Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Former CM YS Jagan anger against Chandrababu Naidu government1
చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

ఏపీలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండా పోయిందని చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సా­ర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం తన 'ఎక్స్‌'లో పోస్ట్‌ చేశారు.రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండా పోయింది. శాంతి భద్రతల నిర్వహణలో @ncbn గారి వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంది. అనంతపురంలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్యచేశారు. ఈనెల జూన్‌ 3న తమ కుమార్తె కనిపించడంలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ అమ్మాయిని రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఆరు రోజుల తర్వాత కూడేరు మండలం బ్రాహ్మణపల్లె సమీపంలో తన్మయి మృతదేహాన్ని గుర్తించారు. తన్మయి హత్య పూర్తిగా యంత్రాంగ వైఫల్యమే. తమ అమ్మాయి కనిపించడంలేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ పోలీసులు ఏంచేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆరు రోజుల క్రితం ఫిర్యాదు వచ్చినా సరే ఎందుకు పట్టించుకోలేదు? అసలు రాష్ట్రంలో కేసుల దర్యాప్తు మీద, నేరాల అదుపుమీద అసలు దృష్టి ఉందా? కేవలం రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు, డైవర్షన్‌ పాలిటిక్స్‌ తప్ప.. ఈ ప్రభుత్వానికి ప్రజల రక్షణపట్ల బాధ్యత అనేది ఉందా? తన్మయి హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, ప్రభుత్వం బాధ్యత వహించాలి.రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండా పోయింది. శాంతి భద్రతల నిర్వహణలో @ncbn గారి వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంది. అనంతపురంలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్యచేశారు. ఈనెల జూన్‌ 3న తమ కుమార్తె… pic.twitter.com/WSSOoiAIwL— YS Jagan Mohan Reddy (@ysjagan) June 8, 2025

Did Not Organise It, KSCA Invited Me Only CM Siddaramaiah2
నన్ను రమ్మని పిలిచారు అంతే.. నాకు ఇంకేమీ తెలీదు: సీఎం సిద్ధరామయ్య

బెంగళూరు: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 2025 టైటిల్‌ను గెలిచిన సందర్భంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్ల సన్మానం కార్యక్రమం.. పెను విషాదాన్ని మిగిల్చింది. గతవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆ ఈవెంట్‌లో తొక్కిసలాట జరిగి 11 మంది మృత్యువాత పడగా, 48 మంది వరకూ గాయపడ్డారు. దీనిపై ప్రతిపక్ష బీజేపీ.. అధికార కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రభుత్వం తప్పిదం వల్లే ఈ ఘోరం జరిగిందంటూ ధ్వజమెత్తింది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టినా అది ప్రభుత్వ వైఫల్యం అని విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది. దీనిపై తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ‘ఆర్సీబీకి సంబంధించిన ఈవెంట్‌ను తాము నిర్వహించలేనప్పుడు ప్రభుత్వ వైఫల్యం ఎలా అవుతుందని అంటున్నారు. ‘నన్ను ఆ ఈవెంట్‌కు రమ్మని కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌(కేఎస్‌సీఏ) ఆహ్వానించింది. నా వద్దకు వచ్చి మరీ కేఎస్‌సీఏ పెద్దలు నన్ను ఆహ్వానించారు. గవర్నర్‌ కూడా ఆ ఈవెంట్‌కు వస్తున్నారని నాకు చెప్పారు. నేను కూడా ఆ ఈవెంట్‌కు వెళ్లా. అంతేకానీ మేము ఆ ఈవెంట్‌ను నిర్వహించలేదు. నన్ను రమ్మన్నారు.. వెళ్లాను.. అంతకుమించి నాకైతే ఏమీ తెలీదు’ అని స్పష్టం చేశారు. ఆ కార్యక్రమాన్ని కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ నిర్వహించిందని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఐపీఎల్‌ టైటిల్‌ను సాధించాలనే చిరకాల కోరిక ఆర్సీబీకి ఎట్టకేలకు లభించడంతో ఆ జట్టును ఘనంగా సన్మానించాలనుకున్నారు. దాంతో ఆదరా బాదరగా ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది. లక్షల్లో అభిమానల హాజరుకావడంతో ఆ ఈవెంట్‌ కాస్తా విషాదంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ, కేఎస్‌సీఏలతో పాటు కర్ణాటక ప్రభుత్వంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఒక ఐపీఎల్‌ ఫ్రాంచైజీ టీమ్‌ పెద్ద ఈవెంట్‌ను నిర్వహిస్తంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటూ విమర్శల వర్షం కురిసింది. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే సీఎం సిద్ధరామయ్యతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లు సంజాయిషీలు ఇస్తూనే వస్తున్నారు.

ENG VS WI 2nd T20: West Indies Set 197 Runs Target To England3
ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు.. విండీస్‌ బ్యాటర్ల బీభత్సం

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇవాళ (జూన్‌ 8) జరుగుతున్న రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు బీభత్సం సృష్టించారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ ఆదిలో నిదానంగా ఆడినా, ఇన్నింగ్స్‌ చివర్లో చెలరేగింది. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు రోవ్‌మన్‌ పావెల్‌ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రొమారియో షెపర్డ్‌ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), జేసన్‌ హోల్డర్‌ (9 బంతుల్లో 29 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రోస్టన్‌ ఛేజ్‌ (1 బంతిలో 6 పరుగులు (నాటౌట్‌) ఆకాశమే హద్దుగా బ్యాటింగ్‌ చేశారు. ఫలితంగా ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.16 ఓవర్లలో తర్వాత 121/4గా ఉండిన విండీస్‌ స్కోర్‌.. చివరి 4 ఓవర్లలో రాకెట్‌ లాగా దూసుకోపోయింది. పావెల్‌, షెపర్డ్‌, హోల్డర్‌, ఛేజ్‌ విజృంభించడంతో 4 ఓవర్లలో ఏకంగా 75 పరుగులు వచ్చాయి. ఆదిల్‌ రషీద్‌ వేసిన 19 ఓవర్లో హోల్డర్‌, షెపర్డ్‌ ఊచకోత కోశారు. ఈ ఓవర్‌లో ఇరువురు కలిసి 5 సిక్సర్లు బాదారు. ఫలితంగా ఆ ఓవర్‌లో 31 పరుగులు వచ్చాయి. అంతకుముందు 17 ఓవర్లో 20, 18వ ఓవర్‌లో 8, ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి.కాగా, ఈ సిరీస్‌లో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్‌ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (96) తృటిలో సెంచరీ మిస్‌ అయ్యాడు. జేమీ స్మిత్‌ (38), జేకబ్‌ బేతెల్‌ (23 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేశారు. విండీస్‌ బౌలర్లలో షెపర్డ్‌ వికెట్లు తీశాడు.అనంతరం బరిలోకి దిగిన విండీస్‌.. లియామ్‌ డాసన్‌ (4-0-20-4) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులే చేయగలిగింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో పాట్స్‌, జేకబ్‌ బేతెల్‌ తలో 2 వికెట్లు తీశారు. విండీస్‌ ఇన్నింగ్స్‌లో ఎవిన్‌ లెవిస్‌ (39) టాప్‌ స్కోరర్‌ కాగా.. ఛేజ్‌ 24, జాన్సన్‌ ఛార్లెస్‌ 18, రోవ్‌మన్‌ పావెల్‌ 13, ఆండ్రీ రసెల్‌ 15, షెపర్డ్‌ 16, హోల్డర్‌ 16 (నాటౌట్‌) పరుగులు చేశారు.

YSRCP MLC Chandrasekhar Reddy Takes On AP Govt4
AP: ‘టీచర్లను ఎలా మోసం చేశారంటే...’

నెల్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల బదిలీల ప్రక్రియను కూటమి సర్కరా్ ప్రహాసనంగా మార్చేసిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బదిలీల్లో మ్యానువల్ ఆప్షన్ అమలు చేస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం ఆఖరి నిమిషంలో ఆన్‌లైన్ వెబ్ ఆప్షన్స్‌ను తప్పనిసరి చేయడం ద్వారా మొత్తం ఉపాధ్యాయలోకంను పచ్చిగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్‌కు రెడ్‌బుక్‌పై ఉన్న శ్రద్దలో కాస్తైనా విద్యాశాఖపై లేకపోవడం వల్లే రాష్ట్రంలో విద్యావ్యవస్థ అధ్వన్నంగా మారిందని ధ్వజమెత్తారు. తక్షణం ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు మ్యానువల్ విధానంలోనే బదిలీ ప్రక్రియ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...తాజాగా కూటమి ప్రభుత్వం టీచర్ల బదిలీలకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ రోజు నుంచి 48 గంటల్లో ఆన్‌లైన్ బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలంటూ, ఒక్కో టీచర్ 2500 ఆప్షన్స్‌ పెట్టుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాల వల్ల రాష్ట్రంలో 1.20 లక్షల మంది ఎస్జీటీలకు సంబంధించి అటు హెచ్‌ఎం పదోన్నతులు లేకుండా చేశారు. మరోవైపు 48 గంటల్లో ఒక్కో టీచర్ 2500 ఆన్‌లైన్ బదిలీ అప్షన్స్‌ పెట్టుకోవాలంటూ ఒత్తిడి చేయడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు.టీచర్లను ఎలా మోసం చేశారంటే...టీచర్ల బదిలీలకు సంబంధించిన చట్టానికి విరుద్దంగా రోజుకోరకంగా నిబంధనలను మార్చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం టీచర్లకు వెన్నుపోటు పొడిచింది. 35 వారాల పాటు ప్రతి శుక్రవారం మీటింగ్‌లు పెట్టి మ్యానువల్ కౌన్సిలింగ్ ద్వారానే బదిలీలు చేస్తానని చెప్పి నమ్మించారు. తరువాత అసెంబ్లీలో మాత్రం మ్యాన్‌వల్‌కు బదులు ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్ చేస్తామని చట్టం తీసుకువచ్చారు. దీనిపై టీచర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో అధికారులు చట్టంలో ఉన్న దానిని పక్కకుపెట్టి మ్యాన్‌వల్‌ బదిలీలనే చేస్తామని హామీ ఇచ్చారు. గత మే నెలలో ఆన్‌లైన్‌ బదిలీలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండటంతో డీఈఓ కార్యాలయాల ముందు మే 25న ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. దీనితో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టీచర్ యూనియన్లతో ఒక మీటింగ్ పెట్టి చట్టప్రకారం ఆన్‌లైన్ బదిలీలు ఉన్నా కూడా, దానిని పక్కకు పెట్టి మ్యానువల్ బదిలీలే చేస్తామని హామీ ఇవ్వడంతో టీచర్ యూనియన్లు ఆందోళనను విరమించుకున్నారు. అదే క్రమంలో ప్రభుత్వం మే 25న బదిలీలకు సంబంధించి జారీ చేసిన జీఓ 22లో ఖచ్చితంగా ఆన్‌లైన్ బదిలీలే చేస్తామని స్పష్టం చేసింది. ఇంతకంటే మోసం ఎక్కడైనా ఉంటుందా? దీనిపై టీచర్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పొరపాటుగా ఆ జీఓ జారీ చేశామని, మ్యానువల్ బదిలీలే చేస్తామంటూ టీచర్ సంఘాలకు అధికారులు హామీ ఇచ్చారు. ఇప్పుడు హటాత్తుగా బదిలీలపై తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా పదేపదే టీచర్లను నమ్మించి, నిలువుగా దగా చేస్తూనే ఉన్నారు.బదిలీల ప్రక్రియ అస్తవ్యస్తంగత ప్రభుత్వం జారీ చేసిన 117 జీఓను రద్దు చేసి, కూటమి ప్రభుత్వం తొమ్మిది రకాల స్కూల్స్‌ను తీసుకువచ్చింది. బదిలీల కోసం వెబ్ అప్షన్స్‌లో ఫౌండేషన్, బేసిక్, మెడల్ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అనే నాలుగు ఆప్షన్స్ కనిపించాల్సి ఉంది. కానీ కేవలం ఎంపీపీ, యుపీ స్కూల్స్ అని మాత్రమే పెట్టారు. దీనితో టీచర్లలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తాము ఆప్షన్ ఇచ్చే స్కూల్ ఏ కేటగిరిలోకి మార్పు చెందిందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. రేపు సాయంత్రంతో వెబ్ అప్షన్స్ గడువు ముగుస్తోంది. తొమ్మిదిరకాల స్కూల్స్‌గా మార్చిన నేపథ్యంలో కొన్ని మండలాల్లో బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఎక్కువగా పెడితే, మరికొన్ని మండలాల్లో ఫౌండేషన్ స్కూల్స్‌ను ఎక్కువగా పెట్టారు. ఎక్కడా హేతుబద్దత అనేది లేకుండా చేశారు. తెలుగుదేశం నాయకులు చెప్పినట్లుగా స్కూల్స్ కేటగిరిని మార్చారు. ఆర్జేడీ, డీఈఓ, ఎంఈఓలతో సంబంధం లేకుండా, నిబంధనలకు అనుగుణంగా ఏ స్కూల్ ఏ కేటగిరిలో ఉండాలని నిర్ణయించకుండా, టీడీపీ నాయకులు సూచించినట్లుగా స్కూల్స్‌ను మార్చేశారు. టీచర్లు ఎన్ని సంవత్సరాలు, ఎంత దూరంలో పనిచేశారనే దానిపై పాయింట్స్‌ ఇస్తారు. దాని ప్రకారమే బదిలీల్లో ప్రాధాన్యత ఉంటుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో ఈ పాయింట్స్‌ కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడుతున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని చూపి టీచర్లను భయపెట్టాలని అనుకుంటున్నారు. రాజకీయ ఒత్తిళ్ళతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే, రాబోయే రోజుల్లో ఇబ్బంది పడతారు. ఎనిమిది అకడమిక్ ఇయర్స్ పూర్తయితే బదిలీ చేస్తామనే నిబంధనలు ఉంటే, ఎనిమిది క్యాలెండర్ ఇయర్స్‌ పూర్తి కాలేదంటూ సాకులు చూపి పాయింట్స్ ఇవ్వడం లేదు. అలాగే దాదాపు 4000 మంది స్కూల్ అసిస్టెంట్‌లు సర్‌ప్లస్‌గా మారిపోయారు. వారిని నిబంధనలకు విరుద్దంగా ప్రైమరీ స్కూల్‌కు కేటాయిస్తున్నారు. ఇరవై ఏళ్ళ సర్వీస్ ఉన్న స్కూల్ అసిస్టెంట్‌ను కూడా పీఎస్ హెచ్‌ఎంగా మోడల్ స్కూల్స్‌కు పంపడం దారుణం. దీనివల్ల ఎస్‌జీటీలకు పీఎస్ హెచ్‌ఎం పదోన్నతి రాకుండా పోయింది.పదో తరగతి మూల్యాంకనంతో పరువు పోయిందిమంత్రి నారా లోకేష్ అసమర్థత కారణంగా, పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో చూసిన నిర్లక్ష్యంతో విద్యాశాఖ పరువు పోయింది. పదోతరగతి పరీక్షలు విద్యార్ధుల భవిష్యత్తుకు తొలి మెట్టు. అటువంటి పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరిగాయో అందరికీ తెలుసు. నెల్లూరుకు చెందిన విద్యార్థిని సాయి కుందనకి అన్ని సబ్జెక్ట్‌ల్లో తొంబైకి పైగా మార్కులు వస్తే, హిందీ సబ్జెక్ట్‌లో 34 మార్కులు వచ్చాయి, బాలికను ఫెయిల్ చేశారు. ఆమె రీవాల్యుయేషన్ పెట్టకుంటే 90 మార్కులు వచ్చాయి. నెల రోజుల పాటు ఆ విద్యార్ధి ఎంత వేదన చెంది ఉంటారో అర్థం చేసుకోవాలి. బొర్రా శిశింద్రారెడ్డికి గణితంలో 32 మార్కులు వేశారు. అన్నింటిలో మంచి మార్కులు వచ్చిన ఈ విద్యార్ధి తిరిగి రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే 72 మార్కులు వేశారు. దీనిపైన మళ్ళీ రీకౌంటింగ్ చేయించుకుంటే 78 మార్కులు వచ్చాయి. ప్రొద్దుటూరుకు చెందిన గంగిరెడ్డి మోక్షితను సోషల్ లో 21 మార్కులతో ఫెయిల్ చేశారు. రీవాల్యుయేషన్‌లో 84 మార్కులు వచ్చాయి. ఇలా అనేక మంది విద్యార్ధుల జవాబుపత్రాలను తీసుకువస్తే, ఎంత దారుణంగా వాల్యుయేషన్ చేశారో అర్థమవుతుంది. ఒక సబ్జెక్ట్‌ను దిద్దడానికి పదిరోజులు సమయం ఇచ్చే పరిస్థితి ఉంటే, ఆరు రోజుల్లో పూర్తి చేయాలని ఒత్తిడి చేశారు’ అని చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు.

Toxic Fungus Smuggling from China to US Could Be Worse Than Covid, Experts Warn5
కోవిడ్-19 కంటే డేంజర్‌: చైనా నుంచి అమెరికాకు ఫంగస్‌, ట్రంప్‌కు డెడ్లీ వార్నింగ్‌

బీజింగ్‌: అమెరికా సంతతికి చెందిన చైనా నిపుణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జాగ్రత్త పడకపోతే కోవిడ్‌-19 కన్నా దారుణ విపత్తు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఇటీవల చైనాకు చెందిన ఇద్దరు సైంటిస్టులు ప్రమాదకరమైన ఫంగస్‌ను రహస్యంగా అమెరికాకు తరలించేందుకు కుట్ర చేశారు. ఆ కుట్రను అమెరికా గుట్టు రట్టు చేసింది.యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కోవిడ్‌-19 మహమ్మారి.. మొట్టమొదటగా చైనాలోని వుహాన్‌లో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు చైనా మరోసారి కోవిడ్‌-19 కంటే ప్రమాదకరమైన పొటెన్షియల్‌ ఆగ్రోటెర్రరిజం వెపన్ పేరుతో ప్రమాదకరమైన ఫంగస్‌ ఫ్యూసారియం గ్రామినియంను అమెరికాకు తరలించింది. చైనా సైంటిస్టులు యున్ క్వింగ్ జియాన్ (33),జూన్ యాంగ్ లియూ (34) ఫంగస్‌ను స్మగ్లింగ్ చేయడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలో ఫంగస్‌ విషయంలో అమెరికా జాగ్రత్తగా ఉండాలని చైనా నిపుణుడు గార్డన్ జి.చాంగ్ వార్నింగ్‌ ఇచ్చారు.‘అమెరికాతో యుద్ధం చేసేందుకు చైనా సిద్ధమైంది. అమెరికా తక్షణ చర్యలు తీసుకోకపోతే కోవిడ్‌-19 కంటే భయంకరమైన విపత్తు చోటు చేసుకునే అవకాశం ఉంది. 2020లో చైనా పండించిన విత్తనాల్ని అమెరికాలోని 50 రాష్ట్రాలకు రవాణా చేసింది. ఆ విత్తనాల రవాణాకు చైనా ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. అది ఆగ్రో టెర్రరిజంలోని భాగమేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.అందుకు 2019 మే నెలలో ప్రముఖ చైనా పత్రిక పీపుల్స్ డైలీ ఎడిటోరియల్‌ ప్రచురించింది. ఆ ఎడిటోరియల్‌ సారాంశం అమెరికాతో చైనా యుద్ధం చేయాలి. అదే కథనాన్ని గార్డన్ జి.చాంగ్ ఊటంకిస్తూ.. తాజాగా ఫ్యూసారియం గ్రామినియం ఫంగస్‌ను అమెరికాకు పంపించింది. చైనా ప్రభుత్వం స్వయంగా ఈ యుద్ధానికి సిద్ధమవుతోంది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ చైనా ప్రజల్ని సైతం సంసిద్ధం చేస్తున్నారు. మనం చైనాను ఎదుర్కొనేలా చర్యలు తీసుకోవాలి. ఆ దేశంతో సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని సూచించారు. చైనా తయారు చేసిన ఈ ఫంగస్ వల్ల గోధుమ, బార్లీ, మొక్కజొన్న, బియ్యానికి నష్టం కలిగించే ఫ్యుసేరియం హెడ్‌ బ్లైట్‌ అనే వ్యాధి అపార నష్టాన్ని మిగుల్చుతుంది. ఈ వ్యాధి మానవులకూ, జంతువులకు సోకుతుంది. వాంతులు, కాలేయం దెబ్బతినడం, సంతానలేమి సమస్యలు ఉత్పన్నమవుతాయి.అంతేకాదు, ఈ ఫంగస్‌ వల్ల ధాన్యం దిగుబడి తగ్గడానికి, నాణ్యత లేని ధాన్యాలు, హానికరమైన మైకోటాక్సిన్‌లతో (డియోక్సినివాలెనాల్ (DON) వంటివి) కలుషితం కావడానికి దారితీస్తుంది. ఈ వైరస్‌ ఉన్న ధాన్యంతో తయారు ఆహారం తింటే మనషులు,జంతువులకు ప్రమాదం ఏర్పడనుంది. అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, ఈ ఫంగస్ ఆగ్రోటెరరిజం ఆయుధంగా పరిగణిస్తుంది. అమెరికాను నాశనం చేసేందుకు అమెరికాపై చైనా దీనిని ప్రయోగిస్తుందనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

former guntur mayor kavati manohar naidu suspended from ysrcp6
ysrcp: గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడిపై సస్పెన్షన్‌ వేటు

గుంటూరు,సాక్షి: గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడుపై సస్పెన్షన్ వేటు పడింది. కావటితో పాటు మర్రి అంజలి, యాట్ల రవికుమార్ అనే ఇద్దరు కార్పరేటర్లు కూడా వైఎస్సార్సీపీ నుండి సస్పెండ్ చేస్తూ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు మాజీ మేయర్‌ కావటి, ఇద్దరు కార్పొరేట్లపై ఫిర్యాదులు రావడంతోనే చర్యలకు ఉపక్రమించింది.

Asian Suniel Resigns Telangana State Film Chamber7
ప్రెసిడెంట్ అయిన 24 గంటల్లోనే పదవికి రాజీనామా

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికైన 24 గంటల్లోనే ఆ పదవికి నిర్మాత సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. అందుకు గల కారణాల్ని కూడా వెల్లడించారు. తనకు సమాచారం ఇవ్వకుండా ఎవరికి వారు ప్రకటనలు జారీ చేస్తున్నారని, కొందరి వ్యాఖ్యలు తనని బాధించాయని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో ప్రెసిడెంట్ పదవిలో కొనసాగడం తనకు కష్టంగా ఉందని చెబుతూ ఓ లేఖని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: నాకు ఆ ఫిగర్ నచ్చలేదు.. అందుకే 'కన్నప్ప'ని ఇంకా: మంచు విష్ణు)అసలేం జరిగిందంటే?టాలీవుడ్‌లో గత కొన్నిరోజులుగా అనిశ్చితి వాతావరణం నెలకొంది. పర్సంటేజీ విషయమై నిర్మాతలతో సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్లకు మధ్య కొన్నిరోజుల క్రితం చర్చలు నడిచాయి. ఇది జరిగిన కొన్నిరోజులకు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు బంద్‍‌ చేయనున్నారనే న్యూస్ బయటకొచ్చింది. దీని తర్వాత పవన్ కల్యాణ్.. ప్రెస్ మీట్ పెట్టి హడావుడి చేశారు. తన సినిమా 'హరిహర వీరమల్లు' వస్తుందనే ఇలా చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జరిగిన తర్వాత ఆ నలుగురు అనే మాట తెగ వైరల్ అయింది.ఆ నలుగురే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లని శాసిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. దీంతో తొలుత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. పవన్ సినిమాని ఆపడానికి తాము ప్రయత్నించలేదు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో శనివారం.. తెలంగాణ ఫిలిం చాంబర్‌లో జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్‌ని ఎంపిక చేశారు. ఇప్పుడు ఇది జరిగిన 24 గంటలు కూడా కాకముందే ఆ పదవికి సునీల్ రాజీనామా చేశారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)

Inter Student Incident In Andhra Pradesh's Anantapur8
AP: ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్య

అనంతపురం: జిల్లాలో దారుణం చోటు చేసకుంది. ఇంటర్‌ చదువుతున్న తన్మయి అనే విద్యార్థిని దారుణంగా హత్య చేయబడింది. కొంతమంది దుండగులు ఇంటర్‌ విద్యార్థినిని తొలుత తలపై బండరాయితో కొట్టి చంపి.. ఆపై పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. ఉరవకొండ నియోజవర్గం కూడేర మండలం బ్రహ్మణపల్లి వద్ద మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. తమ కుమార్తె కనిపిండం లేదని ఆరు రోజుల క్రితం ఫిర్యాదు చేసినా పోలీసలు పట్టించుకోలేదని, చివరకు ఇలా పూర్తిగా కాలిపోయి కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటర్‌ చదివే ఆ విద్యార్థినిని హత్య చేసిన తర్వాత పెట్రోల్‌ పోసి కాల్చివేసినట్ల తెలుస్తోంది. ఆర రోజుల క్రితం అదృశ్యమైనప్పటికీ పోలీసుల కాలయాపన చేయడంతోనే ఇలా జరిగిందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసులు ముందుగానే పట్టించుకని ఉంటే తమ కూతురు బతికేదని తల్లిదండ్రలు కన్నీటి పర్యంతమవుతున్నారు. కాల్‌లిస్ట్‌ పేరుతో పోలీసులు కాలయాపన చేశారని ఆ అమ్మాయి తరఫు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీర్‌ బాటిల్‌తో కొట్టడం వల్లే..విద్యార్థిని తన్మయిని బీర్‌ బాటిల్‌తో కొట్టడం వల్లే చనిపోయిందని అనంతపురం వన్ టౌన్ సీఐ రాజేంద్రనాథ్‌ యాదవ్‌ తెలిపారు. ఈ నెల 3వ తేదీన తన్మయి అదృశ్యం అయినట్లు ఫిర్యాదు వచ్చిందన్నారు. వంటనే కేసు నమోదు చేసి అనుమానితులను విచారించామన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు సీఐ రాజేంద్రనాథ్‌.

CM Revanth Reddy Comments On His Political Journey9
నా స్కూల్‌ మీ వద్దే అని ప్రధాని మోదీకి చెప్పాను: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ 'ఆటో బయోగ్రఫీ' పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్​ శిల్పకళా వేదికలో ఆదివారం( జూన్‌8) ఘనంగా నిర్వహించారు 'ప్రజల కథే నా ఆత్మకథ' పేరుతో బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ పుస్తకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. ‘గౌలిగూడ గల్లి నుంచి హర్యానా గవర్నర్‌గా ఎన్నో రాజకీయ ఓడి దుడుకులు ఎదుర్కొని ఎదిగిన వ్యక్తి బండారు దత్తాత్రేయ. దత్తాత్రేయ, కిషన్ రెడ్డి కుటుంబాలతో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. మొన్న నీతి అయోగ్ మీటింగ్‌లో ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడును చూపించి అప్ కి సాతి యా వా హై(మీ స్నేహితుడు అక్కడున్నారు) అన్నారు. నేను ప్రధానికి చెప్పాను నేను స్కూల్ మీ దగ్గర చదివాను , కాలేజీ వారి(టీడీపీ) దగ్గర చదివి, ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నానని అన్నాను. అన్ని రాజకీయ పార్టీల నేతలు అరుదుగా ఒక వేదికపై కనిపిస్తారు అంటే అది అలయ్ బలయ్ వేదిక. మా మంత్రి వర్గం అంత ఇక్కడే ఉంది. నేను ఇక్కడ కేబినెట్ మీటింగ్ పెట్టుకోవచ్చు. దత్తాత్రేయ ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. హైదరాబాద్ ప్రజల గుండెల్లో పి. జనార్ధన్ రెడ్డి, దత్తాత్రేయలది చెరగని ముద్ర. దత్తాత్రేయ ముక్కు సూటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకి వెళ్ళాలి. కిషన్ రెడ్డితో నాకున్న అనుబంధాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటా. కిషన్ రెడ్డితో కలిసి రాష్ట్ర అభివృద్ధిని ముందుకి తీసుకెళ్తాను’ అని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు.

Active Covid-19 Cases In India Cross 6000 Mark10
దేశంలో కోవిడ్‌ కలకలం.. ఆరు వేలు దాటిన యాక్టివ్‌ కేసులు

ఢిల్లీ: భారత్‌లో రోజురోజుకూ కోవిడ్‌–19 యాక్టివ్‌ కేసులు పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. దేశంలో కొత్తగా 1,131 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య ఆరు వేలు దాటింది. దేశంలో ఆదివారం ఉదయం 8 గంటల నాటికి కోవిడ్-19 యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,133కి చేరుకుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.కోవిడ్‌తో దక్షిణాది రాష్ట్రాల్లో ఆరుగురు మృతి చెందారు. కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు, తమిళనాడులో ఒకరు మృతి చెందారు. కేరళలో 1950, గుజరాత్‌లో 822, బెంగాల్‌లో 693, మహారాష్ట్రలో 595, కర్ణాటకలో 366, ఏపీలో 86, తెలంగాణలో 10 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కోవిడ్‌ మృతుల సంఖ్య కూడా పెరగడంతో మరో ‘కరోనా వేవ్‌’ముంచెత్తుతుందా అన్న భయాలు సైతం వివిధ వర్గాల ప్రజల్లో నెలకొన్నాయి. కేరళలో అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌ తర్వాతి స్థానాల్లో నిలుస్తున్నాయి.కేరళలో శనివారం నాటికి (గత 24 గంటల్లో) 192, గుజరాత్‌లో 107, పశ్చిమబెంగాల్‌లో 58, కర్ణాటకలో 15, ఆంధ్రప్రదేశ్‌లో 12 కొత్త యాక్టివ్‌ కేసులు వెలుగు చూశాయి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోనూ యాక్టివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేసుల వ్యాప్తికి కారణమైన ఒమిక్రాన్‌ సబ్‌వేరియెంట్లు, లీనియేజ్‌లు ఎగువ శ్వాసకోశ వ్యవస్థ (అప్పర్‌ రెస్పిరేటరీ) పైనే ప్రభావం చూపుతున్నందున పెద్దగా భయపడాల్సిన పనిలేదని వైద్య నిపుణులు అంటున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement