మెదక్: కాబోయే భర్త ఇంట్లో నివసిస్తున్న యువతి గత ఆరు రోజులుగా కనిపించకుండాపోయింది. జిల్లాలోని కల్హేర్ మండలం కడ్పల్ గ్రామానికి చెందిన నర్సింహులు కుమార్తె సునిత పటాన్చెరువులో ఉంటూ.. మదీనగూడలో ఓ నర్సింగ్ కళాశాలలో చదువుకుంటోంది. జేపీకాలనీకి చెందిన ఓ యువకునితో ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. దాంతో ఆమె జేపీకాలనీలో కాబోయే భర్త కుటుంబికులతో కలిసి ఉంటోంది. కానీ ఆరు రోజులుగా ఆమె కనిపించకపోవడంతో ఆమె తండ్రి వచ్చి పటాన్చెరువు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాబోయే భర్త ఇంట్లో ఉంటూ.. యువతి అదృశ్యం
Published Mon, Jul 13 2015 12:18 AM | Last Updated on Wed, Aug 1 2018 2:15 PM
Advertisement
Advertisement
Advertisement