మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో భర్తను గొడ్డలితో నరికేసిందో భార్య. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. అబీద్ (35) అనే సదరు భర్త నిద్రపోతుండగా అతడి భార్య ఫైహా (32) గొడ్డలి తీసుకుని ఒకే ఒక్క వేటు వేసింది. ఇకౌనా అనే ప్రాంతంలోని బేగం సరాయ్ వద్ద తమ ఇంట్లో ఉండగానే ఆమె అతడిని నరికేసిందని పోలీసులు చెప్పారు. అనంతరం ఆమె తన నేరాన్ని అంగీకరించడంతో ఫైహాను పోలీసులు అరెస్టు చేశారు.
తన భర్త ఎంత చెప్పినా వినిపించుకోకుండా వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, త్వరలోనే ఆమెను పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పాడని, అందుకే పట్టలేని కోపంలో తాను అతడిని నరికేశానని ఆమె పోలీసులకు వెల్లడించింది.
భర్తను గొడ్డలితో నరికేసిన భార్య
Published Wed, Mar 26 2014 1:51 PM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
Advertisement
Advertisement