళలు నిమగ్నమయ్యారు. కుమ్మరి కళాకారులు సంప్రదాయబద్ధంగా చేతులతోనే ప్రమిదలతో పాటు కుందులు తయారుచేసి చక్కని డిజైన్లకు ఆకర్షణీయమైన రంగులు వేస్తూ మార్కెట్లోకి పంపిణీ చేస్తున్నారు. అమీర్పేటలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెనుక ఈ వృత్తి కళాకారులు, మహిళలు వీటి తయారీలో నిమగ్నమయ్యారు. కుందులకు, ప్రమిదలకు తగిన రంగులు అద్దుతూ ఆకట్టుకునేవిధంగా తీర్చిదిద్దుతున్నారు. వీటిని మార్కెట్లో విక్రయించేందుకు పలువురు వ్యాపారులు ఆర్డర్లు ఇవ్వడంతో తమకు చేతినిండా పని దొరికిందని మహిళలు చెబుతున్నారు. వీటి తయారీ కోసం ఈ కుటుంబాలన్నీ ముఖ్యంగా మహిళలు నిమగ్నమయ్యారు. ప్రతియేటా దీపావళికి రెండు నెలల ముందు నుంచే వీటి తయారీపై దృష్టి పెడతామని కుమ్మరి శ్రీను తెలిపారు. ఇదీ చదవండి: ముద్దుల కోడలితో నీతా అంబానీ : బుల్లి బ్యాగ్ ధర ఎన్ని కోట్లో తెలుసా? -
Diwali 2025: ఆ పండుగ పేరుతోనే రెండు గ్రామాలు..కానీ అక్కడ..
దీపావళి అనగానే టపాసులు, బాణ సంచాలతో సరదాగా సాగే పండుగ. పెద్దలు సైతం చిన్నపిల్లల్లా మారిపోయి ఎంజాయ్ చేసేలా చేసే వేడుక ఇది. ఈ పండుగ ఇంటే అందరికీ మహా ప్రీతి. అలాంటి పండుగ పేరుతోనే రెండు గ్రామాలు ఉన్నాయి. అది కూడా ఒకే జిల్లాలో రెండు గ్రామాల పేర్లు దీపావళి. అయితే ఒక చోట ఈ పండుగ ఐదు రోజులు పాటు ఘనంగా నిర్వహిస్తే..మరోచోట మాత్రం ఏ ఇంట్లో దీపమే వెలిగించరు. మరి ఆ పండుగ పేరుతో ఏర్పడిన ఆ రెండు గ్రామల వెనుక ఉన్న ఆసక్తికర కథేంటో తెలుసుకుందామా..!.. దీపాల కాంతితో కళకళలాడే ఈ దీపావళి పండుగ పేరుతో ఉన్న రెండు గ్రామాలు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. ఒకటి శ్రీకాకుళం జిల్లాకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గారమండలంలో ఉండగా, మరొకటి టెక్కలి మండలం అయోధ్యాపురం పంచాయతీ పరిధిలో మరో గ్రామం ఉంది. ఈ రెండు గ్రామాల పేర్లు 'దీపావళి'. వాటికి ఈ పండుగ పేరు ఎలా వచ్చిందంటే..గారమండలంలోని ఊరుకి ఆ పేరు ఎలా వచ్చిందంటే..శ్రీకాకుళం ప్రాంతాన్ని పరిపాలించిన కళింగరాజు కూర్మనాథాలయానికి వచ్చే వారట. స్వామి దర్శనం చేసుకుని తిరిగి వెళుతుండగా.. స్ప్రుహ తప్పి పడిపోయారు. అప్పుడు అక్కడ ఉండే స్థానికులు ఆ రాజుకి సపర్యలు చేశారు. కొద్దిపేపటికి మెలుకువ వచ్చిన తర్వాత రాజు తనకు సపర్యలు చేసిన వారిని ఈ గ్రామం పేరెంటని అడగగా..తమ ఊరికి పేరు లేదని చెప్పారట గ్రామస్తులు. దాంతో రాజుగారు తనకు దీపావళి నాడు ఇక్కడి ప్రజలు ప్రాణదానం చేసి సాయం చేశారు కాబట్టి ఈ ఊరు పేరు 'దీపావళి' అని నామకరణం చేశారని అక్కడ స్థానికులు చెబుతున్నారు. అధికారిక రికార్డుల్లో సైతం ఈ గ్రామానికి అదే పేరు స్థిరపడి ఉండటం విశేషం. ఆ పండుగ రాజుగారి రాజరికదర్పానికి తగ్గట్టుగా ..ఆ రేంజ్లోనే అక్కడి ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారట. మొత్తం ఐదు రోజుల పాటు ఘనంగా ఈ పండుగను నిర్వహిస్తారట. అంతేగాదు గ్రామం మొత్తం వేల దీపాలను వెలిగించి..నాటి చారిత్రక ఘటనకు గుర్తుగా తమ గ్రామం ప్రమిదల కాంతితో దేదీప్యమానంగా వెలిగిపోయాల వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ ఊరికి మాత్రం గమ్మత్తుగా వచ్చిందా పేరు..శ్రీకాకుళం జిల్లాలోనే టెక్కలి మండలం అయోధ్యాపురం పంచాయతిలో ఉన్న ఈ గ్రామం పేరు కూడా 'దీపావళినే'. అయితే దీన్ని మొదట్లో చుట్టుపక్కల గ్రామల ప్రజలు దీపాల పేటగా పిలిచేవారట. రానురాను వాడుకభాషలో దీపావళి ఊరుగా స్థిరపడిందట . అయితే ఇక్కడ ప్రజలెవ్వరూ దీపావళి పండుగను జరుపుకోరు. అక్కడ ఏ ఒక్క ఒక్క ఇంట్లో కూడా ప్రమిదలు వెలిగించరు. ఎందుకంటే..ఎలుక కారణంగా దూరమైన పండుగ..పూర్వం ఈ గ్రామంలో ప్రతి ఇల్లు తాటాకు గుడిసెలే. పైగా కరెంటు సదుపాయం కూడా ఉండేది కాదట. దీంతో ఇళ్లల్లో నూనె దీపాలు వెలిగించి ఉంచేవారట. దీపావళి పండుగ రోజు ఓ ఎలుక దీపాన్ని దొర్లించడంతో ఓ గుడిసెకు అంటుకున్న మంటలు ఊరంతో వ్యాపించి..మొత్తం గ్రామంలో విషాదం నెలకొందట. దాంతో అప్పటి నుంచి ఈ గ్రామంలో దీపావళి పండుగనే జరుపుకోవడం లేదట. అంతేగాదు ఇక్కడ నాగుల చవితిని కూడా జరుపుకోరట. ఒకవేళ ఎవ్వరైన చేస్తే..ఆ ఇంట్లో ఎవ్వరో ఒకరు చనిపోవడం జరుగుతుందట. దాంతో అక్కడి స్థానిక ప్రజలు ఈ రెండు పండుగలను ఎట్టిపరిస్థితుల్లోనూ జరుపుకోరని చెబుతున్నారు. ఈ మూఢనమ్మకాలకు తిలోదాకాలు ఇచ్చి..ఎలాగైనా ఈ పండుగను మిగతా గ్రామాల మాదిరిగానే చేసుకోవాలని అక్కడి యువత గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు పలువురు పెద్దలు చెబుతుండటం విశేషం.(చదవండి: చంద్రభాగ బీచ్..! సైకత శిల్ప వేదిక..) -
దివాలీ బాష్: నీతా అంబానీ స్టన్నింగ్ లుక్ (ఫొటోలు)
-
చాక్లెట్ ప్రేమికుల కోసం ‘ఉత్సవ టేబుల్’
అదేదో వ్యాపార ప్రకటనలో చెప్పినట్లు.. ‘తియ్యని వేడుక చేసుకుందామా’ అనే పదం ఎంత తియ్యగా అనిపిస్తుందో.. అదేరీతిలో.. సమయం సందర్భం ఏదైనా.. అది మొదలయ్యేది మాత్రం ‘తియ్యని వేడుక’తోనే.. ఇప్పుడీ సోదంతా ఎందుకంటే.. ప్రస్తుతం దీపావళి పండగ సమీపిస్తున్న నేపథ్యంలో స్వీట్స్కు ఉన్న ప్రాముఖ్యత వేరు. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ తియ్యటి గిఫ్ట్ ప్యాకింగ్స్ ఎంచుకుంటారు.. ప్రతీ ఇంటా వెలుగులు చిమ్మే ఈ దీపావళి సీజన్లో మనం చేసుకునేది కేవలం ఉత్సవం కాదు.. ఓ ఆత్మీయ కలయిక. స్నేహాన్ని బలపరుచుకోవడం, ఆనందాన్ని పంచుకోవడం అనే భావనల సమ్మేళనం. దీపావళి నేపథ్యంలో నగరంలో స్వీట్లు, చాక్లెట్ల సందడి గురించి తెలిసిందే. అయితే ఈసారి పండుగకు పశ్చిమ గోదావరి జిల్లా కోకో తోటల నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్ వరకూ సాగిన పంచదార రుచి కథలతో.. శ్రమ, కళ, ఫ్యాషన్ సమ్మిళిత చాక్లెట్ ఉత్సవాన్ని నగరవాసులకు పరిచయం చేస్తోంది మనం చాక్లెట్. ఈ సారి దీపావళి ఎడిషన్–2025లో భాగంగా మనం ‘ఉత్సవ టేబుల్’ అనే వినూత్న ఆలోచన చుట్టూ తన సృజనాత్మకతను విస్తరించింది. పంచుకోడానికి, రుచి చూడడానికి, ఆ అనుభూతిని పొందడానికి ఎన్నో మధుర క్షణాలను చాక్లెట్ రూపంలో అందించింది. పాశ్చాత్య శైలితో కాకుండా, భారతీయ భావనతో రూపొందిన ఈ కలెక్షన్లో ప్రతి డబ్బాలో గోదావరి కథలతో ఒక కొత్త అనుభవాన్ని పంచుతోంది. మనం చాక్లెట్ ఖార్ఖానా భారతదేశంలోని మొదటి చాక్లెట్ బ్రాండ్. ఈ ఖార్ఖానాలో ఆంధ్రప్రదేశ్లోని పశి్చమ గోదావరి జిల్లాలో పండించిన చక్కటి రుచి గల కోకో బీన్స్తో తయారు చేసిన చాక్లెట్తో తయారు చేయబడిన 300 కంటే ఎక్కువ ఉత్పత్తులు నగరంలోని విభిన్న రుచులను ఆస్వాదించే చాక్లెట్ ప్రియులను అలరిస్తున్నాయి. డిజిటల్ ఆర్టిస్ట్ నమ్రతా కుమార్ సృష్టించిన ప్రత్యేక డిజైన్లు ఈ ప్యాకేజింగ్కి కొత్త ఉత్సవ రూపాన్ని ఇస్తున్నాయి. ఆమె చిత్రాలలో కేవలం వేడుక కాదు, సమాజం, భాగస్వామ్యం, ఆనందం అనే విలువలు ప్రతిబింబిస్తున్నాయి. దీపావళి అనేది కేవలం వెలుగుల పండుగ కాదు, మనసులు దగ్గరయ్యే సందర్భం. ఆ భావనను మానం చాక్లెట్ తన ప్రత్యేక రుచులతో మరింత బలపరుస్తోంది. ఇండో–అమెరికన్ రుచులతో తయారు చేస్తున్న ఈ చాక్లెట్స్ ప్రత్యేకమైన వేగన్ స్టైల్లో తయారు చేశారు. ఈ చాక్లెట్స్ ఆరోగ్యకరమైన సమ్మేళనాలతో ఏ వయసు వారైనా ఇష్టంగా తీనగలిగే విధంగా రూపోందించారు. ఈ ఎడిషన్లో డార్క్చాక్లెట్–ఆరెంజ్ క్లస్టర్స్, గుంటూరు మిర్చి–డ్రింకింగ్ చాక్లెట్ మిక్స్, సీ సాల్ట్ స్ప్రింకిల్ థిన్స్, గోదావరి కోకో నిబ్స్ థిన్స్, నట్టీ ప్రాలిన్ బార్క్స్, పిస్తా ఫడ్జ్ ఇన్క్లూజన్ టాబ్లెట్, ఇండియన్ ఆరిజిన్ టాబ్లెట్ నెం.6 వంటి ప్రత్యేక ఉత్పత్తులు ఉన్నాయి. వేగన్ స్టైల్లో..(చదవండి: Man Name Makes Record: 'పేరు'తో ప్రపంచ రికార్డు..! ఏకంగా చట్టంలోనే మార్పులు చేసి..) -
దీపావళి పండుగ ప్రయాణాలకు డిమాండ్
దీపావళి సందర్భంగా ప్రయాణాలు, హోటల్ బుకింగ్లకు బలమైన డిమాండ్ కనిపిస్తోంది. దీపావళి సోమవారం రావడంతో, వరుస సెలవుల నేపథ్యంలో పట్టణాలు, విహార ప్రదేశాలు, వివిధ పట్టణాల మధ్య బస్ సేవలకు జోరుగా బుకింగ్లు నమోదవుతున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 95–100 శాతానికి చేరింది. జీఎస్టీ సంస్కరణలతో మధ్యశ్రేణి హోటళ్లకు డిమాండ్ ఏర్పడినట్టు హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఏఐ) ప్రెసిడెంట్ కేబీ కచ్చు తెలిపారు.ఈ ఏడాది దీపావళి కారణంగా వారాంతం ఎక్కువగా ఉండడంతో మెరుగైన పండుగ అనుభవం కోసం ఎక్కువ మంది ముందుగానే తమ ప్రయాణాలకు ప్రణాళిక వేసుకున్నట్టు ఎబిక్స్ ట్రావెలర్స్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ విక్రమ్ ధావన్ తెలిపారు. ప్రధానంగా టైర్–2, 3 పట్టణాల్లో వృద్ధి ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. ఎయిర్లైన్ బుకింగ్లలోనూ 65–70% విహార పర్యటనలకు సంబంధించే ఉన్నట్టు తెలిపారు. క్రితం ఏడాది దీపావళి సీజన్తో పోల్చితే ఈ విడత 15–20% బుకింగ్లు పెరిగాయని చెప్పారు.ఇదీ చదవండి: మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సలహా -
దీపావళి డిన్నర్ పార్టీలో బాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)
-
దివాలీ వైబ్స్, స్టార్ కిడ్ గ్లామర్స్ లుక్స్..
-
కాలిఫోర్నియా రాష్ట్ర సెలవుగా దీపావళి
న్యూయార్క్: అమెరికాలో దీపావళిని అధికారిక రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించిన మూడో రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. ఈ మేరకు కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ మంగళవారం అసెంబ్లీ సభ్యుడు ఆష్ కల్రా ప్రవేశపెట్టిన బిల్లుపై సంతకం చేసి, దీపావళిని రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించారు. అక్టోబర్ 2024లో దీపావళిని అధికారిక రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించిన పెన్సిల్వేనియా మొదటి రాష్ట్రంగా నిలవగా, ఈ సంవత్సరం కనెక్టికట్ ఆ తర్వాతి స్థానంలో ఉంది. న్యూయార్క్ నగరంలో పబ్లిక్ పాఠశాలలకు దీపావళిని సెలవుగా ప్రకటించారు. ‘భారతీయ అమెరికన్లు మరింత సాంస్కృతిక సమ్మిళితం, గుర్తింపు దిశగా సాగుతున్న ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు. ఈ గుర్తింపు దీపావళి జీవకళనే కాదు, యునైటెడ్ స్టేట్స్లో భారతీయ అమెరికన్ల శాశ్వత ప్రభావాన్ని కూడా ప్రతిబింబిస్తుంది’.. ఇండియాస్పోరా వ్యవస్థాపకుడు, చైర్మన్ ఎంఆర్ రంగస్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బిల్లు సహ రూపకర్త అయిన అసెంబ్లీ సభ్యురాలు డాక్టర్ దర్శనా పటేల్ను అభినందించారు. -
ఆవిష్కరణలను అణగదొక్కేలా నిబంధనలు ఉండకూడదు..
నిబంధనలు, నియంత్రణలనేవి కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేలా ఉండాలే తప్ప అణగదొక్కేలా ఉండకూడదని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. వాటిని అణగదొక్కే పరిస్థితి ఉంటే ఇంకో దగ్గరెక్కడో ఆవిష్కరణలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. నియంత్రణలనేవి సంస్థ ప్రాతిపదికగా కాకుండా కార్యకలాపాల ప్రాతిపదికన ఉండాలని సుబ్రహ్మణ్యం గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.‘ఒకవేళ నేను బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తుంటే, నన్ను బ్యాంకరుగా పరిగణించి, దానికి తగ్గ నిబంధనలు వర్తింపచేయాలి. అదే ఏదైనా ఫండ్ను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే, బ్యాంకరుగా కాకుండా ఫండ్ డిస్ట్రిబ్యూటరు నిబంధనలను వర్తింపచేయాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఈ తరహా విధానంపై ఆర్థిక శాఖ, నియంత్రణ సంస్థలు లోతుగా చర్చిస్తున్నట్లు వివరించారు. మరోవైపు, జీఎస్టీ 2.0 తర్వాత, దీపావళికన్నా ముందే మరో విడత సంస్కరణలను ప్రకటించే అవకాశం ఉందని సుబ్రహ్మణ్యం చెప్పారు. నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గౌబా సారథ్యంలోని కమిటీ ఇప్పటికే వీటికి సంబంధించిన నివేదికల తొలి సెట్ను సమర్పించినట్లు పేర్కొన్నారు. పొరుగుదేశాలతో పటిష్ట సంబంధాలు ఉండాలి..చైనాతో పాటు ఇతర పొరుగు దేశాలతో భారత్కి పటిష్టమైన వాణిజ్య సంబంధాలు ఉండాలని సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. మొత్తం యూరోపియన్ యూనియన్ వాణిజ్యంలో 50 శాతం భాగం.. అంతర్గతంగా ఆయా దేశాల మధ్యే జరుగుతుందని ఆయన చెప్పారు. భారత్ విషయానికొస్తే బంగ్లాదేశ్ 6వ అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగాను, టాప్ 10లో నేపాల్ ఉండేదని తెలిపారు. చైనా పెట్టుబడులపై ఆంక్షలు ఎత్తివేస్తారా అనే ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకపోయినప్పటికీ, భారత్కి ఆ దేశం కీలక సరఫరాదారని సుబ్రహ్మణ్యం చెప్పారు. 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని విస్మరించజాలమని పేర్కొన్నారు. అలాంటి దేశానికి మరింతగా విక్రయించలేకపోతే అర్థరహితమైన విషయం అవుతుందని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: కేంద్రం చెంతకు పంచాయితీ! -
ఈ దీపావళికి బంగారం కొనడం మరింత కష్టం!
దీపావళి సమీపిస్తున్న కొద్దీ, బంగారం, వెండి ధరలు చారిత్రాత్మక గరిష్టాలకు చేరుకుంటున్నాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, పండుగ డిమాండ్, సెంట్రల్ బ్యాంక్ విధానాల వల్ల పసిడి ధరలు మరింత పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధరలు (gold price) ఇప్పటికే 10 గ్రాములకు రూ .1,18,000 దాటగా, వెండి కిలోకు రూ .1,44,000 దాటింది. దీపావళి రోజు అంటే అక్టోబర్ 21 నాటికి బంగారం రూ .1.22 లక్షలు, వెండి (silver price)రూ .1.50 లక్షలకు చేరుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఆజ్యం పోస్తున్న ప్రపంచ పోకడలుఅంతర్జాతీయంగా, బంగారం ఔన్స్ కు 3950– 4000 డాలర్లకు చేరుకుంటుందని, అలాగే వెండి ఔన్స్ కు 49– 50 డాలర్లకు పెరుగుతుందని అంచనా. ఈ ధరల వేగానికి విశ్లేషకులు చెబుతున్న కారణాలు.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ డోవిష్ (తక్కువ వడ్డీ రేట్లు, వృద్ధికి ప్రాధాన్యం) వైఖరి, బలహీనపడుతున్న అమెరికన్ డాలర్, బలమైన ఈటీఎఫ్ ఇన్ఫ్లోలు, భారతదేశ పండుగ, వివాహ సీజన్ల నుండి బలమైన డిమాండ్.వెండికి పారిశ్రామిక డిమాండ్ సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ టెక్నాలజీస్ వంటి రంగాల నుండి పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్ కూడా వెండి ర్యాలీకి మద్దతు ఇస్తోంది. సరఫరా పరిమితులు, రూపాయి విలువ తరుగుదల మరింత ఊపందుకుంటోంది.ఇదీ చదవండి: ఆశ పెట్టి అంతలోనే.. ఒక్కసారిగా కొత్త రేట్లకు పసిడి, వెండి -
అక్టోబర్లో రిలీజయ్యే సినిమాలివే..
చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదలకు సంక్రాంతి సరైన పండగ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పందెం కోళ్లులాగా సంక్రాంతి బరిలో నిలిచేందుకు హీరోలు, దర్శక–నిర్మాతలు తెగ ఆసక్తి చూపుతుంటారు. ఈ కారణంగానే సంక్రాంతికి భారీపోటీ ఉంటుంది. సంక్రాంతి తర్వాత దసరా, దీపావళి పండగలు తమ సినిమాల విడుదలకు మంచి సమయం అని మేకర్స్ ఆలోచన. ఈ ఏడాది దసరా, దీపావళి పండగలు అక్టోబరులోనే రావడం విశేషం. సో.. సినిమా ప్రేమికులకు ఈ నెల సినిమాల పండగే అని చెప్పాచ్చు.ఈ నెల ఆరంభంలో ‘ఇడ్లీ కొట్టు, కాంతారా: చాప్టర్ 1’ వంటి డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఈ నెలలోనే రవితేజ ‘మాస్ జాతర’, సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’, ప్రియదర్శి ‘మిత్ర మండలి’, ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’, కిరణ్ అబ్బవరం ‘కె.ర్యాంప్’, సాయికుమార్, అనసూయ ‘అరి’, రక్షిత్ అట్లూరి ‘శశివదనే’ వంటి పలు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అదే విధంగా ప్రభాస్ ‘బాహుబలి’ రెండు భాగాలు కలిపి. ‘బాహుబలి: ది ఎపిక్’గా ఆడియన్స్ ముందుకు రానుంది. ఇవి మాత్రమే కాదు... ఇంకా పలు చిత్రాలు విడుదల కానున్నాయి. ఆ వివరాల్లోకి వెళదాం.బాహుబలి: ది ఎపిక్ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన చిత్రం ‘బాహుబలి’. ప్రభాస్ హీరోగా, అనుష్క, తమన్నా హీరోయిన్లుగా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ముఖ్య తారలుగా నటించారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ‘బాహుబలి: ది బిగినింగ్’ 2015 జూలై 15న, ‘బాహుబలి 2: ది కన్క్లూజన్’ 2017 ఏప్రిల్ 28న రెండు భాగాలుగా విడుదలై, బ్లాక్బస్టర్గా నిలవడంతో పాటు పలు రికార్డులు, రివార్డులు సాధించింది.‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలై పదేళ్లయిన సందర్భంగా ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. తొలి, ద్వితీయ భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఈ నెల 31న రిలీజ్ చేస్తున్నారు. ఇండియాలోనే కాదు... ఇంటర్నేషనల్ వైడ్గా ఈ చిత్రాన్ని రీ–రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ని ఇప్పటికే విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక సినిమా ఎన్ని గంటలు ఉంటుంది? ఎలాంటి రికార్డులు సొంతం చేసుకుంటుంది? అనే వివరాలు తెలియాలంటే విడుదల వరకూ వేచి చూడాలి.థియేటర్లలో జాతర రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహించారు. రవితేజ నటించిన 75వ చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో క్రేజ్ నెలకొంది. పైగా ‘ధమాకా’ (2022) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల ‘మాస్ జాతర’లో రెండోసారి జోడీగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్గా ఈ నెల 31 ప్రేక్షకుల ముందుకు వస్తోంది.‘‘రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనంలాంటి మాస్ ఎంటర్టైనర్గా ‘మాస్ జాతర’ రూపొందింది. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ చిత్రాన్ని మలిచారు భాను భోగవరపు. ‘ధమాకా’ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ అందించిన భీమ్స్ సిసిరోలియో మరోసారి రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా ‘మాస్ జాతర’ కోసం సూపర్ మ్యూజిక్ అందించారు. మా సినిమా థియేటర్లలో అసలు సిసలైన మాస్ పండగను తీసుకురాబోతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. మనసు హత్తుకునే తెలుసు కదా! ‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ చిత్రాల ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’.ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటించగా, వైవా హర్ష కీలక పాత్రపోషించారు. స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది.‘‘మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’. మనసుని హత్తుకునే కథ, స్వచ్ఛమైన ప్రేమ, అనుబంధాల నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. అద్భుతమైన భావోద్వేగాలు, వినోదాలు ప్రేక్షకులని అలరిస్తాయి. నీరజ కోన యునిక్ కాన్సెప్ట్తో తెరకెక్కించారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇటీవల విడుదల చేసిన మా మూవీ టీజర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. తమన్ మ్యూజిక్ మా సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది’’ అని మేకర్స్ తెలిపారు. ప్రేమ, వినోదాల ర్యాంప్ ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం, వినరో భాగ్యము విష్ణుకథ, క’ చిత్రాల ఫేమ్ కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘కె ర్యాంప్’. జైన్ ్స నాని రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటించారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది.‘‘లవ్, రొమాన్ ్స, యాక్షన్, ఫన్తో కంప్లీట్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘కె–ర్యాంప్’. కిరణ్ అబ్బవరం కెరీర్లో ఈ చిత్రం మరో ఫ్రెష్ అటెంప్ట్ అవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే వాణిజ్య అంశాలు మా సినిమాలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మా టీజర్ సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచింది.. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మా చిత్రం ఉంటుంది. చేతన్ భరద్వాజ్ సంగీతం మా మూవీకి ప్లస్ అవుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. నవ్వులు పంచే మిత్ర మండలి ‘బలగం, కోర్ట్’ చిత్రాల ఫేమ్ ప్రియదర్శి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిత్ర మండలి’. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్. దర్శకత్వం వహించారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారిన నిహారిక ఎన్ఎం ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమవుతున్నారు. బ్రహ్మానందం, రాగ్ మయూర్, ప్రసాద్ బెహ్రా ప్రధాన పాత్రలుపోషించారు. బీవీ వర్క్స్(బన్నీ వాసు) సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్పై కల్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది.‘‘స్నేహం ప్రధానంగా నడిచే కథతో రూపొందిన చిత్రం ‘మిత్ర మండలి’. ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఏ ఒక్కర్ని కూడా మా చిత్రం నిరుత్సాహపరచదు. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది’’ అంటూ పేర్కొన్నారు మేకర్స్.తండ్రీ కొడుకుల అనుబంధం ‘పలాస 1978, నరకాసుర, ఆపరేషన్ రావణ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు రక్షిత్ అట్లూరి. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘శశివదనే’. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కోమలి ప్రసాద్ హీరోయిన్. తమిళ నటుడు శ్రీమాన్ కీలక పాత్రపోషించారు. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించారు.ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘‘తండ్రీ కొడుకుల అనుబంధం, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘శశివదనే’. ఇలాంటి కథా నేపథ్యం ఉన్న చిత్రం ఇదివరకు రాలేదు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. ప్రేక్షకులను నిరాశపరచదు. ఓ మంచి సినిమా చూశామనే అనుభూతితో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. దీపావళికి డ్యూడ్ ‘ప్రేమలు’ వంటి అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం ‘డ్యూడ్’. ఈ సినిమాలో శరత్ కుమార్ కీలక పాత్రపోషించారు. ఈ మూవీ ద్వారా కీర్తీశ్వరన్ డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘డ్యూడ్’. న్యూ ఏజ్ కథాంశంతో పూర్తి స్థాయి వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. సాయి అభ్యంకర్ అందించిన అద్భుతమైన మ్యూజిక్ ఆడియన్స్ని అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.సమాజానికి సందేశం సాయి కుమార్, అనసూయ భరద్వాజ్, వినోద్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. ‘పేపర్ బాయ్’ మూవీ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహించారు. ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్వీ రెడ్డి) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి. శేషురెడ్డి మారంరెడ్డి, నాయుడు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ‘‘మా సినిమా ద్వారా సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వనున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే వాణిజ్య అంశాలున్న మా చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం తెలిపింది. పోలీస్ కానిస్టేబుల్ ‘కొత్త బంగారు లోకం’ మూవీ ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కానిస్టేబుల్’. ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా మధులిక వారణాసి హీరోయిన్గా పరిచయమవుతున్నారు. జాగృతి మూవీ మేకర్స్ పై బలగం జగదీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్పోలీస్ కానిస్టేబుల్ పాత్రపోషించారు.సుభాష్ ఆనంద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘కానిస్టేబుల్..’ అంటూ సాగే టైటిల్ సాంగ్ని హైదరాబాద్ మాజీపోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా ఈ నెలలో విడుదలకు ముస్తాబవుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
రైల్వే ఉద్యోగులకు భారీ బోనస్
-
Diwali Gift: రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్
న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగల సందర్భంగా 10,91,146 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు రూ. 1,865.68 కోట్ల ఉత్పాదకత సంబంధిత బోనస్ (PLB) చెల్లింపునకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదించారు. దీనిని దీపావళి కానుకగా రైల్వే ఉద్యోగులకు అందించనున్నారు.ఇది భారతీయ రైల్వేలోని 10.91 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనుంది. ఇందుకోసం 2024-25 సంవత్సరానికి రూ. 1,866 కోట్ల భారాన్ని ప్రభుత్వం మోయనుంది. కేంద్ర మంత్రివర్గం గత ఏడాది అక్టోబర్ మూడున 11.72 లక్షలకు పైగా రైల్వే ఉద్యోగులకు ఉత్పాదకత-సంబంధిత బోనస్ చెల్లింపును ఆమోదించింది. రైల్వే సిబ్బంది పనితీరుకు గుర్తింపుగా 10,91,146 మంది ఉద్యోగులకు 78 రోజుల పనితీరు ఆధారిత బోనస్ (పీఎల్బీ) రూ.1,865.68 కోట్ల చెల్లింపునకు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.అర్హులైన రైల్వే ఉద్యోగులకు (Railway Employees) ఏటా దుర్గా పూజ/దసరా సెలవులకు ముందు పీఎల్బీని చెల్లిస్తారు. ఈ సంవత్సరం కూడా దాదాపు 10.91 లక్షల మంది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన పీఎల్బీ మొత్తాన్ని చెల్లించనున్నారు. రైల్వేల పనితీరు మెరుగుపడేలా కృషి చేసిన ఉద్యోగులకు ప్రేరణనిచ్చే ప్రోత్సాహకంగా పీఎల్బీ ఉపయోగపడనుంది. అర్హత కలిగిన ప్రతి రైల్వే ఉద్యోగికి 78 రోజుల వేతనానికి సమానమైన పీఎల్బీ కింద చెల్లించే గరిష్ట మొత్తం రూ.17,951. ఈ మొత్తాన్ని ట్రాక్ మెయింటెయినర్లు, లోకో పైలట్లు, రైలు గార్డులు, స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, సాంకేతిక నిపుణులు, సహాయకులు, పాయింట్స్ మన్, మినిస్టీరియల్ సిబ్బంది, ఇతర గ్రూప్- సి సిబ్బంది వంటి వివిధ కేటగిరీల్లోని రైల్వే సిబ్బందికి చెల్లిస్తారు. 2024-25లో రైల్వేలు రికార్డు స్థాయిలో 1,614.90 మిలియన్ టన్నుల సరుకును లోడ్ చేయడంతోపాటు దాదాపు 7.3 బిలియన్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి.వీటికి కూడా క్యాబినెట్ ఆమోదంపరిశోధనల ప్రోత్సాహానికి 2,277 కోట్ల రూపాయల కేటాయింపులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సిఎస్ఐఆర్ (CSIR) పథకం కింద మానవ వనరుల అభివృద్ధికి ప్రోత్సాహం కల్పించనున్నట్లు ప్రకటించింది. రీసెర్చ్ ఫెలోషిప్ లకు ప్రోత్సాహం అందించనున్నట్లు తెలిపింది. అత్యుత్తమ పరిశోధనలకు గుర్తింపు, ప్రమోషన్ అందించేలా క్యాబినెట్ ఒక పథకానికి రూపకల్పన చేసింది. -
దీపావళి ముందు ఉద్యోగులకు డబుల్ ఆఫర్?
దీపావళి పండుగకు ముందే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు బంపర్ ఆఫర్లు ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. ఒకవైపు 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు కరవు భత్యం (డీఏ) పెంచాలని చూస్తుండడమే ఇందుకు కారణం. ప్రభుత్వం తీసుకునే ఈ రెండు నిర్ణయాల వల్ల ఉద్యోగుల వేతనాలు పెరుగనున్నాయి.8వ పే కమిషన్8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం 2025 జనవరి 16న స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్రస్థాయిలోని కీలక శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలతో ఈమేరకు ఇప్పటికే సంప్రదింపులు మొదలు పెట్టింది. వీటిలో రక్షణ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సిబ్బంది, శిక్షణ శాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ కమిషన్ ఏర్పాటుకు సంబంధించి దీపావళి లోపు నిబంధనలు ఖరారు చేస్తారని కొందరు విశ్వసిస్తున్నారు. ఈమేరకు ఏర్పాటు చేయనున్న ప్యానెల్లో ఆరుగురు సభ్యులు ఉంటారు. వారు 15-18 నెలల్లో తమ నివేదికను సమర్పిస్తారు. అయితే, ఈసారి 8 నెలల్లోనే నివేదికను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. తద్వారా కొత్త సిఫార్సులను జనవరి 1, 2026 నుంచి అమలు చేసేందుకు వీలవుతుంది.నిమిదో వేతన సంఘం దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా క్లర్కులు, ప్యూన్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) వంటి లెవల్ 1 హోదాల్లో ఉన్న వారు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ప్రభుత్వం సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒక వేతన సంఘాన్ని నియమిస్తుంది. ప్రస్తుత 7వ సీపీసీ 31 డిసెంబర్ 2025తో ముగియనుంది. 2024 జనవరిలో 8వ సీపీసీని ప్రకటించినప్పటికీ, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్)ను ఇంకా నోటిఫై చేయలేదు. అది పూర్తయి సభ్యులను నియమించే వరకు జీతాలు, అలవెన్సులు, పింఛన్లపై అధికారిక సమీక్ష మొదలుకాదని గమనించాలి.కొత్త కమిషన్ కింద వేతన సవరణలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కీలకమైన అంశంగా మారుతుంది. ఇది 8వ సీపీసీ కింద ప్రస్తుత మూల వేతనాన్ని రెట్టింపు చేస్తుంది. 7వ సీపీసీ 2.57 యూనిఫామ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్(కొత్త బేసిక్పేలో ఇప్పటివరకు ఉన్న బేసిక్పేను 2.57తో హెచ్చు వేస్తారు)ను అవలంబించింది.డీఏ పెంపుకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జులై 2025 నుంచి కరవు భత్యం (డీఏ) 3 శాతం పెరిగే అవకాశం ఉందని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇటీవలి ద్రవ్యోల్బణ గణాంకాల ఆధారంగా ఈమేరకు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 55 శాతం డీఏను 58 శాతానికి పెంచాలని యోచిస్తోంది. ఈ పెంపు జులై నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా, దీపావళి ముందు అధికారికంగా దీనికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.ఇదీ చదవండి: కస్టమర్ సర్వీస్ కోసం ప్రీమియం చెల్లించాల్సిందే!? -
దీపావళి కానుకపై ఆశలు
దేశవ్యాప్త వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)ని ఎనిమిదేళ్ళ క్రితం అట్టహాసంగా ప్రారంభించారు. ఆ సందర్భంగా అర్ధరాత్రి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని కూడా నిర్వహించారు. దేశాన్ని ఉమ్మడి ఆర్థిక మార్కెట్గా ఏకీకృతం చేసే చారిత్రక సంస్కరణగా దాన్ని కొనియాడారు. పరోక్ష పన్నులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెస్తున్నామన్నారు. ఘర్షణలు, ఎగవేతలను నిర్మూలిస్తుందని చెప్పారు. ఎక్సైజ్, సర్వీసు పన్నులను విధించే హక్కును కేంద్ర ప్రభుత్వం వదులుకోవడంతో సాయలాపాయలాగా కుదుర్చుకున్న వ్యవహారంగా జీఎస్టీ సంస్కరణ ఆమోదం ఖ్యాతికెక్కింది. దానికి తగ్గట్లుగానే అన్ని రాష్ట్రాలూ రాష్ట్ర స్థాయిలో విధించే అమ్మకం పన్నులు, విలువ–జోడింపు పన్ను, ఆక్ట్రాయ్ వంటి ఇతర చిన్నా చితకా పన్నులను విధించే హక్కును కేంద్రానికి దత్తం చేశాయి. రాష్ట్రాలకు పన్నుల రాబడులలో ఏర్పడే లోటును తాము భర్తీ చేస్తామని కేంద్రం వాగ్దానం చేయడం వల్ల ఆ రాజీ బేరం కుదిరింది. రాష్ట్రాలు పన్నుల విధింపులో ఉన్న స్వయం ప్రతిపత్తిని త్యాగం చేశాయి. దీన్ని 2017 నాటి తొలి చట్టంలో జీఎస్టీ పరిహార క్లాజుగా చేర్చారు. ఆ క్లాజు గడువు 2022తో పూర్తయింది. ఇపుడు జీఎస్టీలో తమ వాటా ఒక్కసారిగా బాగా తగ్గిపోయే ప్రమాదం ఉందని రాష్ట్రాలు భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ‘దీపావళి కానుక’గా జీఎస్టీలో పెద్ద సంస్కరణనే తీసుకురానున్నట్లు ప్రకటించడం హర్షణీయం. తదుపరి సంస్కరణలు సాధారణ ప్రజానీకంపై, ముఖ్యంగా మధ్యతరగతి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలపై పన్ను భారాన్ని తగ్గించేవిగా ఉంటాయని ఆయన వాగ్దానం చేశారు. సంస్థాగత సంస్కరణలు, రేటు హేతుబద్ధీకరణ, బతుకు తెరువును సులభతరం చేయడమనే మూడు అంశాలను ప్రభుత్వం పరిగణించవచ్చు.పుట్టుకలోనే లోపాలురూపకల్పన, అమలులో కూడా ఏకీకృత, దేశవ్యాప్త, పరోక్ష పన్నుగా జీఎస్టీ పుట్టుకలోనే కొన్ని లోపాలున్నాయని చెప్పక తప్పదు. రూపకల్పనలోని లోపం ఏమిటంటే, జీఎస్టీ వంటి పరోక్ష పన్ను అంతర్గతంగానే తిరోగమనమైనది. ఒక వ్యక్తి చెల్లించే పన్ను ఆ వ్యక్తి ఆదాయంపైన కాక, కొనే వస్తువు విలువపై ఆధారపడి ఉంటుంది. కనుక, జీఎస్టీ మంట ధనికుల కన్నా పేదలకు ఎక్కువ తెలుస్తుంది. ఆదాయ పన్ను, సంపద పన్ను వంటి ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నుల కన్నా ఔచిత్యంతో కూడినవిగా ఉంటాయి. మీ పన్ను ఆదాయంతోపాటే పెరుగుతుంది. ఆదాయం తగ్గితే పన్ను ఉండదు.జీఎస్టీలోని అసమంజసత్వాన్ని తగ్గించేందుకు బహుళ శ్లాబులు పెట్టారు. పేదలు కొనే వస్తువులను సున్నా లేదా 5 శాతం శ్లాబులో పెట్టారు. ధనికులు కొనే వస్తువులను హెచ్చు శ్లాబులో పెట్టారు. ఇది ఒక రకంగా పేదలు ఏ వస్తువులను వాడాలో శాసించడమవుతుంది. సాధారణంగా ఆహారం, ఔషధాలను పన్నుల నుంచి మినహా యించే విధానం ప్రపంచ వ్యాప్తంగా అమలులో ఉంది. అన్ని వస్తు వులు, సేవలకు ఒకే రేటు ఉండటం హేతుబద్ధమైన, సమర్థమైన వ్యవస్థ అనిపించుకుంటుంది. యూరోపియన్ యూనియన్ దేశాలు, సింగపూర్, ఆస్ట్రేలియాలలో అది కనిపిస్తుంది. మధ్యస్థ రేటు ఉండా లన్నది స్థూలంగా అంగీకరించే సూత్రం. (ఆహారం, ఔషధాలు వంటి) అత్యవసర వస్తువులపై చాలా తక్కువగా, (పొగాకు, మద్యం వంటి) వ్యసన, విలాస వస్తువులపై చాలా ఎక్కువగా ఉంటుంది. సులభతర శ్లాబులు మేలుఇక అమలులో లోపాల గురించి ముచ్చటించుకుందాం. జీఎస్టీ బహుళ పన్ను శ్లాబుల (0 శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం, పాప కార్యాల కింద వచ్చే వాటిపై వేసే పన్ను, వివిధ సెస్సులు)తో కూడిన సంక్లిష్ట వ్యవస్థ. ఈ సంక్లిష్టత, వస్తువులు, సేవల వర్గీకరణ, పన్ను చెల్లింపుదారులలో అయోమయం, వ్యాజ్యాలు వంటి వివాదాలకు దారితీస్తోంది. అంతిమ వస్తువుల పైన కన్నా ఆ యా వస్తువులను తయారు చేసేందుకు ఉపయోగించే వస్తువులపై పన్ను రేట్లు అధికంగా ఉన్న దృష్టాంతాలు కూడా ఉన్నాయి. ఇది దేశంలో వస్తూత్పత్తిని నీరుగారుస్తోంది. వ్యవసాయం, పెట్రోలు ఉత్పత్తులు, విద్యుచ్ఛక్తి, ఆల్కహాల్, స్థిరాస్తుల రంగం వంటి జీడీపీలోని పెద్ద భాగాలు... జీఎస్టీ పరిధికి బయటనే కొనసాగుతున్నాయి. కొన్నింటికి మినహాయింపు ఇవ్వడం వల్ల రెవెన్యూ తగ్గుతుంది. జీఎస్టీ సంస్కరణలోని స్ఫూర్తి దెబ్బతింటోంది. చిన్న వ్యాపారాల వారు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల వారిపై భారం పడుతోంది. కారణం– వారు వెంటనే జీఎస్టీ చెల్లించాల్సి రావడం, వారి ఖాతాదారులు చెల్లింపులలో జాప్యం చేయటం! రిఫండులలో జాప్యాలు ఉండనే ఉన్నాయి. ఇవి వ్యాపారు లకు చేతిలో నగదు ఆడకుండా చేస్తున్నాయి. ప్రధాని ప్రకటించిన ప్రతిపాదిత సంస్కరణల్లో ఒకటి గణ నీయమైన మార్పు తీసుకురాగల ఆశ రేపుతోంది. అది ప్రస్తుత బహుళ శ్లాబుల పద్ధతిని రద్దు చేసి, రెండు (స్టాండర్డ్, మెరిట్ ) రేట్ల శ్లాబుల సులభతర విధానానికి మళ్ళడం! కొన్ని ఎంపిక చేసిన వస్తువులపైన మాత్రం ప్రత్యేక రేట్లు ఉంటాయి. వ్యాజ్యాలతోపాటు, వర్గీకరణకు సంబంధించిన వివాదాలు తగ్గుతాయి. దైనందిన వాడుక వస్తువులు, జనం సమకూర్చుకోవాలని ఆశపడే వాటిపై పన్ను రేటు తగ్గుతుందని భావిస్తున్నారు. వినిమయం పెరగడం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ రేట్లు తగ్గించడం వల్ల భారతదేశపు ఎగుమతుల పోటీ సామర్థ్యం పెరుగుతుంది. దేశంలో ఉద్యోగాల కల్పనకూ సాయపడుతుంది. మధ్యస్థ రేటును మరీ భారం మోపేదిగా ఉన్న 18 శాతంగా కాక 15 శాతంగా నిర్ణయించవచ్చు. పన్నుల సంస్కరణలపై ఏర్పాటు చేసిన కేల్కర్ సత్వర కార్యాచరణ బృందం సిఫార్సు చేసినట్లుగా దాన్ని 15 శాతంకన్నా తక్కువగా 12 శాతంగా నిర్ణయిస్తే ఇంకా బాగుంటుంది. రాష్ట్రాలకు చేయి తిరిగేలా...చివరగా, ఫెడరలిజంలో (ఆరోగ్యం, విద్య వంటివాటిపై) వ్యయాల బాధ్యతలను రాజ్యాంగం రాష్ట్రాల పైనే మోపింది. కానీ, స్వతంత్ర ఆదాయ వనరులను మాత్రం కొద్దిగానే కల్పించింది. ఈ అసమతౌల్యాన్ని జీఎస్టీ ఇంకా పెంచి, కేంద్ర బదలాయింపులపైనే రాష్ట్రాలు ఎక్కువగా ఆధారపడక తప్పని స్థితి కల్పించింది. స్థానిక అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి నిధుల సమీకరణకు రాష్ట్రాలకు పన్నులు విధించే అధికారం కొంత కావాలి. జీఎస్టీ భారతదేశపు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసిందనే అభిప్రాయం ఒకటి ఉంది. రాష్ట్రాలకు కోశాగారాన్ని విస్తరించుకునే, స్వయం ప్రతిపత్తిని కల్పించే అవకాశాన్ని పునరుద్ధరించేందుకు అన్వేషించవలసిన అవసరం ఉంది. ఫలితంగా, రాష్ట్రాలు వాటి నిర్దిష్ట ఆర్థిక, సామా జిక, ప్రాంతీయ అవసరాలకు తగ్గట్లుగా విధానాలు రూపొందించు కోగలుగుతాయి. అసమానతలను తగ్గించేందుకు, ప్రస్తుతం పరోక్ష పన్నుల వైపు తూగిన తక్కెడను ప్రత్యక్ష పన్నుల వైపు మొగ్గే విధంగా చేయాల్సిన అవసరం కూడా ఉంది. అజీత్ రానాడే వ్యాసకర్త ఆర్థికవేత్త (‘దక్కన్ హెరాల్డ్’ సౌజన్యంతో) -
పండుగ సీజన్లో రైల్వేల బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: దీపావళి, ఛత్ పండుగల రద్దీని తగ్గిస్తూ ప్రయాణికులకు సౌలభ్యం కల్పించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. ‘రౌండ్ ట్రిప్ ప్యాకేజ్’పేరుతో ప్రవేశపెట్టిన ఈ స్కీమ్లో రిటర్న్ టికెట్ ప్రాథమిక ధరపై 20 శాతం రాయితీ లభిస్తుంది. ఈ మేరకు శనివారం కేంద్ర రైల్వే శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పథకంలో భాగంగా చేసే బుకింగ్లు ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర రైల్వేశాఖ ప్రకటించిన రౌండ్ ట్రిప్ ప్యాకేజ్లో భాగంగా వెళ్లే ప్రయాణం అక్టోబర్ 13 నుంచి 26 మధ్య, వచ్చే ప్రయాణం నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1 మధ్య ఉండాలి. రిటర్న్ టికెట్ బుకింగ్కు 60 రోజుల అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ వర్తించదు. రెండు ప్రయాణాలూ ఒకే ప్రయాణికుల పేర్లతో, ఒకే తరగతి, ఒకే గమ్యస్థానం ఉన్న జంటకు మాత్రమే అనుమతిస్తారు. అయితే రెండు ప్రయాణాల్లోనూ కన్ఫర్మ్డ్ టికెట్లు తప్పనిసరి. ఫ్లెక్సీ ఫేర్ రైళ్లు మినహా అన్ని సాధారణ, ప్రత్యేక రైళ్లకు రౌండ్ ట్రిప్ ప్యాకేజ్ ఆఫర్ వర్తిస్తుంది. ఈ పథకం కింద బుక్ చేసిన టికెట్లకు రీఫండ్ లేదా మార్పులు అనుమతించరు. ఆన్లైన్ లేదా కౌంటర్.. రెండు టికెట్లు ఒకే విధానంలోనే బుక్ చేయాలి. ఈ స్కీమ్ పండుగ సీజన్లో రద్దీని విభజించడంతో పాటు, ప్రత్యేక రైళ్ల వినియోగాన్ని పెంచుతుందని కేంద్ర రైల్వేశాఖ ఆశిస్తోంది. ఆఫర్ వివరాలు→ బుకింగ్ ప్రారంభం: ఆగస్టు 14, 2025 → ప్రారంభ ప్రయాణం: అక్టోబర్ 13 నుంచి 26 వరకు → తిరుగు ప్రయాణం: నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1 వరకు → రిటర్న్ టికెట్ బుకింగ్కు 60 రోజుల అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ వర్తించదు. → రానుపోను టికెట్లు ఒకే ప్రయాణికుల పేర్లతో, ఒకే తరగతి, ఒకే గమ్యస్థాన జంటకు మాత్రమే. → రెండు ప్రయాణాలకూ కన్ఫర్మ్డ్ టికెట్లు తప్పనిసరి. → ఫ్లెక్సీ ఫేర్ రైళ్లు మినహా అన్ని రైళ్లకు ఆఫర్ వర్తింపు. → టికెట్ బుక్ చేసిన తర్వాత మార్పులు, రీఫండ్లు ఉండవు. -
‘ఆమె క్షేమంగా వస్తే చాలూ.. మాకు పండుగే!’
ఢిల్లీ: తొమ్మిది నెలలపాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్(sunita williams) , బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు భూమికి తిరుగు పయనమయ్యారు. వ్యోమగాములంతా సురక్షితంగా భూమ్మీద అడుగు మోపాలని కోట్ల మంది ప్రార్థిస్తున్నారు. అయితే ఒక ఊరు మాత్రం ప్రత్యేకంగా సునీత క్షేమం కోసం పూజలు, హోమాలు చేస్తోంది. ఆమె రాకను ఒక పండుగలా జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది. సునీతా విలియమ్స్ భారత సంతతి అనే విషయం తెలిసిందే కదా. గుజరాత్లోని మెహసానా జిల్లా ఝూలాసన్ ఆమె పూర్వీకుల గ్రామం(Ancestral Village). అక్కడ ఇప్పటికీ ఆమెకు బంధువులు ఉన్నారు. కిందటి ఏడాది.. సునీత అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయినప్పటి నుంచి వాళ్లంతా ఆందోళనతోనే ఉన్నారు. ఆమె క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు.. ఆమె తిరిగి వస్తుండడంపై వాళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.‘‘నా సోదరి సునీతా రాక కోసం మేమంతా ఎంతో ఎదురుచూస్తున్నాం. సునీత తల్లి, సోదరి, సోదరుడుతో సహా ఈ దేశంలోని కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. ఆమె సురక్షితంగా కిందకు దిగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. సునీత కోసం దేవాలయాలకు వెళ్లి పూజలు చేశాం. సునీతా కోసం యజ్ఞం నిర్వహిస్తున్నాం’’ అని ఆమె సోదరుడు దినేశ్ అంటున్నారు. మరోవైపు ఊరు ఊరంతా.. సునీత రాకను చిరస్మరణీయమైన రోజు.. దేశం గర్వించదగిన రోజుగా చెబుతోంది. దీపావళి పండుగలా ఆమె రాకను సంబురంగా జరిపేందుకు సిద్ధం అయ్యింది. సునీతా విలియమ్స్ గతంలో రెండుసార్లు భారత్ పర్యటనకు వచ్చారు. 2007లో తొలిసారి ఇండియాకు వచ్చిన ఆమె.. ఝూలాసన్తో పాటు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. తిరిగి 2013లో పర్యటనకు వచ్చి.. కోల్కతా, న్యూఢిల్లీతో పాటు తన పూర్వీకుల గ్రామాన్ని సందర్శించారు. ఆ సమయంలో ఝూలాసన్ గడ్డకు ఆమె ప్రత్యేకంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. కిందటి వ్యోమగాములను భూమ్మీదకు తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్(Space X Crew Dragon Capsule)లోకి వీరు చేరుకున్నారు. ఈ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయి భూమ్మీదకు బయల్దేరింది. స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ ఐఎస్ఎస్ను వీడే అన్డాకింగ్ దృశ్యాలను ప్రపంచమంతా వీక్షించేందుకు నాసా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. -
న్యూజెర్సీలో దీపావళి వేడుకలు 2024
-
ఇంట్లో నుంచే ‘దేవ్ దిపావళి’ని చూడండిలా..
వారణాసి: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నవంబర్ 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవ్ దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆరోజు దశాశ్వమేధ ఘాట్లో అత్యంత వైభవంగా జరిగే గంగా హారతిని చూసేందుకు దేశవిదేశాల నుంచి లక్షలాదిమంది తరలిరానున్నారు.ఈసారి దేవ్ దీపావళికి కాశీకి వెళ్లలేనివారు ఇంట్లో కూర్చొని గంగాహారతిని, దేవ్ దీపావళి వేడుకలను వీక్షించవచ్చు. తొలిసారిగా దేవ్ దీపావళి నాడు జరిగే గంగా హారతి వేడుకలు ‘గంగా సేవా నిధి’ వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ కూడా ఢిల్లీ నుంచి ఈ వేడుకలను వీక్షించనున్నారు.గంగా సేవా నిధి వెబ్సైట్ను నవంబర్ 15న ప్రారంభిస్తున్నామని గంగా సేవా నిధి అధ్యక్షుడు సుశాంత్ మిశ్రా తెలిపారు. విదేశాలలోని వారు కూడా gangasevanidhi.in వెబ్సైట్ ద్వారా దేవ్ దీపావళి వేడుకలను వీక్షించవచ్చు. గంగా హారతి సందర్భంగా ‘ఏక్ సంకల్ప్ గంగా కినారే’ పేరుతో కార్యక్రమానికి హాజరయ్యే లక్షలాది తాము గంగా నదిని పరిశుభ్రంగా ఉంచుతామని, పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేయనున్నారు.నవంబర్ 15న దశాశ్వమేధ ఘాట్లో 21 మంది పండితులు వైదిక ఆచారాల ప్రకారం భగవతీ దేవికి పూజలు నిర్వహిస్తారు. దేవ్ దీపావళి వేళ వారణాసిలోని 84 ఘాట్లను దీపాలతో అందంగా అలంకరించనున్నారు. పురాణాల ప్రకారం త్రిపురాసురుని దౌర్జన్యాల నుంచి దేవతలు విముక్తి పొందిన సందర్భంలో, వారు శివుని నివాసమైన కాశీ నగరానికి వచ్చి దీపాల పండుగను జరుపుకున్నారు. నాటి నుంచి ప్రతియేటా ఇక్కడ దేవ్ దీపావళి వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు.ఇది కూడా చదవండి: ఘనంగా శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్ -
టపాసుల కాలుష్యంలో టాప్ ఫైవ్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని మహానగరాల్లో కాలుష్య మేఘాలు మరింత చిక్కబడుతున్నాయి. సాధారణ సమయంలో కూడా వాయు కాలుష్యం రికార్డులను బద్దలు కొడుతోంది. ఇక పటాకుల పండుగ దీపావళి రోజు వాయు కాలుష్యం అన్ని హద్దులు దాటుతోంది. గత నెల 31న దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో సంతోషంగా దీపావళి పండుగ జరుపుకొన్నారు. కానీ ఆరోజు దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో కాలుష్యం ఎంతటి ప్రమాదకర స్థాయికి చేరిందో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) సర్వేలో తేలింది. మొదటి స్థానం ఢిల్లీదే దీపావళి రోజు నమోదైన వాయు కాలుష్యం విషయంలో హైదరాబాద్ నగరం బెంగళూరుతో కలిసి ఐదో స్థానంలో నిలిచింది. దీపావళి రోజు 24 గంటల్లో ప్రధాన నగరాల్లో వాయు కాలుష్య వివరాలను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) విడుదల చేసింది. పండుగ రోజు అత్యధిక కాలుష్యం ఉన్న నగరంగా దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. దీపావళి రోజు గ్రీన్ కాకర్స్ మినహా సాధారణ పటాకులు కాల్చటంపై నిషేధం ఉన్నా ఢిల్లీ మొదటి స్థానంలోనే నిలవటం గమనార్హం.దీపావళి రోజు ఢిల్లీలో ఏక్యూఐ 339 పాయింట్లుగా నమోదైంది. స్విస్ కంపెనీ ఐక్యూ ఏఐఆర్ ‘లైవ్ ర్యాంకింగ్ ఆఫ్ గ్లోబల్ సిటీస్ ఆన్ ఏక్యూఐ’నివేదిక ప్రకారం దీపావళి పండుగ మరుసటి రోజు ఉదయం 8 గంటల సమయంలో ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్య స్థాయిలను విశ్లేషించినపుడు ఢిల్లీ నగరం ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్య నగరంగా నిలిచింది. ఐక్యూ ఏఐఆర్ నివేదిక ప్రకారం» పర్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం 2.5) ప్రామాణిక పాయింట్లపరంగా 30 పాయింట్లు దాటితే కాలుష్యకారకంగా పరిగణిస్తారు. » మనదేశంలోని ప్రధాన నగరాల్లో కాలుష్య స్థాయిలు జాతీయ సగటు కంటే రెండింతలు నమోదయ్యాయి. » పీఎం 2.5 (అతి సూక్ష్మస్థాయిలోని ధూళి క ణాలు–పీఎం 2.5) విషయానికొస్తే జాతీయ సగటు కంటే ఢిల్లీలో 2022లో 92.6 పాయింట్లు అధికంగా ఉండగా, 2023లో 102.1 పాయింట్లు అధికంగా నమోదైంది. జాతీయసగటు 2022లో 53.3 పాయింట్లు, 2023లో 54.4 పాయింట్లు మాత్రమే ఉన్నది. » పీఎం 2.5 2022లో ముంబైలో 46.7 పాయింట్లు, 2023లో 43.8 పాయింట్లు నమోదైంది. » కోల్కతాలో 2022లో 50.2, 2023లో 47.8 పాయింట్లు రికార్డయ్యింది. » హైదరాబాద్లో 2022లో 42.4 పీఎం 2.5 పాయింట్లు, 2023లో 39.9 పాయింట్లు నమోదైంది. » ప్రామాణికంగా చూస్తే పీఎం 10 స్థాయిలు (మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్) 60 పాయింట్లు దాటితే వాయు కాలుష్యకారకాలు పెరిగినట్టుగా భావించాలి. 2023–24 నాటికి ఏడాదికి 20 నుంచి 30 శాతం పీఎం 10 సాంద్రతను తగ్గించాలని ప్రభుత్వం నిర్దేశించుకొన్నది. ఐతే సగటు వార్షిక పీఎం 10 స్థాయిలు 2023–24లో ఢిల్లీలో 208, ముంబైలో 94, కోల్కతాలో 94, అహ్మదాబాద్లో 98, పుణేలో 98, బెంగళూరులో 70, హైదరాబాద్లో 81, చెన్నైలో 63 పాయింట్లు రికార్డయ్యింది. -
పందెం విసిరిన స్నేహితులు.. బాంబు మీద కూర్చున్న యువకుడు.. ఆ తర్వాత ఏమైందంటే?
బెంగళూరు : స్నేహితులతో పందెం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. బాంబు మీద కూర్చొని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.బెంగళూరు పోలీసుల వివరాల మేరకు.. దీపావళి పండుగ సందర్భంగా శబరిష్ (32) అతని ఆరుగురు స్నేహితులు మధ్య పందెం వేసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న శబరీష్కు అతని స్నేహితులు పందెం విసిరారు. పందెం ప్రకారం..శబరీష్ కార్డ్ బోర్డ్ కింద అమర్చిన బాంబులపై కూర్చోవాలి. అనంతరం బాంబుకు నిప్పు అంటిస్తాము. నిప్పు అంటించినా అలాగే కూర్చుంటే ఓ కొత్త ఆటో కొనిస్తామని ఆఫర్ ఇచ్చారు.చదవండి : తెగిపడిన కుమారుడి తల.. ఒడిలోకి తీసుకుని లాలిస్తూ.. రోదిస్తూదీంతో మద్యం మత్తులో ఉన్న శబరీష్ స్నేహితులు చెప్పినట్లుగానే బాంబులు అమర్చిన కార్డ్ బోర్డ్పై కూర్చున్నాడు. అంనతరం అతని స్నేహితులు కార్డ్ బోర్డ్ కింద ఉన్న బాంబులకు నిప్పు అంటించి దూరంగా పరిగెత్తారు. సెకన్ల వ్యవధిలో భారీ శబ్ధాలతో బాంబులు పేలాయి.శబరీష్ అలాగే ఉన్నాడు. అతనికి ఏమైందా అని చూద్దామని ముందుకు వచ్చిన స్నేహితుల్ని చూసిన శబరీష్ వెంటనే కుప్పకూలాడు. ప్రాణాలు కోల్పోయాడు. అత్యవసర చికిత్స కోసం శబరీష్ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. బాంబు పేలుడు ధాటికి శబరీష్ అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని నిర్ధారించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడికి పందెం విసిరిన అతని ఆరుగురు స్నేహితుల్ని అదుపులోకి తీసుకున్నారు. A Bet that proved costly, takes a Life in #Bengaluru !In a shocking incident a 32-yr-old Shabari died in a tragic way on #Diwali, after he accepted a challenge to sit on a box full of #firecrackers in it to win an auto rickshaw, in Konanakunte, South Bengaluru. His friends lit… pic.twitter.com/YGHEmxViV2— Surya Reddy (@jsuryareddy) November 4, 2024 -
అతనితో మృణాల్ ఠాకూర్ వైరల్ అవుతున్న ఫొటోస్
-
వెర్రి వేషాలపై వీసీ సజ్జనార్ సీరియస్
హైదరాబాద్: దీపావళి సందర్భంగా.. హైటెక్సిటీ ప్రాంతంలో కొందరు యువకులు ఇష్టారీతిన బాణసంచా కాలుస్తూ బైక్లపై విన్యాసాలు చేశారు. దానికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. దీనిపై ఐపీఎస్ అధికారి, టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగపూట ఇదేం వికృతానందమని ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు.‘‘దీపావళి పండగ పూట ఇదేం వికృతానందం.. ఎటు వెళ్తోందీ సమాజం. ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం దీపావళి. పండగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!?’’ అని సజ్జనార్ ప్రశ్నించారు. దీపావళి పండుగ పూట ఇదేం వికృతానందం. ఎటు వెళ్తోందీ సమాజం. దీపావళి అంటే ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం. పండుగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!? pic.twitter.com/pYbELJeZAR— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 3, 2024 ఆయన పోస్ట్పై పలువురు నెటిజన్లు స్పందించారు. కొంతమంది యువకులు తాత్కాలిక ఆనందం కోసం తమ జీవితాలను రిస్క్లో పెట్టుకుంటున్నారన్నారు. ఈ చేష్టలతో మిగతా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదీ చదవండి: ఏడాది క్రితం అదృశ్యమై.. ఆధార్తో దొరికాడు -
దేశ ప్రగతి కొన్ని కంపెనీలపైనే ఆధారపడరాదు
ముంబై: దేశ అభివృద్ధి అన్నది కేవలం కొన్ని కంపెనీలు లేదా కొన్ని గ్రూపులపైనే ఆధారపడి ఉండరాదని ప్రముఖ బ్యాంకర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు. దేశమంతటా మరిన్ని కంపెనీలు వృద్ధి చెందేలా విస్తృతంగా ఉండాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థూలంగా చూస్తే ఆశావహంగానే కనిపించినా.. సూక్ష్మంగా చూస్తే కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. బారత కంపెనీలు రక్షణాత్మక ధోరణి కంటే పోటీతత్వంపైనే ఎక్కువ దృష్టి సారించాలని కోరారు. దీపావళి సందర్భంగా ఇన్వెస్టర్లకు ఉదయ్ కోటక్ ఈ మేరకు వీడియో సందేశం ఇచ్చారు. కంపెనీలకు సాయం చేయడం ద్వారా ‘వెయ్యి పువ్వులు వికసించనివ్వండి’ అనే సామెతను ఆచరణ దాల్చేలా క్యాపిటల్ మార్కెట్లు చూడాలన్నారు. గతేడాది ఈక్విటీలు, ఫైనాన్షియల్ మార్కెట్లకు గొప్ప సంవత్సరంగా ఉండిపోతుందంటూ, ఇన్వెస్టర్లకు అద్భుతమైన రాబడులు వచి్చనట్టు పేర్కొన్నారు. అయినప్పటికీ ఉద్ధాన పతనాలకు ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండాలన్నారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు క్షీణిస్తుండడంతో అప్రమత్తతో కూడిన ఆశావహ ధోరణితో ఉన్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంటు ఖాతా లోటు ప్రస్తుతం నియంత్రణలోనే ఉన్నాయంటూ, వీటిపై భారత్ ఓ కన్నేసి ఉంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ సైతం కేవలం కొన్ని గ్రూపులే కార్పొరేట్ రంగాన్ని నడిపిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. -
AP: ‘బండ’ మోసం.. అరకోటి కుటుంబాలకు ‘గ్యాస్’ ఎగ్గొట్టిన బాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మొత్తం కుటుంబాల సంఖ్య 1.80 కోట్లకుపైనే! వీరిలో 1.54 కోట్ల మందికి యాక్టివ్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అంటే దాదాపు కోటిన్నరకుపైగా కుటుంబాలు! ‘ఇంటింటికీ ఉచిత గ్యాస్’ ఇస్తామన్న టీడీపీ కూటమి పార్టీల ఎన్నికల హామీని నెరవేర్చాలంటే ఏటా దాదాపు రూ.4 వేల కోట్లు అవసరం. కానీ ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల కోసం రూ.2,684.75 కోట్లు మాత్రమే ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. దాదాపు పది లక్షల వరకు ఉన్న ప్రధాని ఉజ్వల యోజన కనెక్షన్లకు పాక్షిక రాయితీతోపాటు మిగతా గ్యాస్ వినియోగదారులకు ఎన్నిల హామీ ప్రకారం పూర్తి ఉచితంగా సిలిండర్ను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన మొత్తం లబ్ధిదారులకు ఒక్క ఉచిత సిలిండర్ పంపిణీ కోసం రూ.1,345 కోట్లు అవసరం. కానీ కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ఇచ్చిందెంతో తెలుసా? దీపావళికి తొలి సిలిండర్ పంపిణీ కోసం ఇచ్చింది కేవలం.. రూ.894.92 కోట్లు మాత్రమే!! అంటే పథకాన్ని కేవలం కోటి కుటుంబాలకు లోపే పరిమితం చేసి మిగతా 54 లక్షల కుటుంబాలకు ఎగ్గొడుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రతి ఇంటికీ ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని ఎన్నికల వేళ బుకాయించిన కూటమి పార్టీల నేతలు ఈ ఏడాది ఇవ్వాల్సిన రెండు సిలిండర్లకు ఎగనామం పెట్టేయడంతోపాటు అర కోటికిపైగా కుటుంబాలను పథకానికి దూరం చేయడం గమనార్హం.అంతా ఉత్త గ్యాసేనా!రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ‘ఉత్త గ్యాస్’గా మారిపోతోందా? అర్హత ఉన్నా ఉచిత గ్యాస్ అందుతుందన్న గ్యారంటీ పోయిందా? రేషన్ కార్డు ఉండీ.. దశాబ్దాలుగా గ్యాస్ కనెక్షన్ వినియోగిస్తున్న కుటుంబాలు ప్రభుత్వం దృష్టిలో అనర్హులైపోతున్నాయా? కూటమి పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోలో చెప్పిన ‘ఇంటింటికీ ఉచిత గ్యాస్’ వాగ్దానంలో మోసం బట్టబయలైందా? అంటే.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అవుననే అంటున్నాయి. దీపం–2 కింద దీపావళి కానుకగా తీసుకొచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అందరికీ కాదనేది తేటతెల్లమవుతోంది. గ్యాస్ బుక్ చేసుకున్న ప్రతి అర్హుడికీ రాయితీ మొత్తం ఖాతాల్లో పడుతుందనేది భ్రమగా తేలిపోయింది.ఇంటింటికీ అని నమ్మించి..ఎన్నికల్లో ఓట్లే పరమావధిగా చంద్రబాబు బృందం ప్రతి ఇంటికీ ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని బూటకపు హామీని గుప్పించింది. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేస్తూ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలు తర్వాత పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు హడావుడి చేసింది. ఓట్లు వేయించుకునేందుకు ఎలాంటి అడ్డంకులు విధించని కూటమి నాయకత్వం ఉచిత గ్యాస్ పథకం పొందాలంటే మాత్రం అర్హత ఉండాలనే మెలిక పెట్టింది. నిజానికి కూటమి పార్టీల ఎన్నికల హామీ ప్రకారం చూస్తే రాష్ట్రంలో 1.80 కోట్ల కుటుంబాలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు చొప్పున (ప్రభుత్వ జీవో ప్రకారం సిలిండర్కు రూ.894) ఇవ్వడానికి రూ.4,827.60 కోట్లు ఖర్చవుతుంది. దీంతో ఉచిత గ్యాస్ పథకాన్ని కుదించేందుకు సిద్ధమయ్యారు. రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఉచిత గ్యాస్ రాయితీ వర్తిస్తుందంటూ షరతులు విధించారు.పొంతన లేని సర్కారు లెక్కలు..రేషన్ కార్డు, ఆధార్, గ్యాస్ కనెక్షన్ ఉంటే ఉచిత గ్యాస్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని 1,48,43,671 మంది కార్డుదారులు తమకు పూర్తిగా గ్యాస్ రాయితీ వస్తుందని ఆశపడ్డారు. వీరంతా బీపీఎల్ కిందే నమోదైన వారే. అయితే పథకాన్ని ప్రారంభించిన తొలి రోజే లక్షల కుటుంబాలకు నిరాశ ఎదురైంది. ఏళ్ల తరబడి గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డులున్నా పథకానికి అనర్హులుగా తేల్చడంతో నివ్వెరపోతున్నారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు.54 లక్షల కుటుంబాలకు అర్హత లేదా?రేషన్ కార్డులున్నప్పటికీ సుమారు 54 లక్షల కుటుంబాలను ఉచిత గ్యాస్ పథకం నుంచి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. వీరిని వడపోసిన తర్వాతే పథకానికి బడ్జెట్ ప్రకటించినట్లు సమాచారం. ఏ ప్రమాణాల ప్రకారం వీరిని అనర్హులుగా ప్రకటించారో చెప్పకుండా అర్హులందరికీ ఉచిత గ్యాస్ ఇస్తున్నట్లు మభ్యపెడుతోంది. అర్హుల కుదింపుతోపాటు మరోవైపు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా నాలుగు నెలలకు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకునేలా మూడు బ్లాక్ పీరియడ్స్ను తెచ్చింది. ఆయా సమయాల్లో గ్యాస్ సిలిండర్ఖాళీగా లేకుంటే లబ్ధిదారుడు నష్టపోవాల్సి వస్తుంది. తద్వారా ప్రభుత్వం ఖర్చును తగ్గించుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు వరకు ఒక్క సిలిండర్తోనే సరిపెడుతూ రెండు సిలిండర్లకు ఎగనామం పెట్టింది.ఇదీ గ్యాస్ ‘‘పథకం’’!రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య 1.80 కోట్లుయాక్టివ్ గ్యాస్ కనెక్షన్లు 1.54 కోట్లురేషన్ కార్డులు 1,48,43,671» ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల ఖర్చు రూ.4 వేల కోట్లు(ఒక్కోటి రూ.894 చొప్పున 1.54 కోట్ల మందికి 3 సిలిండర్లు ఇచ్చేందుకు)కానీ మూడు సిలిండర్లకు ప్రభుత్వం ఎంత ఇస్తోంది?: రూ.2,684.75 కోట్లు(ఈ బడ్జెట్ కోటి కుటుంబాలకు కూడా సరిపోదు.. మరో అర కోటికిపైగా అర్హులైన కుటుంబాలకు మొండి చెయ్యే)» కార్డుదారులకు ఒక్క సిలిండర్ ఇవ్వటానికయ్యే ఖర్చు రూ.1,345 కోట్లు»తొలి సిలిండర్ కోసం విడుదల చేసిన మొత్తం రూ.894.92 కోట్లు » ప్రభుత్వ బడ్జెట్ ప్రకారం చూస్తే లబ్ధి పొందే కుటుంబాలు సుమారు కోటి» అర్హత ఉన్నప్పటికీ పథకానికి దూరమైన కుటుంబాలు సుమారు అర కోటినోట్: ఏపీలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద సుమారు 9.68 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. వీరికి కేంద్రం గ్యాస్ సిలిండర్కు రూ.300 రాయితీ ఇస్తోంది. అది పోనూ ఇటువంటి కనెక్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.594 మాత్రమే చెల్లిస్తుంది. మిగిలిన మాత్రం పూర్తిగా రాయితీ ఇవ్వాల్సి ఉంటుంది. -
Diwali 2024: ఆర్సీబీ ‘క్వీన్’ అలా.. అందమైన అలంకరణతో స్మృతి ఇలా(ఫొటోలు)
-
దీపావళి వీడియో కాదు.. సర్వీస్ స్టేషన్ ఫుటేజ్ చూపండి: కునాల్ కమ్రా
ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్.. కంపెనీలో జరిగిన దీపావళి వేడుకలకు సంబంధించిన ఒక వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోపైన స్పందించిన కునాల్ కమ్రా.. ఓలా సర్వీస్ స్టేషన్ ఫుటేజీని షేర్ చేయమని భవిష్ అగర్వాల్ను కోరారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.సేల్స్ తరువాత నాణ్యమైన సర్వీస్ అందించడం లేదనే సమస్యతో ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్తో రగడ మొదలైంది. అప్పటి నుంచి ఓలా కస్టమర్లు లేవనెత్తే అనేక సమస్యలను కునాల్ హైలైట్ చేస్తూ వస్తున్నారు.నెలకు 80,000 కస్టమర్ ఫిర్యాదులను కంపెనీ ఎందుకు పరిష్కరించడం లేదనికునాల్ కమ్రా.. ఓలా సీఈఓను అడిగారు. దీనిపై స్పందించిన భవిష్ అగర్వాల్, ఓలా పరువు తీసేందుకు కమ్రా డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. అంతే కాకుండా భవిష్ అగర్వాల్ కూడా కమ్రాను ఒక సర్వీస్ సెంటర్లో ఒక రోజు పని చేయాలని కోరారు.ఇదీ చదవండి: ఓలా సీఈఓ జాబ్ ఆఫర్.. ఓకే అన్న కమెడియన్!ఇటీవల ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్.. కమెడియన్ కునాల్ కమ్రాకు జాబ్ ఆఫర్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీనికి కమ్రా అంగీకరిస్తూ కొన్ని షరతులను కూడా వెల్లడించారు. కాగా ఇప్పుడు మళ్ళీ భవిష్ అగర్వాల్ చేసిన పోస్టుకు.. కామెంట్ చేశారు. దీనిపైనా నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.Service station ka footage dikhao… https://t.co/Zmp1Yzoh3i— Kunal Kamra (@kunalkamra88) October 31, 2024 -
దీపావళి వేడుకల్లో అపశ్రుతి..ఆస్పత్రికి క్యూ
-
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. బాణసంచా పేల్చడానికి 10 గంటల వరకే అనుమతి
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా పేల్చడానికి అనుమతినిస్తూ సైబరాబాద్ పోలీసులు ప్రకటన చేశారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పబ్లిక్ రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం నిషేధమని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ప్రకారం.. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా పేల్చడంపై నిషేధం విధించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని.. ఎవరు నిబంధనలు అతిక్రమించినా హైదరాబాద్ పోలీస్ యాక్ట్ ప్రకారం చర్యలుంటాయన్నారు.In view of maintaining public order, peace & tranquility in the limits of Cyberabad @CPCyberabad hereby notify for the information of the general public that Bursting of Fireworks/Crackers on Public roads & public places is strictly prohibited during the celebration of Deepavali. pic.twitter.com/miNJERiaOW— Cyberabad Police (@cyberabadpolice) October 31, 2024 -
సైనికులతో ప్రధాని మోదీ దీపావళి.. పాక్కు వార్నింగ్
ప్రతి ఏడాది దీపావళి పండుగను సైనికులతో గడిపే సంప్రదాయాన్ని ప్రధాని మోదీ ఈ సారి కూడా కొనసాగించారు. సరిహద్దుల్లో గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి కచ్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం, ఆర్మీ, నేవీ, వాయుసేన సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.ఆర్మీ యూనిఫాం ధరించిన ప్రధాని.. కచ్లోని సర్ క్రీక్ ప్రాంతంలో గల లక్కీ నాలాకు బోటులో చేరుకున్నారు. అనంతరం బీఎస్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో సమావేశమయ్యారు. సైనికులకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చారు.. ‘‘కచ్వైపు పాక్ కన్నెత్తి చూసే సాహసం చేయదు. ఇక్కడ రక్షణగా సుక్షితులైన సైనికులు ఉన్నారని వారికి తెలుసు అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘సర్ క్రిక్పై దాడికి గతంలో శత్రు దేశాలు కుట్రలు చేశాయి. ఇక్కడ రక్షణగా ఉన్న సైనికులుగా కుట్రలను తిప్పికొట్టారు.’’ అని మోదీ అన్నారు.దేశ సరిహద్దుల్లో ఒక్క అంగుళం విషయంలోనూ కూడా రాజీపడలేని ప్రభుత్వం ఇప్పుడు ఉంది. దౌత్యం పేరుతో సర్ క్రీక్ను లాక్కోవాలనే కుట్ర గతంలో జరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నేను దానిని వ్యతిరేకించాను’’ అని ప్రధాని చెప్పారు. ప్రపంచం మొత్తం భారతదేశ శక్తిని చూస్తోందని ప్రధాని చెప్పారు.2014 నుంచి ప్రధాని పదవిని చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోదీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో గస్తీ కాస్తున్న సైనికులతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. 2014లో సియాచిన్, 2015లో పంజాబ్ సరిహద్దు, 2016లో హిమాచల్ ప్రదేశ్లోని సుమ్డో, 2017లో జమ్మూ కాశ్మీర్లోని గురేజ్ సెక్టార్, 2018లో ఉత్తరాఖండ్లోని హర్సిల్, 2019లో జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీ, 2019లో రాజస్థాన్, 2019లో కాశ్మీర్లోని నౌషేరా, 2019లో నౌషేరా, 2022లో జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్, 2023లో హిమాచల్లోని లెప్చాలో పర్యటించారు. Celebrating Diwali with our brave Jawans in Kutch, Gujarat.https://t.co/kr3dChLxKB— Narendra Modi (@narendramodi) October 31, 2024 -
బండిపై పేలిన టపాసులు.. ముక్కలు ముక్కలుగా
-
టపాసులపై దేవతల బొమ్మలు ఉంటే కాల్చొద్దు
-
సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్లో దీపావళి సెలబ్రేషన్స్.. ఫొటోలు షేర్ చేసిన సారా
-
తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జగన్
-
సువాసనలు వెదజల్లే దీపాలను వెలిగిద్దాం ఇలా..!
ప్రతి దీపకాంతి పసిడి వర్ణంలో వెలుగులు విరజిమ్ముతుంది. అయితే, కొన్ని దీపాల నుంచి వచ్చే పరిమళాలు మాత్రం విభిన్నంగా మదిని కట్టిపడేస్తున్నాయి. మట్టి ప్రమిదల్లో నూనెతో దీపాలను వెలిగించడంతోనే సంతృప్తి పడటం లేదు నేటితరం అందుకే, భిన్న ఆస్వాదనల వెలుగులను పరిచయం చేస్తున్నారు క్రియేటర్స్. ఈ దీపావళిని సుంగంధ భరితం చేస్తున్న వెలుగులు ఇవి..స్వీట్ ట్రీట్లను పోలి ఉండేలా నోరూరించే దియా డిజైన్ల శ్రేణి ఆన్లైన్ మార్కెట్లో సందడి చేస్తోంది. తియ్యని కప్ కేక్ల నుంచి ఐస్క్రీమ్ల వరకు ప్రతి కొవ్వొత్తి డిజైన్ అబ్బుర పరుస్తోంది. క్రీముతో కూడిన పంచదార పాకం సువాసనలను ఈ కొవ్వొత్తుల ద్వారా ఆస్వాదించవచ్చు. వీటి ధరలు కూడా వందల రూపాయల నుంచి వేలలో ఉన్నాయి. వీగన్ కాంతి..జంతు ఆధారిత ఉత్పత్తులు ఏవీ ఉపయోగించకుండా వీగన్ కొవ్వొత్తుల డిజైన్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. స్వీట్ డిజర్ట్ క్యాండిల్స్లో కుకీస్, బ్లాక్బెర్రీ, డార్క్ చాకొలెట్, లెమన్ డిజర్ట్, స్ట్రాబెర్రీ డిజర్ట్ క్యాండిల్స్ చూపులకు, సువాసనలకు నోరూరిస్తున్నాయి కూడా.ఆకారానికో అందం..మనుషులు, జంతు ఆకారాలను పోలిన క్యాండిల్స్తోపాటు సెంటెడ్ మట్కీ దియా సెట్, టెర్రకోట క్యాండిల్ దియాస్, ఘీ బ్లెండెడ్ ఫిల్డ్ క్లే దియా, మిర్రర్ డెకొరేషన్ దియాస్, షాడో దియాస్, వాటర్ లైట్ దియాస్ లభిస్తున్నాయి. భిన్న ఆకృతిలో డిజైన్లలో కనిపిస్తున్న వెలుగులు ఈ దీపావళికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. (చదవండి: -
సెలబ్రిటీల దీపావళి ముచ్చట్లు.. భయం లేకపోవడమే వెలుగు..!
జీవితం వెలుగుతుంది. జీవితం వెలుతురు సందర్భాలను తీసుకొస్తుంది. జీవితం ఎప్పుడూ నిరాశ, నిçస్పృహలనే చీకట్ల మీదకు ఆశ, ఆవేశం అనే వెలుతురు కిరణాలు పంపుతూనే ఉంటుంది. చీకటి వెలుగుల ఈ రంగేళిని సరి సమంగా స్వీకరించి ముందుకు సాగమని చెబుతుంది దీపావళి. వెలుతురును వరస కట్టుకోమని పెద్ద పెద్ద చప్పుళ్లతో అరిచి చెప్పే పండుగ ఇది. ఈ సందర్భంగా సెలబ్రిటీల వెలుతురు ముచ్చట్లు...నా జీవితంలో వెలుగులు నింపిన సంఘటన నేను మిస్ ఇండియా కిరీటం గెలవడం. మా నాన్నగారు మాకు దూరమైన తర్వాత ఇది జరిగింది. నా కంటే ఎక్కువగా మా కుటుంబ సభ్యులు ఉద్వేగానికి గురైన క్షణాలు అవి. ఇలా మా జీవితాల్లో వెలుగులు నిండిన ఈ సమ యాన్ని నేను మర్చిపోలేను. నాన్నగారు ఆర్మీలో పని చేసేవారు. దీపావళి పండక్కి ఆయన ఇంటికి వచ్చేవారు. అందువల్ల ఇంట్లో పండగ సందడి భలేగా ఉండేది. ఫ్రెండ్స్, బంధువులు అందరూ వచ్చేవారు. ఆయన లేకపోయినా ఆ ఆనవాయితీని కొనసాగేలా చూస్తున్నాను. మా హర్యాణలో దీపావళికి గాలిపటాలు ఎగరేస్తాం. వీధుల్లో పిల్లల ఆటపాటలు ఉంటాయి. కుటుంబ సభ్యులు అందరూ కలుస్తారు నియమంగా. ఇక షాపింగ్ చేయడం, నచ్చిన ఫుడ్ తినడం, దీపావళి వెలుగుల్లో సరదాగా గడపడం... ప్రతిసారి లాగే ఈసారి కూడా దీపాళికి ప్లాన్ చేశాను.ఇప్పుడే కాదు.. నా చిన్నప్పటి నుంచీ నేను క్రాకర్స్ కాల్చను. కానీ ఎవరైనా క్రాకర్స్ కాల్చుతుంటే దూరంగా నిల్చుని చూస్తూ ఆనందిస్తుంటాను. చీకటి, వెలుగులు ఉన్నట్లే... మన జీవితాల్లో కూడా ఎత్తుపల్లాలు, మంచి చెడులు ఉంటూనే ఉంటాయి. అయితే మనం కంట్రోల్ చేయలేని పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అన్నది ముఖ్యం. మన బౌండరీస్పై మనకు ఓ అవగాహన ఉండాలి. ప్రతి విషయంలోనూ సానుకూలంగానే ఆలోచించాలి. ఇలా ఉండటం సులభమని నేను చెప్పడం లేదు. కానీ ఉండగలగాలి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నా బాల్యంలో ప్రతి ఏడాది దీపాళికి మా అమ్మమ్మ ఇంటికి వెళ్లేవాళ్ళం. దాదాపు ఇరవైమంది కుటుంబ సభ్యులం కలిసి ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. అందుకే దీపావళి అంటే నాకు ఎంతో ఇష్టం. చిన్నతనంలో క్రాకర్స్ కాల్చడాన్ని చాలా ఎంజాయ్ చేశాను. మా తాతగారు దీపాళికి పెద్దస్థాయిలో లక్ష్మీపూజ ఘనంగా జరిపేవారు. అప్పట్లో క్రాకర్స్ కొనిచ్చేవారు. పిల్లలు క్రాకర్స్ బాక్స్లను కలిసి కాల్చేవారు. ఎక్స్ఛేంజ్ చేసుకునేవాళ్ళు. బాగుండేది. కానీ పర్యావరణ పరిరక్షణ ముఖ్యమని ఇప్పుడు కాల్చడం లేదు. అయితే ఒకసారి పండక్కు వెళ్లి కాలని లక్ష్మీబాంబులను ఏరుకుని, వాటిని విప్పి అందులోని పొడిని ఓ పేపర్లో ఉంచి, ఆ పేపర్ చివరన వెలిగించాను. నా అంతట నేనే ఓ లక్ష్మీబాంబును తయారు చేసుకుంటున్నానని ఫీలైపోయాను. కానీ దురదృష్టవశాత్తు నా రెండు వేళ్లు కాలిపోయాయి. మా అమ్మకు తెలిస్తే కోప్పడుతుందని తెలియకుండా దాచాను. కానీ అమ్మ గమనించి మందలించింది. ఈ ఘటనను నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే పిల్లలందరికీ చెబుతున్నా... క్రాకర్స్ కాల్చేప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. మీరు కాల్చే క్రాకర్స్పై మీకు అవగాహన లేకపోతే దూరంగా ఉండండి. అత్యుత్సాహం చూపకండి. నేను సరదాగా చేసిన పిచ్చిపనిలాంటివి చేయకండి. కొన్ని కారణాల వల్ల గడిచిన రెండు సంవత్సరాలు నేను దీపాళిని మా అమ్మమ్మ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోలేకపోయాను. అందుకే ఈ ఏడాది నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఆ జ్ఞాపకాలను మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాను. ఇంటి వాతావరణంలో నేను పెరిగింది తక్కువ. బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నాను. కాలేజీ కూడా అంతే. ఒంటరిగా ట్రావెల్ చేస్తుంటాను. సమాజంలో ఎలా మెలగాలో నాకు నేను కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. మీపై మీరు భరోసా ఉంచండి. ధైర్యంగా ఉండండి. నైతిక బాధ్యతతో ఉండండి. అప్పుడు క్లిష్టపరిస్థితులను నెగ్గుకు రావొచ్చు మీరు. నమ్మిన దానిపట్ల ధైర్యంగా నిలబడుతూ తలెత్తుకు జీవించండి. నా అనుభవాల నుంచి నేను నేర్చుకున్న సంగతులు ఇవి. భయం లేకపోవడమే వెలుగని నేను భావిస్తుంటాను. (చదవండి: మన ముంగిళ్లలో వెలుగు పూలు) -
దర్శన్కు దీపావళి!
సాక్షి, బళ్లారి, బనశంకరి: దీపావళి సంబరాల సమయంలో ప్రముఖ నటుడు దర్శన్కు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. ఆయనకు బెంగళూరులోని హైకోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. చిత్రదుర్గానికి చెందిన రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, ప్రియురాలు పవిత్రగౌడ సహా మరికొందరు నిందితులు 140 రోజుల నుంచి జైలులో ఉన్నారు. దర్శన్కు 6 వారాలు పాటు బెయిలు అమల్లో ఉంటుంది.కోర్టులో వాదనలు..తీవ్రమైన వెన్నునొప్పి సమస్యను చూపుతూ బెయిలు పిటిషన్ వేయగా కొన్నిరోజులుగా విచారణ సాగుతోంది. న్యాయమూర్తి విశ్వజిత్శెట్టి ధర్మాసనం చివరకు తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. దర్శన్కు వెన్నులో ఎల్–5, ఎస్–1 డిస్క్లలో సమస్య ఉంది. మైసూరులో చికిత్స తీసుకోవాలని దర్శన్ న్యాయవాది నాగేశ్ వాదించారు. సర్కారు వకీలు ప్రసన్నకుమార్ బెయిలు ఇవ్వరాదని వాదించారు. కాలిలో శక్తి కోల్పోయినట్లు ఉందని, చికిత్స తీసుకోకపోతే మూత్ర నియంత్రణ కోల్పోవడంతో పాటు మునుముందు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చని బళ్లారి ప్రభుత్వ ఆసుపత్రి నరాలరోగ నిపుణుడు విశ్వనాథ్ నివేదిక ఇచ్చారని నాగేశ్ తెలిపారు. దర్శన్ ఇప్పటికే రెండుసార్లు మైసూరు ప్రైవేటు ఆసుపత్రి శస్త్రచికిత్స చేసుకున్నారని చెప్పారు.జైలువద్దకు భార్యాపిల్లలుబెయిల్ లభించగానే దర్శన్ సతీమణి విజయలక్ష్మి, కుమారుడు, బంధువులు బళ్లారి సెంట్రల్ జైలుకు వచ్చారు. కోర్టు నుంచి పత్రాలు అందిన తరువాతే జైలు నుంచి దర్శన్ను విడుదల చేస్తారని జైలు సూపరింటెండెంట్ చెప్పారు. జైలు వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకున్నారు.తప్పుచేసిన వారికి శిక్షపడాలిరేణుకాస్వామి తండ్రి కాశీనాథయ్య హరిహరలో విలేకరులతో మాట్లాడుతూ కొడుకు హత్యతో చాలా బాధలో ఉన్నాము. కోడలు కాన్పు కోసం ఇక్కడ పుట్టింటికి వచ్చింది. కొడుకు పుట్టిన సంతోషం కూడా లేకుండా పోయింది. ఎవరు తప్పుచేసినా శిక్షపడాలనేది మా డిమాండ్. నిందితులకు శిక్ష పడేవరకు పోరాటం ఆపేది లేదని చెప్పారు. -
అమెరికా ఎన్నికల్లో భారతీయత
అమెరికా తపాలా శాఖ వారి నుంచి దీపావళి స్టాంపు విడుదలను కోరుతూ భారతీయ అమెరికన్లు కొన్ని సంవత్సరాలు వరుసగా పిటిషన్ల మీద పిటిషన్లు వేశారు. 2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిసారి వైట్హౌస్లో దీపావళి దివ్వెను వెలిగించినప్పుడు భారతీయ అమెరికన్ల ఛాతీ గర్వంతో ఉప్పొంగింది. అమెరికన్ల గుర్తింపు కోసం ఈ తహతహ అంతా! ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, భారీ విరాళాలు ఇస్తున్నప్పటికీ భారతీయ అమెరికన్లు ఇప్పటికీ ఒక నిర్ణాయక శక్తిగా అవతరించలేదని ఒక అధ్యయనం చెబుతోంది. కమలా హ్యారిస్ తల్లి, జేడీ వాన్స్ భార్య... ఇద్దరూ భారతీయ మూలాలు ఉన్నవారు కావడం వల్ల 2024 ఎన్నికలను భారతీయ అమెరికన్లకు దీపావళి కానుక అనుకోవచ్చు.అమెరికా ప్రభుత్వం తమను గుర్తించాలని తహతహలాడని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దీపావళి స్టాంపు కోసం పిటిషన్ల మీద పిటిషన్లు వేయడం ఇందుకు ఒక ఉదాహరణ. హనుక్కా(యూదుల పండుగ), ఈద్లకు స్టాంపులు ఉండగా... తమకెందుకు లేదని ఏటా భారతీయ అమెరికన్లు అక్కడి పోస్ట్ మాస్టర్ జనరల్కు మెయిళ్లు పెట్టేవారు.సంతకాల సేకరణ జరిగేది. కానీ ప్రతిసారీ నిరాశే ఎదురయ్యేది. 2013లో భారతీయ అమెరికన్ పార్లమెంటు సభ్యుడు అమి బేరా స్టాంపు ఎప్పుడో విడుదల కావాల్సిందని అన్నారు. మూడేళ్ల తరువాత 2016లో ‘ఫరెవర్’ స్టాంపు విడుదలైంది. అంటే ఎప్పటికీ తొలగించ నిది. కొద్ది రోజుల్లోనే లక్ష స్టాంపులు అమ్ముడయ్యాయి. స్టాంపులు అమ్ముడు కాకపోతే పంపిణీలోంచి తొలగిస్తారేమోనని విపరీతంగా కొనాలన్న ప్రచారం జరిగింది. పోస్ట్మాస్టర్ జనరల్ రంగంలోకి దిగి దీపావళి స్టాంపును తొలగించే ఉద్దేశమేమీ లేదని స్పష్టం చేయాల్సి వచ్చింది. స్టాంపు ద్వారా అక్కడి సమాజంలో గుర్తింపు పొందేందుకు పడ్డ శ్రమ, ఆందోళన ఇదంతా.2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిసారి వైట్ హౌస్లో దీపావళి దివ్వెను వెలిగించినప్పుడు భారతీయ అమెరికన్ల ఛాతీ గర్వంతో పొంగిపోయింది. దీపావళి రోజును సెలవుగా ప్రకటించాలన్న డిమాండ్ బయలుదేరింది. స్పెల్లింగ్–బీ పోటీల్లో గెలవడం ఒకటైతే, అమెరికన్ కులీనుల నుంచి గుర్తింపు పొందడం మరొకటి.ఆ రకంగా 2024 ఎన్నికలు భారతీయ అమెరికన్లకు దీపావళి కానుక అనుకోవచ్చు. డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హ్యారిస్ తల్లి, రిపబ్లికన్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జేడీ వాన్స్ భార్య... ఇద్దరూ భారతీయ మూలాలు ఉన్నవారే. అమెరికా ఎన్నికల్లో ఈసారి భారతీయత భావన రకరకాలుగా వ్యక్తమవుతోంది.ఉదాహరణకు డోనాల్డ్ ట్రంప్ ఓ ఆఫ్రికన్ –అమెరికన్ జర్నలిస్టుతో మాట్లాడుతూ... కమల సగం ఆఫ్రికన్ అన్న విషయం తనకు నిన్నమొన్నటి వరకూ తెలియదనీ... ఆమె ఎల్లప్పుడూ తన భారతీయ మూలాలను మాత్రమే ప్రస్తావిస్తూంటుందని అన్నారు. అదొక విచిత్రమైన వ్యాఖ్య. కమల ఎప్పుడూ తన ఆఫ్రికన్ మూలాలనే ప్రస్తావిస్తుంటుందని భారతీయ అమెరికన్లు చాలామంది వాదిస్తూంటారు. కేవలం దీపావళి వేడుకల్లో, లేదంటే ఇండియన్ అమెరికన్ లతో నిధుల సేకరణ కార్యక్రమాల్లో మాత్రమే భారతీయ మహిళగా ఉంటుందని చెబుతుంటారు. భారతీయ అమెరికన్ల కంటే ఆఫ్రికన్ అమె రికన్ల ఓటు బ్యాంకు పెద్దదన్న అంచనాతో కమల హ్యారిస్ను ఒక అవకాశవాదిగా చిత్రీకరించేందుకు ట్రంప్ ప్రయత్నించారు. ఇది దీర్ఘకాలంలోనూ ట్రంప్కు పనికొచ్చే ఎత్తుగడ.ఒక రకంగా చూస్తే అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్లు అంతగా అక్కరకొచ్చే అంశంగా కనపడటం లేదు. స్టాంపుల్లాంటి చిన్న విషయాలను పక్కనబెడితే... మిషిగన్ యూనివర్సిటీకి చెందిన జోయ్ జీత్ పాల్ ‘న్యూస్లాండ్రీ’ కోసం నిర్వహించిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఓట్ల శాతం (2020లో 74 శాతం) ఎక్కువగా ఉన్నప్పటికీ, భారీ విరాళాలు ఇస్తున్నప్పటికీ భారతీయ అమెరికన్లు ఒక నిర్ణాయక శక్తిగా అవతరించలేదని ఈ అధ్యయనం చెబుతోంది. అయితే గతంలో ఒకసారి ఫ్లోరిడా కేంద్రంగా ఉన్న భారతీయ వైద్యులు కొందరు ఇండియన్ రిపబ్లికన్ కౌన్సిల్ ఒకటి ఏర్పాటయ్యేందుకు సహకరించడం... జార్జి బుష్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడిన ప్పుడు అక్కడి 2,000 ఓట్లే కీలకం కావడం గమనార్హం. అయితే 2005లో భారతీయ హోటలియర్లు తమ వార్షిక కార్యక్రమానికి నరేంద్ర మోదీని ఆహ్వానించడం... అది కాస్తా ఆయన వీసా రద్దుకు కారణమవడం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. తమ జనాభా కంటే ఎక్కువ పలుకుబడి కలిగివున్న ఇజ్రాయెలీల మాదిరిగానే భారతీయ అమెరికన్లు కూడా ‘యూఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ’ ఏర్పాటు చేశారు. 1956లో దలీప్ సింగ్ సాండ్ తరువాత బాబీ జిందాల్ కాంగ్రెస్కు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ గా రికార్డు సృష్టించిన అనంతరం, కాలిఫోర్నియా నుంచి అమి బేరా కూడా కాంగ్రెస్కు ఎన్నికైన తరువాత మాత్రమే భారతీయ అమెరికన్ల భాగస్వామ్యం పెరిగిందని జోయ్జీత్ పాల్ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు ఇండియన్ అమెరికన్ ఇంప్యాక్ట్ ఫండ్ భారతీయ అమెరికన్ల ఎన్నికలకు ప్రాయోజకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయినా కూడా ఇప్పటికీ భారతీయ అమెరికన్లను విదేశీయుల్లాగే భావించడం ఎక్కువ. భారతీయులకు తాను దగ్గరివాడినని చెప్పుకునే డోనాల్డ్ ట్రంప్ కూడా తన ప్రత్యర్థి నిక్కీ హేలీని ‘నిమ్రదా’ హేలీ అని సంబోధిస్తూండటం గుర్తు చేసుకోవాలి. భారతీయ మూలాలను గుర్తు చేసే ప్రయత్నం అన్నమాట! దీనికి తగ్గట్టుగానే నిక్కీ హేలీ తన వెబ్సైట్లో అసలు పేరు నమ్రతా రణ్ధవాను అసలు ప్రస్తావించనే లేదు. 2010 అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల పోటీని నేను దగ్గరుండి గమనించాను. ఎక్కువమంది దక్షిణాసియా ప్రాంత వాసులు పెద్దగా లేని చోట్లే పోటీ చేశారు. కాన్సస్లో రాజ్ గోయెల్ పోటీ చేసినప్పుడు, పరిసర ప్రాంతాల్లో ఎంతమంది భారతీయు లున్నారని వచ్చిన ప్రశ్నకు, ‘‘పది’’ అని సమాధానం చెప్పారు; పది శాతమంటే మేలే అని వచ్చిన స్పందనకు, ‘‘శాతం కాదు, అక్షరాలా పది మంది మాత్రమే’’ అని ఈయన జవాబిచ్చిన ఘట్టాన్ని నాతో పంచుకున్నారు. ఇండో అమెరికన్ కౌన్సిల్కు చెందిన డెమోక్రటిక్ నేషనల్ కమిటీ అధ్యక్షుడు శేఖర్ నరసింహన్ మాటల్లో చెప్పాలంటే... భారతీయులు అటు నలుపు కాదు, ఇటు తెలుపు కాదు; కాబట్టి వెంటనే ఎందులోనూ చేర్చలేరు.ఈ ఎన్నికల్లో అమెరికన్ కలల కోసం కష్టపడ్డ తల్లిదండ్రులకు మొక్కుబడిగా ఓ దండం పెట్టేసిన తరువాత అభ్యర్థులంతా తాము అమెరికాలో సాధించిన ఘనతలకే పెద్దపీట వేశారు. కమల హ్యారిస్ తాను ఒకప్పుడు ‘మెక్ డొనాల్డ్స్’లో పని చేశానని చెప్పుకున్నట్లు. అమి బేరా తన ప్రచారంలో భారతీయ సంప్రదాయ విలువలను, అమెరికా వృత్తిగత శైలి... రెండింటిని కలగలిపి ‘బోత్ ఆఫ్ టూ వరల్డ్స్’ అని చెప్పుకొన్నారు. అప్పటికి ఓటమి పాలైనా తరువాతి ఎన్నికల్లో గెలుపొందారు. మార్పునకు కొంత సమయం పడుతుందనేందుకు ఇదో నిదర్శనం.అయినా సరే... పాత అలవాట్లు అంత తొందరగా పోవు అంటారు. శేఖర్ నరసింహన్కు ఇది 2006లోనే అనుభవమైంది. అప్పట్లో రిపబ్లికన్ సెనేటర్ పోటీదారు జార్జ్ అలెన్ ఓ యువ భారతీ యుడిని ఉద్దేశించి ‘మకాకా’(కోతి) అని గేలి చేస్తూ మాట్లాడారు. ఆ యువకుడు శేఖర్ కుమారుడు. ఈ ఘటనతో శేఖర్కు తత్వం బోధ పడింది. నువ్వు ఎంత తాపత్రాయ పడినా, వీళ్లకు (అమెరికన్లు) మనం (భారతీయులు) భిన్నంగానే కనిపిస్తూంటామని అర్థమైంది. ఈ ఎన్ని కల్లో కూడా ట్రంప్ మద్దతుదారు లారా బూమర్ చేసిన ‘‘హ్యారిస్ గెలుపొందితే వైట్హౌజ్లో కర్రీ వాసనొస్తుంది’’ అన్న వ్యాఖ్య రభసకు దారితీసింది. అయినప్పటికీ అమెరికా మారడం లేదని చెప్పలేం. ఈ ఎన్నికల్లో కమల... క్యాథీ పేరుతో పోటీ చేయడం లేదు. పైగా తాను దోశ వేస్తూండగా వీడియో తీయడానికి ఓకే అంటున్నారు. హ్యారిస్ గెలుపు ఓటములను పక్కనబెట్టినా... అమెరికాలో వచ్చిన సాంస్కృతిక మార్పు మాత్రం మళ్లీ వెనక్కు మళ్లలేనిది.సందీప్ రాయ్ వ్యాసకర్త రచయిత, రేడియో హోస్ట్(‘మింట్’ సౌజన్యంతో) -
భయంకరంగా టపాసుల రేట్లు.. ఖాళీగా షాపులు
-
అయోధ్య దీపోత్సవం.. కన్నడ స్టార్ కు బిగ్ రిలీఫ్
-
తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: దీపావళిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారాయన.‘‘చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక. దీపావళి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలి. ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలి. ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలి’’అలాగే.. ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి. వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలి అని ఆయన ఆకాంక్షించారు. ఈ దీపావళి మీ ఇంట మరిన్ని వెలుగులు నింపాలని, మీకు మరిన్ని విజయాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) October 31, 2024క్లిక్ చేయండి: పులివెందులలో.. జనంతో జగన్ -
500 ఏళ్ల తరువాత అయోధ్యలో వైభవంగా దీపావళి
-
పండుగవేళ.. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు శుభవార్త
హైదరాబాద్, సాక్షి: ఉద్యోగులకు జీహెచ్ఎంసీ దీపావళి శుభవార్త చెప్పంది. ఈరోజు సాయంత్రం వరకు జీతాలు విడుదల చేయనున్నట్లు ఫైనాన్స్ డిపార్టుమెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది. జీహెచ్ఎంసీ రూ.120 కోట్ల నిధులను విడుదల చేయనుంది. అయితే.. జీహెచ్ఎంసీ గత నెల వారం రోజుల ఆలస్యంగా జీతాలు ఇచ్చింది. దసరాకు ఐదు రోజులు ఆలస్యంగా జీతాలు ఇవ్వడంతో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి ఉద్యోగుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని రెండు రోజులు ముందుగానే జీహెచ్ఎంసీ జీతాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. -
దివి నుండి భువికి దీపావళి
దీపావళి తారాజువ్వ ఒకటి అంతరిక్షంలోకి దూసుకుని వెళ్లి, అక్కడున్న సునీతా విలియమ్స్ని ఎక్కించుకుని తిరిగి భూమి మీదకు చేరుకుంటే ఎంత బాగుంటుంది! వారంలో తిరిగొచ్చేందుకు వెళ్లి, అవాంతరం వల్ల అక్కడే చిక్కుకుపోయారు సునీత, ఆమె సహవ్యోమగామి విల్మోర్. వారిని స్పేస్లోకి మోసుకెళ్లిన వ్యోమనౌక వారిని అక్కడే వదిలేసి, భూమి పైకి తిరిగొచ్చి కూడా రెండు నెలలు అవుతోంది. వచ్చే ఫిబ్రవరిలో గానీ మరో కొత్త వ్యోమనౌకలో సునీత భూమి పైకి వచ్చే అవకాశాలు లేవు. సునీత ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు ‘నాసా’కు సంకేతాలు అందుతున్నాయి. కానీ అవి సునీత పంపుతున్న సంకేతాలు కావు. నాసా అంచనాలు మాత్రమే. నిజానికి ఆమె ధైర్యంగా ఉన్నారు. భూమిపైకి సందేశాలు పంపుతున్నారు. సోమవారం వైట్హౌస్లో దీపావళి సంబరాలు జరుగుతున్నప్పుడు.. ‘‘అంతరిక్ష కేంద్ర నుండి మీ అందరికీ హ్యాపీ దీపావళి’ అంటూ వీడియోలో శుభాకాంక్షలు పంపారు! ఇది కదా ఈ ఏడాది అసలైన దీపావళి. భూమికి 260 మైళ్ల ఎత్తులో, నక్షత్రంలా మెరుస్తున్న మన సునీతను కళ్లారా చూడ్డం, ఆమె స్వరాన్ని చెవులారా వినటం.. ఇది కదా నిండైన దీపావళి.‘‘ఇంత ఎత్తు నుండి దీపావళిని జరుపుకునే అవకాశం నాకు మాత్రమే లభించింది. దీపావళి, ఇతర భారతీయ పండుగల గొప్పతనం గురించి చిన్నప్పుడు నాన్న మాకు చెప్పేవారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన దీపావళి ఉత్సవాలలో పాల్గొన్నందుకు అమెరికా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్కు సునీతా విలియమ్స్ కృతజ్ఞతలు’’ అని సునీత తన సందేశాన్ని వినిపించారు. కష్టకాలంలో ఉన్నప్పుడు ధీరులు మాత్రమే ఇతరుల సంతోషాలలో పాల్పంచుకోగలరు. తమ కష్టాన్ని దాచి పెట్టి చిరునవ్వుల మతాబులను వెలిగించగలరు. -
రిలయన్స్ దీపావళి గిఫ్ట్ చూశారా?
దీపావళి సందర్భంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు బహుమతులు ఇస్తాయి. కొన్ని కంపెనీలు బోనస్ల రూపంలో నగదు పంపిణీ చేస్తే మరికొన్ని స్వీట్లు, ఇతర గిఫ్ట్లు ఇస్తూంటాయి. భారత్లోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి బహుమతి అందించింది. రిలయన్స్ ఇచ్చిన గిఫ్ట్బాక్స్ అన్బాక్స్ వీడియో ప్రస్తుతం వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.రిలయన్స్ జియో ఇన్ఫోకామ్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని తనకు అందించిన గిఫ్ట్ బాక్స్ను అన్బాక్స్ చేస్తూ వీడియో రికార్డు చేసింది. ఈ వీడియోలో ఇంగ్లీషు, హిందీలో ‘దీపావళి శుభాకాంక్షలు’, ‘శుభ్ దీపావళి’ అని రాసిన తెల్లటి బాక్స్ను గమనించవచ్చు. ఇందులో మూడు ప్యాకెట్లు ఉన్నాయి. వాటిలో జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష(కిస్మిస్) ఉన్నాయి. View this post on Instagram A post shared by sumanasri😍 (@itlu_me_suma)ఇదీ చదవండి: ఉద్యోగులకు టీ, కాఫీ నిలిపివేత!రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, భార్య నీతా అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా, ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్తోపాటు తమ కుటుంబంలోని నలుగురు మనవరాళ్లు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు నోట్ ఉంది. -
పండుగ కళ వచ్చేసింది: పింక్ సారీలో నటి లయ
-
ఈ దేశాల్లోనూ దీపావళి సెలవులు
న్యూఢిల్లీ: భారతదేశంలోని ప్రజలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. ఈ పండుగ సందర్భంగా పలు ప్రాంతాల్లోని ప్రజలు బంగారం, వెండి, కార్లు, పాత్రలు, కొత్త బట్టలు మొదలైనవి కొనుగోలు చేస్తారు. అన్ని విద్యా సంస్థలు, బ్యాంకులు, కార్యాలయాలకు దీపావళి రోజున సెలవు ఉంటుంది.విదేశాల్లో దీపావళి వేడుకల విషయానికొస్తే నేపాల్, బాలి, సింగపూర్ సహా పలు దేశాల్లో దీపావళి సందడి కనిపిస్తుంది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో దీపావళి నాడు ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటిస్తారు. అమెరికాలో అధిక సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు దీపావళి సందర్భంగా వైట్ హౌస్లో దీపం వెలిగిస్తారు. అమెరికాలోని పెన్సిల్వేనియా, న్యూయార్క్లలో దీపావళినాడు అధికారిక సెలవుదినంగా ప్రకటించారు.ఫిజీ: 1879 నుంచి ఫిజీలో దీపావళి నాడు ప్రభుత్వ సెలవుదినాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు.మలేషియా: మలేషియాలో ప్రభుత్వ సెలవుల జాబితాలో దీపావళి కూడా చేరింది. మారిషస్: మారిషస్లో హిందువుల జనాభాను పరిగణనలోకి తీసుకుని దీపావళి నాడు ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించారు. ఈ ద్వీపంలో దీపావళి సందర్భంగా దీపాలు వెలిగిస్తారు. ఇళ్లను అందంగా అలంకరిస్తారు.నేపాల్: నేపాల్లో దీపావళిని తిహార్ లేదా స్వాంతి అంటారు. అక్కడ ఈ పండుగను 5 రోజుల పాటు జరుపుకుంటారు.శ్రీలంక: శ్రీలంకలో తమిళనాడు చెందినవారు దీపావళిని జరుపుకుంటారు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ సెలవులు ఇస్తారు.సింగపూర్: దీపావళి సందర్భంగా సింగపూర్లో ప్రభుత్వ సెలవుదినం. లిటిల్ ఇండియాలో దీపావళి నాడు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దక్షిణాఫ్రికా, ట్రినిడాడ్, టొబాగోలో కూడా దీపావళి సందర్భంగా పబ్లిక్ హాలిడే ఇస్తారు. ఇది కూడా చదవండి: గుడిలో బాణసంచా ప్రమాదం.. 150 మందికి గాయాలు -
ఢిల్లీ.. 72 గంటలు డేంజర్
న్యూఢిల్లీ: రాబోయే 72 గంటలు దేశ రాజధాని ఢిల్లీకి ప్రమాదకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో గత కొన్ని రోజులుగా పొగమంచు కమ్ముకుంటోంది. వాయు నాణ్యత సూచిక ప్రతిరోజూ 300 దాటుతోంది. ఈరోజు (అక్టోబరు 29) ఉదయం ఏక్యూఐ 274గా నమోదయ్యింది. ఢిల్లీలో గాలి నాణ్యత రానున్న మూడు రోజుల్లో మరింత విషపూరితం అయ్యే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. #WATCH | Delhi: A thin layer of smog engulfs the National Capital as the air quality continues to deteriorate.(Visuals from India Gate) pic.twitter.com/XeCku3Hu1k— ANI (@ANI) October 29, 2024ఇప్పటి వరకు వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల వాయుకాలుష్యం పెరిగిందని, అయితే రానున్న రోజుల్లో పటాకులు పేల్చడం వల్ల వాయుకాలుష్యం పెరగనుందని చెబుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వం పటాకులను నిషేధించినప్పటికీ కాలుష్యం పెరిగే అవకాశాలున్నాయి. రాజధానిలో గ్రేప్-1, గ్రేప్-2 నిబంధనలు కూడా అమలు చేస్తున్నారు.#WATCH | Delhi | AQI around Lodhi Road and surrounding areas recorded 255, categorised as 'Poor' according to the Central Pollution Control Board (CPCB). pic.twitter.com/rYZboXTtYN— ANI (@ANI) October 29, 2024సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) డేటాలోని వివరాల ప్రకారం సోమవారం ఆగ్నేయ గాలుల కారణంగా ఢిల్లీ కాలుష్య స్థాయి కాస్త మెరుగుపడింది. అయితే దీపావళి నాటికి ఢిల్లీలో రెట్టింపు కాలుష్యం ఏర్పడే అవకాశాలున్నాయి. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) 304 (చాలా పేలవంగా ఉంది). సాయంత్రం 6 గంటలకు 299గా ఉండగా, రాత్రి 10 గంటలకు 288కి చేరుకుంది. #WATCH | Delhi | AQI around ITO and surrounding areas recorded 261, categorised as 'Poor' according to the Central Pollution Control Board (CPCB). pic.twitter.com/FvG2oZGgJB— ANI (@ANI) October 29, 2024ఇది కూడా చదవండి: గుడిలో బాణసంచా ప్రమాదం.. 150 మందికి గాయాలు -
మనుమలకు టపాసులు కొనిచ్చిన కేంద్ర మంత్రి గడ్కరీ
నాగ్పూర్: దేశంలో దీపావళి సందడి నెలకొంది. మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీపావళి షాపింగ్కు సంబంధించిన ఒక వీడియో వైరల్గా మారింది.ఈ వీడియోలో నితిన్ గడ్కరి తన మనుమడు, మనుమరాలితో దీపావళి షాపింగ్ చేయడాన్ని చూడవచ్చు. గడ్కరీ ఒక బాణసంచా దుకాణంలో తన మనుమలకు బాణసంచా కొనిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను నితిన్ గడ్కరీ కార్యాలయం విడుదల చేసింది.ఇదిలావుండగా పాన్ మసాలా, గుట్కా తిని రోడ్డుపై ఉమ్మివేసే వారికి బుద్ధి చెప్పేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక వినూత్న ఆలోచన వెలిబుచ్చారు. అటువంటివారి ఫొటోలు తీసి పత్రికల్లో ప్రచురించాలని, అప్పుడే వారికి బుద్ధి వస్తుందన్నారు. దేశ ప్రజలు రోడ్లు మురికిగా మారకుండా కాపాడుకోవాలని మంత్రి సూచించారు.ఇది కూడా చదవండి: ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ఇకలేదు -
దీపావళి ఔట్ ఫిట్: రాశీఖన్నా రీగల్ లుక్ (ఫొటోలు)
-
ఏక్తా కపూర్ దీపావళి పార్టీలో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
దీపోత్సవానికి అయోధ్య ముస్తాబు
అయోధ్య: దీపావళి సందర్భంగా జరిగే దీపోత్సవ్ వేడుకలకు యూపీలోని అయోధ్య ముస్తాబవుతోంది. అక్టోబర్ 30న జరిగే దీపోత్సవ్ కోసం రామనగరిని అందంగా తీర్చిదిద్దుతున్నారు. భక్తివిశ్వాసాల కలబోతతో అయోధ్య వెలుగులమయం కానుంది.అయోధ్యలో జరిగే 8వ దీపోత్సవంలో అవధ్ యూనివర్సిటీకి చెందిన 30 వేల మంది వాలంటీర్లు దీపోత్సవ్ స్థలంలో 28 లక్షల దీపాలను అమర్చేందుకు కృషి చేస్తున్నారు. రామ్ కీ పైడిలోని 55 ఘాట్ల వద్ద జై శ్రీరామ్ నినాదాలతో వెలుగుల పండుగలో వాలంటీర్లు పాల్గొననున్నారు.శ్రీరాముడు కొలువైన అయోధ్య ఈ సంవత్సరం దీపోత్సవం సందర్భంగా డిజిటల్ సిటీగా కనిపించబోతోంది. వెలుగుల సంగమం ఆవిష్కృతం కానుంది. ధరంపథ్ నుండి లతా మంగేష్కర్ చౌక్ వరకు, రంగురంగుల లైట్లు ఆకర్షణీయంగా కనువిందు చేయనున్నాయి. ముఖ్యంగా లతా మంగేష్కర్ చౌక్ వెలుగు జిలుగులతో అత్యంత సుందరంగా కనిపించనుంది.దీపోత్సవ వేడుకలకు నగరమంతా త్రేతాయుగంలా ముస్తాబైంది. త్రేతాయుగంలో రాముడు లంకను జయించి అయోధ్యకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి. ఇప్పుడు వాటిని గుర్తు చేసేలా అయోధ్యను రంగురంగుల దీపాలతో అలంకరించారు.లతా మంగేష్కర్ చౌక్ నుండి వివిధ కూడళ్లలో రామభక్తుల కోసం డిజిటల్ డిస్ప్లే వ్యవస్థను ఏర్పాటు చేశారు. రామభక్తులు దీపోత్సవ్ ప్రదేశానికి వెళ్లలేకపోయినా, డిజిటల్ తెరలపై దీపోత్సవాన్ని చూసి ఆస్వాదించవచ్చు.రంగురంగుల దీపాలు అయోధ్య అందాన్ని మరింత పెంచుతున్నాయి. రామభక్తులు రాత్రిపూట అయోధ్య వీధుల్లోకి వెళ్లినప్పుడు తమను తాము మైమరచిపోయేలా దీపోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.ఇది కూడా చదవండి: అత్యంత వృద్ధ మహిళ అస్తమయం -
కరెంట్ చార్జీల పెంచడమే దీపావళి కానుకా?.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
మల్టీ-అసెట్ ఫండ్స్తో దీపావళి కాంతులు
కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అంతా ఒక్క చోట చేరి సంతోషంగా జరుపుకునే దీపాల పండుగ దీపావళి. సంపద, శ్రేయస్సును ప్రసాదించే లక్ష్మీ దేవి పూజ ఈ వేడుకల్లో కీలకమైనది. లక్ష్మీదేవి కటాక్షం పొందాలన్నా, సంపదను సాధించాలన్నా మనం కూడా కష్టపడి పనిచేయాలి. తెలివిగా ఇన్వెస్ట్ చేయాలి. లక్ష్మీ దేవి పూజలో ఉపయోగించే దీపాలు, పూలు, నగదు మొదలైన వాటిని ఒకసారి పరిశీలిస్తే మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోను తీర్చిదిద్దుకునేందుకు ప్రేరణనిచ్చే అంశాలెన్నింటినో తెలుసుకోవచ్చు. వివిధ పూజాద్రవ్యాల సమాహారంలాగా ఈక్విటీ, డెట్, గోల్డ్ మొదలైన వాటితో కూడు కున్న మల్టీ అసెట్ ఫండ్ అనేది మెరుగైన రాబడులను పొందడంలో ఇన్వెస్టర్లకు ఎంతగానో తోడ్పడుతుంది.దీపాలు: ఈక్విటీల కాంతులు చీకటిని పారద్రోలి, ఆశల కాంతులనిస్తాయి దీపాలు. మొత్తం పూజా కార్యక్రమానికి మార్గదర్శకత్వం వహించేలా వెలుగు పంచుతాయి. మల్టీ–అసెట్ ఫండ్ను పరిగణనలోకి తీసుకుంటే, ఈక్విటీ పెట్టుబడులు కూడా ఇలాంటి పాత్రే పోషిస్తాయి. సాధారణంగా పోర్ట్ఫోలియోకు వృద్ధి చోదకాలుగా ఈక్విటీలు పనిచేస్తాయి. దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి దోహదపడతాయి. దీపాలు ఏ విధంగానైతే గదిని కాంతివంతం చేస్తాయో దీర్ఘకాలంలో అధిక రాబడులను అందించి వృద్ధి దిశగా సాగే బాటను ప్రకాశింపచేస్తాయి ఈక్విటీలు. మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా వీటితో కొన్ని రిస్కులు ఉన్నప్పటికీ సంపద సృష్టి విషయంలో వీటికున్న సామర్థ్యాల కారణంగా సమతుల్యమైన పోర్ట్ఫోలియోలో తప్పనిసరిగా చోటు కల్పించాల్సిన ఆర్థిక సాధనంగా ఈక్విటీలు ఉంటాయి. పుష్పాలు: డెట్ సాధనాల సౌరభాలు లక్ష్మీ పూజలో స్వచ్ఛత, అందానికి చిహ్నమైన పుష్పాలు కూడా కీలకమే. పరిమళాలు వెదజల్లే పుష్పాలు పూజా కార్యక్రమానికి ఒకవైపు రంగుల హంగులను జోడిస్తూ మరోవైపు ఆధ్యాత్మిక శోభను తెస్తాయి. మల్టీ అసెట్ ఫండ్లో బాండ్లు, డిబెంచర్లు, గవర్నమెంట్ సెక్యూరిటీల్లాంటి డెట్ సాధనాలు కూడా ఇలాంటి పాత్రే పోషిస్తాయి. మల్టీ అసెట్ ఫండ్లో డెట్ సాధనాలు స్థిరత్వాన్ని, క్రమానుగత ఆదాయాన్ని అందిస్తాయి. ఈక్విటీలు హెచ్చుతగ్గులకు లోనైనా పోర్ట్ఫోలియో తీవ్ర ఒడిదుడుకులకు లోను కాకుండా సమతూకంగా ఉండేలా డెట్ సాధనాలు కాస్త బఫర్గా పనిచేస్తాయి. ఇవి మరో అంచె భద్రతను కల్పిస్తాయి. మార్కెట్ అనిశ్చితిని అధిగమించే ధీమాను అందిస్తాయి. తిలకం: రక్షణ కవచం నుదుటిపైన బొట్టు/తిలకం శుభాన్ని, రక్షణను సూచిస్తుంది. ప్రతికూల శక్తుల నుంచి భక్తులకు ఇది రక్షణ కల్పిస్తుంది. మల్టీ–అసెట్ ఫండ్లో ఈ పాత్రను పసిడి పోషిస్తుంది. సాధారణంగా ద్రవ్యోల్బణం, మార్కెట్ పతనాలకు హెడ్జింగ్గా ఉపయోగపడే సాధనంగా బంగారాన్ని పరిగణిస్తారు. రక్షణ కల్పించే తిలకంలాగే బంగారం కూడా ఆర్థిక సంక్షోభాల సమయంలో మీ పోర్ట్ఫోలియోను సురక్షితంగా ఉంచుతుంది. తమ సంపదను కాపాడుకోవాలనుకునే ఇన్వెస్టర్లు .. కాలం గడిచినా విలువను కోల్పోని బంగారాన్ని తమ పోర్ట్ఫోలియోలో తప్పనిసరిగా చేర్చుకోతగిన సాధనం కాగలదు. ఇటీవలి కాలంలో చూస్తే బంగారం కూడా గణనీయంగా రాబడులు అందించింది. వివిధ అంశాలను పరిశీలిస్తే రాబోయే రోజుల్లో పసిడికి డిమాండ్ మరింతగా పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. నాణేలు/డబ్బు: నగదు తత్సమానాలు నాణేలు, నోట్ల రూపంలో సంపద, సమృద్ధి, శ్రేయస్సు, ఆర్థిక సమృద్ధిని సూచించే నగదుకు కూడా లక్ష్మీ పూజలో ప్రాధాన్యం ఉంటుంది. లక్ష్మీ దేవి ఆర్థిక వృద్ధి, స్థిరత్వాన్ని ప్రసాదిస్తుందని, ఆశీర్వదిస్తుందని నమ్మకం. ఇన్వెస్టింగ్ ప్రపంచంలో టీఆర్ఈపీఎస్ (ట్రెజరీ బిల్స్ రీపర్చేజ్ అగ్రిమెంట్స్), ట్రెజరీ బిల్లుల్లాంటివి నగదు తత్సమానమైనవి. ఇవి పోర్ట్ఫోలియోలో అంతర్గతంగా భద్రతా కవచంగా ఉపయోగపడతాయి. మార్కెట్లు ఒడిదుడుకులకు లోనైనప్పుడు స్థిరత్వాన్ని ఇస్తాయి. వివిధ పూజాద్రవ్యాలతో లక్ష్మీ పూజ ఎలాగైతే సంపూర్ణమవుతుందో వివిధ సాధనాలను తగు పాళ్లలో జోడించుకుంటే పోర్ట్ఫోలియో కూడా సంపూర్ణంగా, సమతూకంగా ఉంటుంది. ఈక్విటీ, డెట్, బంగారం, నగదు మేళవింపుగా ఉండే మల్టీ అసెట్ ఫండ్స్ అటువంటి ప్రయోజనాలను ఇన్వెస్టర్లకు కల్పిస్తాయి. -
వ్యాపారం.. వెలగని భూచక్రం
వన్టౌన్ (విజయవాడ పశ్చిమ)/సాక్షి నెట్వర్క్: దీపావళి పర్వదినం సమీపిస్తోంది. ఈ పండుగ పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది టపాసులే. కానీ.. ఈ ఏడాది బాణసంచా మార్కెట్లో పండుగ సందడి అసలు కనిపించడం లేదు. ఏటా ఈ సమయానికి హోల్సేల్ మార్కెట్లో 90 శాతం టపాసులు అమ్ముడయ్యేవి. దీపావళికి మూడు రోజులే సమయం ఉండగా.. కనీసం 25 శాతం బాణసంచా కూడా అమ్ముడుపోలేదని హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. విజయవాడ నగరంలో ఐదుగురు హోల్సేల్ వ్యాపారులు అనేక దశాబ్దాలుగా టపాసుల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. వీరినుంచి 150 మంది రిటైల్ వ్యాపారులు బాణసంచా కొనుగోలు చేస్తారు. వీరంతా వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసి మూడు, నాలుగు రోజులపాటు విక్రయాలు జరుపుతుంటారు. కానీ.. ఈ ఏడాది రిటైలర్లు హోల్సేలర్ల వద్ద బాణసంచా కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు.దీపావళిని కమ్మేసిన వరద, భారీ వర్షాలుసెప్టెంబర్ మొదటి వారంలో ఎన్టీఆర్ జిల్లాను బుడమేరు వరద ముంచెత్తింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి పలు ప్రాంతాల్లో వరద చేరింది. లక్షలాది మంది ముంపునకు గురై ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఇంట్లో రూ.లక్షల మేర నష్టం వాటిల్లింది. బాధితుల్లో అత్యధికులు ప్రభుత్వ సాయం అందక లబోదిబోమంటున్నారు. వరద ప్రభావం బాణాసంచా విక్రయాలపై తీవ్రంగా పడిందని, అందువల్లే హోల్సేల్ వ్యాపారానికి గండిపడిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. నిత్యావసర ధరలు పెరిగిపోవడంతో..భారీగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు ప్రజల ఆర్థిక పరిస్థితులను దిగజార్చాయి. ఈ ప్రభావం బాణాసంచా విక్రయాలపై అధికంగా కనిపిస్తోంది. వంటనూనె, ఇతర నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో వాటిని కొనుగోలు చేసేందుకే ప్రజల దగ్గర డబ్బులు లేవని.. ఈ పరిస్థితుల్లో బాణసంచా కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.సంక్షేమం లేదు.. సంక్షోభమేగత ప్రభుత్వ హయాంలో తల్లికి వందనం, విద్యాదీవెన, వసతి దీవెన, రైతుభరోసా వంటి పథకాల ద్వారా ఎన్నో కుటుంబాలకు సాయం అందేది. కూటమి ప్రభుత్వం రాకతో సంక్షేమ పథకాల సాయం అందటం లేదు. మరోవైపు ఖర్చులు భారీగా పెరిగిపోవడం పండుగపై ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. ఈ పరిస్థితులన్నీ టపాసుల కొనుగోళ్లపై ప్రభావాన్ని చూపుతున్నాయని, ఈ ఏడాది సరైన వ్యాపారమే జరగలేదని హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు. ఏటా దసరా నుంచి మొదలై.. ఈ సమయానికి 90%వ్యాపారం పూర్తయ్యేదని.. ఈ ఏడాది దానికి భిన్నమైన పరిస్థితులు వల్ల 75% అమ్మకాలు తగ్గాయని వ్యాపార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.విక్రయాలు భారీగా తగ్గాయిఈ ఏడాది బాణాసంచా విక్రయాలు భారీగా తగ్గాయి. వర్షాలు, వరదలు దీపావళి సీజన్పై తీవ్ర ప్రభావం చూపాయి. ఏటా దీపావళికి నెల ముందే బాణసంచా తీసుకెళ్లే రిటైల్ వ్యాపారులు ఈ ఏడాది కొనుగోళ్లకు ముందుకు రాలేదు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు కొనుగోలుదారులపై ప్రభావం చూపుతున్నాయి. పండుగకు ముందు జరిగే వ్యాపారంలో 50 శాతం కూడా జరగలేదు. – గర్రె బాబూరావు, బాణసంచా వ్యాపారి, చిలకలూరిపేటఎక్కడా కనిపించట్లేదుఈసారి దీపావళికి టపాసులు పేలేలా కనిపించడం లేదు. టపాసుల విక్రయాలు ఎక్కడా జరగటం లేదు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఏటా ముందుగానే టపాసులు కొనేవారు. ఇటీవల వచ్చిన అకాల వర్షాలు, ధరల పెరుగుదలతో ఆ పరిస్థితి కనిపించడం లేదు. షాపులు నెలకొల్పేందుకు కూడా వ్యాపారులు ముందుకు వస్తున్న పరిస్థితి లేదు. – ఎస్.రాజారావు, బైరివానిపేట, శ్రీకాకుళం జిల్లా -
సువర్ణ వాకిలి
‘చూశావా... ఏం తెచ్చానో’ అన్నాడతను స్కూటర్ ఇంటి ముందు ఆపి. వెనుక ట్రాలీ వచ్చి ఆగింది. అన్నీ మొక్కలే. నర్సరీ నుంచి తాజాగా దిగినవి. ‘అడిగావుగా... మల్లెతీగ తెచ్చాను’... ‘ఇదిగో... నీకు ఇష్టమైన బంతి. కుండీలోనే ఎన్ని పూసేసిందో చూడు’... ‘చిట్టి రోజాలు... రెక్క చామంతులు... ఈ మందారం కొమ్మలేసేంతగా పెరిగితే చాలా బాగుంటుంది’... వరుసగా చూపుతున్నాడు. ఎన్నాళ్లుగానో అడుగుతోంది. ఇవాళ ఉదయాన్నే లేచి, చెప్పా పెట్టకుండా వెళ్లి తెచ్చాడు. సంతోషంగా, సంబరంగా, ప్రేమగా చూస్తోంది వాటన్నింటిని! ‘నన్నూ తీసుకెళ్లుంటే బాగుండేదిగా’... ‘ఇంట్లోకి మొక్కలు వస్తున్నప్పుడు నువ్వు ఎదురు రావాలనీ’... ఆమె చేతిలో చాలా పూలున్న చిన్న కుండీని పెట్టి సెల్ఫీ దిగాడు. ఇద్దరూ హాయిగా నవ్వారు ఫొటోలో. ‘దీని పేరు బెగోనియా అట. బాగుంది కదూ’...మరోచోట మరో ఇంటతను రెండు రోజులుగా ఇల్లు సర్దుతున్నాడు. భార్యను పిలిచి ‘అనవసరమైన సామాను చాలా పేర్చిపెట్టావు చూడు’ అని బుజ్జగించి పారవేయించాడు. మాసిన కర్టెన్లు తీసి, ఉతికిన కర్టెన్లు మార్చాడు. దుమ్ము పట్టిన లైట్లను తుడిచాడు. అన్నీ చక్కగా అమర్చి హాల్లో రెండు ర్యాకులను ఖాళీగా సంపాదించగలిగాడు. ‘ఇప్పుడు ఏం చేద్దామని ఈ ర్యాకులను’ అందామె. ‘చెప్తా’ అని సాయంత్రం పిల్లల్ని తీసుకొని ఆటో ఎక్కి పుస్తకాల షాపుకు చేరాడు. ‘పిల్లలూ... ఒక ర్యాకుకు సరిపడా పుస్తకాలు మీరు కొనుక్కోండి. ఒక ర్యాకుకు సరిపడా మేము కొనుక్కుంటాం’.... పెళ్లికి ముందు వారిద్దరూ పుస్తకాలు చదివేవారు. సంసారంలో పడి వదిలేశారు. ‘ఇష్టమైన అలవాటు. తిరిగి మొదలెడదాం’ అన్నాడు భార్యతో. అప్పటికే ఆమె పుస్తకాలు ఎంచి ఒకవైపు పెట్టేస్తోందిగా!ఇంకో నగరం. ఉదయపు ఎండ ఎక్కువగా లేదు. అలాగని తక్కువగా లేదు. మంచి గాలి వీస్తున్నందు వల్ల బాల్కనీలో ఎదురూ బొదురూ సమయం ఆహ్లాదంగా ఉంది. ‘నీ ఫోను ఇవ్వు’ అన్నాడామెతో భర్త. తీసుకుని స్విగ్గి, జొమాటో లాంటి యాప్స్ డిలీట్ చేశాడు. తన ఫోన్ ఆమెకు ఇచ్చాడు. ‘ఫుడ్ డెలివరీ యాప్స్ తీసెయ్’ అన్నాడు. తీసేసింది. ‘ఇవాళ్టి నుంచి బయటి తిండి వద్దు. ఈ ఇంట్లోకి ఏది వచ్చినా ఇకపై హెల్దీదే వస్తుంది. నేను వారంలో మూడు బ్రేక్ఫాస్ట్లు, కనీసం రెండు డిన్నర్లు నువ్వు కిచెన్ లోకి రానవసరం లేకుండా చేయగలను. మిగిలింది నువ్వు చేయి. అసలు పొయ్యి ఎక్కవలసిన అవసరం లేని మంచి తిండి కూడా పిల్లలతో కూచుని డిజైన్ చేద్దాం. ఫేస్బుక్, యూట్యూబ్లకు వెచ్చించే సమయం మన ఉదరం కోసం వెచ్చిస్తే తెలిసి తెలిసీ ద్రోహం చేసుకోని వాళ్లం అవుతాం. మన తాత ముత్తాతలు వండుకోవడానికి తిండిలేక ఏడ్చేవాళ్లు. మనకు అన్నీ ఉన్నా వండుకోవడానికి ఏడిస్తే ఎలా? పరుగు పెట్టి సంపాదించి పట్టెడు మెతుకులు తినలేని స్థితికి చేరితే సంతోషమా మనకు?’అబ్బో! ఆ ఇంటిలో సందడి వేరేగా ఉంది. కోడలు మాటిమాటికీ ఊరికి ఫోన్లు మాట్లాడుతూ ఉంది. టికెట్ల ఏర్పాటు చూస్తూ ఉంది. అంత వరకూ ఖాళీగా ఉన్న మూడో బెడ్రూమును సిద్ధం చేస్తూ ఉంది. కొడుకు ఉద్వేగంగా ఉన్నాడు. కలా నిజమా తేల్చుకోలేక ఉన్నాడు. సాకులు వెతుక్కున్నారు తనూ తన భార్య. లేనిపోని తప్పులు వెతికారు తనూ తన భార్య. మా జోలికి రావద్దని తేల్చి చెప్పారు ఇద్దరూ కలిసి. బాగానే ఉంది. హాయిగా ఉంది. కాని బాగానే ఉందా... హాయిగా ఉందా... తల్లితండ్రులు అడుగుపెట్టి నాలుగేళ్లు అవుతున్న ఈ ఇల్లు. వారి ఆశీర్వాదం తాకని ఇల్లు. వారి మాటలు వినపడని, వారి గదమాయింపులూ ఆత్మీయ హెచ్చరికలూ లేని ఇల్లు. పశ్చాత్తాపం పిల్లలకు మరో పుట్టుక ఇస్తుంది. ఈ పుట్టుక తల్లితండ్రులను కోరింది. మనవలు వెళ్లి రిసీవ్ చేసుకొని తీసుకువస్తే కొడుకూ కోడల్ని కన్నీటి కళ్లతో చూస్తూ లోపలికి అడుగు పెట్టారు తల్లితండ్రులు. విశేషం చూడండి. ఆ రోజు ‘ధన్ తేరస్’.సాధారణంగా ధన్ తేరస్కి ఇంటికి బంగారం వస్తే మంచిది అనంటారు. కాని పై నాలుగు ఇళ్లలో బంగారం వంటి నిర్ణయాలు జరిగాయి. సిసలైన ‘ధన్ తేరస్’ అదే కావచ్చు.ధనం వల్ల ధన్యత రాదు. ధన్యత నొసగే జీవితం గడపడమే నిజమైన ధనం కలిగి ఉండటం. గాలినిచ్చే మంచి చెట్టు, పుష్టినిచ్చే తాజా ఆహారం, కష్టసుఖాలు పంచుకునే నిజమైన మిత్రులు, బుద్ధీ వికాసాలు కలిగించి ఈర్షా్య వైషమ్యం పోగొట్టే పుస్తకాలు, సదా అమ్మా నాన్నల సాంగత్యం, కుటుంబ సభ్యులంతా కలిసి భోం చేయగల సమయాలు, కనీస వ్యాయామం... ఇవి ఏ ఇంట ప్రతిరోజూ ఉంటాయో, అడుగు పెడతాయో, అంటిపెట్టుకుని ఉన్నాయన్న భరోసా కల్పిస్తాయో ఆ ఇల్లు సదా సమృద్ధితో అలరారుతుంది. అక్కడ అనివార్యంగా సంపద పోగవుతుంది. ఉత్తమమైన లోహం బంగారం. అది ఉత్తమమైన నివాసాన్నే ఎంచుకుంటుంది. శీతగాలులు ముమ్మరమయ్యే ముందు ఉల్లాస, ఉత్సాహాల కోసం దీపావళి. పనికి మనసొప్పని ఈ మందకొడి రోజులలో జీవనోపాధి దొరకకపోతే గనక జరుగుబాటుకు దాచిన ధన్తేరస్ పసిడి. పెద్దలు ఏం చేసినా ఆచితూచి, ఆలోచించి చేస్తారు. ధన్తేరస్కు తప్పక బంగారం, వెండి, వస్తువులు కొనదలుచుకుంటే కొనండి. కాని ప్రతి ఇల్లూ ఒక సువర్ణ వాకిలి కావాలంటే మాత్రం అహం, అసూయ, అజ్ఞానాలను చిమ్మి బయట పారబోయండి! ‘వాడికేం... బంగారంలా బతికాడు’ అంటారు. అలా బతికి అనిపించుకోండి! ధన త్రయోదశి శుభాకాంక్షలు. ప్రతి ఇంటా వికసిత కాంతులు కురియుగాక! -
దివాళీ బాష్లో మెరిసిన బాలీవుడ్ సినీతారలు.. ఫోటోలు
-
క్రెడిట్ కార్డులపై దీపావళి ఆఫర్లు
దేశీయ కన్స్యూమర్ క్రెడిట్ మార్కెట్ప్లేస్ పైసాబజార్ పలు క్రెడిట్ కార్డ్లపై ప్రత్యేక పండుగ ఆఫర్లను వెల్లడించింది. పైసాబజార్ ద్వారా కొత్త క్రెడిట్ కార్డ్లను తీసుకునేవారికి గిఫ్ట్ కార్డ్లను అందిస్తోంది.నిర్దిష్ట అమెరికన్ ఎక్స్ప్రెస్, హెచ్ఎస్బీసీ కార్డ్ల కోసం దరఖాస్తు చేసుకున్న కస్టమర్లు రూ.1,500 విలువైన అమెజాన్ గిఫ్ట్ కార్డ్ని అందుకుంటారు. హచ్ఎస్బీసీ వీసా ప్లాటినం క్రెడిట్ కార్డ్, అమెరికన్ ఎక్స్ప్రెస్ ప్లాటినం ట్రావెల్ క్రెడిట్ కార్డ్, అమెరికన్ ఎక్స్ప్రెస్ మెంబర్షిప్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్, హెచ్ఎస్బీసీ లైవ్+ క్రెడిట్ కార్డ్ వంటివి వాటిలో ఉన్నాయి.హెచ్డీఎఫ్సీ బిజినెస్ రెగాలియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డైనర్స్ క్లబ్ బ్లాక్ మెటల్ ఎడిషన్ క్రెడిట్ కార్డ్, మర్రియోట్ బన్వాయ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, హెచ్డీఎఫ్సీ రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డ్, అట్లాస్ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డ్ వంటివాటిపై పైసాబజార్ అదనంగా రూ. 1,000 అమెజాన్ గిఫ్ట్ కార్డ్ను అందిస్తోంది.అమెజాన్లో వివిధ రకాల కొనుగోళ్ల కోసం ఉపయోగించగల ఈ వోచర్లను క్రెడిట్ కార్డ్లు యాక్టివేట్ అయినప్పుడు అందుకోవచ్చు.పైసాబజార్ ప్రకారం.. ఈ ఆఫర్లు పండుగ సీజన్లో కొద్దికాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి. పైసాబజార్ ప్రస్తుతం పదికిపైగా బ్యాంకులతో భాగస్వామ్యం ద్వారా 60కిపైగా క్రెడిట్ కార్డులను అందిస్తోంది. -
దీపావళి టపాసులు.. వివిధ రాష్ట్రాల నిబంధనలివే..
న్యూఢిల్లీ: చలికాలం సమీపిస్తున్న కొద్దీ దేశంలోని పలు నగరాల్లో గాలి విషపూరితంగా మారుతుంటుంది. ఇదే కాకుండా దీపావళి సందర్భంగా పటాకులు కాల్చినప్పుడు వాయు కాలుష్యం మరింత విజృంభిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వివిధ రాష్ట్రాలు పటాకులు కాల్పడంపై నిషేధం విధించాయి. మరికొన్ని రాష్ట్రాల్లో కేవలం రెండు గంటలపాటు మాత్రమే టపాసులు వెలిగించేందుకు అనుమతినిచ్చారు.ఢిల్లీఢిల్లీ- ఎన్సీఆర్లలో అక్టోబరు 31న అంటే దీపావళి నాడు సాయంత్రం 8 నుంచి 10 గంటల మధ్యలో మాత్రమే గ్రీన్ టపాసులు కాల్చుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.మహారాష్ట్రమహారాష్ట్ర నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సూచనల మేరకు మహారాష్ట్రలో బాణసంచా కాల్చడాన్ని నిషేధించారు. అయితే గ్రీన్ క్రాకర్స్ కాల్చడానికి మాత్రమే అనుమతి ఉంది. గ్రీన్ క్రాకర్స్ సాధారణ క్రాకర్స్ కంటే 30శాతం తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసేలా తయారు చేస్తారు.పశ్చిమ బెంగాల్పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో దీపావళి సందర్భంగా కాలుష్యం గణనీయంగా పెరుగుతుంది. ఈ కారణంగా గత కొన్నేళ్లుగా ఇక్కడ సాధారణ పటాకులు పేల్చేందుకు అనుమతి ఇవ్వడం లేదు. అయితే కోల్కతాలో గ్రీన్ క్రాకర్లు కాల్చవచ్చు. కోల్కతాలో రాత్రి 8 నుండి 10 గంటల వరకు గ్రీన్ క్రాకర్స్ కాల్చడానికి అనుమతి ఉంది.పంజాబ్పంజాబ్లో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు మాత్రమే అనుమతి ఉంది. పంజాబ్లో దీపావళి రోజున (అక్టోబర్ 31) ఉదయం 4 నుండి 5 గంటల వరకు, రాత్రి 9 నుండి 10 గంటల వరకు టపాసులు కాల్చేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.బీహార్ పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలోని నాలుగు నగరాల్లో బాణాసంచా కాల్చడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. రాజధాని పాట్నా, ముజఫర్పూర్, హాజీపూర్, గయలో ఈ ఏడాది బాణాసంచా కాల్చడానికి అనుమతి లేదు. ఈ నగరాల్లో పటాకుల అమ్మకానికి లైసెన్స్ కూడా ఇవ్వలేదు. ఎవరైనా రహస్యంగా పటాకులు విక్రయిస్తున్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.హర్యానాదీపావళి నాడు హర్యానాలో గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలంటూ ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయి. దీపావళి నాడు రాత్రి 8 నుండి 10 గంటల వరకు, క్రిస్మస్ రోజున 11.55 నుండి 12.30 గంటల వరకు గ్రీన్ క్రాకర్లు కాల్చేందుకు అనుమతినిచ్చారు.తమిళనాడుతమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి దీపావళి రోజున పటాకులు కాల్చేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. తమిళనాడులో దీపావళి రోజున ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు పటాకులు కాల్చేందుకు ప్రభుత్వం సమయం నిర్ణయించింది.ఇది కూడా చదవండి: ఈసారి 33 విమానాలకు బెదిరింపులు -
అక్కడ కనిపించని దీపావళి వేడుకలు.. కారణమిదే..
దీపావళి వేడుకలను భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గురువారం(అక్టోబర్ 31) ఘనంగా చేసుకోనున్నారు. దీపావళి కోసం షాపింగ్ చేయడంతో సహా అన్ని సన్నాహాలు చాలా ముందుగానే ప్రారంభిస్తారు.దీపావళినాడు లక్ష్మీ దేవిని, గణేశుడిని పూజిస్తారు. అయితే మన దేశంలో దీపావళి జరుపుకోని కొన్ని ప్రదేశాలు ఉన్నాయని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఆ ప్రదేశాలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి పండుగను దక్షిణ రాష్ట్రమైన కేరళలో జరుపుకోరు. కేరళలో కొచ్చిలో మాత్రమే దీపావళి జరుపుకుంటారు. కేరళలో దీపావళి జరుపుకోకపోవడానికి అనేక కారణాలున్నాయి.మహాబలి అనే రాక్షసుడు కేరళను పరిపాలించేవాడు. అతన్ని ఇక్కడి ప్రజలు పూజిస్తారు. దీపావళి ఒక రాక్షసుని ఓటమిని గుర్తు చేస్తూ చేసుకునే పండుగ కావడంతో దీనిని ఇక్కడి ప్రజలు జరుపుకోరు. రాముడు రావణుడిని ఓడించి, అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని దీపావళి చేసుకుంటారనే సంగతి అందరికీ తెలిసిందే. కేరళలో దీపావళి జరుపుకోకపోవడానికి రెండవ కారణం అక్కడ హిందువుల సంఖ్య తక్కువగా ఉండటం. అందుకే రాష్ట్రంలో దీపావళి సందడి కనిపించదు. కేరళతో పాటు తమిళనాడులో కూడా దీపావళి జరుపుకోరు. అక్కడ ప్రజలు నరక చతుర్దర్శిని వేడుకగా జరుపుకుంటారు. ఇది కూడా చదవండి: ‘మా సోషల్ మీడియాను రంగంలోకి దింపుతాం’ -
బంగారంపై పండుగ ఆఫర్లు
బంగారం అంటే అందరికీ మక్కువే ముఖ్యంగా మహిళలు అమితంగా ఇష్టపడతారు. అయితే ప్రస్తుతం పసిడి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అయినా పండుగ వేళ రవ్వంత బంగారమైనా కొనుగోలుచేయాలని ఆశపడతారు. ఈ నేపథ్యంలో దీపావళి, ధన త్రయోదశి సందర్భంగా వివిధ జువెలరీ సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి.జోస్ ఆలుక్కాస్ ‘ఆహా దీపావళి’ ఆఫర్లు హైదరాబాద్: దీపావళి సందర్భంగా జోస్ ఆలుక్కాస్ ‘ఆహా దీపావళి’ పేరుతో ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లు రూ.60 వేల కొనుగోలుపై బంగారు ఆభరణాలకు ఉచితంగా వెండి, వజ్రాల కొనుగోలుపై ఒక బంగారు నాణేన్ని ఉచితంగా పొందవచ్చు. వజ్రాలపై 20% తగ్గింపు, ప్లాటినం ఆభరణాలపై 7% తగ్గింపు అందిస్తుంది. పాత బంగారాన్ని హెచ్యూఐడీ హాల్మార్క్ బంగారు ఆభరణాలతో మార్పిడి చేసుకునే సదుపాయం ఉంది.దీపావళి బహుమతిగా ఒక కారు ఈ ఆఫర్లో భాగంగా ఉంటుంది. ధన త్రయోదశి కోసం ముందస్తు బుకింగ్లు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని ‘ఆహా దీపావళి’ ఆఫర్లను ప్రజలంతా వినియోగించుకోవాలని కంపెనీ చైర్మన్ జోస్ ఆలుక్కా కోరారు.తనిష్క్ పండుగ ఆఫర్లు ముంబై: ఆభరణాల సంస్థ తనిష్క్ పండుగ సందర్భంగా అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లు బంగారు ఆభరణాలు, వజ్రాభరణాల తయారీ చార్జీలపై 20% వరకు తగ్గింపు పొందవచ్చు. పాత బంగారు విలువకు సమానమైన బంగారు ఆభరణాలకు ఎలాంటి చెల్లింపు లేకుండా ఉచితంగా పొందవచ్చు. ఈ నవంబర్ 3 వరకు ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. మరిన్ని ఆఫర్ల కోసం తనిష్క్ షోరూం లేదా, అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
జియో దీపావళి ఆఫర్స్: రూ.3,350 విలువైన బెనిఫిట్స్
ప్రముఖ టెలికామ్ దిగ్గజం రిలయన్స్ జియో 'దీపావళి ధమాకా' పేరుతో కొత్త ఆఫర్స్ ప్రకటించింది. దీపావళి పండుగ సందర్భంగా కంపెనీ ఈ వినియోగదారుల కోసం ఈ ఆఫర్స్ తీసుకువచ్చింది. వీటి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..రిలయన్స్ జియో ప్రకటించిన ఈ ఆఫర్స్ ద్వారా సుమారు రూ. 3,350 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. నవంబర్ 5లోపు రీఛార్జ్ చేసుకున్నవారికి మాత్రమే ఈ బెనిఫీట్స్ లభిస్తాయి. రిలయన్స్ జియో దీపావళి ధమాకా ఆఫర్లో భాగంగా రూ.899 రీఛార్జ్ ప్లాన్ మీద, రూ. 3,599 రీఛార్జ్ ప్లాన్ మీద అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.రూ.899 రీఛార్జ్ ప్లాన్ ద్వారా యూజర్స్ 90 రోజుల వరకు అన్లిమిటెడ్ 5జీ సేవలను పొందవచ్చు. అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. అదనంగా 20 జీబీ డేటా కూడా లభిస్తుంది. రూ. 3,599 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ (365 రోజులు) ద్వారా రోజుకు 2.5 జీబీ డేటాను పొందవచ్చు.ప్రయోజనాలుఈజీ మై ట్రిప్ వోచర్: రిలయన్స్ జియో దీపావళి ధమాకా ఆఫర్స్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే.. రూ. 3,000 విలువైన ఈజీ మై ట్రిప్ వోచర్ పొందవచ్చు. దీనిని విమాన ప్రయాణాలను, హోటల్ బుకింగ్స్ వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు.అజియో కూపన్: రూ. 999 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్ళపైన రూ. 200 అజియో డిస్కౌంట్ లభిస్తుంది.స్విగ్గీ వోచర్: ఫుడ్ డెలివరీ కోసం రూ. 150 విలువైన స్విగ్గీ వోచర్ లభిస్తుంది.ఇదీ చదవండి: యూట్యూబ్ కొత్త ఫీచర్: మరింత ఆదాయానికి సులువైన మార్గంకూపన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే..రిలయన్స్ జియా దీపావళి ధమాకా ఆఫర్స్ ద్వారా పొందిన కూపన్లను మై జియో యాప్ సాయంతో క్లెయిమ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.➜మై జియో యాప్ ఓపెన్ చేసి ఆఫర్స్ విభాగంలోకి వెళ్ళాలి➜అక్కడ కనిపించే మై విన్నింగ్స్ మీద క్లిక్ చేసి కూపన్ ఎంచుకోవాలి➜కూపన్ కోడ్ కాపీ చేసి.. ఎక్కడ ఉపయోగించాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్కు వెళ్లి కూపన్ కోడ్ అప్లై చేసుకోవచ్చు. -
స్వీట్ క్రాకర్స్.. మతాబుల రూపాల్లో చాక్లెట్ల తయారీ
ఈ ఫొటోలో ఉన్నవి ఏంటో చెప్పండి చూద్దాం.. చాలా కాన్ఫిడెంట్గా టపాసులు అనుకుంటున్నారు కదా! అయితే మీరు..తప్పులో కాలేసినట్లే..! అవి టపాసుల్లాంటి టపాసులు..కానీ టపాసులు కాదు.. ఎందుకంటే ఈ పటాసులతో పర్యావరణానికి ఎలాంటి హానీ ఉండదు.. పొగ రాదు. నిప్పు రవ్వలు అసలే ఎగసి పడవు. మరి అవన్నీ రాకపోతే అవి పటాసులు ఎందుకు అవుతాయి? అని ఆశ్చర్యపోతున్నారా.. అవును అక్కడికే వస్తున్నాం.. మీకొచ్చిన డౌటనుమానం కరెక్టే. ఎందుకంటే అవి నిజమైన టపాసులు కావు. అవి చాక్లెట్స్.. అరరే.. చూస్తే టపాసుల్లా భలే ముద్దుగా ఉన్నాయే అనుకుంటున్నారా..? స్వీట్స్ను టపాసుల్లాగా చేయాలన్న ఆలోచనతో ఇలా వినూత్నంగా ఇద్దరు అక్కాచెల్లెళ్లు వీటిని తయారు చేస్తున్నారు. దీపావళి సంబరాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. స్వీట్లు, టపాసులతో దుకాణాలు కళకళలాడుతున్నాయి. స్నేహితులు, బంధువులకు స్వీట్లు పంచుకుంటూ దీపావళి శుభాకాంక్షలు చెప్పుకొంటుంటారు. టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకుంటారు. అయితే ఈ రెండింటినీ మిళితం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు గజ్జల హరితారెడ్డి, లిఖితారెడ్డి. ఇద్దరు అక్కా చెల్లెళ్లూ అనుకున్నదే తడవుగా ఇలా టపాసులను తయారు చేశారు. అదేనండీ టపాసుల్లాంటి చాక్లెట్లు.కాస్త భిన్నంగా ఉండాలని.. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్న వీరిద్దరూ ప్రిపరేషన్ సమయంలో వచ్చే ఒత్తిడిని తట్టుకునేందుకు ఇలా ఇంట్లోనే చాక్లెట్లు తయారుచేయడం అలవాటుగా మార్చుకున్నారు. అలా అలా.. వీరు చేస్తున్న చాక్లెట్లు, కుకీలకు మంచి ప్రశంసలు వస్తుండటంతో డీమెల్ట్ పేరుతో చిన్నపాటి క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేసి నడిపిస్తున్నారు. దీపావళికి ఏదైనా వినూత్నంగా తయారుచేయాలని ఆలోచించగా.. ఈ ఐడియా వచి్చందని, ఈ స్వీట్స్ చూసి ముందు టపాసులు అనుకుంటున్నారని, అసలు విషయం తెలిసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారని హరితారెడ్డి సంతోషం వ్యక్తం చేస్తోంది. -
దీపావళి ఆఫర్: కొత్త కారు కొనడానికే ఇదే మంచి సమయం!
అసలే పండుగ సీజన్.. కొత్త కారు కొనాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు దిగ్గజ కంపెనీలు సైతం భారీ డిస్కౌంట్స్ ప్రకటించాయి. ఇందులో బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి లగ్జరీ కంపెనీలు ఉన్నాయి. ఒక్కో కంపెనీ ఎంపిక చేసిన కొన్ని మోడల్స్ రూ.10 లక్షల వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నాయి.కార్లు, వాటిపై లభించే డిస్కౌంట్స్ఆడి క్యూ3: రూ. 5 లక్షలుమెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ: రూ. 5 లక్షలుఆడి క్యూ5: రూ. 5.5 లక్షలుబీఎండబ్ల్యూ ఐ4: రూ. 8 లక్షలుమెర్సిడెస్ బెంజ్ సీ200: రూ. 9 లక్షలుఆడి క్యూ8 ఈ ట్రాన్: రూ. 10 లక్షలుఆడి ఏ6: రూ. 10 లక్షలుబీఎండబ్ల్యూ ఎక్స్5: రూ. 10 లక్షలుకియా ఈవీ6 ఆల్ వీల్ డ్రైవ్: రూ. 12 లక్షలుకార్లపైన కంపెనీలు ఇస్తున్న ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ తగ్గింపులు ఎంచుకునే మోడల్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్లను పొందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితమైన తగ్గింపులను గురించి తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్.. రూ. 358 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి బోనస్ను ప్రకటించింది. దీపావళి బోనస్ కానుకగా రూ. 358 కోట్లు విడుదల చేసింది. గతేడాది కన్నా ఇది రూ.50 కోట్లు అధికం. ఒక్కో కార్మికునికి రూ. 93,750 జమకానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నాటికి కార్మికుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ కానున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. -
ఈ ఐదు నగరాల్లో.. మిన్నంటే దీపావళి సంబరాలు
న్యూఢిల్లీ: దీపావళిని 'దీపాల పండుగ' అని కూడా అంటారు. దీపావళి నాడు దేశంలోని ప్రతి ఇంటా దీపాలు వెలిగిస్తారు. బాణసంచా కాలుస్తారు. ఇరుగుపొరుగువారికి స్వీట్లు పంచుతారు. దీపావళిని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నప్పటికీ, కొన్ని నగరాల్లో జరిగే దీపావళి వేడుకలు ప్రత్యేకంగా నిలుస్తాయి. అటువంటి ఐదు నగరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అయోధ్య (ఉత్తరప్రదేశ్)శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య దీపావళి ప్రత్యేక వేడుకలకు కేంద్రంగా మారింది. ఇక్కడ దీపోత్సవ్ పేరుతో దీపావళిని జరుపుకుంటారు. సరయూ నది ఒడ్డున లక్షలాది దీపాలు వెలిగిస్తారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.ప్రేక్షకులను ఇవి మంత్ర ముగ్ధులను చేస్తాయి.వారణాసి (ఉత్తరప్రదేశ్)వారణాసిలో దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. లక్షల దీపాలతో అలంకృతమైన గంగా ఘాట్లపై హారతి నిర్వహిస్తారు. వారణాసిలోని అన్ని ఘాట్లు, దేవాలయాలు కాంతులతో నిండిపోతాయి. బాణాసంచా వెలుగులు అందరినీ అలరింపజేస్తాయి.కోల్కతా (పశ్చిమ బెంగాల్)కోల్కతాలో దీపావళితో పాటు కాళీ పూజలను కూడా నిర్వహిస్తారు. కాళీ పూజల కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ పందిళ్లను వేస్తారు. వీధులు, ఇళ్లు, దేవాలయాలను దీపాలతో అలంకరిస్తారు. కోల్కతాలో జరిగే దీపావళి వేడుకల్లో ఆధ్యాత్మికత కూడా కనిపిస్తుంది.గోవాగోవాలో దీపావళిని ప్రత్యేక శైలిలో జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని పురస్కరించుకుని నరకాసురుని దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఇందు కోసం ముందుగా భారీ దిష్టిబొమ్మలను తయారు చేస్తారు. వీటిని దీపావళి రాత్రి వేళ దహనం చేస్తారు. వివిధ ప్రాంతాల్లో సాంప్రదాయ సంగీతం, నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. బాణసంచా వెలిగిస్తారు.ముంబై (మహారాష్ట్ర)ముంబైలో దీపావళి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా మెరైన్ డ్రైవ్లో దీపాల వెలుగులు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆకాశంలోకి పేలుతున్న పటాకులు చూపరుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ముంబైలో ఆధునిక జీవనశైలికి అనుగుణంగా దీపావళి వేడుకలు జరగడం విశేషం. ఇది కూడా చదవండి: త్వరలో రూ.లక్షకు.. ఎవరెస్ట్ ఎక్కేసిన బంగారం! -
దీపావళి.. ఏ రాష్ట్రంలో ఎప్పుడు సెలవు?
న్యూఢిల్లీ: ప్రతి సంవత్సరం దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ చీకటి నుండి వెలుగులోకి మారే పయనాన్ని సూచిస్తుంది. దీపావళి సందర్భంగా, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ సెలవులు ప్రకటించారు. అయితే ఈసారి దీపావళిని అక్టోబర్ 31న లేక నవంబర్ 1 న జరుపుకోవాలా అనే గందరగోళం చాలామందిలో నెలకొంది. మరి.. ఈసారి దీపావళికి ఏ రాష్ట్రంలో ఎప్పుడు సెలవు ప్రకటించారో తెలుసుకుందాం.యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో దీపావళికి అక్టోబర్ 31 న సెలవు ఇచ్చారు. నవంబర్ 2 న గోవర్ధన పూజకు సెలవు ఉంటుంది. నవంబర్ 3 న భాయ్ దూజ్ పండుగను జరుపుకుంటారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో ఈ రోజుల్లో మాత్రమే సెలవు దినంగా ప్రకటించారు. అయితే నవంబర్ ఒకటి గురించి స్పష్టంగా తెలియజేయలేదు. మహారాష్ట్రలో సాధారణంగా దీపావళికి రెండు రోజులు సెలవులు ఉంటాయి. నవంబర్ 1, 2 తేదీలలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు దీపావళి సెలవు ప్రకటించారు. దీపావళికి ముందు, తరువాత పాఠశాలలకు ఏడు నుండి 10 రోజుల వరకూ సెలవులు ఉండవచ్చు. నవంబర్ 1న ఢిల్లీలో దీపావళి సెలవు ఉంటుంది. అయితే కుటుంబ సమేతంగా ఈ పండుగను జరుపుకునేందుకు వీలుగా అక్టోబర్ 31 నుంచి నవంబర్ 3 వరకు పాఠశాలకు సెలవు ప్రకటించారు.తమిళనాడులో ఈసారి దీపావళి అక్టోబర్ 31, నవంబర్ ఒకటి తేదీల్లో రెండు రోజుల సెలవు ప్రకటించారు. గుజరాత్లో దీపావళితో పాటు నూతన సంవత్సరాన్ని కూడా జరుపుకుంటారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు దీపావళి సందర్భంగా ఇక్కడ మూడు రోజుల సెలవు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లో కాళీ పూజ, దీపావళిని కలిసి జరుపుకుంటారు. నవంబర్ 1, 2 తేదీలలో ఇక్కడ దీపావళి సెలవు ఉంటుంది. కాళీ పూజ సందర్భంగా అక్టోబర్ 31న కూడా సెలవు ప్రకటించారు.దీపావళి సందర్భంగా మధ్యప్రదేశ్లో రెండు రోజులు సెలవులు ఇచ్చారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు నవంబర్ 1, 2 తేదీలలో మూసివేయనున్నారు. బీహార్లో ఈసారి దీపావళికి రెండు రోజులు సెలవులు ఉంటాయి. నవంబర్ 1, నవంబర్ 2 న ఇక్కడ సెలవు ఉంటుంది. దీనితో పాటు ఛత్ పూజకు సెలవులను కూడా పొడిగించవచ్చు. రాజస్థాన్లో ఈ ఏడాది దీపావళికి మూడు రోజుల సెలవులు ఉంటాయి. అక్టోబర్ 31 నుండి నవంబర్ 2 వరకు ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయనున్నారు.కర్ణాటకలో దీపావళికి రెండు రోజులు సెలవులు ఉంటాయి. నవంబర్ 1, 2 తేదీలలో ప్రజలు ఈ పండుగను సాంప్రదాయ రీతిలో జరుపుకుంటారు. కేరళలో దీపావళికి నవంబర్ 1న సెలవు ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం, ఒడిశా తదితర రాష్ట్రాల్లో దీపావళి సందర్భంగా రెండు రోజులు సెలవులు ప్రకటించారు.ఇది కూడా చదవండి: బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో కిషన్రెడ్డి? -
జొమాటో కస్టమర్లకు భారీ షాక్!
బెంగళూరు : ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఫుడ్ డెలివరీపై ప్లాట్ఫామ్ ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇకపై ప్రతి ఆర్డర్పై రూ.10 చొప్పున వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఇంతకుముందు ఈ ప్లాట్ఫామ్ ఫీజు రూ.7 ఉండగా ఇప్పుడు దాన్ని పది రూపాయలకు పెంచింది. దేశంలో కొనసాగుతున్న పండుగ సీజన్ సందర్భంగా కస్టమర్లకు తమసర్వీసుల్ని విజయవంతంగా అందించేందుకు వీలుగా ప్లాట్ఫామ్ ఫీజును పెంచినట్లు యాప్లో పేర్కొంది. కాగా, జొమాటో కంపెనీ 2023 ఆగస్టులో తొలిసారి ప్లాట్ఫామ్ ఫీజును తీసుకొచ్చింది. మొదటి ఆర్డర్కు రూ.2 చొప్పున వసూలు చేసింది. ఆ తర్వాత జొమాటో క్రమంగా దాన్ని పెంచుతూ వచ్చింది. తాజాగా ఈ ఫీజును రూ.10కు తీసుకొచ్చింది. -
దివాలీ వైబ్స్: నటి జెనీలియా స్పెషల్ లుక్
-
ఆ రాష్ట్రంలో దీపావళికి ఐదు రోజులు సెలవు
జమ్ము: ఈనెల 31న దీపావళి పండుగను వేడుకగా జరుపుకునేందుకు దేశమంతా సిద్ధమైంది. ఈ నేపధ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు దీపావళి సెలవులను ప్రకటించాయి. తాజాగా జమ్ము పాఠశాల విద్యా డైరెక్టర్ దీపావళి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటించించారు.దీపావళి సందర్భంగా అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబర్ 29 నుండి నవంబర్ 2 వరకూ సెలవులను ప్రకటించారు. నవంబర్ 3 ఆదివారం కావడంతో ఆ రోజు కూడా సెలవు ఉంటుంది. నవంబర్ 4న విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. దీనికి సంబంధించి జిల్లా మేజిస్ట్రేట్ తన అధికారిక వెబ్సైట్లో నోటీసు జారీ చేశారు.దీపావళికి ఆదివారంతో కలుపుకుని ఆరు రోజుల పాటు సెలవు రావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు నవంబర్ ఒకటిన కూడా సెలవు ప్రకటించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తిరిగి తమ స్వస్థలానికి వచ్చేందుకు వీలుగా నవంబర్ ఒకటిన సెలవు ప్రకటించారు.ఇది కూడా చదవండి: ఐదుపదుల వయసులోనూ స్లిమ్గా మలైకా..శరీరాకృతి కోసం..! -
‘జామియా’లో దీపావళి ఉద్రిక్తత
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. దీపావళి వేడుకల సందర్భంగా రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం యూనివర్శిటీకి చెందిన కొందరు హిందూ విద్యార్థులు దీపావళి వేడుకలకు ముందుగా దీపాలు వెలిగించారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన మరోవర్గానికి చెందినవారు నిరసనకు దిగారు. అనంతరం ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.ఈ నేపధ్యంలో యూనివర్సిటీ క్యాంపస్లో పోలీసు భద్రతను మరింతగా పెంచారు. జామియా యూనివర్సిటీలో దీపావళి వేడుకల సందర్భంగా వెలిగించిన దీపాలను పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యూనివర్శిటీలో మతపరమైన నినాదాలు వినిపించినట్లు పోలీసులు తెలిపారు. BIG BREAKING NEWS 🚨 Clash breaks out at Jamia Millia Islamia University during Diwali celebrations of Hindus.Conflict began when some individuals allegedly tried to erase off Rangoli with their feet & extinguish Diyas.Viral Video claims some students were raising… pic.twitter.com/Kg4tf9eA2k— Times Algebra (@TimesAlgebraIND) October 22, 2024ఇది కూడా చదవండి: కొనసాగుతున్న బాంబు బెదిరింపులు -
‘టీచ్ ఫర్ చేంజ్’ విద్యార్థులతో మంచు లక్ష్మి దీపావళి సంబరాలు (ఫొటోలు)
-
అదిరిపోయే దీపావళి గిఫ్ట్: ఆనందంలో ఉద్యోగులు
దసరా, దీపావళి వస్తున్నాయంటే.. ఉద్యోగులకు సంబరపడిపోతుంటారు. ఎందుకంటే తాము పనిచేస్తున్న కంపెనీలు బోనస్లు లేదా గిఫ్ట్స్ వంటివి ఇస్తాయని. కొన్ని కంపెనీలు బోనస్ ఇచ్చి సరిపెట్టుకుంటే.. మరికొన్ని కంపెనీలు ఏకంగా ఊహకందని గిఫ్ట్స్ ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.ఇటీవల హర్యానాలోని పంచకులలోని ఫార్మాస్యూటికల్ కంపెనీ 15 మంది ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచింది. పంచకుల పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న మిట్స్కైండ్ హెల్త్కేర్ సంస్థలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందికి 13 టాటా పంచ్ వాహనాలు, రెండు మారుతి గ్రాండ్ విటారా కార్లను గిఫ్ట్ ఇచ్చింది.కంపెనీ యజమాని ఎంకే భాటియా స్వయంగా కార్ల తాళాలు ఉద్యోగులకు అందజేశారు. ఉద్యోగులు ఎంతో అంకితభావంతో పని చేశారని కొనియాడారు. ఉత్తమ పనితీరు కనపరిచిన అందరూ నాకు సెలబ్రిటీల వంటివారని, కంపెనీ విజయానికి వారి సహకారం చాలా ప్రశంసనీయమని భాటియా అన్నారు.ఇదీ చదవండి: ఆ కంపెనీలో జాబ్ ఆఫర్ వదులుకున్న రతన్ టాటాఎంకే భాటియా తన ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం కూడా 12 మంది ఉద్యోగులకు కారును గిఫ్ట్ ఇచ్చారు. ఈ ఏటా 15 మందికి కార్లను బహూకరించారు. ఇప్పటికి కంపెనీ మొత్తం 27 కార్లను ఉద్యోగులకు అందించింది. ఈ పద్దతిని మిట్స్కైండ్ హెల్త్కేర్ భవిష్యత్తులో కొనసాగించాలని యోచిస్తోంది. -
పొట్టిగా ఉండే అమ్మాయిలు స్కర్ట్స్ వేసుకోవద్దా? ఇవిగో ట్రిక్స్ అండ్ టిప్స్
వినాయక చవితి, దసరా, బతుకమ్మ సంబరాలు ముగిసాయి. ఇక దీపావళి సందడి షురూ కానుంది. ఏ పండగఅయినా భక్తి, ముక్తితోపాటు కొత్తబట్టలు, అందంగా ముస్తాబు కావడం ఈ హడావిడి ఉండనే ఉంటుంది. ముఖ్యంగా వెలుగుల పండుగ దీపావళికి ఆరడుగల అందగాళ్లు, చందమామ లాంటి ముద్దుగుమ్మలు ట్రెండీగా, ఫ్యాషన్గా మెరిసిపోవాలని ఆరాటపడతారు. ఆరడుగులు అంటే గుర్తొచ్చింది.. పొట్టిగా ఉన్నామని..లావుగా ఉన్నామని తమకు ఏ డ్రెస్ సూట్ కాదు అని చాలామంది అమ్మాయిలు దిగులు పడుతూ ఉంటారు. పొట్టిగా ఉండటం మన తప్పు కాదు. కానీ మన శరీరారినిక తగ్గట్టు దుస్తులను ఎంచుకుంటే స్పెషల్ బ్యూటీగా మెరిసిపోవడం ఖాయం. అదెలాగో చూసేద్దామా! ఫ్యాషన్ ట్రిక్స్పొడవుగా మారడానికి మ్యాజిక్ సొల్యూషన్ ఏమీ లేదు, కానీ పొడుగ్గా కనిపించేలా కొన్ని ఫ్యాషన్ ట్రిక్స్ ఉన్నాయి. ఫ్యాషన్కి స్లైల్కి ఖచ్చితమైన నియమాలేవీ లేవు. శరీర రంగును బట్టి, బాడీకి తగ్గట్టుగా కలర్ను ఎంచుకుంటే చాలు. చక్కని ఫిట్టింగ్, డ్రెస్సింగ్ స్టైల్లో ఒక చిన్న మార్పు ఎలిగెంట్ లుక్ను ఇస్తుంది.జీన్స్, టీషర్ట్ ఎలాంటి వారికైనా ఇట్టే నప్పుతాయి. మ్యాచింగ్ కలర్స్ చాలా ముఖ్యం. మాక్సీ స్కర్ట్స్ లేదా డ్రెస్లు పొడవాటి అమ్మాయిలకు మాత్రమే బాగుంటాయి అనే అపోహను నమ్మవద్దు. మల్టిపుల్ లేయర్డ్ స్కర్ట్స్ కాకుండా మంచి కట్ స్కర్టులు ఎంచుకోండి. పొడవు స్కర్ అయితే టక్-ఇన్ టీ-షర్టుతో, కట్ జాకెట్తో ,హై హీల్డ్ షూ వేసుకుంటే లుక్ అదిరిపోతుంది.నిలువుగీతలు ఉన్న డ్రెస్లు పొడవుగా కనిపించేలా చేస్తాయి.కుర్తా లేదా చీర ధరించినపుడు సౌకర్యవంతమైన హైహీల్స్ వాడండి. అంతేకాదు డ్రెస్కు తగ్గట్టు , స్టైలింగ్ టిప్స్ పాటించాలి. ఉదాహరణకు క్లచ్లు, క్రాస్ బాడీ పర్సులు , చిన్న బ్యాగ్లు బెస్ట్ ఆప్షన్. మరీ పెద్దబ్యాగుల జోలికి అస్సలు వెళ్లవద్దుకుర్తీలకు, లేదా చీరల బ్లౌజ్లకు హైనెక్, రౌండ్ నెక్ కాకుండా, వీ నెక్, డీప్ నెక్, డీప్ రౌండ్ నెక్ లాంటివి ఎంచుకోండి. వర్టికల్ అప్పీల్కోసం ప్లంగింగ్ v-నెక్లైన్ టాప్లను ధరించండి. దీంతో పొడవుగా కనిపించడమే కాదు, సన్నగా కూడా కనిపిస్తారు.చిన్న ప్రింట్లు, సింపుల్ ఎంబ్రాయిడరీ ఔట్ ఫిట్ చూడడానికి బావుంటాయి. భారీ ఎంబ్రాయిడరీ, చీర పెద్ద పెద్ద అంచులున్న చీరలు అన్ని అకేషన్స్కు నప్పవు.ఎథ్నిక్ వేర్ కోసం పొడవాటి జాకెట్ స్టైల్ లెహెంగా లేదా సల్వార్ సూట్లకు దూరంగా ఉండండి. ఇదీ చదవండి : ఉద్యోగులకు దీపావళి కానుకగా ఏకంగా బెంజ్కార్లు, అంతేనా?! -
రూ.9 చెల్లిస్తే.. రూ.25000 ప్రయోజనం: ఫోన్పేలో కొత్త ప్లాన్
దీపావళి సమీపిస్తోంది. ఈ పండుగ ఎంత సంతోషాన్ని ఇస్తుందో, ఆదమరిస్తో అంత విషాదాన్ని నింపేస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మొబైల్ పేమెంట్స్ యాప్ 'ఫోన్పే' బాణసంచా సంబంధిత ప్రమాదాలు జరిగినప్పుడు ఉపశమనం కల్పించడానికి ఫైర్క్రాకర్ బీమా ప్లాన్ తీసుకువచ్చింది.ఫోన్పే పరిచయం చేసిన ఈ కొత్త ఫైర్క్రాకర్ బీమా ప్లాన్ కేవలం తొమ్మిది రూపాయలకే అందుబాటులో ఉంది. దీని ద్వారా 10 రోజుల పాటు రూ. 25,000 వరకు కవరేజి లభిస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు.. బాధితులు ఆసుపత్రిలో చేరడం లేదా మరణం సంభవిస్తే దానికయ్యే ఖర్చుల నుంచి ఆర్థికంగా కొంత నిలదొక్కుకోవడానికి ఈ బీమా ఉపయోగపడుతుంది.ఫైర్క్రాకర్ బీమా ప్లాన్ కవరేజ్ అక్టోబర్ 25 నుంచి ప్రారంభమవుతుంది. ఈ బీమా కోసం ఫోన్పే యాప్లోనే అప్లై చేసుకోవచ్చు. ఇది కేవలం వినియోగదారుకు మాత్రమే కాకుండా.. జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలతో సహా గరిష్టంగా నలుగురు కుటుంబ సభ్యులకు కవరేజి లభిస్తుంది.ఇదీ చదవండి: 'అప్పుడు రతన్ టాటా ముఖంలో చిరునవ్వు కనిపించింది'ఫైర్క్రాకర్ బీమా కోసం ఎలా అప్లై చేయాలంటే➤ఫోన్పే యాప్లోని బీమా విభాగాన్ని సెలక్ట్ చేసుకున్న తరువాత, అక్కడే ఫైర్క్రాకర్ ఇన్సూరెన్స్ కనిపిస్తుంది.➤ఫైర్క్రాకర్ ఇన్సూరెన్స్ ఎంచుకున్న తరువాత ప్లాన్ వివరాలు చూడవచ్చు. ఇక్కడే బీమా మొత్తం రూ. 25000, ప్రీమియం రూ. 9 ఉండటం చూడవచ్చు.➤కింద కనిపించే కంటిన్యూ బటన్ క్లిక్ చేసిన తరువాత పాలసీ పీరియడ్ అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు ఉన్నట్లు కనిపిస్తుంది. దాని కిందనే పాలసీదారు వివరాలు ఇవ్వవలసి ఉంటుంది. అన్నీ పూర్తయిన తరువాత తొమ్మిది రూపాయలు చెల్లించాలి. ఇలా సులభంగా ఫైర్క్రాకర్ ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవచ్చు. -
ఈసారి విమానం ఎక్కేవారిదే ఆనందం!
సాధారణంగా దీపావళి పండుగ సీజన్లో విమాన ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఒక విశ్లేషణ ప్రకారం.. ఈ దీపావళి సీజన్ విమాన ప్రయాణికులకు మరింత ఆనందం కలిగిస్తోంది. కారణం.. అనేక దేశీయ రూట్లలో సగటు విమాన ఛార్జీలు గత సంవత్సరంతో పోలిస్తే 20-25 శాతం తగ్గాయి.ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో విశ్లేషణ ప్రకారం.. దేశీయ మార్గాల్లో సగటు విమాన ఛార్జీలు 20-25 శాతం శ్రేణిలో క్షీణించాయి. ఇవి 30 రోజుల ఏపీడీ (ముందస్తు కొనుగోలు తేదీ) వన్-వే సగటు ఛార్జీల ధరలు. దీపావళి సీజన్ విమాన టికెట్ల కొనుగోలు సమయాన్ని గతేడాది నవంబర్ 10-16 తేదీల మధ్య పరిగణించగా ఈ ఏడాది అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 మధ్య జరిగిన కోనుగోళ్లను పరిగణనలోకి తీసుకున్నారు.విశ్లేషణ ప్రకారం బెంగళూరు-కోల్కతా విమానానికి సగటు విమాన ఛార్జీలు గరిష్టంగా 38 శాతం క్షీణించాయి. గత ఏడాది రూ.10,195 నుండి ఈ ఏడాది రూ.6,319కి తగ్గాయి. చెన్నై-కోల్కతా మార్గంలో టిక్కెట్ ధర రూ.8,725 నుంచి రూ.5,604కి 36 శాతం తగ్గింది.ఇదీ చదవండి: ఓలా.. అలా కుదరదు.. రిఫండ్ ఇవ్వాల్సిందే!ముంబై-ఢిల్లీ విమానాల సగటు విమాన ఛార్జీలు రూ.8,788 నుంచి రూ.5,762కి 34 శాతం తగ్గాయి. అదేవిధంగా ఢిల్లీ-ఉదయ్పూర్ రూట్లో టికెట్ ధరలు రూ.11,296 నుంచి రూ.7,469కి 34 శాతం క్షీణించాయి. ఢిల్లీ-కోల్కతా, హైదరాబాద్-ఢిల్లీ, ఢిల్లీ-శ్రీనగర్ మార్గాల్లో 32 శాతం క్షీణత ఉంది. -
22న దీపకాంతులలో ఢిల్లీ ఆలయాలు
జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా దేశరాజధాని ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అన్ని దేవాలయాలను రంగురంగుల దీపాలతో, పూలతో అలంకరించనున్నారు. అంతే కాకుండా ఆలయాల్లో రామచరిత మానసను పారాయణం చేయడంతోపాటు రామచరిత మానస ప్రతులను పంపిణీ చేయనున్నారు. శ్రీ రాంలీలా మహాసంఘ్ నేతృత్వంలో ఢిల్లీలో 22న ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మహాసంఘ్ అధ్యక్షుడు అర్జున్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 550 ఏళ్ల తర్వాత అయోధ్యలో శ్రీరాముని ఆరాధించే అవకాశం మనకు లభించబోతోందని అన్నారు. అందుకే ఆ రోజును చారిత్రాత్మకంగా మార్చేందుకు రామ్లీలా కమిటీలన్నీ తమ ప్రాంతాల్లోని ఆలయాలను రంగురంగుల దీపాలతో, పూలతో అలంకరించాలని నిర్ణయించాయన్నారు. ఆలయాల వెలుపల పెద్ద ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా అయోధ్యలోని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్షంగా ప్రదర్శించనున్నామన్నారు. అలాగే రామ్చరిత మానస కాపీలను రామ్లీలా కమిటీలు పంపిణీ చేస్తాయని తెలిపారు. ఆలయాల్లో 501 నెయ్యి దీపాలు వెలిగించనున్నారని తెలిపారు. ఈ నెల 22వ తేదీని దీపావళిలా జరుపుకోవాలని రాజధానివాసులకు శ్రీ రాంలీలా మహాసంఘ్ పిలుపునిచ్చింది. అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభం కానున్న సందర్భంగా సంపూర్ణ అనే సంస్థ ఆదివారం లోధీ గార్డెన్లో రాముని పెయింటింగ్ పోటీని నిర్వహించింది. దీనిలో పెద్ద సంఖ్యలో పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు. సుమారు వంద మంది చిన్నారులు శ్రీరాముడు, ఇతర దేవతల వేషధారణలతో కార్యక్రమానికి హాజరయ్యారు. -
జపాన్లో దీపావళిని పోలిన పండగ ఉంది తెలుసా!
మన దీపావళి ఇటీవలే జరిగింది. అచ్చం మన దీపావళిని పోలిన పండుగనే జపానీయులు కూడా ఏటేటా జరుపుకొంటారు. ఈ పండుగ పేరు ‘చిచిబు యమాత్సురి’– అంటే రాత్రి వేడుక అని అర్థం. దాదాపు మూడు శతాబ్దాలుగా జపానీయులు ఈ పండుగను జరుపుకొంటూ వస్తున్నారు. ఇది రెండు రోజుల పండుగ. ప్రతి ఏటా డిసెంబర్ 2, 3 తేదీల్లో జపాన్ ప్రజలు ఘనంగా ఈ పండుగను జరుపుకొంటారు. ఒకుచిచిబు పర్వతసానువుల దిగువన ఉండే చిచిబు పట్టణంలో ఈ వేడుకలు జరుగుతాయి. రాజధాని టోక్యో సహా వివిధ నగరాలు, పట్టణాలకు చెందిన ప్రజలు ఇక్కడకు చేరుకుని, ఘనంగా పండుగ చేసుకుంటారు. సాయంత్రం చీకటి పడుతూనే ప్రార్థన మందిరాలను, ఇళ్లను సంప్రదాయబద్ధమైన లాంతరు దీపాలతో అలంకరిస్తారు. వీథుల్లో ఊరేగింపులు జరుపుతారు. ప్రార్థన మందిరాలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. పండుగ మొదటి రోజున ప్రార్థనలు, విందు వినోదాలతో గడుపుతారు. రెండోరోజైన డిసెంబర్ 3న రాత్రి వేళ ఇళ్లను, ప్రార్థన మందిరాలను లాంతరు దీపాలతో అలంకరించి, భారీ ఎత్తున బాణసంచా కాల్పులు జరుపుతారు. ఈ వేడుకల్లో చిచిబు పట్టణం బాణసంచా కాల్పులతో హోరెత్తుతుంది. ఎటు చూసినా మిరుమిట్లు గొలిపే బాణసంచా మెరుపులు కనిపిస్తాయి. రంగు రంగుల తారాజువ్వలు, చిచ్చుబుడ్లు వంటి బాణసంచా కాల్పుల్లో పిల్లలూ పెద్దలూ అంతా ఉత్సాహంగా పాల్గొంటారు. చిచిబు పట్టణంలోని ప్రధాన ప్రార్థన మందిరమైన చిచిబు మందిరంలో ఈ వేడుకలు మరింత అట్టహాసంగా జరుగుతాయి. ఈ మందిరం రాత్రివేళ దీపకాంతులతో ధగధగలాడిపోతుంది. వేలాది మంది జనాలు ఇక్కడకు చేరుకుని, బాణసంచా కాల్పులు జరుపుతారు. ఈ మందిరం నుంచి కలపతో తయారు చేసిన రథాల వంటి ‘యతాయి’ వాహనాలను దీపాలతో అలంకరించి వీథుల్లో ఊరేగిస్తూ బాణసంచా కాల్పులు జరుపుతారు. ఈ వేడుకలను తిలకించడానికి విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుంటారు. (చదవండి: అక్కడ ఊపిరి తీసుకున్నా ప్రమాదమే! అణు రియాక్టర్ పేలుడు ఏదీ సంభవించలేదు కానీ..!) -
Dev Diwali 2023: కాశీలో వైభవంగా దేవ్ దీపావళి.. (ఫొటోలు)
-
మళ్లీ పెరుగుతున్న టమాటా రేట్లు
దీపావళి అనంతరం మార్కెట్లో టమాటా ధర ప్రతి ఏటా రూ.15 నుంచి రూ.20 వరకు పలుకుతుండగా, ఈ ఏడాది వర్షాభావంతో టమోటా పంట దెబ్బతింది. ఫలితంగా మహారాష్ట్రలోని నాగ్పూర్తో సహా విదర్భలోని రిటైల్ మార్కెట్లో టమోటాలు కిలోకు రూ.55 నుండి 60 వరకు అమ్ముడవుతున్నాయి. పెరుగుతున్న టమాట ధరలు ఉల్లి ధరలతో పోటీపడుతున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచి టమాటాలను విక్రయించేందుకు నాగ్పూర్లోని కలమన మండీకి తీసుకువస్తుంటారు. అయితే ఈసారి చాలా తక్కువగా టమాటాలు వస్తుండటంతో వీటి ధరలు మళ్లీ పెరిగాయి. టమాటా వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో పెద్ద ఎత్తున టమోటాలు కలమన మండీకి వస్తుంటాయి. ఫలితంగా ధరలు తక్కువగా ఉంటాయి. కాగా పొలంలో టమోటాలు పండించిన రైతులు వాటిని మార్కెట్కు తీసుకురావాలంటే రవాణా ఖర్చులు భారీగా అవుతుంటాయి. ఈ కారణంగా రైతులు టమోటాలను రోడ్లపై పారవేస్తుంటారు. అయితే ఈసారి పరిస్థితి అలా లేదు. టమాటాలు డిమాండ్కు తగ్గట్టుగానే సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్ర, బెంగళూరు నుంచి టమోటాలు నాగపూర్కు విక్రయానికి వస్తున్నాయి. హోల్సేల్ మార్కెట్లో టమాటా ధర నాణ్యతను బట్టి రూ. 40 నుండి 45 వరకు ఉంటుంది. నాగపూర్ పట్టణానికి ప్రతీరోజు 15 నుండి 16 ట్రక్కుల టమాటాలు వస్తున్నాయి. పెరుగుతున్న టమాటా ధరలు ఉల్లికి గట్టి పోటీనిస్తున్నాయి. ఇప్పటికే రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.65 నుంచి రూ.70 పలుకుతోంది. మార్కెట్లో ఉల్లి రాక పెరగడంతో ధరలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: పెళ్లిలో రసగుల్లా కోసం కొట్లాట.. ఆరుగురికి తీవ్రగాయాలు! -
లగ్జరీ కార్లకు పండుగ జోష్.. రికార్డ్ స్థాయిలో అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ ఏడాది అత్యుత్తమ పనితీరును సాధించగలమని లగ్జరీ కార్ల పరిశ్రమ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఓనం నుండి దీపావళి వరకు ఈ పండుగ సీజన్ గత సంవత్సరాల కంటే మెరుగ్గా ఉంది. అనేక కొత్త మోడళ్లు, ఆకర్షణీయమైన పోర్ట్ఫోలియో, బలమైన కస్టమర్ సెంటిమెంట్ ఈ జోష్కు కారణమని మెర్సిడెస్–బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. దసరా, ధన్తేరస్, దీపావళి సందర్భంగా రికార్డు స్థాయిలో డెలివరీలు జరగడం కస్టమర్ల ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. సానుకూల పరిశ్రమ దృక్పథంతో కొనసాగుతున్నామని, ఈ ఏడాది రికార్డు స్థాయిలో అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్యూవీల ఉత్పత్తి, లభ్యతను ప్రభావితం చేస్తూ సరఫరా సంబంధిత ఆటంకాలు కొనసాగే అవకాశం ఉందని వివరించారు. భారత్లో 2023 ఆగస్టు 17 నుంచి నవంబర్ 14 మధ్య మొత్తం ప్యాసింజర్ వాహనాల రిటైల్ అమ్మకాలు 10 లక్షల మార్కును దాటాయి. ఏడేళ్లలో గరిష్టం.. ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్లో 5,530 యూనిట్ల అమ్మకాలతో కంపెనీ 88 శాతం వృద్ధిని సాధించిందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ఇటీవలి కాలంలో అత్యధిక ఆర్డర్ బుక్తో కొనసాగుతున్నట్టు వెల్లడించారు. ఈ పండుగ సీజన్ ఆడి ఇండియాకు పెద్ద వేడుకగా నిలిచిందన్నారు. గత ఏడు సంవత్సరాలతో పోలిస్తే అత్యధిక అమ్మకాలను ఈ సీజన్లో నమోదు చేశామన్నారు. ఏ4, క్యూ3, క్యూ3 స్పోర్ట్బ్యాక్, క్యూ5, ఎస్5 స్పోర్ట్బ్యాక్లతో సహా ఉత్తమ విక్రయాలతో నిరంతర డిమాండ్ కారణంగా వృద్ధి నమోదైందని ధిల్లాన్ చెప్పారు. పండుగల సీజన్లో కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్లో ఢిల్లీ, ముంబై ముందంజలో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్, కోల్కత, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ల నుండి కూడా మంచి డిమాండ్ను చూస్తున్నామని వెల్లడించారు. ఈ ఏడాది భారత్లో లగ్జరీ కార్ల పరిశ్రమ 2018 స్థాయి అమ్మకాలను అధిగమిస్తుందని, 46,000–47,000 యూనిట్ల మార్కును చేరుకుంటుందని జోస్యం చెప్పారు. ఆడి ఇండియా అధిక రెండంకెల వృద్ధితో 2023ను ముగించాలని చూస్తోందని వివరించారు. 2027 నాటికి 1.54 బిలియన్ డాలర్లు.. పండుగ సందర్భంగా కొన్ని శక్తివంతమైన కార్లు, మోటార్సైకిళ్లను విడుదల చేశామని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావా తెలిపారు. ఈ వేగాన్ని కంపెనీ కొనసాగిస్తుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ ఒకటి. అలాగే మిలియనీర్ల సంఖ్య పరంగా 3వ అతిపెద్ద దేశమని లంబోర్గీని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ తెలిపారు. ‘2021లో భారతీయ లగ్జరీ కార్ మార్కెట్ విలువ 1.06 బిలియన్ డాలర్లు. 2027 నాటికి 1.54 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. 2022–2027 అంచనా కాలంలో 6.4 శాతం కంటే ఎక్కువ సగటు వార్షిక వృద్ధి నమోదవుతుంది’ అని పేర్కొన్నారు. కస్టమర్ అభిరుచి, ప్రాధాన్యతలు ఈ వృద్ధిని నడిపిస్తాయని చెప్పారు. దీంతో అధునాతన సాంకేతికత, భద్రతా ఫీచర్లతో లగ్జరీ కార్లకు పెరుగుతున్న డిమాండ్తో ఆటోమొబైల్ రంగం గణనీయంగా విస్తరణను చూస్తోంది’ అని అగర్వాల్ తెలిపారు. మెరుగైన రోడ్లు వృద్ధికి మరింత మద్దతునిస్తోంది. నగరాలు ఎక్స్ప్రెస్వేల ద్వారా అనుసంధానం అవుతున్నాయి. దీంతో అధిక ఆకాంక్షలతో పాటు ద్వితీయ శ్రేణి, చిన్న నగరాల్లో డిమాండ్ను పెంచుతున్నాయని చెప్పారు. లంబోర్గీని మొత్తం అమ్మకాల్లో 25 శాతానికి పైగా మెట్రోయేతర నగరాల నుండి జరుగుతున్నాయని అన్నారు. -
ఎయిర్లైన్స్కు కలిసొచ్చిన వరల్డ్కప్ ఫైనల్ - కనీవినీ ఎరుగని సరికొత్త రికార్డ్..
పండుగ సీజన్లో వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా జరుగుతాయని అందరూ నమ్ముతారు. అయితే ఆ పండుగ సీజన్ కంటే వరల్డ్కప్ బాగా కలిసొచ్చిందని ఎయిర్లైన్స్ తాజాగా వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ రోజు దేశంలో సుమారు 4.6 లక్షలమంది విమాన ప్రయాణం చేశారని, దీపావళికి కూడా చేయలేని పనిని క్రికెట్ వరల్డ్ కప్ చేసిందని ఎయిర్లైన్స్ స్పష్టం చేసింది. గత దీపావళి కంటే కూడా ప్రయాణికుల సంఖ్య చాలా ఎక్కువని తెలిపారు. దీపావళి సమయంలో విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది, కానీ అంత కంటే ఎక్కువ వరల్డ్కప్ ఫైనల్ రోజు ప్రయాణించారు. భారత్ ప్రపంచకప్ ఫైనల్ చేరడంతో అహ్మదాబాద్ చేరుకోవాలనే ఉత్సాహం అభిమానుల్లో కనిపించి సరికొత్త రికార్డు సృష్టించింది. పెరిగిన చార్జీలను కూడా లెక్క చేయకుండా ఒక్కసారిగా ప్రయాణికులు రావడంతో విమానయాన సంస్థల ఆదాయం భారీగా పెరిగింది. ప్రపంచకప్ ఫైనల్ రోజు కొందరు రూ. 20,000 నుంచి రూ. 40,000 వెచ్చించి కూడా టికెట్స్ కొనుగోలు చేశారు. ఫ్లైట్ చార్జీలు ఎక్కువని కొందరు ట్రైన్ ఏసీ క్లాసులు బుక్ చేసుకుని ప్రయాణించారు. అటు విమానయాన సంస్థలు, ఇటు రైల్వే సంస్థలు బాగా సంపాదించుకోగలిగాను. ఒకే రోజులో 4 లక్షల మంది విమాన ప్రయాణం చేయడం ఓ అరుదైన రికార్డ్. ఇది మాకు చారిత్రాత్మకమైన అవకాశం అని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇదీ చదవండి: టీమిండియా ఓటమి - పారిశ్రామిక వేత్తల ట్వీట్స్ వైరల్ అక్టోబర్ నెలలో ప్రారంభమయ్యే పండుగ సీజన్ సద్వినియోగం చేసుకోవడానికి విమానయాన సంస్థలు గత సెప్టెంబర్ చివరి వారంలో అడ్వాన్స్ బుకింగ్ చార్జీలను పెంచడం ప్రారంభించాయి. కొందరు పెరిగిన చార్జీలను దృష్టిలో ఉంచుకుని ట్రైన్ జర్నీ చేయడానికి సిద్ధమయ్యారు. మొత్తం మీద ఇండియా వరల్డ్కప్ కోల్పోయినప్పటికీ.. విమానయాన సంస్థలు మాత్రం లాభాలను గడించాయి. -
Hansika Motwani First Diwali Celebrations: భర్తతో పండగ చేసుకున్న హన్సిక.. ఎంత పద్ధతిగా ఉందో (ఫోటోలు)


