Diwali
-
న్యూజెర్సీలో దీపావళి వేడుకలు 2024
-
ఇంట్లో నుంచే ‘దేవ్ దిపావళి’ని చూడండిలా..
వారణాసి: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నవంబర్ 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవ్ దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆరోజు దశాశ్వమేధ ఘాట్లో అత్యంత వైభవంగా జరిగే గంగా హారతిని చూసేందుకు దేశవిదేశాల నుంచి లక్షలాదిమంది తరలిరానున్నారు.ఈసారి దేవ్ దీపావళికి కాశీకి వెళ్లలేనివారు ఇంట్లో కూర్చొని గంగాహారతిని, దేవ్ దీపావళి వేడుకలను వీక్షించవచ్చు. తొలిసారిగా దేవ్ దీపావళి నాడు జరిగే గంగా హారతి వేడుకలు ‘గంగా సేవా నిధి’ వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ కూడా ఢిల్లీ నుంచి ఈ వేడుకలను వీక్షించనున్నారు.గంగా సేవా నిధి వెబ్సైట్ను నవంబర్ 15న ప్రారంభిస్తున్నామని గంగా సేవా నిధి అధ్యక్షుడు సుశాంత్ మిశ్రా తెలిపారు. విదేశాలలోని వారు కూడా gangasevanidhi.in వెబ్సైట్ ద్వారా దేవ్ దీపావళి వేడుకలను వీక్షించవచ్చు. గంగా హారతి సందర్భంగా ‘ఏక్ సంకల్ప్ గంగా కినారే’ పేరుతో కార్యక్రమానికి హాజరయ్యే లక్షలాది తాము గంగా నదిని పరిశుభ్రంగా ఉంచుతామని, పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేయనున్నారు.నవంబర్ 15న దశాశ్వమేధ ఘాట్లో 21 మంది పండితులు వైదిక ఆచారాల ప్రకారం భగవతీ దేవికి పూజలు నిర్వహిస్తారు. దేవ్ దీపావళి వేళ వారణాసిలోని 84 ఘాట్లను దీపాలతో అందంగా అలంకరించనున్నారు. పురాణాల ప్రకారం త్రిపురాసురుని దౌర్జన్యాల నుంచి దేవతలు విముక్తి పొందిన సందర్భంలో, వారు శివుని నివాసమైన కాశీ నగరానికి వచ్చి దీపాల పండుగను జరుపుకున్నారు. నాటి నుంచి ప్రతియేటా ఇక్కడ దేవ్ దీపావళి వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు.ఇది కూడా చదవండి: ఘనంగా శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్ -
టపాసుల కాలుష్యంలో టాప్ ఫైవ్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని మహానగరాల్లో కాలుష్య మేఘాలు మరింత చిక్కబడుతున్నాయి. సాధారణ సమయంలో కూడా వాయు కాలుష్యం రికార్డులను బద్దలు కొడుతోంది. ఇక పటాకుల పండుగ దీపావళి రోజు వాయు కాలుష్యం అన్ని హద్దులు దాటుతోంది. గత నెల 31న దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో సంతోషంగా దీపావళి పండుగ జరుపుకొన్నారు. కానీ ఆరోజు దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో కాలుష్యం ఎంతటి ప్రమాదకర స్థాయికి చేరిందో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) సర్వేలో తేలింది. మొదటి స్థానం ఢిల్లీదే దీపావళి రోజు నమోదైన వాయు కాలుష్యం విషయంలో హైదరాబాద్ నగరం బెంగళూరుతో కలిసి ఐదో స్థానంలో నిలిచింది. దీపావళి రోజు 24 గంటల్లో ప్రధాన నగరాల్లో వాయు కాలుష్య వివరాలను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) విడుదల చేసింది. పండుగ రోజు అత్యధిక కాలుష్యం ఉన్న నగరంగా దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. దీపావళి రోజు గ్రీన్ కాకర్స్ మినహా సాధారణ పటాకులు కాల్చటంపై నిషేధం ఉన్నా ఢిల్లీ మొదటి స్థానంలోనే నిలవటం గమనార్హం.దీపావళి రోజు ఢిల్లీలో ఏక్యూఐ 339 పాయింట్లుగా నమోదైంది. స్విస్ కంపెనీ ఐక్యూ ఏఐఆర్ ‘లైవ్ ర్యాంకింగ్ ఆఫ్ గ్లోబల్ సిటీస్ ఆన్ ఏక్యూఐ’నివేదిక ప్రకారం దీపావళి పండుగ మరుసటి రోజు ఉదయం 8 గంటల సమయంలో ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్య స్థాయిలను విశ్లేషించినపుడు ఢిల్లీ నగరం ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్య నగరంగా నిలిచింది. ఐక్యూ ఏఐఆర్ నివేదిక ప్రకారం» పర్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం 2.5) ప్రామాణిక పాయింట్లపరంగా 30 పాయింట్లు దాటితే కాలుష్యకారకంగా పరిగణిస్తారు. » మనదేశంలోని ప్రధాన నగరాల్లో కాలుష్య స్థాయిలు జాతీయ సగటు కంటే రెండింతలు నమోదయ్యాయి. » పీఎం 2.5 (అతి సూక్ష్మస్థాయిలోని ధూళి క ణాలు–పీఎం 2.5) విషయానికొస్తే జాతీయ సగటు కంటే ఢిల్లీలో 2022లో 92.6 పాయింట్లు అధికంగా ఉండగా, 2023లో 102.1 పాయింట్లు అధికంగా నమోదైంది. జాతీయసగటు 2022లో 53.3 పాయింట్లు, 2023లో 54.4 పాయింట్లు మాత్రమే ఉన్నది. » పీఎం 2.5 2022లో ముంబైలో 46.7 పాయింట్లు, 2023లో 43.8 పాయింట్లు నమోదైంది. » కోల్కతాలో 2022లో 50.2, 2023లో 47.8 పాయింట్లు రికార్డయ్యింది. » హైదరాబాద్లో 2022లో 42.4 పీఎం 2.5 పాయింట్లు, 2023లో 39.9 పాయింట్లు నమోదైంది. » ప్రామాణికంగా చూస్తే పీఎం 10 స్థాయిలు (మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్) 60 పాయింట్లు దాటితే వాయు కాలుష్యకారకాలు పెరిగినట్టుగా భావించాలి. 2023–24 నాటికి ఏడాదికి 20 నుంచి 30 శాతం పీఎం 10 సాంద్రతను తగ్గించాలని ప్రభుత్వం నిర్దేశించుకొన్నది. ఐతే సగటు వార్షిక పీఎం 10 స్థాయిలు 2023–24లో ఢిల్లీలో 208, ముంబైలో 94, కోల్కతాలో 94, అహ్మదాబాద్లో 98, పుణేలో 98, బెంగళూరులో 70, హైదరాబాద్లో 81, చెన్నైలో 63 పాయింట్లు రికార్డయ్యింది. -
పందెం విసిరిన స్నేహితులు.. బాంబు మీద కూర్చున్న యువకుడు.. ఆ తర్వాత ఏమైందంటే?
బెంగళూరు : స్నేహితులతో పందెం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. బాంబు మీద కూర్చొని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.బెంగళూరు పోలీసుల వివరాల మేరకు.. దీపావళి పండుగ సందర్భంగా శబరిష్ (32) అతని ఆరుగురు స్నేహితులు మధ్య పందెం వేసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న శబరీష్కు అతని స్నేహితులు పందెం విసిరారు. పందెం ప్రకారం..శబరీష్ కార్డ్ బోర్డ్ కింద అమర్చిన బాంబులపై కూర్చోవాలి. అనంతరం బాంబుకు నిప్పు అంటిస్తాము. నిప్పు అంటించినా అలాగే కూర్చుంటే ఓ కొత్త ఆటో కొనిస్తామని ఆఫర్ ఇచ్చారు.చదవండి : తెగిపడిన కుమారుడి తల.. ఒడిలోకి తీసుకుని లాలిస్తూ.. రోదిస్తూదీంతో మద్యం మత్తులో ఉన్న శబరీష్ స్నేహితులు చెప్పినట్లుగానే బాంబులు అమర్చిన కార్డ్ బోర్డ్పై కూర్చున్నాడు. అంనతరం అతని స్నేహితులు కార్డ్ బోర్డ్ కింద ఉన్న బాంబులకు నిప్పు అంటించి దూరంగా పరిగెత్తారు. సెకన్ల వ్యవధిలో భారీ శబ్ధాలతో బాంబులు పేలాయి.శబరీష్ అలాగే ఉన్నాడు. అతనికి ఏమైందా అని చూద్దామని ముందుకు వచ్చిన స్నేహితుల్ని చూసిన శబరీష్ వెంటనే కుప్పకూలాడు. ప్రాణాలు కోల్పోయాడు. అత్యవసర చికిత్స కోసం శబరీష్ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. బాంబు పేలుడు ధాటికి శబరీష్ అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని నిర్ధారించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడికి పందెం విసిరిన అతని ఆరుగురు స్నేహితుల్ని అదుపులోకి తీసుకున్నారు. A Bet that proved costly, takes a Life in #Bengaluru !In a shocking incident a 32-yr-old Shabari died in a tragic way on #Diwali, after he accepted a challenge to sit on a box full of #firecrackers in it to win an auto rickshaw, in Konanakunte, South Bengaluru. His friends lit… pic.twitter.com/YGHEmxViV2— Surya Reddy (@jsuryareddy) November 4, 2024 -
అతనితో మృణాల్ ఠాకూర్ వైరల్ అవుతున్న ఫొటోస్
-
వెర్రి వేషాలపై వీసీ సజ్జనార్ సీరియస్
హైదరాబాద్: దీపావళి సందర్భంగా.. హైటెక్సిటీ ప్రాంతంలో కొందరు యువకులు ఇష్టారీతిన బాణసంచా కాలుస్తూ బైక్లపై విన్యాసాలు చేశారు. దానికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. దీనిపై ఐపీఎస్ అధికారి, టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగపూట ఇదేం వికృతానందమని ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు.‘‘దీపావళి పండగ పూట ఇదేం వికృతానందం.. ఎటు వెళ్తోందీ సమాజం. ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం దీపావళి. పండగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!?’’ అని సజ్జనార్ ప్రశ్నించారు. దీపావళి పండుగ పూట ఇదేం వికృతానందం. ఎటు వెళ్తోందీ సమాజం. దీపావళి అంటే ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం. పండుగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!? pic.twitter.com/pYbELJeZAR— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 3, 2024 ఆయన పోస్ట్పై పలువురు నెటిజన్లు స్పందించారు. కొంతమంది యువకులు తాత్కాలిక ఆనందం కోసం తమ జీవితాలను రిస్క్లో పెట్టుకుంటున్నారన్నారు. ఈ చేష్టలతో మిగతా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదీ చదవండి: ఏడాది క్రితం అదృశ్యమై.. ఆధార్తో దొరికాడు -
దేశ ప్రగతి కొన్ని కంపెనీలపైనే ఆధారపడరాదు
ముంబై: దేశ అభివృద్ధి అన్నది కేవలం కొన్ని కంపెనీలు లేదా కొన్ని గ్రూపులపైనే ఆధారపడి ఉండరాదని ప్రముఖ బ్యాంకర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు. దేశమంతటా మరిన్ని కంపెనీలు వృద్ధి చెందేలా విస్తృతంగా ఉండాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థూలంగా చూస్తే ఆశావహంగానే కనిపించినా.. సూక్ష్మంగా చూస్తే కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. బారత కంపెనీలు రక్షణాత్మక ధోరణి కంటే పోటీతత్వంపైనే ఎక్కువ దృష్టి సారించాలని కోరారు. దీపావళి సందర్భంగా ఇన్వెస్టర్లకు ఉదయ్ కోటక్ ఈ మేరకు వీడియో సందేశం ఇచ్చారు. కంపెనీలకు సాయం చేయడం ద్వారా ‘వెయ్యి పువ్వులు వికసించనివ్వండి’ అనే సామెతను ఆచరణ దాల్చేలా క్యాపిటల్ మార్కెట్లు చూడాలన్నారు. గతేడాది ఈక్విటీలు, ఫైనాన్షియల్ మార్కెట్లకు గొప్ప సంవత్సరంగా ఉండిపోతుందంటూ, ఇన్వెస్టర్లకు అద్భుతమైన రాబడులు వచి్చనట్టు పేర్కొన్నారు. అయినప్పటికీ ఉద్ధాన పతనాలకు ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండాలన్నారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు క్షీణిస్తుండడంతో అప్రమత్తతో కూడిన ఆశావహ ధోరణితో ఉన్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంటు ఖాతా లోటు ప్రస్తుతం నియంత్రణలోనే ఉన్నాయంటూ, వీటిపై భారత్ ఓ కన్నేసి ఉంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ సైతం కేవలం కొన్ని గ్రూపులే కార్పొరేట్ రంగాన్ని నడిపిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. -
AP: ‘బండ’ మోసం.. అరకోటి కుటుంబాలకు ‘గ్యాస్’ ఎగ్గొట్టిన బాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మొత్తం కుటుంబాల సంఖ్య 1.80 కోట్లకుపైనే! వీరిలో 1.54 కోట్ల మందికి యాక్టివ్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అంటే దాదాపు కోటిన్నరకుపైగా కుటుంబాలు! ‘ఇంటింటికీ ఉచిత గ్యాస్’ ఇస్తామన్న టీడీపీ కూటమి పార్టీల ఎన్నికల హామీని నెరవేర్చాలంటే ఏటా దాదాపు రూ.4 వేల కోట్లు అవసరం. కానీ ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల కోసం రూ.2,684.75 కోట్లు మాత్రమే ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. దాదాపు పది లక్షల వరకు ఉన్న ప్రధాని ఉజ్వల యోజన కనెక్షన్లకు పాక్షిక రాయితీతోపాటు మిగతా గ్యాస్ వినియోగదారులకు ఎన్నిల హామీ ప్రకారం పూర్తి ఉచితంగా సిలిండర్ను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన మొత్తం లబ్ధిదారులకు ఒక్క ఉచిత సిలిండర్ పంపిణీ కోసం రూ.1,345 కోట్లు అవసరం. కానీ కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ఇచ్చిందెంతో తెలుసా? దీపావళికి తొలి సిలిండర్ పంపిణీ కోసం ఇచ్చింది కేవలం.. రూ.894.92 కోట్లు మాత్రమే!! అంటే పథకాన్ని కేవలం కోటి కుటుంబాలకు లోపే పరిమితం చేసి మిగతా 54 లక్షల కుటుంబాలకు ఎగ్గొడుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రతి ఇంటికీ ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని ఎన్నికల వేళ బుకాయించిన కూటమి పార్టీల నేతలు ఈ ఏడాది ఇవ్వాల్సిన రెండు సిలిండర్లకు ఎగనామం పెట్టేయడంతోపాటు అర కోటికిపైగా కుటుంబాలను పథకానికి దూరం చేయడం గమనార్హం.అంతా ఉత్త గ్యాసేనా!రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ‘ఉత్త గ్యాస్’గా మారిపోతోందా? అర్హత ఉన్నా ఉచిత గ్యాస్ అందుతుందన్న గ్యారంటీ పోయిందా? రేషన్ కార్డు ఉండీ.. దశాబ్దాలుగా గ్యాస్ కనెక్షన్ వినియోగిస్తున్న కుటుంబాలు ప్రభుత్వం దృష్టిలో అనర్హులైపోతున్నాయా? కూటమి పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోలో చెప్పిన ‘ఇంటింటికీ ఉచిత గ్యాస్’ వాగ్దానంలో మోసం బట్టబయలైందా? అంటే.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అవుననే అంటున్నాయి. దీపం–2 కింద దీపావళి కానుకగా తీసుకొచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అందరికీ కాదనేది తేటతెల్లమవుతోంది. గ్యాస్ బుక్ చేసుకున్న ప్రతి అర్హుడికీ రాయితీ మొత్తం ఖాతాల్లో పడుతుందనేది భ్రమగా తేలిపోయింది.ఇంటింటికీ అని నమ్మించి..ఎన్నికల్లో ఓట్లే పరమావధిగా చంద్రబాబు బృందం ప్రతి ఇంటికీ ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని బూటకపు హామీని గుప్పించింది. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేస్తూ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలు తర్వాత పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు హడావుడి చేసింది. ఓట్లు వేయించుకునేందుకు ఎలాంటి అడ్డంకులు విధించని కూటమి నాయకత్వం ఉచిత గ్యాస్ పథకం పొందాలంటే మాత్రం అర్హత ఉండాలనే మెలిక పెట్టింది. నిజానికి కూటమి పార్టీల ఎన్నికల హామీ ప్రకారం చూస్తే రాష్ట్రంలో 1.80 కోట్ల కుటుంబాలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు చొప్పున (ప్రభుత్వ జీవో ప్రకారం సిలిండర్కు రూ.894) ఇవ్వడానికి రూ.4,827.60 కోట్లు ఖర్చవుతుంది. దీంతో ఉచిత గ్యాస్ పథకాన్ని కుదించేందుకు సిద్ధమయ్యారు. రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఉచిత గ్యాస్ రాయితీ వర్తిస్తుందంటూ షరతులు విధించారు.పొంతన లేని సర్కారు లెక్కలు..రేషన్ కార్డు, ఆధార్, గ్యాస్ కనెక్షన్ ఉంటే ఉచిత గ్యాస్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని 1,48,43,671 మంది కార్డుదారులు తమకు పూర్తిగా గ్యాస్ రాయితీ వస్తుందని ఆశపడ్డారు. వీరంతా బీపీఎల్ కిందే నమోదైన వారే. అయితే పథకాన్ని ప్రారంభించిన తొలి రోజే లక్షల కుటుంబాలకు నిరాశ ఎదురైంది. ఏళ్ల తరబడి గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డులున్నా పథకానికి అనర్హులుగా తేల్చడంతో నివ్వెరపోతున్నారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు.54 లక్షల కుటుంబాలకు అర్హత లేదా?రేషన్ కార్డులున్నప్పటికీ సుమారు 54 లక్షల కుటుంబాలను ఉచిత గ్యాస్ పథకం నుంచి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. వీరిని వడపోసిన తర్వాతే పథకానికి బడ్జెట్ ప్రకటించినట్లు సమాచారం. ఏ ప్రమాణాల ప్రకారం వీరిని అనర్హులుగా ప్రకటించారో చెప్పకుండా అర్హులందరికీ ఉచిత గ్యాస్ ఇస్తున్నట్లు మభ్యపెడుతోంది. అర్హుల కుదింపుతోపాటు మరోవైపు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా నాలుగు నెలలకు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకునేలా మూడు బ్లాక్ పీరియడ్స్ను తెచ్చింది. ఆయా సమయాల్లో గ్యాస్ సిలిండర్ఖాళీగా లేకుంటే లబ్ధిదారుడు నష్టపోవాల్సి వస్తుంది. తద్వారా ప్రభుత్వం ఖర్చును తగ్గించుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు వరకు ఒక్క సిలిండర్తోనే సరిపెడుతూ రెండు సిలిండర్లకు ఎగనామం పెట్టింది.ఇదీ గ్యాస్ ‘‘పథకం’’!రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య 1.80 కోట్లుయాక్టివ్ గ్యాస్ కనెక్షన్లు 1.54 కోట్లురేషన్ కార్డులు 1,48,43,671» ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల ఖర్చు రూ.4 వేల కోట్లు(ఒక్కోటి రూ.894 చొప్పున 1.54 కోట్ల మందికి 3 సిలిండర్లు ఇచ్చేందుకు)కానీ మూడు సిలిండర్లకు ప్రభుత్వం ఎంత ఇస్తోంది?: రూ.2,684.75 కోట్లు(ఈ బడ్జెట్ కోటి కుటుంబాలకు కూడా సరిపోదు.. మరో అర కోటికిపైగా అర్హులైన కుటుంబాలకు మొండి చెయ్యే)» కార్డుదారులకు ఒక్క సిలిండర్ ఇవ్వటానికయ్యే ఖర్చు రూ.1,345 కోట్లు»తొలి సిలిండర్ కోసం విడుదల చేసిన మొత్తం రూ.894.92 కోట్లు » ప్రభుత్వ బడ్జెట్ ప్రకారం చూస్తే లబ్ధి పొందే కుటుంబాలు సుమారు కోటి» అర్హత ఉన్నప్పటికీ పథకానికి దూరమైన కుటుంబాలు సుమారు అర కోటినోట్: ఏపీలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద సుమారు 9.68 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. వీరికి కేంద్రం గ్యాస్ సిలిండర్కు రూ.300 రాయితీ ఇస్తోంది. అది పోనూ ఇటువంటి కనెక్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.594 మాత్రమే చెల్లిస్తుంది. మిగిలిన మాత్రం పూర్తిగా రాయితీ ఇవ్వాల్సి ఉంటుంది. -
Diwali 2024: ఆర్సీబీ ‘క్వీన్’ అలా.. అందమైన అలంకరణతో స్మృతి ఇలా(ఫొటోలు)
-
దీపావళి వీడియో కాదు.. సర్వీస్ స్టేషన్ ఫుటేజ్ చూపండి: కునాల్ కమ్రా
ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్.. కంపెనీలో జరిగిన దీపావళి వేడుకలకు సంబంధించిన ఒక వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోపైన స్పందించిన కునాల్ కమ్రా.. ఓలా సర్వీస్ స్టేషన్ ఫుటేజీని షేర్ చేయమని భవిష్ అగర్వాల్ను కోరారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.సేల్స్ తరువాత నాణ్యమైన సర్వీస్ అందించడం లేదనే సమస్యతో ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్తో రగడ మొదలైంది. అప్పటి నుంచి ఓలా కస్టమర్లు లేవనెత్తే అనేక సమస్యలను కునాల్ హైలైట్ చేస్తూ వస్తున్నారు.నెలకు 80,000 కస్టమర్ ఫిర్యాదులను కంపెనీ ఎందుకు పరిష్కరించడం లేదనికునాల్ కమ్రా.. ఓలా సీఈఓను అడిగారు. దీనిపై స్పందించిన భవిష్ అగర్వాల్, ఓలా పరువు తీసేందుకు కమ్రా డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. అంతే కాకుండా భవిష్ అగర్వాల్ కూడా కమ్రాను ఒక సర్వీస్ సెంటర్లో ఒక రోజు పని చేయాలని కోరారు.ఇదీ చదవండి: ఓలా సీఈఓ జాబ్ ఆఫర్.. ఓకే అన్న కమెడియన్!ఇటీవల ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్.. కమెడియన్ కునాల్ కమ్రాకు జాబ్ ఆఫర్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీనికి కమ్రా అంగీకరిస్తూ కొన్ని షరతులను కూడా వెల్లడించారు. కాగా ఇప్పుడు మళ్ళీ భవిష్ అగర్వాల్ చేసిన పోస్టుకు.. కామెంట్ చేశారు. దీనిపైనా నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.Service station ka footage dikhao… https://t.co/Zmp1Yzoh3i— Kunal Kamra (@kunalkamra88) October 31, 2024 -
దీపావళి వేడుకల్లో అపశ్రుతి..ఆస్పత్రికి క్యూ
-
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. బాణసంచా పేల్చడానికి 10 గంటల వరకే అనుమతి
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా పేల్చడానికి అనుమతినిస్తూ సైబరాబాద్ పోలీసులు ప్రకటన చేశారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పబ్లిక్ రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం నిషేధమని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ప్రకారం.. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా పేల్చడంపై నిషేధం విధించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని.. ఎవరు నిబంధనలు అతిక్రమించినా హైదరాబాద్ పోలీస్ యాక్ట్ ప్రకారం చర్యలుంటాయన్నారు.In view of maintaining public order, peace & tranquility in the limits of Cyberabad @CPCyberabad hereby notify for the information of the general public that Bursting of Fireworks/Crackers on Public roads & public places is strictly prohibited during the celebration of Deepavali. pic.twitter.com/miNJERiaOW— Cyberabad Police (@cyberabadpolice) October 31, 2024 -
సైనికులతో ప్రధాని మోదీ దీపావళి.. పాక్కు వార్నింగ్
ప్రతి ఏడాది దీపావళి పండుగను సైనికులతో గడిపే సంప్రదాయాన్ని ప్రధాని మోదీ ఈ సారి కూడా కొనసాగించారు. సరిహద్దుల్లో గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి కచ్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం, ఆర్మీ, నేవీ, వాయుసేన సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.ఆర్మీ యూనిఫాం ధరించిన ప్రధాని.. కచ్లోని సర్ క్రీక్ ప్రాంతంలో గల లక్కీ నాలాకు బోటులో చేరుకున్నారు. అనంతరం బీఎస్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో సమావేశమయ్యారు. సైనికులకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చారు.. ‘‘కచ్వైపు పాక్ కన్నెత్తి చూసే సాహసం చేయదు. ఇక్కడ రక్షణగా సుక్షితులైన సైనికులు ఉన్నారని వారికి తెలుసు అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘సర్ క్రిక్పై దాడికి గతంలో శత్రు దేశాలు కుట్రలు చేశాయి. ఇక్కడ రక్షణగా ఉన్న సైనికులుగా కుట్రలను తిప్పికొట్టారు.’’ అని మోదీ అన్నారు.దేశ సరిహద్దుల్లో ఒక్క అంగుళం విషయంలోనూ కూడా రాజీపడలేని ప్రభుత్వం ఇప్పుడు ఉంది. దౌత్యం పేరుతో సర్ క్రీక్ను లాక్కోవాలనే కుట్ర గతంలో జరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నేను దానిని వ్యతిరేకించాను’’ అని ప్రధాని చెప్పారు. ప్రపంచం మొత్తం భారతదేశ శక్తిని చూస్తోందని ప్రధాని చెప్పారు.2014 నుంచి ప్రధాని పదవిని చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోదీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో గస్తీ కాస్తున్న సైనికులతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. 2014లో సియాచిన్, 2015లో పంజాబ్ సరిహద్దు, 2016లో హిమాచల్ ప్రదేశ్లోని సుమ్డో, 2017లో జమ్మూ కాశ్మీర్లోని గురేజ్ సెక్టార్, 2018లో ఉత్తరాఖండ్లోని హర్సిల్, 2019లో జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీ, 2019లో రాజస్థాన్, 2019లో కాశ్మీర్లోని నౌషేరా, 2019లో నౌషేరా, 2022లో జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్, 2023లో హిమాచల్లోని లెప్చాలో పర్యటించారు. Celebrating Diwali with our brave Jawans in Kutch, Gujarat.https://t.co/kr3dChLxKB— Narendra Modi (@narendramodi) October 31, 2024 -
బండిపై పేలిన టపాసులు.. ముక్కలు ముక్కలుగా
-
టపాసులపై దేవతల బొమ్మలు ఉంటే కాల్చొద్దు
-
సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్లో దీపావళి సెలబ్రేషన్స్.. ఫొటోలు షేర్ చేసిన సారా
-
తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జగన్
-
సువాసనలు వెదజల్లే దీపాలను వెలిగిద్దాం ఇలా..!
ప్రతి దీపకాంతి పసిడి వర్ణంలో వెలుగులు విరజిమ్ముతుంది. అయితే, కొన్ని దీపాల నుంచి వచ్చే పరిమళాలు మాత్రం విభిన్నంగా మదిని కట్టిపడేస్తున్నాయి. మట్టి ప్రమిదల్లో నూనెతో దీపాలను వెలిగించడంతోనే సంతృప్తి పడటం లేదు నేటితరం అందుకే, భిన్న ఆస్వాదనల వెలుగులను పరిచయం చేస్తున్నారు క్రియేటర్స్. ఈ దీపావళిని సుంగంధ భరితం చేస్తున్న వెలుగులు ఇవి..స్వీట్ ట్రీట్లను పోలి ఉండేలా నోరూరించే దియా డిజైన్ల శ్రేణి ఆన్లైన్ మార్కెట్లో సందడి చేస్తోంది. తియ్యని కప్ కేక్ల నుంచి ఐస్క్రీమ్ల వరకు ప్రతి కొవ్వొత్తి డిజైన్ అబ్బుర పరుస్తోంది. క్రీముతో కూడిన పంచదార పాకం సువాసనలను ఈ కొవ్వొత్తుల ద్వారా ఆస్వాదించవచ్చు. వీటి ధరలు కూడా వందల రూపాయల నుంచి వేలలో ఉన్నాయి. వీగన్ కాంతి..జంతు ఆధారిత ఉత్పత్తులు ఏవీ ఉపయోగించకుండా వీగన్ కొవ్వొత్తుల డిజైన్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. స్వీట్ డిజర్ట్ క్యాండిల్స్లో కుకీస్, బ్లాక్బెర్రీ, డార్క్ చాకొలెట్, లెమన్ డిజర్ట్, స్ట్రాబెర్రీ డిజర్ట్ క్యాండిల్స్ చూపులకు, సువాసనలకు నోరూరిస్తున్నాయి కూడా.ఆకారానికో అందం..మనుషులు, జంతు ఆకారాలను పోలిన క్యాండిల్స్తోపాటు సెంటెడ్ మట్కీ దియా సెట్, టెర్రకోట క్యాండిల్ దియాస్, ఘీ బ్లెండెడ్ ఫిల్డ్ క్లే దియా, మిర్రర్ డెకొరేషన్ దియాస్, షాడో దియాస్, వాటర్ లైట్ దియాస్ లభిస్తున్నాయి. భిన్న ఆకృతిలో డిజైన్లలో కనిపిస్తున్న వెలుగులు ఈ దీపావళికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. (చదవండి: -
సెలబ్రిటీల దీపావళి ముచ్చట్లు.. భయం లేకపోవడమే వెలుగు..!
జీవితం వెలుగుతుంది. జీవితం వెలుతురు సందర్భాలను తీసుకొస్తుంది. జీవితం ఎప్పుడూ నిరాశ, నిçస్పృహలనే చీకట్ల మీదకు ఆశ, ఆవేశం అనే వెలుతురు కిరణాలు పంపుతూనే ఉంటుంది. చీకటి వెలుగుల ఈ రంగేళిని సరి సమంగా స్వీకరించి ముందుకు సాగమని చెబుతుంది దీపావళి. వెలుతురును వరస కట్టుకోమని పెద్ద పెద్ద చప్పుళ్లతో అరిచి చెప్పే పండుగ ఇది. ఈ సందర్భంగా సెలబ్రిటీల వెలుతురు ముచ్చట్లు...నా జీవితంలో వెలుగులు నింపిన సంఘటన నేను మిస్ ఇండియా కిరీటం గెలవడం. మా నాన్నగారు మాకు దూరమైన తర్వాత ఇది జరిగింది. నా కంటే ఎక్కువగా మా కుటుంబ సభ్యులు ఉద్వేగానికి గురైన క్షణాలు అవి. ఇలా మా జీవితాల్లో వెలుగులు నిండిన ఈ సమ యాన్ని నేను మర్చిపోలేను. నాన్నగారు ఆర్మీలో పని చేసేవారు. దీపావళి పండక్కి ఆయన ఇంటికి వచ్చేవారు. అందువల్ల ఇంట్లో పండగ సందడి భలేగా ఉండేది. ఫ్రెండ్స్, బంధువులు అందరూ వచ్చేవారు. ఆయన లేకపోయినా ఆ ఆనవాయితీని కొనసాగేలా చూస్తున్నాను. మా హర్యాణలో దీపావళికి గాలిపటాలు ఎగరేస్తాం. వీధుల్లో పిల్లల ఆటపాటలు ఉంటాయి. కుటుంబ సభ్యులు అందరూ కలుస్తారు నియమంగా. ఇక షాపింగ్ చేయడం, నచ్చిన ఫుడ్ తినడం, దీపావళి వెలుగుల్లో సరదాగా గడపడం... ప్రతిసారి లాగే ఈసారి కూడా దీపాళికి ప్లాన్ చేశాను.ఇప్పుడే కాదు.. నా చిన్నప్పటి నుంచీ నేను క్రాకర్స్ కాల్చను. కానీ ఎవరైనా క్రాకర్స్ కాల్చుతుంటే దూరంగా నిల్చుని చూస్తూ ఆనందిస్తుంటాను. చీకటి, వెలుగులు ఉన్నట్లే... మన జీవితాల్లో కూడా ఎత్తుపల్లాలు, మంచి చెడులు ఉంటూనే ఉంటాయి. అయితే మనం కంట్రోల్ చేయలేని పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అన్నది ముఖ్యం. మన బౌండరీస్పై మనకు ఓ అవగాహన ఉండాలి. ప్రతి విషయంలోనూ సానుకూలంగానే ఆలోచించాలి. ఇలా ఉండటం సులభమని నేను చెప్పడం లేదు. కానీ ఉండగలగాలి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నా బాల్యంలో ప్రతి ఏడాది దీపాళికి మా అమ్మమ్మ ఇంటికి వెళ్లేవాళ్ళం. దాదాపు ఇరవైమంది కుటుంబ సభ్యులం కలిసి ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. అందుకే దీపావళి అంటే నాకు ఎంతో ఇష్టం. చిన్నతనంలో క్రాకర్స్ కాల్చడాన్ని చాలా ఎంజాయ్ చేశాను. మా తాతగారు దీపాళికి పెద్దస్థాయిలో లక్ష్మీపూజ ఘనంగా జరిపేవారు. అప్పట్లో క్రాకర్స్ కొనిచ్చేవారు. పిల్లలు క్రాకర్స్ బాక్స్లను కలిసి కాల్చేవారు. ఎక్స్ఛేంజ్ చేసుకునేవాళ్ళు. బాగుండేది. కానీ పర్యావరణ పరిరక్షణ ముఖ్యమని ఇప్పుడు కాల్చడం లేదు. అయితే ఒకసారి పండక్కు వెళ్లి కాలని లక్ష్మీబాంబులను ఏరుకుని, వాటిని విప్పి అందులోని పొడిని ఓ పేపర్లో ఉంచి, ఆ పేపర్ చివరన వెలిగించాను. నా అంతట నేనే ఓ లక్ష్మీబాంబును తయారు చేసుకుంటున్నానని ఫీలైపోయాను. కానీ దురదృష్టవశాత్తు నా రెండు వేళ్లు కాలిపోయాయి. మా అమ్మకు తెలిస్తే కోప్పడుతుందని తెలియకుండా దాచాను. కానీ అమ్మ గమనించి మందలించింది. ఈ ఘటనను నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే పిల్లలందరికీ చెబుతున్నా... క్రాకర్స్ కాల్చేప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. మీరు కాల్చే క్రాకర్స్పై మీకు అవగాహన లేకపోతే దూరంగా ఉండండి. అత్యుత్సాహం చూపకండి. నేను సరదాగా చేసిన పిచ్చిపనిలాంటివి చేయకండి. కొన్ని కారణాల వల్ల గడిచిన రెండు సంవత్సరాలు నేను దీపాళిని మా అమ్మమ్మ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోలేకపోయాను. అందుకే ఈ ఏడాది నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఆ జ్ఞాపకాలను మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాను. ఇంటి వాతావరణంలో నేను పెరిగింది తక్కువ. బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నాను. కాలేజీ కూడా అంతే. ఒంటరిగా ట్రావెల్ చేస్తుంటాను. సమాజంలో ఎలా మెలగాలో నాకు నేను కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. మీపై మీరు భరోసా ఉంచండి. ధైర్యంగా ఉండండి. నైతిక బాధ్యతతో ఉండండి. అప్పుడు క్లిష్టపరిస్థితులను నెగ్గుకు రావొచ్చు మీరు. నమ్మిన దానిపట్ల ధైర్యంగా నిలబడుతూ తలెత్తుకు జీవించండి. నా అనుభవాల నుంచి నేను నేర్చుకున్న సంగతులు ఇవి. భయం లేకపోవడమే వెలుగని నేను భావిస్తుంటాను. (చదవండి: మన ముంగిళ్లలో వెలుగు పూలు) -
దర్శన్కు దీపావళి!
సాక్షి, బళ్లారి, బనశంకరి: దీపావళి సంబరాల సమయంలో ప్రముఖ నటుడు దర్శన్కు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. ఆయనకు బెంగళూరులోని హైకోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. చిత్రదుర్గానికి చెందిన రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, ప్రియురాలు పవిత్రగౌడ సహా మరికొందరు నిందితులు 140 రోజుల నుంచి జైలులో ఉన్నారు. దర్శన్కు 6 వారాలు పాటు బెయిలు అమల్లో ఉంటుంది.కోర్టులో వాదనలు..తీవ్రమైన వెన్నునొప్పి సమస్యను చూపుతూ బెయిలు పిటిషన్ వేయగా కొన్నిరోజులుగా విచారణ సాగుతోంది. న్యాయమూర్తి విశ్వజిత్శెట్టి ధర్మాసనం చివరకు తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. దర్శన్కు వెన్నులో ఎల్–5, ఎస్–1 డిస్క్లలో సమస్య ఉంది. మైసూరులో చికిత్స తీసుకోవాలని దర్శన్ న్యాయవాది నాగేశ్ వాదించారు. సర్కారు వకీలు ప్రసన్నకుమార్ బెయిలు ఇవ్వరాదని వాదించారు. కాలిలో శక్తి కోల్పోయినట్లు ఉందని, చికిత్స తీసుకోకపోతే మూత్ర నియంత్రణ కోల్పోవడంతో పాటు మునుముందు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చని బళ్లారి ప్రభుత్వ ఆసుపత్రి నరాలరోగ నిపుణుడు విశ్వనాథ్ నివేదిక ఇచ్చారని నాగేశ్ తెలిపారు. దర్శన్ ఇప్పటికే రెండుసార్లు మైసూరు ప్రైవేటు ఆసుపత్రి శస్త్రచికిత్స చేసుకున్నారని చెప్పారు.జైలువద్దకు భార్యాపిల్లలుబెయిల్ లభించగానే దర్శన్ సతీమణి విజయలక్ష్మి, కుమారుడు, బంధువులు బళ్లారి సెంట్రల్ జైలుకు వచ్చారు. కోర్టు నుంచి పత్రాలు అందిన తరువాతే జైలు నుంచి దర్శన్ను విడుదల చేస్తారని జైలు సూపరింటెండెంట్ చెప్పారు. జైలు వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకున్నారు.తప్పుచేసిన వారికి శిక్షపడాలిరేణుకాస్వామి తండ్రి కాశీనాథయ్య హరిహరలో విలేకరులతో మాట్లాడుతూ కొడుకు హత్యతో చాలా బాధలో ఉన్నాము. కోడలు కాన్పు కోసం ఇక్కడ పుట్టింటికి వచ్చింది. కొడుకు పుట్టిన సంతోషం కూడా లేకుండా పోయింది. ఎవరు తప్పుచేసినా శిక్షపడాలనేది మా డిమాండ్. నిందితులకు శిక్ష పడేవరకు పోరాటం ఆపేది లేదని చెప్పారు. -
అమెరికా ఎన్నికల్లో భారతీయత
అమెరికా తపాలా శాఖ వారి నుంచి దీపావళి స్టాంపు విడుదలను కోరుతూ భారతీయ అమెరికన్లు కొన్ని సంవత్సరాలు వరుసగా పిటిషన్ల మీద పిటిషన్లు వేశారు. 2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిసారి వైట్హౌస్లో దీపావళి దివ్వెను వెలిగించినప్పుడు భారతీయ అమెరికన్ల ఛాతీ గర్వంతో ఉప్పొంగింది. అమెరికన్ల గుర్తింపు కోసం ఈ తహతహ అంతా! ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, భారీ విరాళాలు ఇస్తున్నప్పటికీ భారతీయ అమెరికన్లు ఇప్పటికీ ఒక నిర్ణాయక శక్తిగా అవతరించలేదని ఒక అధ్యయనం చెబుతోంది. కమలా హ్యారిస్ తల్లి, జేడీ వాన్స్ భార్య... ఇద్దరూ భారతీయ మూలాలు ఉన్నవారు కావడం వల్ల 2024 ఎన్నికలను భారతీయ అమెరికన్లకు దీపావళి కానుక అనుకోవచ్చు.అమెరికా ప్రభుత్వం తమను గుర్తించాలని తహతహలాడని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దీపావళి స్టాంపు కోసం పిటిషన్ల మీద పిటిషన్లు వేయడం ఇందుకు ఒక ఉదాహరణ. హనుక్కా(యూదుల పండుగ), ఈద్లకు స్టాంపులు ఉండగా... తమకెందుకు లేదని ఏటా భారతీయ అమెరికన్లు అక్కడి పోస్ట్ మాస్టర్ జనరల్కు మెయిళ్లు పెట్టేవారు.సంతకాల సేకరణ జరిగేది. కానీ ప్రతిసారీ నిరాశే ఎదురయ్యేది. 2013లో భారతీయ అమెరికన్ పార్లమెంటు సభ్యుడు అమి బేరా స్టాంపు ఎప్పుడో విడుదల కావాల్సిందని అన్నారు. మూడేళ్ల తరువాత 2016లో ‘ఫరెవర్’ స్టాంపు విడుదలైంది. అంటే ఎప్పటికీ తొలగించ నిది. కొద్ది రోజుల్లోనే లక్ష స్టాంపులు అమ్ముడయ్యాయి. స్టాంపులు అమ్ముడు కాకపోతే పంపిణీలోంచి తొలగిస్తారేమోనని విపరీతంగా కొనాలన్న ప్రచారం జరిగింది. పోస్ట్మాస్టర్ జనరల్ రంగంలోకి దిగి దీపావళి స్టాంపును తొలగించే ఉద్దేశమేమీ లేదని స్పష్టం చేయాల్సి వచ్చింది. స్టాంపు ద్వారా అక్కడి సమాజంలో గుర్తింపు పొందేందుకు పడ్డ శ్రమ, ఆందోళన ఇదంతా.2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిసారి వైట్ హౌస్లో దీపావళి దివ్వెను వెలిగించినప్పుడు భారతీయ అమెరికన్ల ఛాతీ గర్వంతో పొంగిపోయింది. దీపావళి రోజును సెలవుగా ప్రకటించాలన్న డిమాండ్ బయలుదేరింది. స్పెల్లింగ్–బీ పోటీల్లో గెలవడం ఒకటైతే, అమెరికన్ కులీనుల నుంచి గుర్తింపు పొందడం మరొకటి.ఆ రకంగా 2024 ఎన్నికలు భారతీయ అమెరికన్లకు దీపావళి కానుక అనుకోవచ్చు. డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హ్యారిస్ తల్లి, రిపబ్లికన్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జేడీ వాన్స్ భార్య... ఇద్దరూ భారతీయ మూలాలు ఉన్నవారే. అమెరికా ఎన్నికల్లో ఈసారి భారతీయత భావన రకరకాలుగా వ్యక్తమవుతోంది.ఉదాహరణకు డోనాల్డ్ ట్రంప్ ఓ ఆఫ్రికన్ –అమెరికన్ జర్నలిస్టుతో మాట్లాడుతూ... కమల సగం ఆఫ్రికన్ అన్న విషయం తనకు నిన్నమొన్నటి వరకూ తెలియదనీ... ఆమె ఎల్లప్పుడూ తన భారతీయ మూలాలను మాత్రమే ప్రస్తావిస్తూంటుందని అన్నారు. అదొక విచిత్రమైన వ్యాఖ్య. కమల ఎప్పుడూ తన ఆఫ్రికన్ మూలాలనే ప్రస్తావిస్తుంటుందని భారతీయ అమెరికన్లు చాలామంది వాదిస్తూంటారు. కేవలం దీపావళి వేడుకల్లో, లేదంటే ఇండియన్ అమెరికన్ లతో నిధుల సేకరణ కార్యక్రమాల్లో మాత్రమే భారతీయ మహిళగా ఉంటుందని చెబుతుంటారు. భారతీయ అమెరికన్ల కంటే ఆఫ్రికన్ అమె రికన్ల ఓటు బ్యాంకు పెద్దదన్న అంచనాతో కమల హ్యారిస్ను ఒక అవకాశవాదిగా చిత్రీకరించేందుకు ట్రంప్ ప్రయత్నించారు. ఇది దీర్ఘకాలంలోనూ ట్రంప్కు పనికొచ్చే ఎత్తుగడ.ఒక రకంగా చూస్తే అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్లు అంతగా అక్కరకొచ్చే అంశంగా కనపడటం లేదు. స్టాంపుల్లాంటి చిన్న విషయాలను పక్కనబెడితే... మిషిగన్ యూనివర్సిటీకి చెందిన జోయ్ జీత్ పాల్ ‘న్యూస్లాండ్రీ’ కోసం నిర్వహించిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఓట్ల శాతం (2020లో 74 శాతం) ఎక్కువగా ఉన్నప్పటికీ, భారీ విరాళాలు ఇస్తున్నప్పటికీ భారతీయ అమెరికన్లు ఒక నిర్ణాయక శక్తిగా అవతరించలేదని ఈ అధ్యయనం చెబుతోంది. అయితే గతంలో ఒకసారి ఫ్లోరిడా కేంద్రంగా ఉన్న భారతీయ వైద్యులు కొందరు ఇండియన్ రిపబ్లికన్ కౌన్సిల్ ఒకటి ఏర్పాటయ్యేందుకు సహకరించడం... జార్జి బుష్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడిన ప్పుడు అక్కడి 2,000 ఓట్లే కీలకం కావడం గమనార్హం. అయితే 2005లో భారతీయ హోటలియర్లు తమ వార్షిక కార్యక్రమానికి నరేంద్ర మోదీని ఆహ్వానించడం... అది కాస్తా ఆయన వీసా రద్దుకు కారణమవడం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. తమ జనాభా కంటే ఎక్కువ పలుకుబడి కలిగివున్న ఇజ్రాయెలీల మాదిరిగానే భారతీయ అమెరికన్లు కూడా ‘యూఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ’ ఏర్పాటు చేశారు. 1956లో దలీప్ సింగ్ సాండ్ తరువాత బాబీ జిందాల్ కాంగ్రెస్కు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ గా రికార్డు సృష్టించిన అనంతరం, కాలిఫోర్నియా నుంచి అమి బేరా కూడా కాంగ్రెస్కు ఎన్నికైన తరువాత మాత్రమే భారతీయ అమెరికన్ల భాగస్వామ్యం పెరిగిందని జోయ్జీత్ పాల్ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు ఇండియన్ అమెరికన్ ఇంప్యాక్ట్ ఫండ్ భారతీయ అమెరికన్ల ఎన్నికలకు ప్రాయోజకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయినా కూడా ఇప్పటికీ భారతీయ అమెరికన్లను విదేశీయుల్లాగే భావించడం ఎక్కువ. భారతీయులకు తాను దగ్గరివాడినని చెప్పుకునే డోనాల్డ్ ట్రంప్ కూడా తన ప్రత్యర్థి నిక్కీ హేలీని ‘నిమ్రదా’ హేలీ అని సంబోధిస్తూండటం గుర్తు చేసుకోవాలి. భారతీయ మూలాలను గుర్తు చేసే ప్రయత్నం అన్నమాట! దీనికి తగ్గట్టుగానే నిక్కీ హేలీ తన వెబ్సైట్లో అసలు పేరు నమ్రతా రణ్ధవాను అసలు ప్రస్తావించనే లేదు. 2010 అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల పోటీని నేను దగ్గరుండి గమనించాను. ఎక్కువమంది దక్షిణాసియా ప్రాంత వాసులు పెద్దగా లేని చోట్లే పోటీ చేశారు. కాన్సస్లో రాజ్ గోయెల్ పోటీ చేసినప్పుడు, పరిసర ప్రాంతాల్లో ఎంతమంది భారతీయు లున్నారని వచ్చిన ప్రశ్నకు, ‘‘పది’’ అని సమాధానం చెప్పారు; పది శాతమంటే మేలే అని వచ్చిన స్పందనకు, ‘‘శాతం కాదు, అక్షరాలా పది మంది మాత్రమే’’ అని ఈయన జవాబిచ్చిన ఘట్టాన్ని నాతో పంచుకున్నారు. ఇండో అమెరికన్ కౌన్సిల్కు చెందిన డెమోక్రటిక్ నేషనల్ కమిటీ అధ్యక్షుడు శేఖర్ నరసింహన్ మాటల్లో చెప్పాలంటే... భారతీయులు అటు నలుపు కాదు, ఇటు తెలుపు కాదు; కాబట్టి వెంటనే ఎందులోనూ చేర్చలేరు.ఈ ఎన్నికల్లో అమెరికన్ కలల కోసం కష్టపడ్డ తల్లిదండ్రులకు మొక్కుబడిగా ఓ దండం పెట్టేసిన తరువాత అభ్యర్థులంతా తాము అమెరికాలో సాధించిన ఘనతలకే పెద్దపీట వేశారు. కమల హ్యారిస్ తాను ఒకప్పుడు ‘మెక్ డొనాల్డ్స్’లో పని చేశానని చెప్పుకున్నట్లు. అమి బేరా తన ప్రచారంలో భారతీయ సంప్రదాయ విలువలను, అమెరికా వృత్తిగత శైలి... రెండింటిని కలగలిపి ‘బోత్ ఆఫ్ టూ వరల్డ్స్’ అని చెప్పుకొన్నారు. అప్పటికి ఓటమి పాలైనా తరువాతి ఎన్నికల్లో గెలుపొందారు. మార్పునకు కొంత సమయం పడుతుందనేందుకు ఇదో నిదర్శనం.అయినా సరే... పాత అలవాట్లు అంత తొందరగా పోవు అంటారు. శేఖర్ నరసింహన్కు ఇది 2006లోనే అనుభవమైంది. అప్పట్లో రిపబ్లికన్ సెనేటర్ పోటీదారు జార్జ్ అలెన్ ఓ యువ భారతీ యుడిని ఉద్దేశించి ‘మకాకా’(కోతి) అని గేలి చేస్తూ మాట్లాడారు. ఆ యువకుడు శేఖర్ కుమారుడు. ఈ ఘటనతో శేఖర్కు తత్వం బోధ పడింది. నువ్వు ఎంత తాపత్రాయ పడినా, వీళ్లకు (అమెరికన్లు) మనం (భారతీయులు) భిన్నంగానే కనిపిస్తూంటామని అర్థమైంది. ఈ ఎన్ని కల్లో కూడా ట్రంప్ మద్దతుదారు లారా బూమర్ చేసిన ‘‘హ్యారిస్ గెలుపొందితే వైట్హౌజ్లో కర్రీ వాసనొస్తుంది’’ అన్న వ్యాఖ్య రభసకు దారితీసింది. అయినప్పటికీ అమెరికా మారడం లేదని చెప్పలేం. ఈ ఎన్నికల్లో కమల... క్యాథీ పేరుతో పోటీ చేయడం లేదు. పైగా తాను దోశ వేస్తూండగా వీడియో తీయడానికి ఓకే అంటున్నారు. హ్యారిస్ గెలుపు ఓటములను పక్కనబెట్టినా... అమెరికాలో వచ్చిన సాంస్కృతిక మార్పు మాత్రం మళ్లీ వెనక్కు మళ్లలేనిది.సందీప్ రాయ్ వ్యాసకర్త రచయిత, రేడియో హోస్ట్(‘మింట్’ సౌజన్యంతో) -
భయంకరంగా టపాసుల రేట్లు.. ఖాళీగా షాపులు
-
అయోధ్య దీపోత్సవం.. కన్నడ స్టార్ కు బిగ్ రిలీఫ్
-
తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: దీపావళిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారాయన.‘‘చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక. దీపావళి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలి. ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలి. ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలి’’అలాగే.. ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి. వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలి అని ఆయన ఆకాంక్షించారు. ఈ దీపావళి మీ ఇంట మరిన్ని వెలుగులు నింపాలని, మీకు మరిన్ని విజయాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) October 31, 2024క్లిక్ చేయండి: పులివెందులలో.. జనంతో జగన్ -
500 ఏళ్ల తరువాత అయోధ్యలో వైభవంగా దీపావళి
-
పండుగవేళ.. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు శుభవార్త
హైదరాబాద్, సాక్షి: ఉద్యోగులకు జీహెచ్ఎంసీ దీపావళి శుభవార్త చెప్పంది. ఈరోజు సాయంత్రం వరకు జీతాలు విడుదల చేయనున్నట్లు ఫైనాన్స్ డిపార్టుమెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది. జీహెచ్ఎంసీ రూ.120 కోట్ల నిధులను విడుదల చేయనుంది. అయితే.. జీహెచ్ఎంసీ గత నెల వారం రోజుల ఆలస్యంగా జీతాలు ఇచ్చింది. దసరాకు ఐదు రోజులు ఆలస్యంగా జీతాలు ఇవ్వడంతో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి ఉద్యోగుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని రెండు రోజులు ముందుగానే జీహెచ్ఎంసీ జీతాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. -
దివి నుండి భువికి దీపావళి
దీపావళి తారాజువ్వ ఒకటి అంతరిక్షంలోకి దూసుకుని వెళ్లి, అక్కడున్న సునీతా విలియమ్స్ని ఎక్కించుకుని తిరిగి భూమి మీదకు చేరుకుంటే ఎంత బాగుంటుంది! వారంలో తిరిగొచ్చేందుకు వెళ్లి, అవాంతరం వల్ల అక్కడే చిక్కుకుపోయారు సునీత, ఆమె సహవ్యోమగామి విల్మోర్. వారిని స్పేస్లోకి మోసుకెళ్లిన వ్యోమనౌక వారిని అక్కడే వదిలేసి, భూమి పైకి తిరిగొచ్చి కూడా రెండు నెలలు అవుతోంది. వచ్చే ఫిబ్రవరిలో గానీ మరో కొత్త వ్యోమనౌకలో సునీత భూమి పైకి వచ్చే అవకాశాలు లేవు. సునీత ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు ‘నాసా’కు సంకేతాలు అందుతున్నాయి. కానీ అవి సునీత పంపుతున్న సంకేతాలు కావు. నాసా అంచనాలు మాత్రమే. నిజానికి ఆమె ధైర్యంగా ఉన్నారు. భూమిపైకి సందేశాలు పంపుతున్నారు. సోమవారం వైట్హౌస్లో దీపావళి సంబరాలు జరుగుతున్నప్పుడు.. ‘‘అంతరిక్ష కేంద్ర నుండి మీ అందరికీ హ్యాపీ దీపావళి’ అంటూ వీడియోలో శుభాకాంక్షలు పంపారు! ఇది కదా ఈ ఏడాది అసలైన దీపావళి. భూమికి 260 మైళ్ల ఎత్తులో, నక్షత్రంలా మెరుస్తున్న మన సునీతను కళ్లారా చూడ్డం, ఆమె స్వరాన్ని చెవులారా వినటం.. ఇది కదా నిండైన దీపావళి.‘‘ఇంత ఎత్తు నుండి దీపావళిని జరుపుకునే అవకాశం నాకు మాత్రమే లభించింది. దీపావళి, ఇతర భారతీయ పండుగల గొప్పతనం గురించి చిన్నప్పుడు నాన్న మాకు చెప్పేవారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన దీపావళి ఉత్సవాలలో పాల్గొన్నందుకు అమెరికా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్కు సునీతా విలియమ్స్ కృతజ్ఞతలు’’ అని సునీత తన సందేశాన్ని వినిపించారు. కష్టకాలంలో ఉన్నప్పుడు ధీరులు మాత్రమే ఇతరుల సంతోషాలలో పాల్పంచుకోగలరు. తమ కష్టాన్ని దాచి పెట్టి చిరునవ్వుల మతాబులను వెలిగించగలరు. -
రిలయన్స్ దీపావళి గిఫ్ట్ చూశారా?
దీపావళి సందర్భంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు బహుమతులు ఇస్తాయి. కొన్ని కంపెనీలు బోనస్ల రూపంలో నగదు పంపిణీ చేస్తే మరికొన్ని స్వీట్లు, ఇతర గిఫ్ట్లు ఇస్తూంటాయి. భారత్లోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి బహుమతి అందించింది. రిలయన్స్ ఇచ్చిన గిఫ్ట్బాక్స్ అన్బాక్స్ వీడియో ప్రస్తుతం వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.రిలయన్స్ జియో ఇన్ఫోకామ్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని తనకు అందించిన గిఫ్ట్ బాక్స్ను అన్బాక్స్ చేస్తూ వీడియో రికార్డు చేసింది. ఈ వీడియోలో ఇంగ్లీషు, హిందీలో ‘దీపావళి శుభాకాంక్షలు’, ‘శుభ్ దీపావళి’ అని రాసిన తెల్లటి బాక్స్ను గమనించవచ్చు. ఇందులో మూడు ప్యాకెట్లు ఉన్నాయి. వాటిలో జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష(కిస్మిస్) ఉన్నాయి. View this post on Instagram A post shared by sumanasri😍 (@itlu_me_suma)ఇదీ చదవండి: ఉద్యోగులకు టీ, కాఫీ నిలిపివేత!రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, భార్య నీతా అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా, ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్తోపాటు తమ కుటుంబంలోని నలుగురు మనవరాళ్లు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు నోట్ ఉంది. -
పండుగ కళ వచ్చేసింది: పింక్ సారీలో నటి లయ
-
ఈ దేశాల్లోనూ దీపావళి సెలవులు
న్యూఢిల్లీ: భారతదేశంలోని ప్రజలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. ఈ పండుగ సందర్భంగా పలు ప్రాంతాల్లోని ప్రజలు బంగారం, వెండి, కార్లు, పాత్రలు, కొత్త బట్టలు మొదలైనవి కొనుగోలు చేస్తారు. అన్ని విద్యా సంస్థలు, బ్యాంకులు, కార్యాలయాలకు దీపావళి రోజున సెలవు ఉంటుంది.విదేశాల్లో దీపావళి వేడుకల విషయానికొస్తే నేపాల్, బాలి, సింగపూర్ సహా పలు దేశాల్లో దీపావళి సందడి కనిపిస్తుంది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో దీపావళి నాడు ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటిస్తారు. అమెరికాలో అధిక సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు దీపావళి సందర్భంగా వైట్ హౌస్లో దీపం వెలిగిస్తారు. అమెరికాలోని పెన్సిల్వేనియా, న్యూయార్క్లలో దీపావళినాడు అధికారిక సెలవుదినంగా ప్రకటించారు.ఫిజీ: 1879 నుంచి ఫిజీలో దీపావళి నాడు ప్రభుత్వ సెలవుదినాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు.మలేషియా: మలేషియాలో ప్రభుత్వ సెలవుల జాబితాలో దీపావళి కూడా చేరింది. మారిషస్: మారిషస్లో హిందువుల జనాభాను పరిగణనలోకి తీసుకుని దీపావళి నాడు ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించారు. ఈ ద్వీపంలో దీపావళి సందర్భంగా దీపాలు వెలిగిస్తారు. ఇళ్లను అందంగా అలంకరిస్తారు.నేపాల్: నేపాల్లో దీపావళిని తిహార్ లేదా స్వాంతి అంటారు. అక్కడ ఈ పండుగను 5 రోజుల పాటు జరుపుకుంటారు.శ్రీలంక: శ్రీలంకలో తమిళనాడు చెందినవారు దీపావళిని జరుపుకుంటారు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ సెలవులు ఇస్తారు.సింగపూర్: దీపావళి సందర్భంగా సింగపూర్లో ప్రభుత్వ సెలవుదినం. లిటిల్ ఇండియాలో దీపావళి నాడు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దక్షిణాఫ్రికా, ట్రినిడాడ్, టొబాగోలో కూడా దీపావళి సందర్భంగా పబ్లిక్ హాలిడే ఇస్తారు. ఇది కూడా చదవండి: గుడిలో బాణసంచా ప్రమాదం.. 150 మందికి గాయాలు -
ఢిల్లీ.. 72 గంటలు డేంజర్
న్యూఢిల్లీ: రాబోయే 72 గంటలు దేశ రాజధాని ఢిల్లీకి ప్రమాదకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో గత కొన్ని రోజులుగా పొగమంచు కమ్ముకుంటోంది. వాయు నాణ్యత సూచిక ప్రతిరోజూ 300 దాటుతోంది. ఈరోజు (అక్టోబరు 29) ఉదయం ఏక్యూఐ 274గా నమోదయ్యింది. ఢిల్లీలో గాలి నాణ్యత రానున్న మూడు రోజుల్లో మరింత విషపూరితం అయ్యే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. #WATCH | Delhi: A thin layer of smog engulfs the National Capital as the air quality continues to deteriorate.(Visuals from India Gate) pic.twitter.com/XeCku3Hu1k— ANI (@ANI) October 29, 2024ఇప్పటి వరకు వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల వాయుకాలుష్యం పెరిగిందని, అయితే రానున్న రోజుల్లో పటాకులు పేల్చడం వల్ల వాయుకాలుష్యం పెరగనుందని చెబుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వం పటాకులను నిషేధించినప్పటికీ కాలుష్యం పెరిగే అవకాశాలున్నాయి. రాజధానిలో గ్రేప్-1, గ్రేప్-2 నిబంధనలు కూడా అమలు చేస్తున్నారు.#WATCH | Delhi | AQI around Lodhi Road and surrounding areas recorded 255, categorised as 'Poor' according to the Central Pollution Control Board (CPCB). pic.twitter.com/rYZboXTtYN— ANI (@ANI) October 29, 2024సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) డేటాలోని వివరాల ప్రకారం సోమవారం ఆగ్నేయ గాలుల కారణంగా ఢిల్లీ కాలుష్య స్థాయి కాస్త మెరుగుపడింది. అయితే దీపావళి నాటికి ఢిల్లీలో రెట్టింపు కాలుష్యం ఏర్పడే అవకాశాలున్నాయి. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) 304 (చాలా పేలవంగా ఉంది). సాయంత్రం 6 గంటలకు 299గా ఉండగా, రాత్రి 10 గంటలకు 288కి చేరుకుంది. #WATCH | Delhi | AQI around ITO and surrounding areas recorded 261, categorised as 'Poor' according to the Central Pollution Control Board (CPCB). pic.twitter.com/FvG2oZGgJB— ANI (@ANI) October 29, 2024ఇది కూడా చదవండి: గుడిలో బాణసంచా ప్రమాదం.. 150 మందికి గాయాలు -
మనుమలకు టపాసులు కొనిచ్చిన కేంద్ర మంత్రి గడ్కరీ
నాగ్పూర్: దేశంలో దీపావళి సందడి నెలకొంది. మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీపావళి షాపింగ్కు సంబంధించిన ఒక వీడియో వైరల్గా మారింది.ఈ వీడియోలో నితిన్ గడ్కరి తన మనుమడు, మనుమరాలితో దీపావళి షాపింగ్ చేయడాన్ని చూడవచ్చు. గడ్కరీ ఒక బాణసంచా దుకాణంలో తన మనుమలకు బాణసంచా కొనిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను నితిన్ గడ్కరీ కార్యాలయం విడుదల చేసింది.ఇదిలావుండగా పాన్ మసాలా, గుట్కా తిని రోడ్డుపై ఉమ్మివేసే వారికి బుద్ధి చెప్పేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక వినూత్న ఆలోచన వెలిబుచ్చారు. అటువంటివారి ఫొటోలు తీసి పత్రికల్లో ప్రచురించాలని, అప్పుడే వారికి బుద్ధి వస్తుందన్నారు. దేశ ప్రజలు రోడ్లు మురికిగా మారకుండా కాపాడుకోవాలని మంత్రి సూచించారు.ఇది కూడా చదవండి: ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ఇకలేదు -
దీపావళి ఔట్ ఫిట్: రాశీఖన్నా రీగల్ లుక్ (ఫొటోలు)
-
ఏక్తా కపూర్ దీపావళి పార్టీలో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
దీపోత్సవానికి అయోధ్య ముస్తాబు
అయోధ్య: దీపావళి సందర్భంగా జరిగే దీపోత్సవ్ వేడుకలకు యూపీలోని అయోధ్య ముస్తాబవుతోంది. అక్టోబర్ 30న జరిగే దీపోత్సవ్ కోసం రామనగరిని అందంగా తీర్చిదిద్దుతున్నారు. భక్తివిశ్వాసాల కలబోతతో అయోధ్య వెలుగులమయం కానుంది.అయోధ్యలో జరిగే 8వ దీపోత్సవంలో అవధ్ యూనివర్సిటీకి చెందిన 30 వేల మంది వాలంటీర్లు దీపోత్సవ్ స్థలంలో 28 లక్షల దీపాలను అమర్చేందుకు కృషి చేస్తున్నారు. రామ్ కీ పైడిలోని 55 ఘాట్ల వద్ద జై శ్రీరామ్ నినాదాలతో వెలుగుల పండుగలో వాలంటీర్లు పాల్గొననున్నారు.శ్రీరాముడు కొలువైన అయోధ్య ఈ సంవత్సరం దీపోత్సవం సందర్భంగా డిజిటల్ సిటీగా కనిపించబోతోంది. వెలుగుల సంగమం ఆవిష్కృతం కానుంది. ధరంపథ్ నుండి లతా మంగేష్కర్ చౌక్ వరకు, రంగురంగుల లైట్లు ఆకర్షణీయంగా కనువిందు చేయనున్నాయి. ముఖ్యంగా లతా మంగేష్కర్ చౌక్ వెలుగు జిలుగులతో అత్యంత సుందరంగా కనిపించనుంది.దీపోత్సవ వేడుకలకు నగరమంతా త్రేతాయుగంలా ముస్తాబైంది. త్రేతాయుగంలో రాముడు లంకను జయించి అయోధ్యకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి. ఇప్పుడు వాటిని గుర్తు చేసేలా అయోధ్యను రంగురంగుల దీపాలతో అలంకరించారు.లతా మంగేష్కర్ చౌక్ నుండి వివిధ కూడళ్లలో రామభక్తుల కోసం డిజిటల్ డిస్ప్లే వ్యవస్థను ఏర్పాటు చేశారు. రామభక్తులు దీపోత్సవ్ ప్రదేశానికి వెళ్లలేకపోయినా, డిజిటల్ తెరలపై దీపోత్సవాన్ని చూసి ఆస్వాదించవచ్చు.రంగురంగుల దీపాలు అయోధ్య అందాన్ని మరింత పెంచుతున్నాయి. రామభక్తులు రాత్రిపూట అయోధ్య వీధుల్లోకి వెళ్లినప్పుడు తమను తాము మైమరచిపోయేలా దీపోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.ఇది కూడా చదవండి: అత్యంత వృద్ధ మహిళ అస్తమయం -
కరెంట్ చార్జీల పెంచడమే దీపావళి కానుకా?.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
మల్టీ-అసెట్ ఫండ్స్తో దీపావళి కాంతులు
కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అంతా ఒక్క చోట చేరి సంతోషంగా జరుపుకునే దీపాల పండుగ దీపావళి. సంపద, శ్రేయస్సును ప్రసాదించే లక్ష్మీ దేవి పూజ ఈ వేడుకల్లో కీలకమైనది. లక్ష్మీదేవి కటాక్షం పొందాలన్నా, సంపదను సాధించాలన్నా మనం కూడా కష్టపడి పనిచేయాలి. తెలివిగా ఇన్వెస్ట్ చేయాలి. లక్ష్మీ దేవి పూజలో ఉపయోగించే దీపాలు, పూలు, నగదు మొదలైన వాటిని ఒకసారి పరిశీలిస్తే మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోను తీర్చిదిద్దుకునేందుకు ప్రేరణనిచ్చే అంశాలెన్నింటినో తెలుసుకోవచ్చు. వివిధ పూజాద్రవ్యాల సమాహారంలాగా ఈక్విటీ, డెట్, గోల్డ్ మొదలైన వాటితో కూడు కున్న మల్టీ అసెట్ ఫండ్ అనేది మెరుగైన రాబడులను పొందడంలో ఇన్వెస్టర్లకు ఎంతగానో తోడ్పడుతుంది.దీపాలు: ఈక్విటీల కాంతులు చీకటిని పారద్రోలి, ఆశల కాంతులనిస్తాయి దీపాలు. మొత్తం పూజా కార్యక్రమానికి మార్గదర్శకత్వం వహించేలా వెలుగు పంచుతాయి. మల్టీ–అసెట్ ఫండ్ను పరిగణనలోకి తీసుకుంటే, ఈక్విటీ పెట్టుబడులు కూడా ఇలాంటి పాత్రే పోషిస్తాయి. సాధారణంగా పోర్ట్ఫోలియోకు వృద్ధి చోదకాలుగా ఈక్విటీలు పనిచేస్తాయి. దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి దోహదపడతాయి. దీపాలు ఏ విధంగానైతే గదిని కాంతివంతం చేస్తాయో దీర్ఘకాలంలో అధిక రాబడులను అందించి వృద్ధి దిశగా సాగే బాటను ప్రకాశింపచేస్తాయి ఈక్విటీలు. మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా వీటితో కొన్ని రిస్కులు ఉన్నప్పటికీ సంపద సృష్టి విషయంలో వీటికున్న సామర్థ్యాల కారణంగా సమతుల్యమైన పోర్ట్ఫోలియోలో తప్పనిసరిగా చోటు కల్పించాల్సిన ఆర్థిక సాధనంగా ఈక్విటీలు ఉంటాయి. పుష్పాలు: డెట్ సాధనాల సౌరభాలు లక్ష్మీ పూజలో స్వచ్ఛత, అందానికి చిహ్నమైన పుష్పాలు కూడా కీలకమే. పరిమళాలు వెదజల్లే పుష్పాలు పూజా కార్యక్రమానికి ఒకవైపు రంగుల హంగులను జోడిస్తూ మరోవైపు ఆధ్యాత్మిక శోభను తెస్తాయి. మల్టీ అసెట్ ఫండ్లో బాండ్లు, డిబెంచర్లు, గవర్నమెంట్ సెక్యూరిటీల్లాంటి డెట్ సాధనాలు కూడా ఇలాంటి పాత్రే పోషిస్తాయి. మల్టీ అసెట్ ఫండ్లో డెట్ సాధనాలు స్థిరత్వాన్ని, క్రమానుగత ఆదాయాన్ని అందిస్తాయి. ఈక్విటీలు హెచ్చుతగ్గులకు లోనైనా పోర్ట్ఫోలియో తీవ్ర ఒడిదుడుకులకు లోను కాకుండా సమతూకంగా ఉండేలా డెట్ సాధనాలు కాస్త బఫర్గా పనిచేస్తాయి. ఇవి మరో అంచె భద్రతను కల్పిస్తాయి. మార్కెట్ అనిశ్చితిని అధిగమించే ధీమాను అందిస్తాయి. తిలకం: రక్షణ కవచం నుదుటిపైన బొట్టు/తిలకం శుభాన్ని, రక్షణను సూచిస్తుంది. ప్రతికూల శక్తుల నుంచి భక్తులకు ఇది రక్షణ కల్పిస్తుంది. మల్టీ–అసెట్ ఫండ్లో ఈ పాత్రను పసిడి పోషిస్తుంది. సాధారణంగా ద్రవ్యోల్బణం, మార్కెట్ పతనాలకు హెడ్జింగ్గా ఉపయోగపడే సాధనంగా బంగారాన్ని పరిగణిస్తారు. రక్షణ కల్పించే తిలకంలాగే బంగారం కూడా ఆర్థిక సంక్షోభాల సమయంలో మీ పోర్ట్ఫోలియోను సురక్షితంగా ఉంచుతుంది. తమ సంపదను కాపాడుకోవాలనుకునే ఇన్వెస్టర్లు .. కాలం గడిచినా విలువను కోల్పోని బంగారాన్ని తమ పోర్ట్ఫోలియోలో తప్పనిసరిగా చేర్చుకోతగిన సాధనం కాగలదు. ఇటీవలి కాలంలో చూస్తే బంగారం కూడా గణనీయంగా రాబడులు అందించింది. వివిధ అంశాలను పరిశీలిస్తే రాబోయే రోజుల్లో పసిడికి డిమాండ్ మరింతగా పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. నాణేలు/డబ్బు: నగదు తత్సమానాలు నాణేలు, నోట్ల రూపంలో సంపద, సమృద్ధి, శ్రేయస్సు, ఆర్థిక సమృద్ధిని సూచించే నగదుకు కూడా లక్ష్మీ పూజలో ప్రాధాన్యం ఉంటుంది. లక్ష్మీ దేవి ఆర్థిక వృద్ధి, స్థిరత్వాన్ని ప్రసాదిస్తుందని, ఆశీర్వదిస్తుందని నమ్మకం. ఇన్వెస్టింగ్ ప్రపంచంలో టీఆర్ఈపీఎస్ (ట్రెజరీ బిల్స్ రీపర్చేజ్ అగ్రిమెంట్స్), ట్రెజరీ బిల్లుల్లాంటివి నగదు తత్సమానమైనవి. ఇవి పోర్ట్ఫోలియోలో అంతర్గతంగా భద్రతా కవచంగా ఉపయోగపడతాయి. మార్కెట్లు ఒడిదుడుకులకు లోనైనప్పుడు స్థిరత్వాన్ని ఇస్తాయి. వివిధ పూజాద్రవ్యాలతో లక్ష్మీ పూజ ఎలాగైతే సంపూర్ణమవుతుందో వివిధ సాధనాలను తగు పాళ్లలో జోడించుకుంటే పోర్ట్ఫోలియో కూడా సంపూర్ణంగా, సమతూకంగా ఉంటుంది. ఈక్విటీ, డెట్, బంగారం, నగదు మేళవింపుగా ఉండే మల్టీ అసెట్ ఫండ్స్ అటువంటి ప్రయోజనాలను ఇన్వెస్టర్లకు కల్పిస్తాయి. -
వ్యాపారం.. వెలగని భూచక్రం
వన్టౌన్ (విజయవాడ పశ్చిమ)/సాక్షి నెట్వర్క్: దీపావళి పర్వదినం సమీపిస్తోంది. ఈ పండుగ పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది టపాసులే. కానీ.. ఈ ఏడాది బాణసంచా మార్కెట్లో పండుగ సందడి అసలు కనిపించడం లేదు. ఏటా ఈ సమయానికి హోల్సేల్ మార్కెట్లో 90 శాతం టపాసులు అమ్ముడయ్యేవి. దీపావళికి మూడు రోజులే సమయం ఉండగా.. కనీసం 25 శాతం బాణసంచా కూడా అమ్ముడుపోలేదని హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. విజయవాడ నగరంలో ఐదుగురు హోల్సేల్ వ్యాపారులు అనేక దశాబ్దాలుగా టపాసుల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. వీరినుంచి 150 మంది రిటైల్ వ్యాపారులు బాణసంచా కొనుగోలు చేస్తారు. వీరంతా వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసి మూడు, నాలుగు రోజులపాటు విక్రయాలు జరుపుతుంటారు. కానీ.. ఈ ఏడాది రిటైలర్లు హోల్సేలర్ల వద్ద బాణసంచా కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు.దీపావళిని కమ్మేసిన వరద, భారీ వర్షాలుసెప్టెంబర్ మొదటి వారంలో ఎన్టీఆర్ జిల్లాను బుడమేరు వరద ముంచెత్తింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి పలు ప్రాంతాల్లో వరద చేరింది. లక్షలాది మంది ముంపునకు గురై ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఇంట్లో రూ.లక్షల మేర నష్టం వాటిల్లింది. బాధితుల్లో అత్యధికులు ప్రభుత్వ సాయం అందక లబోదిబోమంటున్నారు. వరద ప్రభావం బాణాసంచా విక్రయాలపై తీవ్రంగా పడిందని, అందువల్లే హోల్సేల్ వ్యాపారానికి గండిపడిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. నిత్యావసర ధరలు పెరిగిపోవడంతో..భారీగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు ప్రజల ఆర్థిక పరిస్థితులను దిగజార్చాయి. ఈ ప్రభావం బాణాసంచా విక్రయాలపై అధికంగా కనిపిస్తోంది. వంటనూనె, ఇతర నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో వాటిని కొనుగోలు చేసేందుకే ప్రజల దగ్గర డబ్బులు లేవని.. ఈ పరిస్థితుల్లో బాణసంచా కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.సంక్షేమం లేదు.. సంక్షోభమేగత ప్రభుత్వ హయాంలో తల్లికి వందనం, విద్యాదీవెన, వసతి దీవెన, రైతుభరోసా వంటి పథకాల ద్వారా ఎన్నో కుటుంబాలకు సాయం అందేది. కూటమి ప్రభుత్వం రాకతో సంక్షేమ పథకాల సాయం అందటం లేదు. మరోవైపు ఖర్చులు భారీగా పెరిగిపోవడం పండుగపై ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. ఈ పరిస్థితులన్నీ టపాసుల కొనుగోళ్లపై ప్రభావాన్ని చూపుతున్నాయని, ఈ ఏడాది సరైన వ్యాపారమే జరగలేదని హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు. ఏటా దసరా నుంచి మొదలై.. ఈ సమయానికి 90%వ్యాపారం పూర్తయ్యేదని.. ఈ ఏడాది దానికి భిన్నమైన పరిస్థితులు వల్ల 75% అమ్మకాలు తగ్గాయని వ్యాపార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.విక్రయాలు భారీగా తగ్గాయిఈ ఏడాది బాణాసంచా విక్రయాలు భారీగా తగ్గాయి. వర్షాలు, వరదలు దీపావళి సీజన్పై తీవ్ర ప్రభావం చూపాయి. ఏటా దీపావళికి నెల ముందే బాణసంచా తీసుకెళ్లే రిటైల్ వ్యాపారులు ఈ ఏడాది కొనుగోళ్లకు ముందుకు రాలేదు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు కొనుగోలుదారులపై ప్రభావం చూపుతున్నాయి. పండుగకు ముందు జరిగే వ్యాపారంలో 50 శాతం కూడా జరగలేదు. – గర్రె బాబూరావు, బాణసంచా వ్యాపారి, చిలకలూరిపేటఎక్కడా కనిపించట్లేదుఈసారి దీపావళికి టపాసులు పేలేలా కనిపించడం లేదు. టపాసుల విక్రయాలు ఎక్కడా జరగటం లేదు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఏటా ముందుగానే టపాసులు కొనేవారు. ఇటీవల వచ్చిన అకాల వర్షాలు, ధరల పెరుగుదలతో ఆ పరిస్థితి కనిపించడం లేదు. షాపులు నెలకొల్పేందుకు కూడా వ్యాపారులు ముందుకు వస్తున్న పరిస్థితి లేదు. – ఎస్.రాజారావు, బైరివానిపేట, శ్రీకాకుళం జిల్లా -
సువర్ణ వాకిలి
‘చూశావా... ఏం తెచ్చానో’ అన్నాడతను స్కూటర్ ఇంటి ముందు ఆపి. వెనుక ట్రాలీ వచ్చి ఆగింది. అన్నీ మొక్కలే. నర్సరీ నుంచి తాజాగా దిగినవి. ‘అడిగావుగా... మల్లెతీగ తెచ్చాను’... ‘ఇదిగో... నీకు ఇష్టమైన బంతి. కుండీలోనే ఎన్ని పూసేసిందో చూడు’... ‘చిట్టి రోజాలు... రెక్క చామంతులు... ఈ మందారం కొమ్మలేసేంతగా పెరిగితే చాలా బాగుంటుంది’... వరుసగా చూపుతున్నాడు. ఎన్నాళ్లుగానో అడుగుతోంది. ఇవాళ ఉదయాన్నే లేచి, చెప్పా పెట్టకుండా వెళ్లి తెచ్చాడు. సంతోషంగా, సంబరంగా, ప్రేమగా చూస్తోంది వాటన్నింటిని! ‘నన్నూ తీసుకెళ్లుంటే బాగుండేదిగా’... ‘ఇంట్లోకి మొక్కలు వస్తున్నప్పుడు నువ్వు ఎదురు రావాలనీ’... ఆమె చేతిలో చాలా పూలున్న చిన్న కుండీని పెట్టి సెల్ఫీ దిగాడు. ఇద్దరూ హాయిగా నవ్వారు ఫొటోలో. ‘దీని పేరు బెగోనియా అట. బాగుంది కదూ’...మరోచోట మరో ఇంటతను రెండు రోజులుగా ఇల్లు సర్దుతున్నాడు. భార్యను పిలిచి ‘అనవసరమైన సామాను చాలా పేర్చిపెట్టావు చూడు’ అని బుజ్జగించి పారవేయించాడు. మాసిన కర్టెన్లు తీసి, ఉతికిన కర్టెన్లు మార్చాడు. దుమ్ము పట్టిన లైట్లను తుడిచాడు. అన్నీ చక్కగా అమర్చి హాల్లో రెండు ర్యాకులను ఖాళీగా సంపాదించగలిగాడు. ‘ఇప్పుడు ఏం చేద్దామని ఈ ర్యాకులను’ అందామె. ‘చెప్తా’ అని సాయంత్రం పిల్లల్ని తీసుకొని ఆటో ఎక్కి పుస్తకాల షాపుకు చేరాడు. ‘పిల్లలూ... ఒక ర్యాకుకు సరిపడా పుస్తకాలు మీరు కొనుక్కోండి. ఒక ర్యాకుకు సరిపడా మేము కొనుక్కుంటాం’.... పెళ్లికి ముందు వారిద్దరూ పుస్తకాలు చదివేవారు. సంసారంలో పడి వదిలేశారు. ‘ఇష్టమైన అలవాటు. తిరిగి మొదలెడదాం’ అన్నాడు భార్యతో. అప్పటికే ఆమె పుస్తకాలు ఎంచి ఒకవైపు పెట్టేస్తోందిగా!ఇంకో నగరం. ఉదయపు ఎండ ఎక్కువగా లేదు. అలాగని తక్కువగా లేదు. మంచి గాలి వీస్తున్నందు వల్ల బాల్కనీలో ఎదురూ బొదురూ సమయం ఆహ్లాదంగా ఉంది. ‘నీ ఫోను ఇవ్వు’ అన్నాడామెతో భర్త. తీసుకుని స్విగ్గి, జొమాటో లాంటి యాప్స్ డిలీట్ చేశాడు. తన ఫోన్ ఆమెకు ఇచ్చాడు. ‘ఫుడ్ డెలివరీ యాప్స్ తీసెయ్’ అన్నాడు. తీసేసింది. ‘ఇవాళ్టి నుంచి బయటి తిండి వద్దు. ఈ ఇంట్లోకి ఏది వచ్చినా ఇకపై హెల్దీదే వస్తుంది. నేను వారంలో మూడు బ్రేక్ఫాస్ట్లు, కనీసం రెండు డిన్నర్లు నువ్వు కిచెన్ లోకి రానవసరం లేకుండా చేయగలను. మిగిలింది నువ్వు చేయి. అసలు పొయ్యి ఎక్కవలసిన అవసరం లేని మంచి తిండి కూడా పిల్లలతో కూచుని డిజైన్ చేద్దాం. ఫేస్బుక్, యూట్యూబ్లకు వెచ్చించే సమయం మన ఉదరం కోసం వెచ్చిస్తే తెలిసి తెలిసీ ద్రోహం చేసుకోని వాళ్లం అవుతాం. మన తాత ముత్తాతలు వండుకోవడానికి తిండిలేక ఏడ్చేవాళ్లు. మనకు అన్నీ ఉన్నా వండుకోవడానికి ఏడిస్తే ఎలా? పరుగు పెట్టి సంపాదించి పట్టెడు మెతుకులు తినలేని స్థితికి చేరితే సంతోషమా మనకు?’అబ్బో! ఆ ఇంటిలో సందడి వేరేగా ఉంది. కోడలు మాటిమాటికీ ఊరికి ఫోన్లు మాట్లాడుతూ ఉంది. టికెట్ల ఏర్పాటు చూస్తూ ఉంది. అంత వరకూ ఖాళీగా ఉన్న మూడో బెడ్రూమును సిద్ధం చేస్తూ ఉంది. కొడుకు ఉద్వేగంగా ఉన్నాడు. కలా నిజమా తేల్చుకోలేక ఉన్నాడు. సాకులు వెతుక్కున్నారు తనూ తన భార్య. లేనిపోని తప్పులు వెతికారు తనూ తన భార్య. మా జోలికి రావద్దని తేల్చి చెప్పారు ఇద్దరూ కలిసి. బాగానే ఉంది. హాయిగా ఉంది. కాని బాగానే ఉందా... హాయిగా ఉందా... తల్లితండ్రులు అడుగుపెట్టి నాలుగేళ్లు అవుతున్న ఈ ఇల్లు. వారి ఆశీర్వాదం తాకని ఇల్లు. వారి మాటలు వినపడని, వారి గదమాయింపులూ ఆత్మీయ హెచ్చరికలూ లేని ఇల్లు. పశ్చాత్తాపం పిల్లలకు మరో పుట్టుక ఇస్తుంది. ఈ పుట్టుక తల్లితండ్రులను కోరింది. మనవలు వెళ్లి రిసీవ్ చేసుకొని తీసుకువస్తే కొడుకూ కోడల్ని కన్నీటి కళ్లతో చూస్తూ లోపలికి అడుగు పెట్టారు తల్లితండ్రులు. విశేషం చూడండి. ఆ రోజు ‘ధన్ తేరస్’.సాధారణంగా ధన్ తేరస్కి ఇంటికి బంగారం వస్తే మంచిది అనంటారు. కాని పై నాలుగు ఇళ్లలో బంగారం వంటి నిర్ణయాలు జరిగాయి. సిసలైన ‘ధన్ తేరస్’ అదే కావచ్చు.ధనం వల్ల ధన్యత రాదు. ధన్యత నొసగే జీవితం గడపడమే నిజమైన ధనం కలిగి ఉండటం. గాలినిచ్చే మంచి చెట్టు, పుష్టినిచ్చే తాజా ఆహారం, కష్టసుఖాలు పంచుకునే నిజమైన మిత్రులు, బుద్ధీ వికాసాలు కలిగించి ఈర్షా్య వైషమ్యం పోగొట్టే పుస్తకాలు, సదా అమ్మా నాన్నల సాంగత్యం, కుటుంబ సభ్యులంతా కలిసి భోం చేయగల సమయాలు, కనీస వ్యాయామం... ఇవి ఏ ఇంట ప్రతిరోజూ ఉంటాయో, అడుగు పెడతాయో, అంటిపెట్టుకుని ఉన్నాయన్న భరోసా కల్పిస్తాయో ఆ ఇల్లు సదా సమృద్ధితో అలరారుతుంది. అక్కడ అనివార్యంగా సంపద పోగవుతుంది. ఉత్తమమైన లోహం బంగారం. అది ఉత్తమమైన నివాసాన్నే ఎంచుకుంటుంది. శీతగాలులు ముమ్మరమయ్యే ముందు ఉల్లాస, ఉత్సాహాల కోసం దీపావళి. పనికి మనసొప్పని ఈ మందకొడి రోజులలో జీవనోపాధి దొరకకపోతే గనక జరుగుబాటుకు దాచిన ధన్తేరస్ పసిడి. పెద్దలు ఏం చేసినా ఆచితూచి, ఆలోచించి చేస్తారు. ధన్తేరస్కు తప్పక బంగారం, వెండి, వస్తువులు కొనదలుచుకుంటే కొనండి. కాని ప్రతి ఇల్లూ ఒక సువర్ణ వాకిలి కావాలంటే మాత్రం అహం, అసూయ, అజ్ఞానాలను చిమ్మి బయట పారబోయండి! ‘వాడికేం... బంగారంలా బతికాడు’ అంటారు. అలా బతికి అనిపించుకోండి! ధన త్రయోదశి శుభాకాంక్షలు. ప్రతి ఇంటా వికసిత కాంతులు కురియుగాక! -
దివాళీ బాష్లో మెరిసిన బాలీవుడ్ సినీతారలు.. ఫోటోలు
-
క్రెడిట్ కార్డులపై దీపావళి ఆఫర్లు
దేశీయ కన్స్యూమర్ క్రెడిట్ మార్కెట్ప్లేస్ పైసాబజార్ పలు క్రెడిట్ కార్డ్లపై ప్రత్యేక పండుగ ఆఫర్లను వెల్లడించింది. పైసాబజార్ ద్వారా కొత్త క్రెడిట్ కార్డ్లను తీసుకునేవారికి గిఫ్ట్ కార్డ్లను అందిస్తోంది.నిర్దిష్ట అమెరికన్ ఎక్స్ప్రెస్, హెచ్ఎస్బీసీ కార్డ్ల కోసం దరఖాస్తు చేసుకున్న కస్టమర్లు రూ.1,500 విలువైన అమెజాన్ గిఫ్ట్ కార్డ్ని అందుకుంటారు. హచ్ఎస్బీసీ వీసా ప్లాటినం క్రెడిట్ కార్డ్, అమెరికన్ ఎక్స్ప్రెస్ ప్లాటినం ట్రావెల్ క్రెడిట్ కార్డ్, అమెరికన్ ఎక్స్ప్రెస్ మెంబర్షిప్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్, హెచ్ఎస్బీసీ లైవ్+ క్రెడిట్ కార్డ్ వంటివి వాటిలో ఉన్నాయి.హెచ్డీఎఫ్సీ బిజినెస్ రెగాలియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డైనర్స్ క్లబ్ బ్లాక్ మెటల్ ఎడిషన్ క్రెడిట్ కార్డ్, మర్రియోట్ బన్వాయ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, హెచ్డీఎఫ్సీ రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డ్, అట్లాస్ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డ్ వంటివాటిపై పైసాబజార్ అదనంగా రూ. 1,000 అమెజాన్ గిఫ్ట్ కార్డ్ను అందిస్తోంది.అమెజాన్లో వివిధ రకాల కొనుగోళ్ల కోసం ఉపయోగించగల ఈ వోచర్లను క్రెడిట్ కార్డ్లు యాక్టివేట్ అయినప్పుడు అందుకోవచ్చు.పైసాబజార్ ప్రకారం.. ఈ ఆఫర్లు పండుగ సీజన్లో కొద్దికాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి. పైసాబజార్ ప్రస్తుతం పదికిపైగా బ్యాంకులతో భాగస్వామ్యం ద్వారా 60కిపైగా క్రెడిట్ కార్డులను అందిస్తోంది. -
దీపావళి టపాసులు.. వివిధ రాష్ట్రాల నిబంధనలివే..
న్యూఢిల్లీ: చలికాలం సమీపిస్తున్న కొద్దీ దేశంలోని పలు నగరాల్లో గాలి విషపూరితంగా మారుతుంటుంది. ఇదే కాకుండా దీపావళి సందర్భంగా పటాకులు కాల్చినప్పుడు వాయు కాలుష్యం మరింత విజృంభిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వివిధ రాష్ట్రాలు పటాకులు కాల్పడంపై నిషేధం విధించాయి. మరికొన్ని రాష్ట్రాల్లో కేవలం రెండు గంటలపాటు మాత్రమే టపాసులు వెలిగించేందుకు అనుమతినిచ్చారు.ఢిల్లీఢిల్లీ- ఎన్సీఆర్లలో అక్టోబరు 31న అంటే దీపావళి నాడు సాయంత్రం 8 నుంచి 10 గంటల మధ్యలో మాత్రమే గ్రీన్ టపాసులు కాల్చుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.మహారాష్ట్రమహారాష్ట్ర నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సూచనల మేరకు మహారాష్ట్రలో బాణసంచా కాల్చడాన్ని నిషేధించారు. అయితే గ్రీన్ క్రాకర్స్ కాల్చడానికి మాత్రమే అనుమతి ఉంది. గ్రీన్ క్రాకర్స్ సాధారణ క్రాకర్స్ కంటే 30శాతం తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసేలా తయారు చేస్తారు.పశ్చిమ బెంగాల్పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో దీపావళి సందర్భంగా కాలుష్యం గణనీయంగా పెరుగుతుంది. ఈ కారణంగా గత కొన్నేళ్లుగా ఇక్కడ సాధారణ పటాకులు పేల్చేందుకు అనుమతి ఇవ్వడం లేదు. అయితే కోల్కతాలో గ్రీన్ క్రాకర్లు కాల్చవచ్చు. కోల్కతాలో రాత్రి 8 నుండి 10 గంటల వరకు గ్రీన్ క్రాకర్స్ కాల్చడానికి అనుమతి ఉంది.పంజాబ్పంజాబ్లో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు మాత్రమే అనుమతి ఉంది. పంజాబ్లో దీపావళి రోజున (అక్టోబర్ 31) ఉదయం 4 నుండి 5 గంటల వరకు, రాత్రి 9 నుండి 10 గంటల వరకు టపాసులు కాల్చేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.బీహార్ పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలోని నాలుగు నగరాల్లో బాణాసంచా కాల్చడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. రాజధాని పాట్నా, ముజఫర్పూర్, హాజీపూర్, గయలో ఈ ఏడాది బాణాసంచా కాల్చడానికి అనుమతి లేదు. ఈ నగరాల్లో పటాకుల అమ్మకానికి లైసెన్స్ కూడా ఇవ్వలేదు. ఎవరైనా రహస్యంగా పటాకులు విక్రయిస్తున్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.హర్యానాదీపావళి నాడు హర్యానాలో గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలంటూ ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయి. దీపావళి నాడు రాత్రి 8 నుండి 10 గంటల వరకు, క్రిస్మస్ రోజున 11.55 నుండి 12.30 గంటల వరకు గ్రీన్ క్రాకర్లు కాల్చేందుకు అనుమతినిచ్చారు.తమిళనాడుతమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి దీపావళి రోజున పటాకులు కాల్చేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. తమిళనాడులో దీపావళి రోజున ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు పటాకులు కాల్చేందుకు ప్రభుత్వం సమయం నిర్ణయించింది.ఇది కూడా చదవండి: ఈసారి 33 విమానాలకు బెదిరింపులు -
అక్కడ కనిపించని దీపావళి వేడుకలు.. కారణమిదే..
దీపావళి వేడుకలను భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గురువారం(అక్టోబర్ 31) ఘనంగా చేసుకోనున్నారు. దీపావళి కోసం షాపింగ్ చేయడంతో సహా అన్ని సన్నాహాలు చాలా ముందుగానే ప్రారంభిస్తారు.దీపావళినాడు లక్ష్మీ దేవిని, గణేశుడిని పూజిస్తారు. అయితే మన దేశంలో దీపావళి జరుపుకోని కొన్ని ప్రదేశాలు ఉన్నాయని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఆ ప్రదేశాలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి పండుగను దక్షిణ రాష్ట్రమైన కేరళలో జరుపుకోరు. కేరళలో కొచ్చిలో మాత్రమే దీపావళి జరుపుకుంటారు. కేరళలో దీపావళి జరుపుకోకపోవడానికి అనేక కారణాలున్నాయి.మహాబలి అనే రాక్షసుడు కేరళను పరిపాలించేవాడు. అతన్ని ఇక్కడి ప్రజలు పూజిస్తారు. దీపావళి ఒక రాక్షసుని ఓటమిని గుర్తు చేస్తూ చేసుకునే పండుగ కావడంతో దీనిని ఇక్కడి ప్రజలు జరుపుకోరు. రాముడు రావణుడిని ఓడించి, అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని దీపావళి చేసుకుంటారనే సంగతి అందరికీ తెలిసిందే. కేరళలో దీపావళి జరుపుకోకపోవడానికి రెండవ కారణం అక్కడ హిందువుల సంఖ్య తక్కువగా ఉండటం. అందుకే రాష్ట్రంలో దీపావళి సందడి కనిపించదు. కేరళతో పాటు తమిళనాడులో కూడా దీపావళి జరుపుకోరు. అక్కడ ప్రజలు నరక చతుర్దర్శిని వేడుకగా జరుపుకుంటారు. ఇది కూడా చదవండి: ‘మా సోషల్ మీడియాను రంగంలోకి దింపుతాం’ -
బంగారంపై పండుగ ఆఫర్లు
బంగారం అంటే అందరికీ మక్కువే ముఖ్యంగా మహిళలు అమితంగా ఇష్టపడతారు. అయితే ప్రస్తుతం పసిడి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అయినా పండుగ వేళ రవ్వంత బంగారమైనా కొనుగోలుచేయాలని ఆశపడతారు. ఈ నేపథ్యంలో దీపావళి, ధన త్రయోదశి సందర్భంగా వివిధ జువెలరీ సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి.జోస్ ఆలుక్కాస్ ‘ఆహా దీపావళి’ ఆఫర్లు హైదరాబాద్: దీపావళి సందర్భంగా జోస్ ఆలుక్కాస్ ‘ఆహా దీపావళి’ పేరుతో ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లు రూ.60 వేల కొనుగోలుపై బంగారు ఆభరణాలకు ఉచితంగా వెండి, వజ్రాల కొనుగోలుపై ఒక బంగారు నాణేన్ని ఉచితంగా పొందవచ్చు. వజ్రాలపై 20% తగ్గింపు, ప్లాటినం ఆభరణాలపై 7% తగ్గింపు అందిస్తుంది. పాత బంగారాన్ని హెచ్యూఐడీ హాల్మార్క్ బంగారు ఆభరణాలతో మార్పిడి చేసుకునే సదుపాయం ఉంది.దీపావళి బహుమతిగా ఒక కారు ఈ ఆఫర్లో భాగంగా ఉంటుంది. ధన త్రయోదశి కోసం ముందస్తు బుకింగ్లు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని ‘ఆహా దీపావళి’ ఆఫర్లను ప్రజలంతా వినియోగించుకోవాలని కంపెనీ చైర్మన్ జోస్ ఆలుక్కా కోరారు.తనిష్క్ పండుగ ఆఫర్లు ముంబై: ఆభరణాల సంస్థ తనిష్క్ పండుగ సందర్భంగా అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లు బంగారు ఆభరణాలు, వజ్రాభరణాల తయారీ చార్జీలపై 20% వరకు తగ్గింపు పొందవచ్చు. పాత బంగారు విలువకు సమానమైన బంగారు ఆభరణాలకు ఎలాంటి చెల్లింపు లేకుండా ఉచితంగా పొందవచ్చు. ఈ నవంబర్ 3 వరకు ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. మరిన్ని ఆఫర్ల కోసం తనిష్క్ షోరూం లేదా, అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
జియో దీపావళి ఆఫర్స్: రూ.3,350 విలువైన బెనిఫిట్స్
ప్రముఖ టెలికామ్ దిగ్గజం రిలయన్స్ జియో 'దీపావళి ధమాకా' పేరుతో కొత్త ఆఫర్స్ ప్రకటించింది. దీపావళి పండుగ సందర్భంగా కంపెనీ ఈ వినియోగదారుల కోసం ఈ ఆఫర్స్ తీసుకువచ్చింది. వీటి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..రిలయన్స్ జియో ప్రకటించిన ఈ ఆఫర్స్ ద్వారా సుమారు రూ. 3,350 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. నవంబర్ 5లోపు రీఛార్జ్ చేసుకున్నవారికి మాత్రమే ఈ బెనిఫీట్స్ లభిస్తాయి. రిలయన్స్ జియో దీపావళి ధమాకా ఆఫర్లో భాగంగా రూ.899 రీఛార్జ్ ప్లాన్ మీద, రూ. 3,599 రీఛార్జ్ ప్లాన్ మీద అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.రూ.899 రీఛార్జ్ ప్లాన్ ద్వారా యూజర్స్ 90 రోజుల వరకు అన్లిమిటెడ్ 5జీ సేవలను పొందవచ్చు. అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. అదనంగా 20 జీబీ డేటా కూడా లభిస్తుంది. రూ. 3,599 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ (365 రోజులు) ద్వారా రోజుకు 2.5 జీబీ డేటాను పొందవచ్చు.ప్రయోజనాలుఈజీ మై ట్రిప్ వోచర్: రిలయన్స్ జియో దీపావళి ధమాకా ఆఫర్స్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే.. రూ. 3,000 విలువైన ఈజీ మై ట్రిప్ వోచర్ పొందవచ్చు. దీనిని విమాన ప్రయాణాలను, హోటల్ బుకింగ్స్ వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు.అజియో కూపన్: రూ. 999 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్ళపైన రూ. 200 అజియో డిస్కౌంట్ లభిస్తుంది.స్విగ్గీ వోచర్: ఫుడ్ డెలివరీ కోసం రూ. 150 విలువైన స్విగ్గీ వోచర్ లభిస్తుంది.ఇదీ చదవండి: యూట్యూబ్ కొత్త ఫీచర్: మరింత ఆదాయానికి సులువైన మార్గంకూపన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే..రిలయన్స్ జియా దీపావళి ధమాకా ఆఫర్స్ ద్వారా పొందిన కూపన్లను మై జియో యాప్ సాయంతో క్లెయిమ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.➜మై జియో యాప్ ఓపెన్ చేసి ఆఫర్స్ విభాగంలోకి వెళ్ళాలి➜అక్కడ కనిపించే మై విన్నింగ్స్ మీద క్లిక్ చేసి కూపన్ ఎంచుకోవాలి➜కూపన్ కోడ్ కాపీ చేసి.. ఎక్కడ ఉపయోగించాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్కు వెళ్లి కూపన్ కోడ్ అప్లై చేసుకోవచ్చు. -
స్వీట్ క్రాకర్స్.. మతాబుల రూపాల్లో చాక్లెట్ల తయారీ
ఈ ఫొటోలో ఉన్నవి ఏంటో చెప్పండి చూద్దాం.. చాలా కాన్ఫిడెంట్గా టపాసులు అనుకుంటున్నారు కదా! అయితే మీరు..తప్పులో కాలేసినట్లే..! అవి టపాసుల్లాంటి టపాసులు..కానీ టపాసులు కాదు.. ఎందుకంటే ఈ పటాసులతో పర్యావరణానికి ఎలాంటి హానీ ఉండదు.. పొగ రాదు. నిప్పు రవ్వలు అసలే ఎగసి పడవు. మరి అవన్నీ రాకపోతే అవి పటాసులు ఎందుకు అవుతాయి? అని ఆశ్చర్యపోతున్నారా.. అవును అక్కడికే వస్తున్నాం.. మీకొచ్చిన డౌటనుమానం కరెక్టే. ఎందుకంటే అవి నిజమైన టపాసులు కావు. అవి చాక్లెట్స్.. అరరే.. చూస్తే టపాసుల్లా భలే ముద్దుగా ఉన్నాయే అనుకుంటున్నారా..? స్వీట్స్ను టపాసుల్లాగా చేయాలన్న ఆలోచనతో ఇలా వినూత్నంగా ఇద్దరు అక్కాచెల్లెళ్లు వీటిని తయారు చేస్తున్నారు. దీపావళి సంబరాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. స్వీట్లు, టపాసులతో దుకాణాలు కళకళలాడుతున్నాయి. స్నేహితులు, బంధువులకు స్వీట్లు పంచుకుంటూ దీపావళి శుభాకాంక్షలు చెప్పుకొంటుంటారు. టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకుంటారు. అయితే ఈ రెండింటినీ మిళితం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు గజ్జల హరితారెడ్డి, లిఖితారెడ్డి. ఇద్దరు అక్కా చెల్లెళ్లూ అనుకున్నదే తడవుగా ఇలా టపాసులను తయారు చేశారు. అదేనండీ టపాసుల్లాంటి చాక్లెట్లు.కాస్త భిన్నంగా ఉండాలని.. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్న వీరిద్దరూ ప్రిపరేషన్ సమయంలో వచ్చే ఒత్తిడిని తట్టుకునేందుకు ఇలా ఇంట్లోనే చాక్లెట్లు తయారుచేయడం అలవాటుగా మార్చుకున్నారు. అలా అలా.. వీరు చేస్తున్న చాక్లెట్లు, కుకీలకు మంచి ప్రశంసలు వస్తుండటంతో డీమెల్ట్ పేరుతో చిన్నపాటి క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేసి నడిపిస్తున్నారు. దీపావళికి ఏదైనా వినూత్నంగా తయారుచేయాలని ఆలోచించగా.. ఈ ఐడియా వచి్చందని, ఈ స్వీట్స్ చూసి ముందు టపాసులు అనుకుంటున్నారని, అసలు విషయం తెలిసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారని హరితారెడ్డి సంతోషం వ్యక్తం చేస్తోంది. -
దీపావళి ఆఫర్: కొత్త కారు కొనడానికే ఇదే మంచి సమయం!
అసలే పండుగ సీజన్.. కొత్త కారు కొనాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు దిగ్గజ కంపెనీలు సైతం భారీ డిస్కౌంట్స్ ప్రకటించాయి. ఇందులో బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి లగ్జరీ కంపెనీలు ఉన్నాయి. ఒక్కో కంపెనీ ఎంపిక చేసిన కొన్ని మోడల్స్ రూ.10 లక్షల వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నాయి.కార్లు, వాటిపై లభించే డిస్కౌంట్స్ఆడి క్యూ3: రూ. 5 లక్షలుమెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ: రూ. 5 లక్షలుఆడి క్యూ5: రూ. 5.5 లక్షలుబీఎండబ్ల్యూ ఐ4: రూ. 8 లక్షలుమెర్సిడెస్ బెంజ్ సీ200: రూ. 9 లక్షలుఆడి క్యూ8 ఈ ట్రాన్: రూ. 10 లక్షలుఆడి ఏ6: రూ. 10 లక్షలుబీఎండబ్ల్యూ ఎక్స్5: రూ. 10 లక్షలుకియా ఈవీ6 ఆల్ వీల్ డ్రైవ్: రూ. 12 లక్షలుకార్లపైన కంపెనీలు ఇస్తున్న ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ తగ్గింపులు ఎంచుకునే మోడల్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్లను పొందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితమైన తగ్గింపులను గురించి తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్.. రూ. 358 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి బోనస్ను ప్రకటించింది. దీపావళి బోనస్ కానుకగా రూ. 358 కోట్లు విడుదల చేసింది. గతేడాది కన్నా ఇది రూ.50 కోట్లు అధికం. ఒక్కో కార్మికునికి రూ. 93,750 జమకానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నాటికి కార్మికుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ కానున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. -
ఈ ఐదు నగరాల్లో.. మిన్నంటే దీపావళి సంబరాలు
న్యూఢిల్లీ: దీపావళిని 'దీపాల పండుగ' అని కూడా అంటారు. దీపావళి నాడు దేశంలోని ప్రతి ఇంటా దీపాలు వెలిగిస్తారు. బాణసంచా కాలుస్తారు. ఇరుగుపొరుగువారికి స్వీట్లు పంచుతారు. దీపావళిని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నప్పటికీ, కొన్ని నగరాల్లో జరిగే దీపావళి వేడుకలు ప్రత్యేకంగా నిలుస్తాయి. అటువంటి ఐదు నగరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అయోధ్య (ఉత్తరప్రదేశ్)శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య దీపావళి ప్రత్యేక వేడుకలకు కేంద్రంగా మారింది. ఇక్కడ దీపోత్సవ్ పేరుతో దీపావళిని జరుపుకుంటారు. సరయూ నది ఒడ్డున లక్షలాది దీపాలు వెలిగిస్తారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.ప్రేక్షకులను ఇవి మంత్ర ముగ్ధులను చేస్తాయి.వారణాసి (ఉత్తరప్రదేశ్)వారణాసిలో దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. లక్షల దీపాలతో అలంకృతమైన గంగా ఘాట్లపై హారతి నిర్వహిస్తారు. వారణాసిలోని అన్ని ఘాట్లు, దేవాలయాలు కాంతులతో నిండిపోతాయి. బాణాసంచా వెలుగులు అందరినీ అలరింపజేస్తాయి.కోల్కతా (పశ్చిమ బెంగాల్)కోల్కతాలో దీపావళితో పాటు కాళీ పూజలను కూడా నిర్వహిస్తారు. కాళీ పూజల కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ పందిళ్లను వేస్తారు. వీధులు, ఇళ్లు, దేవాలయాలను దీపాలతో అలంకరిస్తారు. కోల్కతాలో జరిగే దీపావళి వేడుకల్లో ఆధ్యాత్మికత కూడా కనిపిస్తుంది.గోవాగోవాలో దీపావళిని ప్రత్యేక శైలిలో జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని పురస్కరించుకుని నరకాసురుని దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఇందు కోసం ముందుగా భారీ దిష్టిబొమ్మలను తయారు చేస్తారు. వీటిని దీపావళి రాత్రి వేళ దహనం చేస్తారు. వివిధ ప్రాంతాల్లో సాంప్రదాయ సంగీతం, నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. బాణసంచా వెలిగిస్తారు.ముంబై (మహారాష్ట్ర)ముంబైలో దీపావళి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా మెరైన్ డ్రైవ్లో దీపాల వెలుగులు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆకాశంలోకి పేలుతున్న పటాకులు చూపరుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ముంబైలో ఆధునిక జీవనశైలికి అనుగుణంగా దీపావళి వేడుకలు జరగడం విశేషం. ఇది కూడా చదవండి: త్వరలో రూ.లక్షకు.. ఎవరెస్ట్ ఎక్కేసిన బంగారం! -
దీపావళి.. ఏ రాష్ట్రంలో ఎప్పుడు సెలవు?
న్యూఢిల్లీ: ప్రతి సంవత్సరం దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ చీకటి నుండి వెలుగులోకి మారే పయనాన్ని సూచిస్తుంది. దీపావళి సందర్భంగా, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ సెలవులు ప్రకటించారు. అయితే ఈసారి దీపావళిని అక్టోబర్ 31న లేక నవంబర్ 1 న జరుపుకోవాలా అనే గందరగోళం చాలామందిలో నెలకొంది. మరి.. ఈసారి దీపావళికి ఏ రాష్ట్రంలో ఎప్పుడు సెలవు ప్రకటించారో తెలుసుకుందాం.యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో దీపావళికి అక్టోబర్ 31 న సెలవు ఇచ్చారు. నవంబర్ 2 న గోవర్ధన పూజకు సెలవు ఉంటుంది. నవంబర్ 3 న భాయ్ దూజ్ పండుగను జరుపుకుంటారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో ఈ రోజుల్లో మాత్రమే సెలవు దినంగా ప్రకటించారు. అయితే నవంబర్ ఒకటి గురించి స్పష్టంగా తెలియజేయలేదు. మహారాష్ట్రలో సాధారణంగా దీపావళికి రెండు రోజులు సెలవులు ఉంటాయి. నవంబర్ 1, 2 తేదీలలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు దీపావళి సెలవు ప్రకటించారు. దీపావళికి ముందు, తరువాత పాఠశాలలకు ఏడు నుండి 10 రోజుల వరకూ సెలవులు ఉండవచ్చు. నవంబర్ 1న ఢిల్లీలో దీపావళి సెలవు ఉంటుంది. అయితే కుటుంబ సమేతంగా ఈ పండుగను జరుపుకునేందుకు వీలుగా అక్టోబర్ 31 నుంచి నవంబర్ 3 వరకు పాఠశాలకు సెలవు ప్రకటించారు.తమిళనాడులో ఈసారి దీపావళి అక్టోబర్ 31, నవంబర్ ఒకటి తేదీల్లో రెండు రోజుల సెలవు ప్రకటించారు. గుజరాత్లో దీపావళితో పాటు నూతన సంవత్సరాన్ని కూడా జరుపుకుంటారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు దీపావళి సందర్భంగా ఇక్కడ మూడు రోజుల సెలవు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లో కాళీ పూజ, దీపావళిని కలిసి జరుపుకుంటారు. నవంబర్ 1, 2 తేదీలలో ఇక్కడ దీపావళి సెలవు ఉంటుంది. కాళీ పూజ సందర్భంగా అక్టోబర్ 31న కూడా సెలవు ప్రకటించారు.దీపావళి సందర్భంగా మధ్యప్రదేశ్లో రెండు రోజులు సెలవులు ఇచ్చారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు నవంబర్ 1, 2 తేదీలలో మూసివేయనున్నారు. బీహార్లో ఈసారి దీపావళికి రెండు రోజులు సెలవులు ఉంటాయి. నవంబర్ 1, నవంబర్ 2 న ఇక్కడ సెలవు ఉంటుంది. దీనితో పాటు ఛత్ పూజకు సెలవులను కూడా పొడిగించవచ్చు. రాజస్థాన్లో ఈ ఏడాది దీపావళికి మూడు రోజుల సెలవులు ఉంటాయి. అక్టోబర్ 31 నుండి నవంబర్ 2 వరకు ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయనున్నారు.కర్ణాటకలో దీపావళికి రెండు రోజులు సెలవులు ఉంటాయి. నవంబర్ 1, 2 తేదీలలో ప్రజలు ఈ పండుగను సాంప్రదాయ రీతిలో జరుపుకుంటారు. కేరళలో దీపావళికి నవంబర్ 1న సెలవు ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం, ఒడిశా తదితర రాష్ట్రాల్లో దీపావళి సందర్భంగా రెండు రోజులు సెలవులు ప్రకటించారు.ఇది కూడా చదవండి: బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో కిషన్రెడ్డి? -
జొమాటో కస్టమర్లకు భారీ షాక్!
బెంగళూరు : ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఫుడ్ డెలివరీపై ప్లాట్ఫామ్ ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇకపై ప్రతి ఆర్డర్పై రూ.10 చొప్పున వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఇంతకుముందు ఈ ప్లాట్ఫామ్ ఫీజు రూ.7 ఉండగా ఇప్పుడు దాన్ని పది రూపాయలకు పెంచింది. దేశంలో కొనసాగుతున్న పండుగ సీజన్ సందర్భంగా కస్టమర్లకు తమసర్వీసుల్ని విజయవంతంగా అందించేందుకు వీలుగా ప్లాట్ఫామ్ ఫీజును పెంచినట్లు యాప్లో పేర్కొంది. కాగా, జొమాటో కంపెనీ 2023 ఆగస్టులో తొలిసారి ప్లాట్ఫామ్ ఫీజును తీసుకొచ్చింది. మొదటి ఆర్డర్కు రూ.2 చొప్పున వసూలు చేసింది. ఆ తర్వాత జొమాటో క్రమంగా దాన్ని పెంచుతూ వచ్చింది. తాజాగా ఈ ఫీజును రూ.10కు తీసుకొచ్చింది. -
దివాలీ వైబ్స్: నటి జెనీలియా స్పెషల్ లుక్
-
ఆ రాష్ట్రంలో దీపావళికి ఐదు రోజులు సెలవు
జమ్ము: ఈనెల 31న దీపావళి పండుగను వేడుకగా జరుపుకునేందుకు దేశమంతా సిద్ధమైంది. ఈ నేపధ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు దీపావళి సెలవులను ప్రకటించాయి. తాజాగా జమ్ము పాఠశాల విద్యా డైరెక్టర్ దీపావళి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటించించారు.దీపావళి సందర్భంగా అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబర్ 29 నుండి నవంబర్ 2 వరకూ సెలవులను ప్రకటించారు. నవంబర్ 3 ఆదివారం కావడంతో ఆ రోజు కూడా సెలవు ఉంటుంది. నవంబర్ 4న విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. దీనికి సంబంధించి జిల్లా మేజిస్ట్రేట్ తన అధికారిక వెబ్సైట్లో నోటీసు జారీ చేశారు.దీపావళికి ఆదివారంతో కలుపుకుని ఆరు రోజుల పాటు సెలవు రావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు నవంబర్ ఒకటిన కూడా సెలవు ప్రకటించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తిరిగి తమ స్వస్థలానికి వచ్చేందుకు వీలుగా నవంబర్ ఒకటిన సెలవు ప్రకటించారు.ఇది కూడా చదవండి: ఐదుపదుల వయసులోనూ స్లిమ్గా మలైకా..శరీరాకృతి కోసం..! -
‘జామియా’లో దీపావళి ఉద్రిక్తత
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. దీపావళి వేడుకల సందర్భంగా రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం యూనివర్శిటీకి చెందిన కొందరు హిందూ విద్యార్థులు దీపావళి వేడుకలకు ముందుగా దీపాలు వెలిగించారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన మరోవర్గానికి చెందినవారు నిరసనకు దిగారు. అనంతరం ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.ఈ నేపధ్యంలో యూనివర్సిటీ క్యాంపస్లో పోలీసు భద్రతను మరింతగా పెంచారు. జామియా యూనివర్సిటీలో దీపావళి వేడుకల సందర్భంగా వెలిగించిన దీపాలను పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యూనివర్శిటీలో మతపరమైన నినాదాలు వినిపించినట్లు పోలీసులు తెలిపారు. BIG BREAKING NEWS 🚨 Clash breaks out at Jamia Millia Islamia University during Diwali celebrations of Hindus.Conflict began when some individuals allegedly tried to erase off Rangoli with their feet & extinguish Diyas.Viral Video claims some students were raising… pic.twitter.com/Kg4tf9eA2k— Times Algebra (@TimesAlgebraIND) October 22, 2024ఇది కూడా చదవండి: కొనసాగుతున్న బాంబు బెదిరింపులు -
‘టీచ్ ఫర్ చేంజ్’ విద్యార్థులతో మంచు లక్ష్మి దీపావళి సంబరాలు (ఫొటోలు)
-
అదిరిపోయే దీపావళి గిఫ్ట్: ఆనందంలో ఉద్యోగులు
దసరా, దీపావళి వస్తున్నాయంటే.. ఉద్యోగులకు సంబరపడిపోతుంటారు. ఎందుకంటే తాము పనిచేస్తున్న కంపెనీలు బోనస్లు లేదా గిఫ్ట్స్ వంటివి ఇస్తాయని. కొన్ని కంపెనీలు బోనస్ ఇచ్చి సరిపెట్టుకుంటే.. మరికొన్ని కంపెనీలు ఏకంగా ఊహకందని గిఫ్ట్స్ ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.ఇటీవల హర్యానాలోని పంచకులలోని ఫార్మాస్యూటికల్ కంపెనీ 15 మంది ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచింది. పంచకుల పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న మిట్స్కైండ్ హెల్త్కేర్ సంస్థలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందికి 13 టాటా పంచ్ వాహనాలు, రెండు మారుతి గ్రాండ్ విటారా కార్లను గిఫ్ట్ ఇచ్చింది.కంపెనీ యజమాని ఎంకే భాటియా స్వయంగా కార్ల తాళాలు ఉద్యోగులకు అందజేశారు. ఉద్యోగులు ఎంతో అంకితభావంతో పని చేశారని కొనియాడారు. ఉత్తమ పనితీరు కనపరిచిన అందరూ నాకు సెలబ్రిటీల వంటివారని, కంపెనీ విజయానికి వారి సహకారం చాలా ప్రశంసనీయమని భాటియా అన్నారు.ఇదీ చదవండి: ఆ కంపెనీలో జాబ్ ఆఫర్ వదులుకున్న రతన్ టాటాఎంకే భాటియా తన ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం కూడా 12 మంది ఉద్యోగులకు కారును గిఫ్ట్ ఇచ్చారు. ఈ ఏటా 15 మందికి కార్లను బహూకరించారు. ఇప్పటికి కంపెనీ మొత్తం 27 కార్లను ఉద్యోగులకు అందించింది. ఈ పద్దతిని మిట్స్కైండ్ హెల్త్కేర్ భవిష్యత్తులో కొనసాగించాలని యోచిస్తోంది. -
పొట్టిగా ఉండే అమ్మాయిలు స్కర్ట్స్ వేసుకోవద్దా? ఇవిగో ట్రిక్స్ అండ్ టిప్స్
వినాయక చవితి, దసరా, బతుకమ్మ సంబరాలు ముగిసాయి. ఇక దీపావళి సందడి షురూ కానుంది. ఏ పండగఅయినా భక్తి, ముక్తితోపాటు కొత్తబట్టలు, అందంగా ముస్తాబు కావడం ఈ హడావిడి ఉండనే ఉంటుంది. ముఖ్యంగా వెలుగుల పండుగ దీపావళికి ఆరడుగల అందగాళ్లు, చందమామ లాంటి ముద్దుగుమ్మలు ట్రెండీగా, ఫ్యాషన్గా మెరిసిపోవాలని ఆరాటపడతారు. ఆరడుగులు అంటే గుర్తొచ్చింది.. పొట్టిగా ఉన్నామని..లావుగా ఉన్నామని తమకు ఏ డ్రెస్ సూట్ కాదు అని చాలామంది అమ్మాయిలు దిగులు పడుతూ ఉంటారు. పొట్టిగా ఉండటం మన తప్పు కాదు. కానీ మన శరీరారినిక తగ్గట్టు దుస్తులను ఎంచుకుంటే స్పెషల్ బ్యూటీగా మెరిసిపోవడం ఖాయం. అదెలాగో చూసేద్దామా! ఫ్యాషన్ ట్రిక్స్పొడవుగా మారడానికి మ్యాజిక్ సొల్యూషన్ ఏమీ లేదు, కానీ పొడుగ్గా కనిపించేలా కొన్ని ఫ్యాషన్ ట్రిక్స్ ఉన్నాయి. ఫ్యాషన్కి స్లైల్కి ఖచ్చితమైన నియమాలేవీ లేవు. శరీర రంగును బట్టి, బాడీకి తగ్గట్టుగా కలర్ను ఎంచుకుంటే చాలు. చక్కని ఫిట్టింగ్, డ్రెస్సింగ్ స్టైల్లో ఒక చిన్న మార్పు ఎలిగెంట్ లుక్ను ఇస్తుంది.జీన్స్, టీషర్ట్ ఎలాంటి వారికైనా ఇట్టే నప్పుతాయి. మ్యాచింగ్ కలర్స్ చాలా ముఖ్యం. మాక్సీ స్కర్ట్స్ లేదా డ్రెస్లు పొడవాటి అమ్మాయిలకు మాత్రమే బాగుంటాయి అనే అపోహను నమ్మవద్దు. మల్టిపుల్ లేయర్డ్ స్కర్ట్స్ కాకుండా మంచి కట్ స్కర్టులు ఎంచుకోండి. పొడవు స్కర్ అయితే టక్-ఇన్ టీ-షర్టుతో, కట్ జాకెట్తో ,హై హీల్డ్ షూ వేసుకుంటే లుక్ అదిరిపోతుంది.నిలువుగీతలు ఉన్న డ్రెస్లు పొడవుగా కనిపించేలా చేస్తాయి.కుర్తా లేదా చీర ధరించినపుడు సౌకర్యవంతమైన హైహీల్స్ వాడండి. అంతేకాదు డ్రెస్కు తగ్గట్టు , స్టైలింగ్ టిప్స్ పాటించాలి. ఉదాహరణకు క్లచ్లు, క్రాస్ బాడీ పర్సులు , చిన్న బ్యాగ్లు బెస్ట్ ఆప్షన్. మరీ పెద్దబ్యాగుల జోలికి అస్సలు వెళ్లవద్దుకుర్తీలకు, లేదా చీరల బ్లౌజ్లకు హైనెక్, రౌండ్ నెక్ కాకుండా, వీ నెక్, డీప్ నెక్, డీప్ రౌండ్ నెక్ లాంటివి ఎంచుకోండి. వర్టికల్ అప్పీల్కోసం ప్లంగింగ్ v-నెక్లైన్ టాప్లను ధరించండి. దీంతో పొడవుగా కనిపించడమే కాదు, సన్నగా కూడా కనిపిస్తారు.చిన్న ప్రింట్లు, సింపుల్ ఎంబ్రాయిడరీ ఔట్ ఫిట్ చూడడానికి బావుంటాయి. భారీ ఎంబ్రాయిడరీ, చీర పెద్ద పెద్ద అంచులున్న చీరలు అన్ని అకేషన్స్కు నప్పవు.ఎథ్నిక్ వేర్ కోసం పొడవాటి జాకెట్ స్టైల్ లెహెంగా లేదా సల్వార్ సూట్లకు దూరంగా ఉండండి. ఇదీ చదవండి : ఉద్యోగులకు దీపావళి కానుకగా ఏకంగా బెంజ్కార్లు, అంతేనా?! -
రూ.9 చెల్లిస్తే.. రూ.25000 ప్రయోజనం: ఫోన్పేలో కొత్త ప్లాన్
దీపావళి సమీపిస్తోంది. ఈ పండుగ ఎంత సంతోషాన్ని ఇస్తుందో, ఆదమరిస్తో అంత విషాదాన్ని నింపేస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మొబైల్ పేమెంట్స్ యాప్ 'ఫోన్పే' బాణసంచా సంబంధిత ప్రమాదాలు జరిగినప్పుడు ఉపశమనం కల్పించడానికి ఫైర్క్రాకర్ బీమా ప్లాన్ తీసుకువచ్చింది.ఫోన్పే పరిచయం చేసిన ఈ కొత్త ఫైర్క్రాకర్ బీమా ప్లాన్ కేవలం తొమ్మిది రూపాయలకే అందుబాటులో ఉంది. దీని ద్వారా 10 రోజుల పాటు రూ. 25,000 వరకు కవరేజి లభిస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు.. బాధితులు ఆసుపత్రిలో చేరడం లేదా మరణం సంభవిస్తే దానికయ్యే ఖర్చుల నుంచి ఆర్థికంగా కొంత నిలదొక్కుకోవడానికి ఈ బీమా ఉపయోగపడుతుంది.ఫైర్క్రాకర్ బీమా ప్లాన్ కవరేజ్ అక్టోబర్ 25 నుంచి ప్రారంభమవుతుంది. ఈ బీమా కోసం ఫోన్పే యాప్లోనే అప్లై చేసుకోవచ్చు. ఇది కేవలం వినియోగదారుకు మాత్రమే కాకుండా.. జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలతో సహా గరిష్టంగా నలుగురు కుటుంబ సభ్యులకు కవరేజి లభిస్తుంది.ఇదీ చదవండి: 'అప్పుడు రతన్ టాటా ముఖంలో చిరునవ్వు కనిపించింది'ఫైర్క్రాకర్ బీమా కోసం ఎలా అప్లై చేయాలంటే➤ఫోన్పే యాప్లోని బీమా విభాగాన్ని సెలక్ట్ చేసుకున్న తరువాత, అక్కడే ఫైర్క్రాకర్ ఇన్సూరెన్స్ కనిపిస్తుంది.➤ఫైర్క్రాకర్ ఇన్సూరెన్స్ ఎంచుకున్న తరువాత ప్లాన్ వివరాలు చూడవచ్చు. ఇక్కడే బీమా మొత్తం రూ. 25000, ప్రీమియం రూ. 9 ఉండటం చూడవచ్చు.➤కింద కనిపించే కంటిన్యూ బటన్ క్లిక్ చేసిన తరువాత పాలసీ పీరియడ్ అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు ఉన్నట్లు కనిపిస్తుంది. దాని కిందనే పాలసీదారు వివరాలు ఇవ్వవలసి ఉంటుంది. అన్నీ పూర్తయిన తరువాత తొమ్మిది రూపాయలు చెల్లించాలి. ఇలా సులభంగా ఫైర్క్రాకర్ ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవచ్చు. -
ఈసారి విమానం ఎక్కేవారిదే ఆనందం!
సాధారణంగా దీపావళి పండుగ సీజన్లో విమాన ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఒక విశ్లేషణ ప్రకారం.. ఈ దీపావళి సీజన్ విమాన ప్రయాణికులకు మరింత ఆనందం కలిగిస్తోంది. కారణం.. అనేక దేశీయ రూట్లలో సగటు విమాన ఛార్జీలు గత సంవత్సరంతో పోలిస్తే 20-25 శాతం తగ్గాయి.ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో విశ్లేషణ ప్రకారం.. దేశీయ మార్గాల్లో సగటు విమాన ఛార్జీలు 20-25 శాతం శ్రేణిలో క్షీణించాయి. ఇవి 30 రోజుల ఏపీడీ (ముందస్తు కొనుగోలు తేదీ) వన్-వే సగటు ఛార్జీల ధరలు. దీపావళి సీజన్ విమాన టికెట్ల కొనుగోలు సమయాన్ని గతేడాది నవంబర్ 10-16 తేదీల మధ్య పరిగణించగా ఈ ఏడాది అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 మధ్య జరిగిన కోనుగోళ్లను పరిగణనలోకి తీసుకున్నారు.విశ్లేషణ ప్రకారం బెంగళూరు-కోల్కతా విమానానికి సగటు విమాన ఛార్జీలు గరిష్టంగా 38 శాతం క్షీణించాయి. గత ఏడాది రూ.10,195 నుండి ఈ ఏడాది రూ.6,319కి తగ్గాయి. చెన్నై-కోల్కతా మార్గంలో టిక్కెట్ ధర రూ.8,725 నుంచి రూ.5,604కి 36 శాతం తగ్గింది.ఇదీ చదవండి: ఓలా.. అలా కుదరదు.. రిఫండ్ ఇవ్వాల్సిందే!ముంబై-ఢిల్లీ విమానాల సగటు విమాన ఛార్జీలు రూ.8,788 నుంచి రూ.5,762కి 34 శాతం తగ్గాయి. అదేవిధంగా ఢిల్లీ-ఉదయ్పూర్ రూట్లో టికెట్ ధరలు రూ.11,296 నుంచి రూ.7,469కి 34 శాతం క్షీణించాయి. ఢిల్లీ-కోల్కతా, హైదరాబాద్-ఢిల్లీ, ఢిల్లీ-శ్రీనగర్ మార్గాల్లో 32 శాతం క్షీణత ఉంది. -
22న దీపకాంతులలో ఢిల్లీ ఆలయాలు
జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా దేశరాజధాని ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అన్ని దేవాలయాలను రంగురంగుల దీపాలతో, పూలతో అలంకరించనున్నారు. అంతే కాకుండా ఆలయాల్లో రామచరిత మానసను పారాయణం చేయడంతోపాటు రామచరిత మానస ప్రతులను పంపిణీ చేయనున్నారు. శ్రీ రాంలీలా మహాసంఘ్ నేతృత్వంలో ఢిల్లీలో 22న ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మహాసంఘ్ అధ్యక్షుడు అర్జున్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 550 ఏళ్ల తర్వాత అయోధ్యలో శ్రీరాముని ఆరాధించే అవకాశం మనకు లభించబోతోందని అన్నారు. అందుకే ఆ రోజును చారిత్రాత్మకంగా మార్చేందుకు రామ్లీలా కమిటీలన్నీ తమ ప్రాంతాల్లోని ఆలయాలను రంగురంగుల దీపాలతో, పూలతో అలంకరించాలని నిర్ణయించాయన్నారు. ఆలయాల వెలుపల పెద్ద ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా అయోధ్యలోని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్షంగా ప్రదర్శించనున్నామన్నారు. అలాగే రామ్చరిత మానస కాపీలను రామ్లీలా కమిటీలు పంపిణీ చేస్తాయని తెలిపారు. ఆలయాల్లో 501 నెయ్యి దీపాలు వెలిగించనున్నారని తెలిపారు. ఈ నెల 22వ తేదీని దీపావళిలా జరుపుకోవాలని రాజధానివాసులకు శ్రీ రాంలీలా మహాసంఘ్ పిలుపునిచ్చింది. అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభం కానున్న సందర్భంగా సంపూర్ణ అనే సంస్థ ఆదివారం లోధీ గార్డెన్లో రాముని పెయింటింగ్ పోటీని నిర్వహించింది. దీనిలో పెద్ద సంఖ్యలో పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు. సుమారు వంద మంది చిన్నారులు శ్రీరాముడు, ఇతర దేవతల వేషధారణలతో కార్యక్రమానికి హాజరయ్యారు. -
జపాన్లో దీపావళిని పోలిన పండగ ఉంది తెలుసా!
మన దీపావళి ఇటీవలే జరిగింది. అచ్చం మన దీపావళిని పోలిన పండుగనే జపానీయులు కూడా ఏటేటా జరుపుకొంటారు. ఈ పండుగ పేరు ‘చిచిబు యమాత్సురి’– అంటే రాత్రి వేడుక అని అర్థం. దాదాపు మూడు శతాబ్దాలుగా జపానీయులు ఈ పండుగను జరుపుకొంటూ వస్తున్నారు. ఇది రెండు రోజుల పండుగ. ప్రతి ఏటా డిసెంబర్ 2, 3 తేదీల్లో జపాన్ ప్రజలు ఘనంగా ఈ పండుగను జరుపుకొంటారు. ఒకుచిచిబు పర్వతసానువుల దిగువన ఉండే చిచిబు పట్టణంలో ఈ వేడుకలు జరుగుతాయి. రాజధాని టోక్యో సహా వివిధ నగరాలు, పట్టణాలకు చెందిన ప్రజలు ఇక్కడకు చేరుకుని, ఘనంగా పండుగ చేసుకుంటారు. సాయంత్రం చీకటి పడుతూనే ప్రార్థన మందిరాలను, ఇళ్లను సంప్రదాయబద్ధమైన లాంతరు దీపాలతో అలంకరిస్తారు. వీథుల్లో ఊరేగింపులు జరుపుతారు. ప్రార్థన మందిరాలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. పండుగ మొదటి రోజున ప్రార్థనలు, విందు వినోదాలతో గడుపుతారు. రెండోరోజైన డిసెంబర్ 3న రాత్రి వేళ ఇళ్లను, ప్రార్థన మందిరాలను లాంతరు దీపాలతో అలంకరించి, భారీ ఎత్తున బాణసంచా కాల్పులు జరుపుతారు. ఈ వేడుకల్లో చిచిబు పట్టణం బాణసంచా కాల్పులతో హోరెత్తుతుంది. ఎటు చూసినా మిరుమిట్లు గొలిపే బాణసంచా మెరుపులు కనిపిస్తాయి. రంగు రంగుల తారాజువ్వలు, చిచ్చుబుడ్లు వంటి బాణసంచా కాల్పుల్లో పిల్లలూ పెద్దలూ అంతా ఉత్సాహంగా పాల్గొంటారు. చిచిబు పట్టణంలోని ప్రధాన ప్రార్థన మందిరమైన చిచిబు మందిరంలో ఈ వేడుకలు మరింత అట్టహాసంగా జరుగుతాయి. ఈ మందిరం రాత్రివేళ దీపకాంతులతో ధగధగలాడిపోతుంది. వేలాది మంది జనాలు ఇక్కడకు చేరుకుని, బాణసంచా కాల్పులు జరుపుతారు. ఈ మందిరం నుంచి కలపతో తయారు చేసిన రథాల వంటి ‘యతాయి’ వాహనాలను దీపాలతో అలంకరించి వీథుల్లో ఊరేగిస్తూ బాణసంచా కాల్పులు జరుపుతారు. ఈ వేడుకలను తిలకించడానికి విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుంటారు. (చదవండి: అక్కడ ఊపిరి తీసుకున్నా ప్రమాదమే! అణు రియాక్టర్ పేలుడు ఏదీ సంభవించలేదు కానీ..!) -
Dev Diwali 2023: కాశీలో వైభవంగా దేవ్ దీపావళి.. (ఫొటోలు)
-
మళ్లీ పెరుగుతున్న టమాటా రేట్లు
దీపావళి అనంతరం మార్కెట్లో టమాటా ధర ప్రతి ఏటా రూ.15 నుంచి రూ.20 వరకు పలుకుతుండగా, ఈ ఏడాది వర్షాభావంతో టమోటా పంట దెబ్బతింది. ఫలితంగా మహారాష్ట్రలోని నాగ్పూర్తో సహా విదర్భలోని రిటైల్ మార్కెట్లో టమోటాలు కిలోకు రూ.55 నుండి 60 వరకు అమ్ముడవుతున్నాయి. పెరుగుతున్న టమాట ధరలు ఉల్లి ధరలతో పోటీపడుతున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచి టమాటాలను విక్రయించేందుకు నాగ్పూర్లోని కలమన మండీకి తీసుకువస్తుంటారు. అయితే ఈసారి చాలా తక్కువగా టమాటాలు వస్తుండటంతో వీటి ధరలు మళ్లీ పెరిగాయి. టమాటా వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో పెద్ద ఎత్తున టమోటాలు కలమన మండీకి వస్తుంటాయి. ఫలితంగా ధరలు తక్కువగా ఉంటాయి. కాగా పొలంలో టమోటాలు పండించిన రైతులు వాటిని మార్కెట్కు తీసుకురావాలంటే రవాణా ఖర్చులు భారీగా అవుతుంటాయి. ఈ కారణంగా రైతులు టమోటాలను రోడ్లపై పారవేస్తుంటారు. అయితే ఈసారి పరిస్థితి అలా లేదు. టమాటాలు డిమాండ్కు తగ్గట్టుగానే సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్ర, బెంగళూరు నుంచి టమోటాలు నాగపూర్కు విక్రయానికి వస్తున్నాయి. హోల్సేల్ మార్కెట్లో టమాటా ధర నాణ్యతను బట్టి రూ. 40 నుండి 45 వరకు ఉంటుంది. నాగపూర్ పట్టణానికి ప్రతీరోజు 15 నుండి 16 ట్రక్కుల టమాటాలు వస్తున్నాయి. పెరుగుతున్న టమాటా ధరలు ఉల్లికి గట్టి పోటీనిస్తున్నాయి. ఇప్పటికే రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.65 నుంచి రూ.70 పలుకుతోంది. మార్కెట్లో ఉల్లి రాక పెరగడంతో ధరలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: పెళ్లిలో రసగుల్లా కోసం కొట్లాట.. ఆరుగురికి తీవ్రగాయాలు! -
లగ్జరీ కార్లకు పండుగ జోష్.. రికార్డ్ స్థాయిలో అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ ఏడాది అత్యుత్తమ పనితీరును సాధించగలమని లగ్జరీ కార్ల పరిశ్రమ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఓనం నుండి దీపావళి వరకు ఈ పండుగ సీజన్ గత సంవత్సరాల కంటే మెరుగ్గా ఉంది. అనేక కొత్త మోడళ్లు, ఆకర్షణీయమైన పోర్ట్ఫోలియో, బలమైన కస్టమర్ సెంటిమెంట్ ఈ జోష్కు కారణమని మెర్సిడెస్–బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. దసరా, ధన్తేరస్, దీపావళి సందర్భంగా రికార్డు స్థాయిలో డెలివరీలు జరగడం కస్టమర్ల ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. సానుకూల పరిశ్రమ దృక్పథంతో కొనసాగుతున్నామని, ఈ ఏడాది రికార్డు స్థాయిలో అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్యూవీల ఉత్పత్తి, లభ్యతను ప్రభావితం చేస్తూ సరఫరా సంబంధిత ఆటంకాలు కొనసాగే అవకాశం ఉందని వివరించారు. భారత్లో 2023 ఆగస్టు 17 నుంచి నవంబర్ 14 మధ్య మొత్తం ప్యాసింజర్ వాహనాల రిటైల్ అమ్మకాలు 10 లక్షల మార్కును దాటాయి. ఏడేళ్లలో గరిష్టం.. ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్లో 5,530 యూనిట్ల అమ్మకాలతో కంపెనీ 88 శాతం వృద్ధిని సాధించిందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ఇటీవలి కాలంలో అత్యధిక ఆర్డర్ బుక్తో కొనసాగుతున్నట్టు వెల్లడించారు. ఈ పండుగ సీజన్ ఆడి ఇండియాకు పెద్ద వేడుకగా నిలిచిందన్నారు. గత ఏడు సంవత్సరాలతో పోలిస్తే అత్యధిక అమ్మకాలను ఈ సీజన్లో నమోదు చేశామన్నారు. ఏ4, క్యూ3, క్యూ3 స్పోర్ట్బ్యాక్, క్యూ5, ఎస్5 స్పోర్ట్బ్యాక్లతో సహా ఉత్తమ విక్రయాలతో నిరంతర డిమాండ్ కారణంగా వృద్ధి నమోదైందని ధిల్లాన్ చెప్పారు. పండుగల సీజన్లో కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్లో ఢిల్లీ, ముంబై ముందంజలో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్, కోల్కత, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ల నుండి కూడా మంచి డిమాండ్ను చూస్తున్నామని వెల్లడించారు. ఈ ఏడాది భారత్లో లగ్జరీ కార్ల పరిశ్రమ 2018 స్థాయి అమ్మకాలను అధిగమిస్తుందని, 46,000–47,000 యూనిట్ల మార్కును చేరుకుంటుందని జోస్యం చెప్పారు. ఆడి ఇండియా అధిక రెండంకెల వృద్ధితో 2023ను ముగించాలని చూస్తోందని వివరించారు. 2027 నాటికి 1.54 బిలియన్ డాలర్లు.. పండుగ సందర్భంగా కొన్ని శక్తివంతమైన కార్లు, మోటార్సైకిళ్లను విడుదల చేశామని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావా తెలిపారు. ఈ వేగాన్ని కంపెనీ కొనసాగిస్తుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ ఒకటి. అలాగే మిలియనీర్ల సంఖ్య పరంగా 3వ అతిపెద్ద దేశమని లంబోర్గీని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ తెలిపారు. ‘2021లో భారతీయ లగ్జరీ కార్ మార్కెట్ విలువ 1.06 బిలియన్ డాలర్లు. 2027 నాటికి 1.54 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. 2022–2027 అంచనా కాలంలో 6.4 శాతం కంటే ఎక్కువ సగటు వార్షిక వృద్ధి నమోదవుతుంది’ అని పేర్కొన్నారు. కస్టమర్ అభిరుచి, ప్రాధాన్యతలు ఈ వృద్ధిని నడిపిస్తాయని చెప్పారు. దీంతో అధునాతన సాంకేతికత, భద్రతా ఫీచర్లతో లగ్జరీ కార్లకు పెరుగుతున్న డిమాండ్తో ఆటోమొబైల్ రంగం గణనీయంగా విస్తరణను చూస్తోంది’ అని అగర్వాల్ తెలిపారు. మెరుగైన రోడ్లు వృద్ధికి మరింత మద్దతునిస్తోంది. నగరాలు ఎక్స్ప్రెస్వేల ద్వారా అనుసంధానం అవుతున్నాయి. దీంతో అధిక ఆకాంక్షలతో పాటు ద్వితీయ శ్రేణి, చిన్న నగరాల్లో డిమాండ్ను పెంచుతున్నాయని చెప్పారు. లంబోర్గీని మొత్తం అమ్మకాల్లో 25 శాతానికి పైగా మెట్రోయేతర నగరాల నుండి జరుగుతున్నాయని అన్నారు. -
ఎయిర్లైన్స్కు కలిసొచ్చిన వరల్డ్కప్ ఫైనల్ - కనీవినీ ఎరుగని సరికొత్త రికార్డ్..
పండుగ సీజన్లో వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా జరుగుతాయని అందరూ నమ్ముతారు. అయితే ఆ పండుగ సీజన్ కంటే వరల్డ్కప్ బాగా కలిసొచ్చిందని ఎయిర్లైన్స్ తాజాగా వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ రోజు దేశంలో సుమారు 4.6 లక్షలమంది విమాన ప్రయాణం చేశారని, దీపావళికి కూడా చేయలేని పనిని క్రికెట్ వరల్డ్ కప్ చేసిందని ఎయిర్లైన్స్ స్పష్టం చేసింది. గత దీపావళి కంటే కూడా ప్రయాణికుల సంఖ్య చాలా ఎక్కువని తెలిపారు. దీపావళి సమయంలో విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది, కానీ అంత కంటే ఎక్కువ వరల్డ్కప్ ఫైనల్ రోజు ప్రయాణించారు. భారత్ ప్రపంచకప్ ఫైనల్ చేరడంతో అహ్మదాబాద్ చేరుకోవాలనే ఉత్సాహం అభిమానుల్లో కనిపించి సరికొత్త రికార్డు సృష్టించింది. పెరిగిన చార్జీలను కూడా లెక్క చేయకుండా ఒక్కసారిగా ప్రయాణికులు రావడంతో విమానయాన సంస్థల ఆదాయం భారీగా పెరిగింది. ప్రపంచకప్ ఫైనల్ రోజు కొందరు రూ. 20,000 నుంచి రూ. 40,000 వెచ్చించి కూడా టికెట్స్ కొనుగోలు చేశారు. ఫ్లైట్ చార్జీలు ఎక్కువని కొందరు ట్రైన్ ఏసీ క్లాసులు బుక్ చేసుకుని ప్రయాణించారు. అటు విమానయాన సంస్థలు, ఇటు రైల్వే సంస్థలు బాగా సంపాదించుకోగలిగాను. ఒకే రోజులో 4 లక్షల మంది విమాన ప్రయాణం చేయడం ఓ అరుదైన రికార్డ్. ఇది మాకు చారిత్రాత్మకమైన అవకాశం అని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇదీ చదవండి: టీమిండియా ఓటమి - పారిశ్రామిక వేత్తల ట్వీట్స్ వైరల్ అక్టోబర్ నెలలో ప్రారంభమయ్యే పండుగ సీజన్ సద్వినియోగం చేసుకోవడానికి విమానయాన సంస్థలు గత సెప్టెంబర్ చివరి వారంలో అడ్వాన్స్ బుకింగ్ చార్జీలను పెంచడం ప్రారంభించాయి. కొందరు పెరిగిన చార్జీలను దృష్టిలో ఉంచుకుని ట్రైన్ జర్నీ చేయడానికి సిద్ధమయ్యారు. మొత్తం మీద ఇండియా వరల్డ్కప్ కోల్పోయినప్పటికీ.. విమానయాన సంస్థలు మాత్రం లాభాలను గడించాయి. -
Hansika Motwani First Diwali Celebrations: భర్తతో పండగ చేసుకున్న హన్సిక.. ఎంత పద్ధతిగా ఉందో (ఫోటోలు)
-
బుల్ రన్, దీపావళి కానుకగా రూ.3.3 లక్షల కోట్ల బోనస్
ముంబై: అమెరికా, భారత్లో ద్రవ్యోల్బణం దిగిరావడంతో బుధవారం దేశీయ స్టాక్ సూచీలు నెల గరిష్టంపైన ముగిశాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూలతలు, బాండ్లపై రాబడులు తగ్గడంతో పాటు 14 ట్రేడింగ్ సెషన్ల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టడం కలిసొచ్చాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు రాణించడంతో బుధవారం సెన్సెక్స్ 742 పాయింట్లు పెరిగి 65,676 వద్ద ముగిసింది. నిఫ్టీ 232 పాయింట్లు బలపడి 19,675 వద్ద నిలిచింది. బలిప్రతిపద సెలవు తర్వాత ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ను ప్రారంభించిన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. ట్రేడింగ్లో అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ క్రమంలో సెన్సెక్స్ 814 పాయింట్లు ఎగసి 65,748 వద్ద, నిఫ్టీ 249 పాయింట్లు బలపడి 19,693 వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్లకు భారీగా డిమాండ్ నెలకొనడంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ సూచీలు వరుసగా 1.13%, 0.91% చొప్పున రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.550 కోట్లు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.610 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్ సూచీ (హాంగ్సెంగ్) అత్యధికంగా 4% ర్యాలీ చేసింది. జపాన్ నికాయ్ 2.50%, కొరియా, థాయిలాండ్ సూచీలు 2%, ఇండోనేషియా, సింగపూర్ సూచీలు 1% చొప్పున లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు 1% మేర పెరిగాయి. అమెరికా మార్కెట్లు అరశాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ‘అమెరికా, బ్రిటన్, భారత్ల్లో ద్రవ్యోల్బణం దిగిరావడంతో ఫెడరల్ రిజర్వ్తో సహా ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపుపై వెనకడుగు వేయొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అందుకు సంకేతంగా బాండ్లపై రాబడులు తగ్గుముఖం పట్టాయి. పండుగ సీజన్, మెరుగైన కార్పొరేట్ ఫలితాలతో ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే విదేశీ ఇన్వెస్టర్లు భారత్లో పెట్టుబడులకు మొగ్గుచూపొచ్చు. ఈ ఏడాది చివరికల్లా నిఫ్టీ తిరిగి 20,000 స్థాయిని అందుకోవచ్చు’ అని జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. దీపావళి బోనస్ : రూ.3.29 లక్షల కోట్లు దలాల్ స్ట్రీట్ ఒక శాతం ర్యాలీ చేసి ఇన్వెస్టర్లకు దీపావళి కానుకగా రూ.3.3 లక్షల కోట్ల బోనస్ ఇచ్చింది. సెన్సెక్స్ 742 పాయింట్లు పెరగడంతో బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.3.29 లక్షల కోట్లు పెరిగి రూ.325.41 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లలో బజాజ్ ఫైనాన్స్ 2%, ఇండస్ఇండ్ 1%, పవర్గ్రిడ్ 1% మాత్రమే నష్టపోయాయి. అదరగొట్టిన ఆస్క్ ఆటోమోటివ్ లిస్టింగ్ ఆస్క్ ఆటోమోటివ్ లిస్టింగ్లో అదరగొట్టింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.282)తో పోలిస్తే 8% ప్రీమియంతో రూ.305 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో 12 శాతానికి పైగా ర్యాలీ చేసి రూ.317 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 10% లాభపడి రూ.310 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.6,115 కోట్లుగా నమోదైంది. రూపాయి రికవరీ జీవితకాల కనిష్ట స్థాయిల నుంచి రూపాయి రికవరీ అయ్యింది. డాలర్ మారకంలో 24 పైసలు బలపడి 83.09 స్థిరపడింది. అంతర్జాతీయంగా డాలర్ విలువ రెండేళ్ల కనిష్టాన్ని తాకడం దేశీయ కరెన్సీకి కలిసొచ్చింది. ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో రిస్క్ సామర్థ్యం పెరిగిందని ఫారెక్స్ నిపుణులు తెలిపారు. ఈ సోమవారం 83.33 వద్ద జీవితకాల కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. కాగా బలప్రతిపద సందర్భంగా మంగళవారం ఫారెక్స్ మార్కెట్ పనిచేయలేదు. -
Divi Vadthya Diwali Celebrations: దీపావళి సెలబ్రేషన్స్.. చీరకట్టులో మైమరిపిస్తోన్న దివి (ఫొటోలు)
-
Manchu Lakshmi Prasanna: మంచు లక్ష్మికి అల్లు శిరీష్ ముద్దు, పార్టీలో పూనకాలే (ఫోటోలు)
-
‘దీపావళి మద్యం’తో ఢిల్లీ సర్కారుకు భారీ ఆదాయం!
ఏటా దీపావళి సీజన్లో మద్యం విక్రయాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా దేశ రాజధాని ఢిల్లీలో మద్యం విక్రయాలు అత్యధికంగా జరిగాయి. సాధారణ రోజులతో పోలిస్తే దీపావళికి కొద్ది రోజుల ముందు నుంచే మద్యం విక్రయాలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. దీపావళి సీజన్లో అత్యధిక మద్యం విక్రయాల కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి మొత్తం రూ.525.84 కోట్ల ఆదాయం సమకూరింది. దీపావళి సందర్భంగా గత శుక్రవారం నుంచి ఆదివారం వరకు రూ.121 కోట్ల విలువైన 64 లక్షల మద్యం బాటిళ్లను వినియోగదారులు కొనుగోలు చేశారని సమాచారం. అదే సమయంలో దీపావళి పండుగకు వారం రోజుల ముందు కోటికి పైగా మద్యం బాటిళ్లు విక్రయించగా, ప్రభుత్వానికి రూ.234.15 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే దీపావళికి ముందు 17 రోజుల్లో మొత్తం 3 కోట్లకు పైగా మద్యం బాటిళ్లు అమ్ముడుపోవడంతో ప్రభుత్వానికి రూ.525.84 కోట్ల ఆదాయం సమకూరింది. దీపావళి, హోలీ తదితర పండుగల సమయంలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని మద్యం దుకాణాల్లో గురువారం రూ. 17.33 లక్షలు, శుక్రవారం రూ. 18.89 లక్షలు, శనివారం 27.89 లక్షల రూపాయాల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈ మూడు రోజుల్లోనే 64 లక్షలకు పైగా మద్యం బాటిళ్లు అమ్ముడుపోయి, ఢిల్లీ ప్రభుత్వానికి మొత్తం రూ.120.92 కోట్ల ఆదాయం అందింది. అయితే దీపావళి నాడు కొన్ని చోట్ల మద్యం దుకాణాలను మూసివేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది దీపావళి సందర్భంగా 42 శాతం అధికంగా మద్యం బాటిళ్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాది దీపావళికి మూడు రోజుల ముందు వరుసగా 13.46 లక్షలు, 15 లక్షలు, 19.39 లక్షల మద్యం బాటిళ్లు విక్రయించినట్లు అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి! -
భారత్లో దీపావళి సంబరాలు.. చైనాకు లక్ష కోట్లు నష్టం!
భారత్లో దీపావళి సంబరాలతో చైనాకు లక్ష కోట్ల ఆదాయం తగ్గింది. అదెలా అంటారా? మన దేశంలో ప్రతి ఏడాది రక్షా బంధన్తో ప్రారంభమైన ఫెస్టివల్ సీజన్ న్యూ ఇయర్ వరకు.. ఇలా ఐదు నెలల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో వ్యాపారస్థులు, ఎగుమతిదారులు పండగ సమయాల్లో ప్రజలకు అవసరమయ్యే నిత్యవసర వస్తువుల్ని చైనా నుంచి భారత్కు తెస్తుంటారు. ఆ మొత్తం విలువ సుమారు రూ.80 వేల కోట్లు. అయితే 2020 జూన్ 15న తూర్పు లద్దాఖ్ వద్ద గల్వాన్ నది లోయలో భారత సైనికులు వివిధ అవసరాలకు ఉపయోగిస్తున్న ఓ తాత్కాలిక వంతెనను డ్రాగన్ సైన్యం (పీఎల్ఏ) తొలగించేందుకు ప్రయత్నించింది. ఇది రెండు దేశాల సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణకు దారితీసింది.నాటి ఘటనలో భారత్కు చెందిన 20 మంది సైనికులు అమరులయ్యారు. అప్పటికి వంతెనపై ఉన్న కనీసం 38 మంది చైనా సైనికులను చైనా కోల్పోయింది. ఈ హింసాత్మక ఘటన తర్వాత భారత్.. చైనాను అన్ని విధులుగా నిలువరించే ప్రయత్నాలు ప్రారంభించింది. అప్పుడే ప్రధాని మోదీ ‘వోకల్ ఫర్ లోకల్’ పేరుతో ప్రజలు దేశీయ ఉత్పత్తులకు మద్దతు ఇవ్వాలని పిలుపు నిచ్చారు. అలా దేశంలో చైనా ఉత్పత్తులపై మొదలైన బాయ్కాట్ ఉద్యమం ప్రతిఏడు చైనాను కోలుకోలేని దెబ్బ తీస్తుంది. ఫలితంగా ఈ ఏడాదిలో దీపావళి వరకు జరిగిన పండుగుల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ.3.75 లక్షల కోట్ల విలువైన వ్యాపార లావాదేవీలు జరిగాయని వ్యాపార సంస్థల సంఘం.. కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) పేర్కొంది. నవంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే గోవర్ధన్ పూజ, భాయా దూజ్, నవంబర్ 19 ఛాత్ పూజ, నవంబర్ 24న జరిగే తులసీ వివాహ్ వంటి పర్వదినాల నేపథ్యంలో మరో రూ.50 వేల కోట్ల విలువైన వ్యాపారం జరిగే అవకాశం ఉందని కెయిట్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. ఇక, నాలుగు రోజుల పాటు జరిగిన దీపావళి ఫెస్టివల్ సీజన్లో దేశ వ్యాప్తంగా స్థానిక ఉత్పత్తుల అమ్మకాలతో చైనాకు రూ.1 లక్ష కోట్ల ఆదాయం తగ్గిందని వెల్లడించారు. ‘ఇంతకుముందు దేశవ్యాప్తంగా దీపావళి సందర్భంగా దాదాపు 70 శాతం చైనా ఉత్పత్తులే అమ్ముడయ్యేవి. కానీ ప్రధాని నరేంద్రమోదీ అభ్యర్థన మేరకు వ్యాపారులు స్థానిక ఉత్పత్తులనే విక్రయించారు. వినియోగదారులు కూడా దేశీయ ఉత్పత్తులను ఆదరించారు’ అని కెయిట్ సెక్రటరీ జెనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు. చదవండి👉 పండగ సీజన్లో దినదిన గండం..టెక్కీల నెత్తిపై మరో పిడుగు! -
అగ్రరాజ్యంలో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు!
అగ్రరాజ్యం అమెరికాలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఉత్తర కాలిఫోర్నియా, మిల్పిటాస్ నగరంలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో దీపావళి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. మహిళలు పెద్ద సంఖ్యలో దీపాలు వెలిగించి ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ప్రవాసులు సంప్రదాయ వస్త్రధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇక అందరూ కలిసి బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. చిన్నారులు, యువత.. టపాసులు, తారాజువ్వలు, చిచ్చుబుడ్లు వెలిగించి ఆనందాలు పంచుకున్నారు. అన్ని రకాల టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. దీపాలు, టపాసుల కాంతులతో సిలికానాంధ్ర యూనివర్సిటీ ప్రాంగణం వెలిగిపోయింది. ప్రవాసులు బారీగా తరలివచ్చి.. వెలుగుల పండుగ దీపావళిని ఆనందోత్సాహాల మధ్య సెలబ్రేట్ చేసుకున్నారు. దీపావళి ఉత్సవంలో భాగంగా భక్తి గీతాలు, భజనలతో పాటు వైవిధ్యభరిత సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరింపజేశాయి. దీపావళి వేడుకలు గ్రాండ్గా జరగటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: న్యూయార్క్లో ఘనంగా దీపావళి వేడుకలు) -
పండగ పోస్టర్ గురూ
దీపావళి పండక్కి ఇండస్ట్రీలో సినీ టపాసులు బాగానే పేలాయి. టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్, కొత్త పోస్టర్.. ఇలా సినీ ప్రేమికులకు కావాల్సిన మతాబులు అందాయి. ఈ విశేషాల్లోకి... రజనీకాంత్, కపిల్దేవ్ కీలక పాత్రల్లో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా జీవితా రాజశేఖర్ ఓ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కానుంది. దీపావళి సందర్భంగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. క్రికెట్ను ప్రేమించే కొందరు హిందు, ముస్లిం యువకుల మధ్య రాజకీయ జోక్యంతో తలెత్తిన వివాదాలను మొయిద్దీన్ భాయ్ (రజనీ పాత్ర పేరు) ఎలా సరిదిద్దుతాడు? అనే కోణంలో ఈ సినిమా కథనం సాగుతుందని యూనిట్ చెబుతోంది. ‘రాంగ్ యూసేజ్’ అంటూ ‘సైంధవ్’ సినిమా కోసం పాట పాడారు వెంకటేశ్. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, బేబీ సారా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘రాంగ్ యూసేజ్’ పాట లిరికల్ వీడియోను ఈ నెల 21న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించి, ఈ సాంగ్ పోస్టర్ను రిలీజ్ చేశారు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది. రవితేజ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ చిత్రం ‘ఈగల్’. ఇందులో కావ్యాథాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు. ఈ సినిమా కొత్త పోస్టర్ విడుదలైంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ ఫిల్మ్ ‘సలార్’. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ డిసెంబరు 22న విడుదల కానుంది. తొలి భాగం ట్రైలర్ను డిసెంబరు 1న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, ప్రభాస్ కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. మాస్ పోలీసాఫీసర్ పాత్రలో గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ ఫిల్మ్ ‘భీమా’. ఎ. హర్ష దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఓ మాస్ పోస్టర్ను రిలీజ్ చేశారు. సూర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కంగువా’. ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్. దీపావళి సందర్భంగా ‘కంగువా’ పోస్టర్ను రిలీజ్ చేశారు. యూవీ క్రియేషన్స్తో కలిసి స్టూడియో గ్రీన్ ఈ సినిమాను నిర్మిస్తోంది. రెండు విభిన్న కాలాల్లో సాగనున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ఏప్రిల్ 11న విడుదల కానుందని టాక్. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఫ్యామిలీ స్టార్’. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త పోస్టర్ విడుదలైంది. ఈ సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్ను బ్యాంకాక్లో ప్లాన్ చేశారు. సంక్రాంతికి ‘ఫ్యామిలీ స్టార్’ విడుదల కానుంది. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ తనయుడు చైతన్యకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘బ్రీత్’. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో నందమూరి జయకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత చోటు చేసుకునే ఘటనల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని యూనిట్ చెబుతోంది. ప్రముఖ నటుడు ఉపేంద్ర భార్య, నటి ప్రియాంకా ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించిన ప్రయోగాత్మక చిత్రం ‘క్యాప్చర్’. ఈ సినిమాకు లోహిత్ దర్శకుడు. రాధికా కుమారస్వామి సమర్పణలో రవిరాజ్ నిర్మించారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ‘‘ఇప్పటి వరకూ సినీ ప్రపంచంలో రాని ఓ ప్రయోగాత్మక చిత్రం ఇది. సింగిల్ లెన్స్తో తీసిన మొట్ట మొదటి సినిమా కూడా ఇదే. సినిమా మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ నుంచి షూట్ చేసినట్టుగా అనిపిస్తుంది. 30 రోజులు గోవాలో ఏకధాటిగా షూటింగ్ జరిపాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి సతీమణి, నటి రాధికా కుమారస్వామి నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘అజాగ్రత్త’. శశిధర్ దర్శకత్వంలో రవిరాజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏడు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే రాధికా కుమారస్వామి నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘భైరా దేవీ’. శ్రీ జై దర్శకత్వం వహిస్తున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునే అఘోరా భైరాదేవిగా రాధిక నటిస్తున్నారు. క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో రూపొందుతున్న సినిమా ‘చే’. ‘లాంగ్ లివ్’ అనేది ఉపశీర్షిక. లావణ్య సమీరా, పూల సిద్ధేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్, బి.ఆర్ సభావత్ నాయక్ కీలక పాత్రల్లో నటించారు. బి.ఆర్ సభావత్ నాయక్ దర్శకత్వంలో సూర్య, బాబు, దేవేంద్ర నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ‘‘చేగువేరా బయోపిక్ తీయాలన్నది నా 20 ఏళ్ల కల. విప్లవ వీరుడు చేగువేరా లైఫ్లో జరిగిన ఎన్నో అరుదైన విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి. డిసెంబరులో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు బి.ఆర్ సభావత్ నాయక్. -
మరోసారి నోరు జారిన ఎస్పీ నేత.. ఏమన్నారంటే..
ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఆయన దీపావళివేళ భక్తులు పూజించే లక్ష్మీదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో తన భార్యను పూజిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్గా మారిన ఈ ఫొటోలపై మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఎస్పీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో దీపావళి సందర్భంగా తన తన భార్యను పూజిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘ప్రపంచంలోని ఏ మతం, కులం, జాతి, వర్ణం, వ్యవస్థలో పుట్టిన ఏ బిడ్డకైనా రెండు చేతులే ఉంటాయన్నారు. రెండు కాళ్లు, రెండు చెవులు, రెండు కళ్లు ఉన్న మహిళకు.. నాలుగు చేతులు, ఎనిమిది చేతులు, పది చేతులు, ఇరవై చేతులు, వెయ్యి చేతులు కలిగిన శిశువు ఇప్పటి వరకు పుట్టలేదన్నారు. నాలుగు చేతులతో లక్ష్మీదేవి ఎలా పుట్టింది? ఎవరైనా లక్ష్మీ దేవిని ఆరాధించాలనుకుంటే, దేవతలాంటి భార్యను పూజించండి. గౌరవించండి.. ఎందుకంటే ఆమె మీ కుటుంబ పోషణ కోసం పనిచేస్తూ, ఆనందం, శ్రేయస్సు అందిస్తూ, ఆహారం సంరక్షణ బాధ్యతలను ఎంతో శ్రద్ధతో నిర్వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: దీపావళి వేళ.. వళ్లంతా దీపాలే! दीपोत्सव के अवसर पर अपनी पत्नी का पूजा व सम्मान करते हुए कहा कि पूरे विश्व के प्रत्येक धर्म, जाति, नस्ल, रंग व देश में पैदा होने वाले बच्चे के दो हाथ, दो पैर, दो कान, दो आंख, दो छिद्रों वाली नाक के साथ एक सिर, पेट व पीठ ही होती है, चार हाथ,आठ हाथ, दस हाथ, बीस हाथ व हजार हाथ वाला… pic.twitter.com/CP5AjKODfq — Swami Prasad Maurya (@SwamiPMaurya) November 12, 2023 -
దీపావళి వేళ.. వళ్లంతా దీపాలే!
దీపావళి వేడుకలు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి. దీపావళి అంటే వెలుగుల పండుగ. దీపావళి రోజున ఇళ్లను దీపాలతో అలంకరిస్తారు. అయితే దీపావళి వేళ ఒక మహిళ వినూత్నంగా అలంకరించుకుంది. ఇళ్లను అలంకరించేందుకు వినియోగించే చిరు దీపాలను తన దుస్తులకు అల్లుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు దీపావళికి ఇటువంటి దుస్తులు పర్ఫెక్ట్ అని కితాబిస్తున్నారు. వర్షా. యాదవ్ పేరిట ఉన్న ఇన్స్టా ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. వీడియోలో ఒక మహిళ ఘాగ్రా చోళీని ధరించి కనిపిస్తుంది. ఘాగ్రాతో పాటు వేసుకున్న చున్నీకి రంగురంగుల దీపాలు అతికించి ఉన్నాయి. కాంతులీనుతున్న ఈ దుస్తులను చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోకు దాదాపు 5 లక్షల లైక్స్ వచ్చాయి. లెక్కకు మించిన కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇది కూడా చదవండి: దీపావళి వేళ.. ఢిల్లీలో 200కుపైగా అగ్నిప్రమాదాలు! View this post on Instagram A post shared by Varsha Bai (@varsha.yadav777) -
Anasuya Bharadwaj: అనసూయ దీపావళి సంబరాలు (ఫోటోలు)
-
దీపావళి పండుగ కారణంగా ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం
-
టపాసుల కాలుస్తుండగా పలువురికి తీవ్రగాయాలు
-
దీపావళి వేడుకల్లో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
-
తానేటి వనిత ఇంట్లో దీపావళి సంబరాలు