
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
ఎస్సార్నగర్: నగరంలో పలు చోట్ల ద్విచక్రవాహనాల దొంగతనానికి పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ మేరకు బుధవారం ఎస్సార్నగర్ పోలీసులు నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. వివరాలు.. ప్రదీప్(28) అనే యువకుడు గత కొంత కాలంగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు.
కాగా, ప్రదీప్ను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 9 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రదీప్ను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు.