Top Stories
ప్రధాన వార్తలు

చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం
ఏపీలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండా పోయిందని చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం తన 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండా పోయింది. శాంతి భద్రతల నిర్వహణలో @ncbn గారి వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంది. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్యచేశారు. ఈనెల జూన్ 3న తమ కుమార్తె కనిపించడంలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ అమ్మాయిని రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఆరు రోజుల తర్వాత కూడేరు మండలం బ్రాహ్మణపల్లె సమీపంలో తన్మయి మృతదేహాన్ని గుర్తించారు. తన్మయి హత్య పూర్తిగా యంత్రాంగ వైఫల్యమే. తమ అమ్మాయి కనిపించడంలేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ పోలీసులు ఏంచేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆరు రోజుల క్రితం ఫిర్యాదు వచ్చినా సరే ఎందుకు పట్టించుకోలేదు? అసలు రాష్ట్రంలో కేసుల దర్యాప్తు మీద, నేరాల అదుపుమీద అసలు దృష్టి ఉందా? కేవలం రెడ్బుక్ రాజ్యాంగం అమలు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప.. ఈ ప్రభుత్వానికి ప్రజల రక్షణపట్ల బాధ్యత అనేది ఉందా? తన్మయి హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, ప్రభుత్వం బాధ్యత వహించాలి.రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండా పోయింది. శాంతి భద్రతల నిర్వహణలో @ncbn గారి వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంది. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్యచేశారు. ఈనెల జూన్ 3న తమ కుమార్తె… pic.twitter.com/WSSOoiAIwL— YS Jagan Mohan Reddy (@ysjagan) June 8, 2025

నన్ను రమ్మని పిలిచారు అంతే.. నాకు ఇంకేమీ తెలీదు: సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2025 టైటిల్ను గెలిచిన సందర్భంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్ల సన్మానం కార్యక్రమం.. పెను విషాదాన్ని మిగిల్చింది. గతవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆ ఈవెంట్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృత్యువాత పడగా, 48 మంది వరకూ గాయపడ్డారు. దీనిపై ప్రతిపక్ష బీజేపీ.. అధికార కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రభుత్వం తప్పిదం వల్లే ఈ ఘోరం జరిగిందంటూ ధ్వజమెత్తింది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టినా అది ప్రభుత్వ వైఫల్యం అని విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది. దీనిపై తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ‘ఆర్సీబీకి సంబంధించిన ఈవెంట్ను తాము నిర్వహించలేనప్పుడు ప్రభుత్వ వైఫల్యం ఎలా అవుతుందని అంటున్నారు. ‘నన్ను ఆ ఈవెంట్కు రమ్మని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(కేఎస్సీఏ) ఆహ్వానించింది. నా వద్దకు వచ్చి మరీ కేఎస్సీఏ పెద్దలు నన్ను ఆహ్వానించారు. గవర్నర్ కూడా ఆ ఈవెంట్కు వస్తున్నారని నాకు చెప్పారు. నేను కూడా ఆ ఈవెంట్కు వెళ్లా. అంతేకానీ మేము ఆ ఈవెంట్ను నిర్వహించలేదు. నన్ను రమ్మన్నారు.. వెళ్లాను.. అంతకుమించి నాకైతే ఏమీ తెలీదు’ అని స్పష్టం చేశారు. ఆ కార్యక్రమాన్ని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిందని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఐపీఎల్ టైటిల్ను సాధించాలనే చిరకాల కోరిక ఆర్సీబీకి ఎట్టకేలకు లభించడంతో ఆ జట్టును ఘనంగా సన్మానించాలనుకున్నారు. దాంతో ఆదరా బాదరగా ఈవెంట్ను ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది. లక్షల్లో అభిమానల హాజరుకావడంతో ఆ ఈవెంట్ కాస్తా విషాదంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ, కేఎస్సీఏలతో పాటు కర్ణాటక ప్రభుత్వంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ టీమ్ పెద్ద ఈవెంట్ను నిర్వహిస్తంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటూ విమర్శల వర్షం కురిసింది. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే సీఎం సిద్ధరామయ్యతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లు సంజాయిషీలు ఇస్తూనే వస్తున్నారు.

ఒకే ఓవర్లో 5 సిక్సర్లు.. విండీస్ బ్యాటర్ల బీభత్సం
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో ఇవాళ (జూన్ 8) జరుగుతున్న రెండో మ్యాచ్లో వెస్టిండీస్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు బీభత్సం సృష్టించారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ ఆదిలో నిదానంగా ఆడినా, ఇన్నింగ్స్ చివర్లో చెలరేగింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు రోవ్మన్ పావెల్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), జేసన్ హోల్డర్ (9 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రోస్టన్ ఛేజ్ (1 బంతిలో 6 పరుగులు (నాటౌట్) ఆకాశమే హద్దుగా బ్యాటింగ్ చేశారు. ఫలితంగా ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.16 ఓవర్లలో తర్వాత 121/4గా ఉండిన విండీస్ స్కోర్.. చివరి 4 ఓవర్లలో రాకెట్ లాగా దూసుకోపోయింది. పావెల్, షెపర్డ్, హోల్డర్, ఛేజ్ విజృంభించడంతో 4 ఓవర్లలో ఏకంగా 75 పరుగులు వచ్చాయి. ఆదిల్ రషీద్ వేసిన 19 ఓవర్లో హోల్డర్, షెపర్డ్ ఊచకోత కోశారు. ఈ ఓవర్లో ఇరువురు కలిసి 5 సిక్సర్లు బాదారు. ఫలితంగా ఆ ఓవర్లో 31 పరుగులు వచ్చాయి. అంతకుముందు 17 ఓవర్లో 20, 18వ ఓవర్లో 8, ఆఖరి ఓవర్లో 16 పరుగులు వచ్చాయి.కాగా, ఈ సిరీస్లో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (96) తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. జేమీ స్మిత్ (38), జేకబ్ బేతెల్ (23 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో షెపర్డ్ వికెట్లు తీశాడు.అనంతరం బరిలోకి దిగిన విండీస్.. లియామ్ డాసన్ (4-0-20-4) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులే చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో పాట్స్, జేకబ్ బేతెల్ తలో 2 వికెట్లు తీశారు. విండీస్ ఇన్నింగ్స్లో ఎవిన్ లెవిస్ (39) టాప్ స్కోరర్ కాగా.. ఛేజ్ 24, జాన్సన్ ఛార్లెస్ 18, రోవ్మన్ పావెల్ 13, ఆండ్రీ రసెల్ 15, షెపర్డ్ 16, హోల్డర్ 16 (నాటౌట్) పరుగులు చేశారు.

AP: ‘టీచర్లను ఎలా మోసం చేశారంటే...’
నెల్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల బదిలీల ప్రక్రియను కూటమి సర్కరా్ ప్రహాసనంగా మార్చేసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బదిలీల్లో మ్యానువల్ ఆప్షన్ అమలు చేస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం ఆఖరి నిమిషంలో ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ను తప్పనిసరి చేయడం ద్వారా మొత్తం ఉపాధ్యాయలోకంను పచ్చిగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్కు రెడ్బుక్పై ఉన్న శ్రద్దలో కాస్తైనా విద్యాశాఖపై లేకపోవడం వల్లే రాష్ట్రంలో విద్యావ్యవస్థ అధ్వన్నంగా మారిందని ధ్వజమెత్తారు. తక్షణం ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు మ్యానువల్ విధానంలోనే బదిలీ ప్రక్రియ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...తాజాగా కూటమి ప్రభుత్వం టీచర్ల బదిలీలకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ రోజు నుంచి 48 గంటల్లో ఆన్లైన్ బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలంటూ, ఒక్కో టీచర్ 2500 ఆప్షన్స్ పెట్టుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాల వల్ల రాష్ట్రంలో 1.20 లక్షల మంది ఎస్జీటీలకు సంబంధించి అటు హెచ్ఎం పదోన్నతులు లేకుండా చేశారు. మరోవైపు 48 గంటల్లో ఒక్కో టీచర్ 2500 ఆన్లైన్ బదిలీ అప్షన్స్ పెట్టుకోవాలంటూ ఒత్తిడి చేయడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు.టీచర్లను ఎలా మోసం చేశారంటే...టీచర్ల బదిలీలకు సంబంధించిన చట్టానికి విరుద్దంగా రోజుకోరకంగా నిబంధనలను మార్చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం టీచర్లకు వెన్నుపోటు పొడిచింది. 35 వారాల పాటు ప్రతి శుక్రవారం మీటింగ్లు పెట్టి మ్యానువల్ కౌన్సిలింగ్ ద్వారానే బదిలీలు చేస్తానని చెప్పి నమ్మించారు. తరువాత అసెంబ్లీలో మాత్రం మ్యాన్వల్కు బదులు ఆన్లైన్ కౌన్సెలింగ్ చేస్తామని చట్టం తీసుకువచ్చారు. దీనిపై టీచర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో అధికారులు చట్టంలో ఉన్న దానిని పక్కకుపెట్టి మ్యాన్వల్ బదిలీలనే చేస్తామని హామీ ఇచ్చారు. గత మే నెలలో ఆన్లైన్ బదిలీలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండటంతో డీఈఓ కార్యాలయాల ముందు మే 25న ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. దీనితో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టీచర్ యూనియన్లతో ఒక మీటింగ్ పెట్టి చట్టప్రకారం ఆన్లైన్ బదిలీలు ఉన్నా కూడా, దానిని పక్కకు పెట్టి మ్యానువల్ బదిలీలే చేస్తామని హామీ ఇవ్వడంతో టీచర్ యూనియన్లు ఆందోళనను విరమించుకున్నారు. అదే క్రమంలో ప్రభుత్వం మే 25న బదిలీలకు సంబంధించి జారీ చేసిన జీఓ 22లో ఖచ్చితంగా ఆన్లైన్ బదిలీలే చేస్తామని స్పష్టం చేసింది. ఇంతకంటే మోసం ఎక్కడైనా ఉంటుందా? దీనిపై టీచర్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పొరపాటుగా ఆ జీఓ జారీ చేశామని, మ్యానువల్ బదిలీలే చేస్తామంటూ టీచర్ సంఘాలకు అధికారులు హామీ ఇచ్చారు. ఇప్పుడు హటాత్తుగా బదిలీలపై తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా పదేపదే టీచర్లను నమ్మించి, నిలువుగా దగా చేస్తూనే ఉన్నారు.బదిలీల ప్రక్రియ అస్తవ్యస్తంగత ప్రభుత్వం జారీ చేసిన 117 జీఓను రద్దు చేసి, కూటమి ప్రభుత్వం తొమ్మిది రకాల స్కూల్స్ను తీసుకువచ్చింది. బదిలీల కోసం వెబ్ అప్షన్స్లో ఫౌండేషన్, బేసిక్, మెడల్ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అనే నాలుగు ఆప్షన్స్ కనిపించాల్సి ఉంది. కానీ కేవలం ఎంపీపీ, యుపీ స్కూల్స్ అని మాత్రమే పెట్టారు. దీనితో టీచర్లలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తాము ఆప్షన్ ఇచ్చే స్కూల్ ఏ కేటగిరిలోకి మార్పు చెందిందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. రేపు సాయంత్రంతో వెబ్ అప్షన్స్ గడువు ముగుస్తోంది. తొమ్మిదిరకాల స్కూల్స్గా మార్చిన నేపథ్యంలో కొన్ని మండలాల్లో బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఎక్కువగా పెడితే, మరికొన్ని మండలాల్లో ఫౌండేషన్ స్కూల్స్ను ఎక్కువగా పెట్టారు. ఎక్కడా హేతుబద్దత అనేది లేకుండా చేశారు. తెలుగుదేశం నాయకులు చెప్పినట్లుగా స్కూల్స్ కేటగిరిని మార్చారు. ఆర్జేడీ, డీఈఓ, ఎంఈఓలతో సంబంధం లేకుండా, నిబంధనలకు అనుగుణంగా ఏ స్కూల్ ఏ కేటగిరిలో ఉండాలని నిర్ణయించకుండా, టీడీపీ నాయకులు సూచించినట్లుగా స్కూల్స్ను మార్చేశారు. టీచర్లు ఎన్ని సంవత్సరాలు, ఎంత దూరంలో పనిచేశారనే దానిపై పాయింట్స్ ఇస్తారు. దాని ప్రకారమే బదిలీల్లో ప్రాధాన్యత ఉంటుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో ఈ పాయింట్స్ కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడుతున్నారు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని చూపి టీచర్లను భయపెట్టాలని అనుకుంటున్నారు. రాజకీయ ఒత్తిళ్ళతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే, రాబోయే రోజుల్లో ఇబ్బంది పడతారు. ఎనిమిది అకడమిక్ ఇయర్స్ పూర్తయితే బదిలీ చేస్తామనే నిబంధనలు ఉంటే, ఎనిమిది క్యాలెండర్ ఇయర్స్ పూర్తి కాలేదంటూ సాకులు చూపి పాయింట్స్ ఇవ్వడం లేదు. అలాగే దాదాపు 4000 మంది స్కూల్ అసిస్టెంట్లు సర్ప్లస్గా మారిపోయారు. వారిని నిబంధనలకు విరుద్దంగా ప్రైమరీ స్కూల్కు కేటాయిస్తున్నారు. ఇరవై ఏళ్ళ సర్వీస్ ఉన్న స్కూల్ అసిస్టెంట్ను కూడా పీఎస్ హెచ్ఎంగా మోడల్ స్కూల్స్కు పంపడం దారుణం. దీనివల్ల ఎస్జీటీలకు పీఎస్ హెచ్ఎం పదోన్నతి రాకుండా పోయింది.పదో తరగతి మూల్యాంకనంతో పరువు పోయిందిమంత్రి నారా లోకేష్ అసమర్థత కారణంగా, పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో చూసిన నిర్లక్ష్యంతో విద్యాశాఖ పరువు పోయింది. పదోతరగతి పరీక్షలు విద్యార్ధుల భవిష్యత్తుకు తొలి మెట్టు. అటువంటి పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరిగాయో అందరికీ తెలుసు. నెల్లూరుకు చెందిన విద్యార్థిని సాయి కుందనకి అన్ని సబ్జెక్ట్ల్లో తొంబైకి పైగా మార్కులు వస్తే, హిందీ సబ్జెక్ట్లో 34 మార్కులు వచ్చాయి, బాలికను ఫెయిల్ చేశారు. ఆమె రీవాల్యుయేషన్ పెట్టకుంటే 90 మార్కులు వచ్చాయి. నెల రోజుల పాటు ఆ విద్యార్ధి ఎంత వేదన చెంది ఉంటారో అర్థం చేసుకోవాలి. బొర్రా శిశింద్రారెడ్డికి గణితంలో 32 మార్కులు వేశారు. అన్నింటిలో మంచి మార్కులు వచ్చిన ఈ విద్యార్ధి తిరిగి రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే 72 మార్కులు వేశారు. దీనిపైన మళ్ళీ రీకౌంటింగ్ చేయించుకుంటే 78 మార్కులు వచ్చాయి. ప్రొద్దుటూరుకు చెందిన గంగిరెడ్డి మోక్షితను సోషల్ లో 21 మార్కులతో ఫెయిల్ చేశారు. రీవాల్యుయేషన్లో 84 మార్కులు వచ్చాయి. ఇలా అనేక మంది విద్యార్ధుల జవాబుపత్రాలను తీసుకువస్తే, ఎంత దారుణంగా వాల్యుయేషన్ చేశారో అర్థమవుతుంది. ఒక సబ్జెక్ట్ను దిద్దడానికి పదిరోజులు సమయం ఇచ్చే పరిస్థితి ఉంటే, ఆరు రోజుల్లో పూర్తి చేయాలని ఒత్తిడి చేశారు’ అని చంద్రశేఖర్రెడ్డి స్పష్టం చేశారు.

కోవిడ్-19 కంటే డేంజర్: చైనా నుంచి అమెరికాకు ఫంగస్, ట్రంప్కు డెడ్లీ వార్నింగ్
బీజింగ్: అమెరికా సంతతికి చెందిన చైనా నిపుణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాగ్రత్త పడకపోతే కోవిడ్-19 కన్నా దారుణ విపత్తు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఇటీవల చైనాకు చెందిన ఇద్దరు సైంటిస్టులు ప్రమాదకరమైన ఫంగస్ను రహస్యంగా అమెరికాకు తరలించేందుకు కుట్ర చేశారు. ఆ కుట్రను అమెరికా గుట్టు రట్టు చేసింది.యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కోవిడ్-19 మహమ్మారి.. మొట్టమొదటగా చైనాలోని వుహాన్లో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు చైనా మరోసారి కోవిడ్-19 కంటే ప్రమాదకరమైన పొటెన్షియల్ ఆగ్రోటెర్రరిజం వెపన్ పేరుతో ప్రమాదకరమైన ఫంగస్ ఫ్యూసారియం గ్రామినియంను అమెరికాకు తరలించింది. చైనా సైంటిస్టులు యున్ క్వింగ్ జియాన్ (33),జూన్ యాంగ్ లియూ (34) ఫంగస్ను స్మగ్లింగ్ చేయడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలో ఫంగస్ విషయంలో అమెరికా జాగ్రత్తగా ఉండాలని చైనా నిపుణుడు గార్డన్ జి.చాంగ్ వార్నింగ్ ఇచ్చారు.‘అమెరికాతో యుద్ధం చేసేందుకు చైనా సిద్ధమైంది. అమెరికా తక్షణ చర్యలు తీసుకోకపోతే కోవిడ్-19 కంటే భయంకరమైన విపత్తు చోటు చేసుకునే అవకాశం ఉంది. 2020లో చైనా పండించిన విత్తనాల్ని అమెరికాలోని 50 రాష్ట్రాలకు రవాణా చేసింది. ఆ విత్తనాల రవాణాకు చైనా ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. అది ఆగ్రో టెర్రరిజంలోని భాగమేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.అందుకు 2019 మే నెలలో ప్రముఖ చైనా పత్రిక పీపుల్స్ డైలీ ఎడిటోరియల్ ప్రచురించింది. ఆ ఎడిటోరియల్ సారాంశం అమెరికాతో చైనా యుద్ధం చేయాలి. అదే కథనాన్ని గార్డన్ జి.చాంగ్ ఊటంకిస్తూ.. తాజాగా ఫ్యూసారియం గ్రామినియం ఫంగస్ను అమెరికాకు పంపించింది. చైనా ప్రభుత్వం స్వయంగా ఈ యుద్ధానికి సిద్ధమవుతోంది. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ చైనా ప్రజల్ని సైతం సంసిద్ధం చేస్తున్నారు. మనం చైనాను ఎదుర్కొనేలా చర్యలు తీసుకోవాలి. ఆ దేశంతో సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని సూచించారు. చైనా తయారు చేసిన ఈ ఫంగస్ వల్ల గోధుమ, బార్లీ, మొక్కజొన్న, బియ్యానికి నష్టం కలిగించే ఫ్యుసేరియం హెడ్ బ్లైట్ అనే వ్యాధి అపార నష్టాన్ని మిగుల్చుతుంది. ఈ వ్యాధి మానవులకూ, జంతువులకు సోకుతుంది. వాంతులు, కాలేయం దెబ్బతినడం, సంతానలేమి సమస్యలు ఉత్పన్నమవుతాయి.అంతేకాదు, ఈ ఫంగస్ వల్ల ధాన్యం దిగుబడి తగ్గడానికి, నాణ్యత లేని ధాన్యాలు, హానికరమైన మైకోటాక్సిన్లతో (డియోక్సినివాలెనాల్ (DON) వంటివి) కలుషితం కావడానికి దారితీస్తుంది. ఈ వైరస్ ఉన్న ధాన్యంతో తయారు ఆహారం తింటే మనషులు,జంతువులకు ప్రమాదం ఏర్పడనుంది. అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ప్రకారం, ఈ ఫంగస్ ఆగ్రోటెరరిజం ఆయుధంగా పరిగణిస్తుంది. అమెరికాను నాశనం చేసేందుకు అమెరికాపై చైనా దీనిని ప్రయోగిస్తుందనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

ysrcp: గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడిపై సస్పెన్షన్ వేటు
గుంటూరు,సాక్షి: గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడుపై సస్పెన్షన్ వేటు పడింది. కావటితో పాటు మర్రి అంజలి, యాట్ల రవికుమార్ అనే ఇద్దరు కార్పరేటర్లు కూడా వైఎస్సార్సీపీ నుండి సస్పెండ్ చేస్తూ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు మాజీ మేయర్ కావటి, ఇద్దరు కార్పొరేట్లపై ఫిర్యాదులు రావడంతోనే చర్యలకు ఉపక్రమించింది.

ప్రెసిడెంట్ అయిన 24 గంటల్లోనే పదవికి రాజీనామా
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికైన 24 గంటల్లోనే ఆ పదవికి నిర్మాత సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. అందుకు గల కారణాల్ని కూడా వెల్లడించారు. తనకు సమాచారం ఇవ్వకుండా ఎవరికి వారు ప్రకటనలు జారీ చేస్తున్నారని, కొందరి వ్యాఖ్యలు తనని బాధించాయని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో ప్రెసిడెంట్ పదవిలో కొనసాగడం తనకు కష్టంగా ఉందని చెబుతూ ఓ లేఖని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: నాకు ఆ ఫిగర్ నచ్చలేదు.. అందుకే 'కన్నప్ప'ని ఇంకా: మంచు విష్ణు)అసలేం జరిగిందంటే?టాలీవుడ్లో గత కొన్నిరోజులుగా అనిశ్చితి వాతావరణం నెలకొంది. పర్సంటేజీ విషయమై నిర్మాతలతో సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్లకు మధ్య కొన్నిరోజుల క్రితం చర్చలు నడిచాయి. ఇది జరిగిన కొన్నిరోజులకు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు బంద్ చేయనున్నారనే న్యూస్ బయటకొచ్చింది. దీని తర్వాత పవన్ కల్యాణ్.. ప్రెస్ మీట్ పెట్టి హడావుడి చేశారు. తన సినిమా 'హరిహర వీరమల్లు' వస్తుందనే ఇలా చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జరిగిన తర్వాత ఆ నలుగురు అనే మాట తెగ వైరల్ అయింది.ఆ నలుగురే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లని శాసిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. దీంతో తొలుత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. పవన్ సినిమాని ఆపడానికి తాము ప్రయత్నించలేదు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో శనివారం.. తెలంగాణ ఫిలిం చాంబర్లో జనరల్ బాడీ సమావేశం జరిగింది. తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ని ఎంపిక చేశారు. ఇప్పుడు ఇది జరిగిన 24 గంటలు కూడా కాకముందే ఆ పదవికి సునీల్ రాజీనామా చేశారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)

AP: ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య
అనంతపురం: జిల్లాలో దారుణం చోటు చేసకుంది. ఇంటర్ చదువుతున్న తన్మయి అనే విద్యార్థిని దారుణంగా హత్య చేయబడింది. కొంతమంది దుండగులు ఇంటర్ విద్యార్థినిని తొలుత తలపై బండరాయితో కొట్టి చంపి.. ఆపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఉరవకొండ నియోజవర్గం కూడేర మండలం బ్రహ్మణపల్లి వద్ద మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. తమ కుమార్తె కనిపిండం లేదని ఆరు రోజుల క్రితం ఫిర్యాదు చేసినా పోలీసలు పట్టించుకోలేదని, చివరకు ఇలా పూర్తిగా కాలిపోయి కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటర్ చదివే ఆ విద్యార్థినిని హత్య చేసిన తర్వాత పెట్రోల్ పోసి కాల్చివేసినట్ల తెలుస్తోంది. ఆర రోజుల క్రితం అదృశ్యమైనప్పటికీ పోలీసుల కాలయాపన చేయడంతోనే ఇలా జరిగిందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసులు ముందుగానే పట్టించుకని ఉంటే తమ కూతురు బతికేదని తల్లిదండ్రలు కన్నీటి పర్యంతమవుతున్నారు. కాల్లిస్ట్ పేరుతో పోలీసులు కాలయాపన చేశారని ఆ అమ్మాయి తరఫు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీర్ బాటిల్తో కొట్టడం వల్లే..విద్యార్థిని తన్మయిని బీర్ బాటిల్తో కొట్టడం వల్లే చనిపోయిందని అనంతపురం వన్ టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు. ఈ నెల 3వ తేదీన తన్మయి అదృశ్యం అయినట్లు ఫిర్యాదు వచ్చిందన్నారు. వంటనే కేసు నమోదు చేసి అనుమానితులను విచారించామన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు సీఐ రాజేంద్రనాథ్.

నా స్కూల్ మీ వద్దే అని ప్రధాని మోదీకి చెప్పాను: సీఎం రేవంత్
హైదరాబాద్: హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ 'ఆటో బయోగ్రఫీ' పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఆదివారం( జూన్8) ఘనంగా నిర్వహించారు 'ప్రజల కథే నా ఆత్మకథ' పేరుతో బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ పుస్తకాన్ని సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘గౌలిగూడ గల్లి నుంచి హర్యానా గవర్నర్గా ఎన్నో రాజకీయ ఓడి దుడుకులు ఎదుర్కొని ఎదిగిన వ్యక్తి బండారు దత్తాత్రేయ. దత్తాత్రేయ, కిషన్ రెడ్డి కుటుంబాలతో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. మొన్న నీతి అయోగ్ మీటింగ్లో ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడును చూపించి అప్ కి సాతి యా వా హై(మీ స్నేహితుడు అక్కడున్నారు) అన్నారు. నేను ప్రధానికి చెప్పాను నేను స్కూల్ మీ దగ్గర చదివాను , కాలేజీ వారి(టీడీపీ) దగ్గర చదివి, ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నానని అన్నాను. అన్ని రాజకీయ పార్టీల నేతలు అరుదుగా ఒక వేదికపై కనిపిస్తారు అంటే అది అలయ్ బలయ్ వేదిక. మా మంత్రి వర్గం అంత ఇక్కడే ఉంది. నేను ఇక్కడ కేబినెట్ మీటింగ్ పెట్టుకోవచ్చు. దత్తాత్రేయ ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. హైదరాబాద్ ప్రజల గుండెల్లో పి. జనార్ధన్ రెడ్డి, దత్తాత్రేయలది చెరగని ముద్ర. దత్తాత్రేయ ముక్కు సూటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకి వెళ్ళాలి. కిషన్ రెడ్డితో నాకున్న అనుబంధాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటా. కిషన్ రెడ్డితో కలిసి రాష్ట్ర అభివృద్ధిని ముందుకి తీసుకెళ్తాను’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

దేశంలో కోవిడ్ కలకలం.. ఆరు వేలు దాటిన యాక్టివ్ కేసులు
ఢిల్లీ: భారత్లో రోజురోజుకూ కోవిడ్–19 యాక్టివ్ కేసులు పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. దేశంలో కొత్తగా 1,131 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య ఆరు వేలు దాటింది. దేశంలో ఆదివారం ఉదయం 8 గంటల నాటికి కోవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య 6,133కి చేరుకుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.కోవిడ్తో దక్షిణాది రాష్ట్రాల్లో ఆరుగురు మృతి చెందారు. కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు, తమిళనాడులో ఒకరు మృతి చెందారు. కేరళలో 1950, గుజరాత్లో 822, బెంగాల్లో 693, మహారాష్ట్రలో 595, కర్ణాటకలో 366, ఏపీలో 86, తెలంగాణలో 10 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ మృతుల సంఖ్య కూడా పెరగడంతో మరో ‘కరోనా వేవ్’ముంచెత్తుతుందా అన్న భయాలు సైతం వివిధ వర్గాల ప్రజల్లో నెలకొన్నాయి. కేరళలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ తర్వాతి స్థానాల్లో నిలుస్తున్నాయి.కేరళలో శనివారం నాటికి (గత 24 గంటల్లో) 192, గుజరాత్లో 107, పశ్చిమబెంగాల్లో 58, కర్ణాటకలో 15, ఆంధ్రప్రదేశ్లో 12 కొత్త యాక్టివ్ కేసులు వెలుగు చూశాయి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోనూ యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేసుల వ్యాప్తికి కారణమైన ఒమిక్రాన్ సబ్వేరియెంట్లు, లీనియేజ్లు ఎగువ శ్వాసకోశ వ్యవస్థ (అప్పర్ రెస్పిరేటరీ) పైనే ప్రభావం చూపుతున్నందున పెద్దగా భయపడాల్సిన పనిలేదని వైద్య నిపుణులు అంటున్నారు.
చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం
‘నేను కమిషన్ దగ్గరకు దోషిగా వెళ్లలేదు.. సాక్షిగా వెళ్లాను’
రూ.10 కోట్లు కట్ చేస్తామన్నారు.. 'కుబేర' నిర్మాత ఆవేదన
ఒకే ఓవర్లో 5 సిక్సర్లు.. విండీస్ బ్యాటర్ల బీభత్సం
గ్రాండ్గా అక్కినేని అఖిల్ రిసెప్షన్
ఫోన్ ట్యాపింగ్ కేసు.. హైదరాబాద్కు ప్రభాకర్రావు!
నన్ను రమ్మని పిలిచారు అంతే.. నాకు ఇంకేమీ తెలీదు: సీఎం సిద్ధరామయ్య
టీమిండియాకు స్వల్ప ఆధిక్యం
ysrcp: గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడిపై సస్పెన్షన్ వేటు
అందుకే నేను 'కన్నప్ప'లో నటించలేదు: మంచు లక్ష్మీ
స్పా ముసుగులో వ్యభిచారం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్, అనూష కలిసి..
శ్రేయాస్ అయ్యర్ను పెళ్లి చేసుకున్నాను.. తల్లిని కూడా: నటి
మొత్తానికి శ్రీవారు ప్రపోజ్ చేశారు, సీక్రెట్ చెప్పిన ‘ప్రేమపావురం’ (ఫొటోలు)
అమరావతి ప్రజలారా.. బాబుని నమ్మొద్దు.. టీడీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
20 ఏళ్లు దాటేసినా 'వెంకీ'లో అది కనిపెట్టలేకపోయారు
రోహిత్ శర్మకు షాక్..! టీమిండియా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్?
ట్రంప్ ఎలన్ మస్క్ మధ్య పెరుగుతున్న దూరం
ఈ రాశి వారు ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
నన్ను దూరం పెట్టాడు.. ఎందుకు వదిలేస్తున్నావని నిలదీశా!
మాగంటిని చూసి.. కన్నీరు పెట్టిన కేసీఆర్
అఖిల్ అక్కినేని సతీమణి 'జైనబ్' ఫోటోషూట్ లుక్స్ చూశారా..? (ఫొటోలు)
గ్రాండ్గా అఖిల్- జైనాబ్ రిసెప్షన్ వేడుక.. హాజరైన పలువురు ప్రముఖులు (ఫొటోలు)
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఇంటిలో శుభకార్యాలు
టీడీపీకి బిగ్ షాక్.. సీనియర్ నాయకుడు రాజీనామా
విమాన సిబ్బంది తీరుపై అసహనం
నువ్వు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా: అతియా ఎమోషనల్
Akhil-Zianab : జైనాబ్ డైమండ్ జ్యుయల్లరీ స్పెషల్ ఎట్రాక్షన్
ఎందులో అనేది మనకనవసరం! అమెరికాను అధిగమించి టాప్లో ఉన్నాం చాలు!
‘సిందూర’ మొక్క నాటిన ప్రధాని మోదీ
చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం
‘నేను కమిషన్ దగ్గరకు దోషిగా వెళ్లలేదు.. సాక్షిగా వెళ్లాను’
రూ.10 కోట్లు కట్ చేస్తామన్నారు.. 'కుబేర' నిర్మాత ఆవేదన
ఒకే ఓవర్లో 5 సిక్సర్లు.. విండీస్ బ్యాటర్ల బీభత్సం
గ్రాండ్గా అక్కినేని అఖిల్ రిసెప్షన్
ఫోన్ ట్యాపింగ్ కేసు.. హైదరాబాద్కు ప్రభాకర్రావు!
నన్ను రమ్మని పిలిచారు అంతే.. నాకు ఇంకేమీ తెలీదు: సీఎం సిద్ధరామయ్య
టీమిండియాకు స్వల్ప ఆధిక్యం
ysrcp: గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడిపై సస్పెన్షన్ వేటు
అందుకే నేను 'కన్నప్ప'లో నటించలేదు: మంచు లక్ష్మీ
స్పా ముసుగులో వ్యభిచారం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్, అనూష కలిసి..
శ్రేయాస్ అయ్యర్ను పెళ్లి చేసుకున్నాను.. తల్లిని కూడా: నటి
అమరావతి ప్రజలారా.. బాబుని నమ్మొద్దు.. టీడీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
20 ఏళ్లు దాటేసినా 'వెంకీ'లో అది కనిపెట్టలేకపోయారు
రోహిత్ శర్మకు షాక్..! టీమిండియా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్?
ట్రంప్ ఎలన్ మస్క్ మధ్య పెరుగుతున్న దూరం
ఈ రాశి వారు ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
నన్ను దూరం పెట్టాడు.. ఎందుకు వదిలేస్తున్నావని నిలదీశా!
మాగంటిని చూసి.. కన్నీరు పెట్టిన కేసీఆర్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఇంటిలో శుభకార్యాలు
విమాన సిబ్బంది తీరుపై అసహనం
టీడీపీకి బిగ్ షాక్.. సీనియర్ నాయకుడు రాజీనామా
నువ్వు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా: అతియా ఎమోషనల్
Akhil-Zianab : జైనాబ్ డైమండ్ జ్యుయల్లరీ స్పెషల్ ఎట్రాక్షన్
ఎందులో అనేది మనకనవసరం! అమెరికాను అధిగమించి టాప్లో ఉన్నాం చాలు!
‘సిందూర’ మొక్క నాటిన ప్రధాని మోదీ
అలా ఎలా ఔట్ ఇస్తావు.. అంపైర్పై జైశ్వాల్ ఫైర్! వీడియో వైరల్
కాంగ్రెస్లో ‘కేబినెట్ బెర్త్’ హీట్.. ముగ్గురు అసంతృప్తి నేతల దారెటు?
శ్రుతి తప్పిన రుతురాగం
సినిమా

వైట్ షర్ట్లో జవాల్కర్ హొయలు.. దేవకన్యలా జాక్వెలిన్
షర్ట్ సైడ్ చేసి రెచ్చగొట్టేస్తున్న ప్రియాంక జవాల్కర్దేవకన్యలా మారిపోయి అందాల చందమామల జాక్వెలిన్పట్టుచీరలో బుట్టబొమ్మలా మీనాక్షి చౌదరిబ్లర్రీ పోజుల్లో 'డ్రాగన్' ఫేమ్ కాయదు లోహర్చీరలో కేక పుట్టిస్తున్న కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్మెడలో హారంతో మాయ చేసేలా చూస్తున్న రుహానీ శర్మఎల్లో డ్రస్సులో మంట పుట్టించేస్తున్న నందిని రాయ్ View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Mithila Palkar (@mipalkarofficial) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta)

ప్రెసిడెంట్ అయిన 24 గంటల్లోనే పదవికి రాజీనామా
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికైన 24 గంటల్లోనే ఆ పదవికి నిర్మాత సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. అందుకు గల కారణాల్ని కూడా వెల్లడించారు. తనకు సమాచారం ఇవ్వకుండా ఎవరికి వారు ప్రకటనలు జారీ చేస్తున్నారని, కొందరి వ్యాఖ్యలు తనని బాధించాయని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో ప్రెసిడెంట్ పదవిలో కొనసాగడం తనకు కష్టంగా ఉందని చెబుతూ ఓ లేఖని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: నాకు ఆ ఫిగర్ నచ్చలేదు.. అందుకే 'కన్నప్ప'ని ఇంకా: మంచు విష్ణు)అసలేం జరిగిందంటే?టాలీవుడ్లో గత కొన్నిరోజులుగా అనిశ్చితి వాతావరణం నెలకొంది. పర్సంటేజీ విషయమై నిర్మాతలతో సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్లకు మధ్య కొన్నిరోజుల క్రితం చర్చలు నడిచాయి. ఇది జరిగిన కొన్నిరోజులకు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు బంద్ చేయనున్నారనే న్యూస్ బయటకొచ్చింది. దీని తర్వాత పవన్ కల్యాణ్.. ప్రెస్ మీట్ పెట్టి హడావుడి చేశారు. తన సినిమా 'హరిహర వీరమల్లు' వస్తుందనే ఇలా చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జరిగిన తర్వాత ఆ నలుగురు అనే మాట తెగ వైరల్ అయింది.ఆ నలుగురే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లని శాసిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. దీంతో తొలుత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. పవన్ సినిమాని ఆపడానికి తాము ప్రయత్నించలేదు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో శనివారం.. తెలంగాణ ఫిలిం చాంబర్లో జనరల్ బాడీ సమావేశం జరిగింది. తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ని ఎంపిక చేశారు. ఇప్పుడు ఇది జరిగిన 24 గంటలు కూడా కాకముందే ఆ పదవికి సునీల్ రాజీనామా చేశారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)

పవన్ 'హరిహర..' పరువు తీసిన యాంకర్!
పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా.. లెక్క ప్రకారం జూన్ 12న థియేటర్లలోకి రావాలి. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. బహుశా జూలైలో రిలీజ్ ఉండొచ్చు. మార్కెట్లో చూసుకుంటే ఈ సినిమాపై అసలు బజ్ లేదు. మొన్నీమధ్య అంటే శుక్రవారం మచిలీపట్నంలో మూవీ ఈవెంట్ జరగ్గా.. దీనికి ఉదయభాను యాంకరింగ్ చేసింది. ఓ విషయాన్ని మర్చిపోయిన ఈమె.. ఓ రకంగా మూవీ పరువు తీసేసిందనే చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే?పవన్ 'హరిహర..' సినిమా నుంచి ఇదివరకే రెండు మూడు పాటలు రిలీజయ్యాయి కానీ వాటికి పెద్దగా రీచ్ లేదు. ఇప్పుడు మచిలీపట్నం ఈవెంట్ని యాంకరింగ్ చేసిన ఉదయభాను, డైరెక్టర్ జ్యోతికృష్ణతో మాట్లాడుతుంటే మధ్యలో కల్పించుకుని.. ఇదంతా చూస్తుంటే ఇందులో పవన్ కల్యాణ్ కచ్చితంగా ఓ పాట పాడి ఉంటారని, అదేంటో చెప్పండి.. సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారా? అని ఏమీ తెలియనట్టుగా అడిగేసింది. దీంతో డైరెక్టర్ ఏం అనాలో తెలీక బిక్కమొహం వేశాడు.(ఇదీ చదవండి: చెట్టు వెనక్కెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు.. అప్పుడు బిగ్బీ..)ఎందుకంటే కొన్నాళ్ల క్రితం పవన్ పాడిన 'మాట వినాలి' అనే పాటనే తొలుత రిలీజ్ చేశారు. ఈవెంట్కి యాంకరింగ్ చేస్తున్న ఉదయభానుకి ఆ విషయం కూడా తెలియకపోవడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఆమె అడిగేసరికి అక్కడిక్కడ కవర్ చేసిన దర్శకుడు జ్యోతికృష్ణ.. పాట గురించి చెప్పుకొచ్చారు. అలానే ఇదే ఈవెంట్లో మాట్లాడుతూ పవన్ ఇప్పటికీ మూడుసార్లు సినిమా చూశారని, ఆయనకు తెగ నచ్చడంతో గంటసేపు తనని మెచ్చుకున్నారని జ్యోతికృష్ణ చెప్పాడు.అప్పుడెప్పుడో 2020లో మొదలైన ఈ సినిమా.. కొన్నాళ్ల క్రితం షూటింగ్ ముగించుకుంది. థియేటర్లలో రిలీజ్ చేద్దామనుకుంటే ఎక్కడలేని కష్టాలన్నీ వస్తున్నాయి. గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాలేదని మూవీ టీమ్ అంటోంది గానీ మూవీ కొనేందుకు బయ్యర్లు ఎవరూ ముందుకు రావడం లేదని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. మరి అన్ని అడ్డంకులు దాటుకుని 'హరిహర వీరమల్లు' థియేటర్లలోకి ఎప్పుడొస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ప్రభాస్ సినిమా.. 70 ఏళ్ల వయసులో గోడ దూకిన నటుడు)

నాకు ఆ ఫిగర్ నచ్చలేదు.. అందుకే 'కన్నప్ప'ని ఇంకా: మంచు విష్ణు
ప్రస్తుతం తెలుగు సినిమా వ్యవహారాలు దాదాపు ఓటీటీ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయాయి. మూవీని ఏ తేదీన థియేటర్లలో విడుదల చేయాలనేది వారే నిర్ణయిస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్కి పర్లేదు గానీ చాలామంది చిన్న, మీడియం బడ్జెట్ పెట్టే నిర్మాతలు.. తమ చిత్రాల్ని పూర్తి చేసినా సరే రిలీజ్ చేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు 'కన్నప్ప' ఓటీటీ గురించి పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. వాటి గురించి అడగ్గా.. విష్ణు తాజా ఇంటర్వ్యూలో సమాధానమిచ్చాడు.'కన్నప్ప' ఓటీటీ డీల్ కుదిరిందా? అని అడగ్గా.. 'వాళ్లు ఓ ఫిగర్ చెప్పారు అది నాకు నచ్చలేదు. హిట్ అయ్యాక అమ్మితే ఎంత ఇస్తారని అడిగాను. అప్పుడు వాళ్లు చెప్పిన ఫిగర్ నాకు నచ్చింది. డబ్బులు రెడీ చేస్కోండి. విడుదలయ్యాక వస్తాను అని చెప్పాను' అని విష్ణు చెప్పుకొచ్చాడు. ఇతడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే సినిమాపై చాలా నమ్మకంతోనే ఉన్నాడనిపిస్తుంది. చూడాలి మరి ఫలితం ఎలా వస్తుందో?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'. గత చిత్రాలు సరిగా ఆడకపోవడంతో చాన్నాళ్ల పాటు గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేశాడు. భారీ బడ్జెట్ పెట్టి స్వయంగా నిర్మించాడు. ఇందులో ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్.. ఇలా చాలామంది స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. మార్కెట్ పరంగా చూసుకుంటే దక్షిణాది స్టార్స్ చాలామంది ఉన్నారు. సినిమా హిట్ అయితే ఓటీటీల నుంచి డిమాండ్ ఉండొచ్చు. ఒకవేళ తేడా కొడితే మాత్రం అంతే సంగతులు.జూన్ 27న 'కన్నప్ప' సినిమా థియేటర్లలోకి రానుంది. చాన్నాళ్ల క్రితం తొలుత ఓ టీజర్ రిలీజ్ చేయగా.. విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. కాస్త గ్యాప్ తీసుకుని మరో టీజర్ రిలీజ్ చేయగా, నెగిటివిటీ కాస్త తగ్గింది. ప్రస్తుతం ప్రమోషన్ల బాధ్యత విష్ణునే తీసుకున్నాడు. పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ చేయబోతున్నాడు. దీనికి ప్రభాస్ కూడా హాజరవుతాడని టాక్.(ఇదీ చదవండి: పవన్ 'హరిహర..' పరువు తీసిన యాంకర్!)
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

నిప్పులు చెరిగిన సీఎస్కే బౌలర్
ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్లో భారత ఏ బౌలర్, సీఎస్కే పేసర్ ఖలీల్ అహ్మద్ నిప్పులు చెరిగాడు. మూడో రోజు ఆటలో ఖలీల్ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీశాడు. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి పటిష్టంగా (192/3) ఉన్న లయన్స్ మూడో రోజు ఆట తొలి సెషన్లోనే కష్టాల్లో పడింది. కడపటి వార్తలందే సరికి లయన్స్ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. ఫర్హాన్ అహ్మద్ 11, జోష్ టంగ్ 14 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు లయన్స్ ఇంకా 83 పరుగులు వెనుకపడి ఉంది.మూడో రోజు ఆటలో ఖలీల్ జోర్డర్ కాక్స్ (45), జేమ్స్ ర్యూ (10), జార్జ్ హిల్ (0), క్రిస్ వోక్స్ (5) వికెట్లు తీశాడు. రెండో రోజు 10 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన ఖలీల్.. ఇవాళ ఆట తొలి సెషన్లోనే 4 వికెట్లు తీసి భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించేందుకు పునాది వేశాడు. ఈ రోజు ఆటలో ఖలీల్తో పాటు తుషార్ దేశ్పాండే కూడా ఓ వికెట్ తీశాడు. తుషార్.. మ్యాక్స్ హోల్డన్ను (7) ఔట్ చేశాడు.అంతకుముందు లయన్స్ ఆటగాళ్లు టామ్ హెయిన్స్ (54), ఎమిలియో గే (71) అర్ద సెంచరీలతో రాణించగా.. బెన్ మెక్కిన్నీ (12) తక్కువ స్కోర్కు ఔటయ్యాడు. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 4, తుషార్ దేశ్పాండే 2, అన్షుల్ కంబోజ్, తనుశ్ కోటియన్ చెరో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్లో 348 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (116) అద్భుతమైన శతకంతో భారత్కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ధృవ్ జురెల్ (52), కరుణ్ నాయర్ (40), నితీశ్ కుమార్ రెడ్డి (34) రాణించారు. యశస్వి జైస్వాల్ (17), అభిమన్యు ఈశ్వరన్ (11), శార్దూల్ ఠాకూర్ (19), తనుశ్ కోటియన్ (15), అన్షుల్ కంబోజ్ (2), తుషార్ దేశ్పాండే (11) తక్కువ స్కోర్కు ఔటయ్యారు.

దారుణంగా విఫలమైన పంజాబ్ కింగ్స్ బ్యాటర్
తాజాగా ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన ముషీర్ ఖాన్.. ప్రస్తుతం జరుగుతున్న ముంబై టీ20 లీగ్లో దారుణంగా విఫలమవుతున్నారు. ఐపీఎల్ తర్వాత మొదలైన ఈ లీగ్లో ఇప్పటివరకు 5 ఇన్నింగ్స్లు ఆడిన ముషీర్ 16.50 సగటున కేవలం 66 పరుగులే చేశాడు. ముంబై టీ20 లీగ్లో అంధేరికి ప్రాతినిథ్యం వహిస్తున్న ముషీర్.. ఇవాళ (జూన్ 8) థానే స్ట్రయికర్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగి 7 బంతుల్లో 4 పరగులు మాత్రమే చేసి ఔటయ్యారు. ఐపీఎల్ 2025 ఒకే ఒక మ్యాచ్ ఆడిన ముషీర్.. ఆ మ్యాచ్లో (ఆర్సీబీ) డకౌటయ్యాడు. అయితే ఆ మ్యాచ్లో ముషీర్ బంతితో ఆకట్టుకున్నాడు. 2 ఓవర్లలో 27 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు.20 ఏళ్ల ముషీర్ ఖాన్పై ముంబై టీ20 లీగ్లో భారీ అంచనాలు ఉండేవి. అయితే అతను 5 ఇన్నింగ్స్ల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడైన ముషీర్కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ ఫార్మాట్లో అతను 9 మ్యాచ్లు ఆడి 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 51.14 సగటున 716 పరుగులు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. థానే స్ట్రయికర్స్తో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన అంధేరి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఓపెనర్గా వచ్చిన ముషీర్ ఖాన్ విఫలం కాగా.. మరో ఓపెనర్ హర్వాద్కర్ 40 పరుగులతో రాణించాడు. హర్కాద్కర్.. వన్డౌన్లో వచ్చిన ప్రసాద్ పవార్తో (57) కలిసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. వీరిద్దరు ఆడకపోయుంటే అంధేరి ఈ మాత్రం స్కోర్ కూడా చేయలేకపోయేది. మోనిల్ సోని, నౌషద్ అహ్మద్ డకౌట్ కాగా.. ప్రజ్ఞేశ్ 10, తివారి 14 (నాటౌట్), ఓంకార్ జాదవ్ 3 (నాటౌట్) పరుగులు చేశారు. థానే బౌలర్లలో శశాంక్ అట్టర్డే 3, అంకుర్ సింగ్ ఓ వికెట్ తీశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన థానే.. 2.5 ఓవర్ల తర్వాత వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. వరున్ లవండే 6 పరుగులకు ఔట్ కాగా.. అనిశ్ ముకుంద్ 15, అజిత్ యాదవ్ (0) క్రీజ్లో ఉన్నారు. మోనిల్ సోనికి ఓ వికెట్ దక్కింది.

రోహిత్, కోహ్లి ఫేర్వెల్కు ప్లాన్ చేస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియా
భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీ20, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇరువురు వన్డేలకు మాత్రమే అందుబాటులో ఉన్నారు. రోకో (రోహిత్, కోహ్లి) 2027 వన్డే వరల్డ్కప్ వరకు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతామని సూచనప్రాయంగా తెలిపినట్లు సమాచారం.రోకో ఈ ఆగస్ట్లో బంగ్లాదేశ్తో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో టీమిండియా తరఫున బరిలోకి దిగవచ్చు. అనంతరం అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లోనూ పాల్గొనవచ్చు. ఒకవేళ ఈ సిరీస్లో రోకోకు పాల్గొంటే కెరీర్లో వారికి అదే చివరి ఆస్ట్రేలియా పర్యటన అవుతుంది.ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా రోహిత్, కోహ్లి ఫేర్వెల్కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. హిందుస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం.. క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో టాడ్ గ్రీన్బర్గ్ అక్టోబర్లో జరిగే భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ సందర్భంగా రోహిత్, కోహ్లిలకు ఘనంగా వీడ్కోలు పలకాలని ప్లాన్ చేస్తున్నారు.ఓ సందర్భంగా టాడ్ ఇలా అన్నారు. మా దేశంలో (ఆస్ట్రేలియా) విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడటం అదే చివరిసారి కావచ్చు. ఒకవేళ అలా అయితే వారికి గొప్పగా వీడ్కోలు పలకాల్సిన ధర్మం మాకుంది. వారిరువురు భారత క్రికెట్తో పాటు అంతర్జాతీయ క్రికెట్కు ఎంతో చేశారు. అలాంటి వారికి గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన చేస్తాము.ఇదిలా ఉంటే, రోహిత్, కోహ్లి తాజాగా ముగిసిన బోర్డర్ గవాస్కర్ సిరీస్ తర్వాత టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. వారిద్దరి కెరీర్లో చివరి టెస్ట్లు ఆస్ట్రేలియా గడ్డపైనే ఆడారు. అయితే ఆ సిరీస్ జరిగే నాటికి రోహిత్, కోహ్లి రిటైర్మెంట్ గురించి ఆలోచించకపోయి ఉండవచ్చు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు చోటు చేసుకున్న పరిణామాల అనంతరం వారిద్దరు రోజుల వ్యవధిలో టెస్ట్లకు గుడ్బై చెప్పారు.బీసీసీఐ సైతం రోహిత్, కోహ్లిలకు ఫేర్వెల్ పలకలేకపోయింది. ఈ జోడీ టెస్ట్ల్లో ఇంకొంతకాలం కొనసాగుతారని అంతా అనుకున్నారు. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ, వారిద్దరు టెస్ట్లకు గుడ్బై చెప్పి భారత క్రికెట్ అభిమానులను షాక్కు గురి చేశారు. రోకో 2027 వరల్డ్కప్ వరకు వన్డేల్లో కొనసాగుతామని చెప్పినప్పటికీ.. ఈ విషయంపై కూడా అంత గ్యారెంటీ లేదు.ఎందుకంటే, ఆ సమయానికి రోహిత్ వయసు 40, కోహ్లి వయసు 38గా ఉంటుంది. ఆ టైమ్ వరకు ఇరువురు ఫిట్గా ఉంటారో లేదో. ఈ విషయంలో కోహ్లి గురించి ఆలోచన లేనప్పటికీ, రోహిత్పైనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే రోహిత్ ఫిట్నెస్కు సంబంధించి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాడు. మరో రెండేళ్ల తర్వాత అంటే అతని పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో మరి.

ఘనంగా రింకూ సింగ్ ఎంగేజ్మెంట్.. మాజీ సీఎం సహా ప్రముఖులు హాజరు
టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ ఎంగేజ్మెంట్ ఇవాళ (జూన్ 8) లక్నోలోని ద సెంట్రమ్ ఫైవ్ స్టార్ హోటల్లో ఘనంగా జరిగింది. రింకూ సమాజ్వాది పార్టీ ఎంపీ (లోక్సభ) ప్రియా సరోజ్ను నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో రింకూ, సరోజ్ నిశ్చితార్థం రింగులు మార్చుకున్నారు. ఈ వేడుకకు రింకూ, సరోజ్ కుటుంబ సభ్యులతో పాటు క్రికెట్, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.Rinku Singh got engaged with Priya Saroj. 💍 ❤️- Congratulations to both of them. pic.twitter.com/hj8aAslurI— Johns. (@CricCrazyJohns) June 8, 2025తెలుపు, పింక్ కలర్ ఔట్ ఫిట్లలో రింకూ, సరోజ్ జోడీ చూడముచ్చటగా ఉంది. ఈ వేడుకకు యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, అతని భార్య డింపుల్ యాదవ్, బిగ్బీ సతీమణి, సమాజ్వాది పార్టీ ఎంపీ జయా బచ్చన్, సమాజ్వాది పార్టీ సీనియర్ లీడర్ ప్రొఫెసర్ రామ్గోపాల్ యాదవ్, ఇక్రా హసన్ (సరోజ్ క్లోజ్ ఫ్రెండ్), బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, ఉత్తర్ప్రదేశ్ మాజీ క్రికెటర్లు ప్రవీణ్ కుమార్, పియుశ్ చావ్లా, ఉత్తర్ప్రదేశ్ రంజీ జట్టు కెప్టెన్ ఆర్యన్ జుయల్ తదితరులు హాజరయ్యారు. వేడుక అనంతరం అతిథులకు దేశీయ విందుతో పాటు యురోపియన్ వంటాలను వడ్డించారు. ఎంగేజ్మెంట్ వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. 27 ఏళ్ల రింకూ ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ సీజన్లో అతను 29.42 సగటున, 153.73 స్ట్రయిక్రేట్తో 206 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్లో అతను ప్రాతినిథ్యం వహించిన కేకేఆర్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది. ఆ జట్టు 14 మ్యాచ్ల్లో కేవలం ఐదింట మాత్రమే గెలుపొందింది. రింకూ అంతర్జాతీయ కెరీర్ విషయానికొస్తే.. భారత్ తరఫున 33 టీ20లు, రెండు వన్డేలు ఆడాడు. ఇందులో 3 అర్ద సెంచరీల సాయంతో 601 పరుగులు చేశాడు.సరోజ్ విషయానికొస్తే.. 26 ఏళ్ల సరోజ్ ప్రస్తుతం ఉత్తర్ప్రదేశ్లోని మచ్లిషెహర్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. 2024 జనరల్ ఎలెక్షన్స్లో ప్రియా సిట్టింగ్ బీజేపీ ఎంపీ బీపీ సరోజ్పై 35000 ఓట్ల తేడాతో గెలుపొందింది. ప్రియాకు ఇవే తొలి ఎన్నికలు.వారణాసికి చెందిన సరోజ్ పాలిటిక్స్లోకి రాక ముందు 'లా'లో బ్యాచ్లర్ డిగ్రీ పొందారు. సరోజ్ తన ఉన్నత చదువులను ఢిల్లీలో పూర్తి చేశారు. సరోజ్ తండ్రి తూఫానీ సరోజ్ మూడు సార్లు ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం అతను జౌన్పూర్ జిల్లాలోని కేరాకట్ అసెంబ్లీ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు.
బిజినెస్

జాబ్ రావాలంటే క్రెడిట్ స్కోరే కీలకం.. కంపెనీల్లో కొత్త ధోరణి..
సాంకేతిక పురోగతి, మారుతున్న సంస్థల అవసరాలతో ఉద్యోగ అన్వేషణ తీరులో వేగంగా మార్పులు జరిగిపోతున్నాయి. ఉద్యోగార్థుల అర్హతలను నిర్ణయించడానికి కంపెనీలు రెజ్యూమెలు, ఇంటర్వ్యూలను దాటి వెతుకుతున్నాయి. చాలా సంస్థలు ఇప్పుడు అభ్యర్థుల ఆర్థిక నేపథ్యాన్ని అంచనా వేయడానికి వారి క్రెడిట్ స్కోర్ను కూడా తనిఖీ చేస్తున్నాయి. ఇది నేరుగా ఉద్యోగ పనితీరుతో సంబంధం లేనప్పటికీ, అభ్యర్థి ఆర్థిక క్రమశిక్షణ, విశ్వసనీయతకు సూచికగా క్రెడిట్ స్కోర్ను యాజమాన్యాలు పరిగణిస్తున్నాయి.అయితే ప్రతి కంపెనీ ఉద్యోగార్థుల క్రెడిట్ హిస్టరీని తనిఖీ చేయదు కానీ, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కొన్ని ప్రభుత్వ సంస్థలు మాత్రం ఈ వైఖరిని అనుసరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఫైనాన్స్, బ్యాంకింగ్, అకౌంటింగ్ లేదా సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరమయ్యే ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తుంటే నియామక ప్రక్రియలో భాగంగా మీ క్రెడిట్ స్కోర్ను పరిగణనలోకి తీసకునే అవకాశం ఉంది. ఈ రోజుల్లో చాలా కంపెనీలు అభ్యర్థుల నేపథ్యాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ఈ కసరత్తును నిర్వహించడానికి థర్డ్ పార్టీ ఏజెన్సీలను సైతం నియమించుకుంటున్నాయి.జాబ్ అప్లికేషన్పై క్రెడిట్ స్కోర్ ప్రభావంక్రెడిట్ స్కోర్ అనేది మూడు అంకెల సంఖ్య, దీనిని ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వడానికి తరచుగా ఉపయోగిస్తాయి. ఇది 300 నుండి 900 మధ్య ఉంటుంది. క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే, అనుకూలమైన వడ్డీ రేటుతో రుణాలు త్వరగా ఆమోదం పొందే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. ఇది మీ రుణ అర్హత గురించి రుణదాతకు హామీ ఇస్తుంది. మీరు తీసుకున్న మొత్తాన్ని ఎటువంటి డిఫాల్ట్ లేకుండా సకాలంలో తిరిగి చెల్లంచగలరు అనే నమ్మకాన్ని కలిగిస్తుంది.మీకు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే, మీరు రుణం లేదా క్రెడిట్ కార్డు చెల్లింపులను మిస్ అయ్యారని, అవసరానికి మించి అప్పు తీసుకున్నారని లేదా రుణాలను డిఫాల్ట్ చేశారని చూపిస్తుంది. దీని వల్ల డబ్బు దొంగిలించడం, డేటా లీక్ చేయడం లేదా మోసానికి పాల్పడటం వంటి విషయాలకు మీరు ఎక్కువగా గురవుతారని కంపెనీ యజమాన్యం అనుకోవచ్చు.ఒక కంపెనీ మీ క్రెడిట్ హిస్టరీని చెక్ చేసిందంటే.. మీరు రుణాలు, క్రెడిట్ కార్డులు, బిల్లు చెల్లింపులను ఎంత బాగా నిర్వహించారు వంటి మీ గత ఆర్థిక ప్రవర్తనను చూస్తోందని అర్థం. మీరు అప్పుల్లో ఉంటే, మీరు మీ ఆర్థిక వ్యవహారాలను సరిగ్గా నిర్వహించడం లేదని ఇది సూచిస్తుంది.👉ఇదీ చదవండి: టీనేజ్ అప్పులు.. తీరని తిప్పలు!తక్కువ క్రెడిట్ స్కోర్ మీరు పనిలో చాలా పరధ్యానంలో ఉన్నారనే అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ఇది తప్పులు చేయడానికి, గడువులను కోల్పోవటానికి దారితీస్తుంది. ఆర్థిక విషయాలను నిర్వహించే పాత్రలకు, మీరు సరైన వ్యక్తి కాదని కంపెనీలు భావించవచ్చు.క్రెడిట్ స్కోరు మీ ఉద్యోగ దరఖాస్తును నేరుగా ప్రభావితం చేయదు కానీ, కొన్నిసార్లు ఇది కొన్ని రంగాలలో నియామక నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ఫైనాన్షియల్ సెక్టార్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సున్నితమైన ఆర్థిక విషయాలను బాధ్యతాయుతంగా నిర్వహించగలరని భరోసా ఇవ్వడానికి తమ క్రెడిట్ స్కోర్ను షేర్ చేయాలని కంపెనీలు అడగవచ్చు.

ఐపీవోకి వస్తున్న ఏక్వస్
న్యూఢిల్లీ: కన్జూమర్ డ్యురబుల్ గూడ్స్, వైమానిక విడిభాగాల కాంట్రాక్ట్ తయారీ కంపెనీ ఏక్వస్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి గోప్యతా మార్గంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూ ద్వారా 20 కోట్ల డాలర్లు(రూ. 1,700 కోట్లు) సమీకరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.తాజా ఈక్విటీ జారీ, ప్రస్తుత ఇన్వెస్టర్ల వాటా విక్రయం ద్వారా కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్కానున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కంపెనీలో ఇప్పటికే అమికస్, అమన్సా, స్టెడ్వ్యూ క్యాపిటల్సహా కాటమారన్, స్పర్ట గ్రూప్ తదితరాలు ఇన్వెస్ట్ చేశాయి. కంపెనీ ఏరోస్పేస్, కన్జూమర్ రంగాలకు ప్రెసిషన్ మ్యాన్యుఫాక్చరింగ్ ఎకోసిస్టమ్ను సమకూర్చుతోందిఏక్వస్ భారత్తోపాటు ఫ్రాన్స్, మూఎస్ఏలలో తయారీ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. బహుళ పరిశ్రమ విభాగాలలో తన ప్రపంచ కస్టమర్ బేస్కు ఉత్పత్తులను అందిస్తోంది. ఈ సంస్థకు భారత్లోని కర్ణాటకలో మూడు తయారీ క్లస్టర్లు (బెల్గావి, హుబ్బళ్ళి, కొప్పల్) ఉన్నాయి. మీడియా నివేదికల ప్రకారం.. టాటా ఎలక్ట్రానిక్స్, మదర్సన్ గ్రూప్, జబిల్తో కలిసి ఏక్వస్ కూడా యాపిల్ ఉత్పత్తుల కోసం మెకానికల్ విడిభాగాలను ఉత్పత్తి చేస్తోంది.

అనిల్ అంబానీకి భారీ ఉపశమనం
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దివాలా చర్యలను నిలిపివేస్తూ తాజాగా అపిల్లేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీ ఆదేశాలు జారీ చేసింది. తమ అప్పీల్ మేరకు ఎన్సీఎల్టీ ఆదేశాలను ఎన్సీఎల్ఏటీ రద్దు చేసినట్లు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియకు ఆదేశిస్తూ ఇంతక్రితం ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ సీపీ(ఐబీ)/624(ఎంబీ)2022 కేసులో 2025 మే 30న జారీ చేసిన ఆదేశాలను ఎన్సీఎల్ఏటీ రద్దు చేసినట్లు పేర్కొంది. తమకు సౌర విద్యుత్ సరఫరా చేసిన ధుర్సర్ సోలార్ పవర్కి చెల్లింపులు జరపలేదంటూ రిలయన్స్ ఇన్ఫ్రాపై ఆరోపణలు ఉన్నాయి. ధుర్సర్కి సెక్యూరిటీ ట్రస్టీగా వ్యవహరించిన ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ సంస్థ 2022 ఏప్రిల్లో రిలయన్స్ ఇన్ఫ్రాపై కార్పొరేట్ దివాలా పరిష్కార చర్యలు తీసుకోవాలంటూ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. రిలయన్స్ ఇన్ఫ్రా 2018 ఆగస్టు 28 నుంచి అసలు రూ. 88.68 కోట్లతో పాటు వడ్డీ కూడా బాకీ పడిందని వివరించింది.దీనితో రిలయన్స్ ఇన్ఫ్రాపై ఎన్సీఎల్టీ దివాలా చర్యలకు ఆదేశించింది. అయితే, ధుర్సర్ సోలార్ పవర్కు పూర్తిస్థాయిలో రూ. 92.68 కోట్లు చెల్లించేసినందున దివాలా చట్ట చర్యలను వ్యతిరేకిస్తున్నట్లు రిలయన్స్ ఇన్ఫ్రా పేర్కొంది. ఇంధన కొనుగోలు ఒప్పందంలో భాగంగా టారిఫ్లకింద సొమ్ము చెల్లించినట్లు తెలియజేసింది.

మెహుల్ చోక్సీ ఖాతాల అటాచ్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మెహుల్ చోక్సీ ఆస్తులను అటాచ్ చేసేందుకు ఆదేశించింది. వీటిలో చోక్సీ బ్యాంక్ ఖాతాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ ఉన్నాయి. జ్యువెలరీ కంపెనీ గీతాంజలి జెమ్స్ ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనల ఉల్లంఘన కేసులో సెబీ రూ. 2.1 కోట్లు రికవర్ చేసుకునేందుకు తాజా ఆదేశాలు జారీ చేసింది. గత నెల 15న చోక్సీకి డిమాండ్ నోటీసు జారీ చేసిన సెబీ 15 రోజుల గడువు ముగియడంతో రికవరీ చర్యలకు తెరతీసింది. ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు నేపథ్యంలో 2022 జనవరిలోనూ సెబీ జరిమానా విధించింది. అయితే చెల్లింపులు చేపట్టకపోవడంతో డిమాండ్ నోటీసు జారీ చేసింది. గీతాంజలి జెమ్స్ చైర్మన్, ఎండీ చోక్సీ ప్రమోటర్ గ్రూప్లోని వ్యక్తికావడంతోపాటు.. నీరవ్ మోడీకి మేనమామకూడా. ప్రభుత్వ రంగ పీఎన్బీలో రూ. 14,000 కోట్లమేర మోసానికి తెరతీసినట్లు ఇరువురిపైనా కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే పీఎన్బీని మోసగించిన అంశం వెలుగుచూసిన 2018 మొదట్లో వీరిరువురూ విదేశాలకు పారిపోగా.. చోక్సీని బెల్జియంలోనూ, మోడీని స్కాట్లాండ్లోనూ అక్కడి ప్రభుత్వాలు అరెస్ట్ చేయడం గమనార్హం!
ఫ్యామిలీ

ఎవరీ పిడుగు.. ఎనిమిదేళ్లకే పత్రిక ఎడిటర్గా రికార్డ్!
పిల్లలూ! రోజూ పొద్దున్నే న్యూస్పేపర్ చదివే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే రకరకాల వార్తలు ఏరి, కూర్చి మనకు అందించేందుకు న్యూస్పేపర్ సంస్థలో అనేకమంది పనిచేస్తుంటారు. వారందరికీ బాస్గా వ్యవహరించేది ఎడిటర్. ఆ పత్రిక బయటకు రావడంలో ఆయనదే కీలకపాత్ర. ఎడిటర్గా స్థానం పొందాలంటే ఎంతో అనుభవం కావాలి. అయితే ఓ పాప మ్యాగజైన్ ఎడిటర్గా మారి రికార్డు సృష్టించింది.ఆస్ట్రేలియాకు చెందిన రోక్సాన్ డౌన్స్...ఎనిమిదేళ్లకే ’ఇట్ గర్ల్ మ్యాగజన్’ (It Girl Magazine) అనే మ్యాగ్జైన్ కి ఎడిటర్గా మారింది. ఆ వయసున్న చిన్నారులు తోటి పిల్లలతో ఆడుకోవాలని అనుకుంటారు. అయితే రోక్సాన్ మాత్రం ఏదైనా కొత్తగా చేయాలన్న ఆలోచనతో ఉంది. తన వయసున్న ఆడపిల్లలు చదువుకునే మ్యాగ్జైన్ రూపొందించాలని భావించింది. దానికి తనే ఎడిటర్గా మారింది. మ్యాగ్జైన్లో ఏం రాయాలో, ఎలాంటి అంశాలను చేర్చాలో తెలుసుకునేందుకు రోక్సాన్ చాలా పరిశోధనలు చేసింది. రోజంతా తన వయస్సు గల వారితో తిరుగుతూ వారి ఇష్టాలు, ఇబ్బందులు, వారు ఆసక్తులు గమనించి, వాటి గురించి తన మ్యాగ్జైన్లో వ్యాసాలు రాయడం మొదలుపెట్టింది.చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకంమ్యాగ్జైన్ కోసం ప్రముఖ పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ని రోక్సాన్ ఇంటర్వ్యూ చేసింది. అది ప్రఖ్యాతి పొందడంతో ఆ తర్వాత అనేకమంది రచయితలు, టిక్టాక్ స్టార్లు, గాయకులు, నటులను ఇంటర్వ్యూలు చేసే స్థితికి చేరుకుంది. ఆ ఇంటర్వ్యూలను వీడియో రూపంలో యూట్యూబ్లో చూడొచ్చు. ఓ వైపు మ్యాగ్జైన్ పనులు చేస్తూనే, పాఠశాలకు వెళ్లి చదువుకుంటోంది రోక్సాన్. బద్దకంగా ఉండటం తనకు అస్సలు నచ్చదని, జీవితంలో ఏదైనా సాధించాలన్న ఆకాంక్ష అందరిలోనూ ఉండాలని తను చెపుతోంది.ఇదీ చదవండి: Bakrid speical : నోరూరేలా.. కాలా మటన్

Bakrid speical : నోరూరేలా.. కాలా మటన్
ముస్లింలు జరుపుకునే ప్రధాన పండుగల్లో రెండోది బక్రీద్. ఇది త్యాగానికి ప్రతీక. దీనిని ‘ఈదుల్ అజ్ హా’ అని కూడా అంటారు. ఈ రోజూ ప్రతి ముస్లిం తమ తాహతుకు తగ్గట్టుగా ఇరుగు పొరుగు వారికి ఖుర్బానీ ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఏటా మంచి ఘుమ ఘుమలతో ఈ పండుగను జరుపు కుంటారు. రోజూ అందించే టిప్లో భాగంగా ఈ రోజు కాలా మటన్, రామ్పూరి తార్ కుర్మా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కావలసినవి: మటన్ – ముప్పావు కేజీ, గ్రీన్ చట్నీ(పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్టు) – అరకప్పు, పసుపు – అరటీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, పెరుగు – కప్పు, ఉల్లిపాయ తరుగు – రెండు కప్పులు, నూనె – ఐదు టేబుల్ స్పూన్లు, ధనియాలు – టేబుల్ స్పూను, గసగసాలు – టేబుల్ స్పూను, యాలుక్కాయలు – నాలుగు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, లవంగాలు – ఐదు, మిరియాలు – ఐదు, సోంపు – టేబుల్ స్పూను, ఎండు మిర్చి – నాలుగు, ఎండుకొబ్బరి తురుము – అరకప్పు, బిర్యానీ ఆకు – ఒకటి, షాజీరా – టీస్పూను, వెల్లుల్లి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, అల్లం తరుగు – టేబుల్ స్పూను, బంగాళ దుంపలు – రెండు, చింతపండు గుజ్జు – రెండు టేబుల్ స్పూన్లు.తయారీ: మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి. దీనిలో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, గ్రీన్ చట్ని, పెరుగు వేసి కలిపి ఇరవైనిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత మటన్ను కుకర్లో వేయాలి. దీనిలో కొద్దిగా ఉల్లి పాయ తరుగు, కప్పు నీళ్లు పోసి ఒక విజిల్ వచ్చేంతవరకు పెద్దమంట మీద ఉడికించాలి. తరువాత సన్నని మంట మీద పదినిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి టేబుల్ స్పూన్ నూనె వేయాలి. వేడెక్కిన నూనెలో ధనియాలు, గసగసాలు, యాలుక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, సోంపు, ఎండు మిర్చి వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి. దీనిలో కొన్ని ఉల్లి పాయ ముక్కలు వేసి ముదురు బ్రౌన్ రంగు వచ్చేంతవరకు వేయించాలి. ఇప్పుడు ఎండుకొబ్బరి తురుము వేసి రంగు మారేంత వరకు వేయించి, చల్లారాక కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో బాణలి పెట్టి మిగిలిన నూనె వేయాలి. నూనె వేడెక్కిన తరువాత బిర్యానీ ఆకు, షాజీరా వేసి నిమిషం పాయించాలి. ∙తరువాత అల్లం, వెల్లుల్లి తరుగు, మిగిలిన ఉల్లిపాయ తరుగు వేసి లేత బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. ఇప్పుడు బంగాళ దుంపల్ని తొక్కతీసి ముక్కలు తరిగి వేసి, కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. దుంప ముక్కలు సగం ఉడికిన తరువాత ఉడికిన మటన్ మిశ్రమం వేయాలి. ఐదు నిమిషాల తరువాత మసాలా పేస్టు, రుచికి సరిపడా ఉప్పు వేసి పదినిమిషాల పాటు మగ్గనిచ్చి దించేయాలి. అంతే ఘుమఘుమ లాడే టేస్టీ టేస్టీ కాలా మటన్ రెడీ. రామ్పూరి తార్ కుర్మాకావలసినవి: నెయ్యి – కప్పు, మటన్ - కేజీన్నర, అల్లం వెల్లుల్లి పేస్టు- రెండు టేబుల్ స్పూన్లు, కారం - రెండు టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకులు – రెండు, పసుపు – అర టీస్పూను, గరం మసాలా పొడి – టేబుల్ స్పూను, వేయించిన ఉల్లిపాయ పేస్టు - పావు కప్పు, పెరుగు – ఆరు టేబుల్ స్పూన్లు, పాలు -కప్పు, ఫూల్ మఖనీ – నాలుగు టేబుల్ స్పూన్లు, కర్బూజా గింజలు – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు- రుచికి సరిపడా, మటన్ సూప్- అరలీటర్, జీడిపప్పు - పది. కుర్మా మసాలా: యాలుక్కాయలు -పది, నల్ల యాలుక్కాయలు - రెండు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, జాపత్రి ΄ పొడి -పావు టీ స్పూన్, అనాసపువ్వు- రెండు, లవంగాలు- నాలుగు, షాజీరా - టీ స్పూను, ఎండుకొబ్బరి తురుము - టేబుల్ స్పూను, మిరియాలు -పది, కశ్మీరి ఎండుమిర్చి రెండు. తయారీ: ∙మటన్ను శుభ్రంగా కడిగి టేబుల్ స్పూను ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలిపి పక్కనబెట్టాలి. ∙కర్బూజ గింజలు, పూల్ మఖనీలను అరకప్పు ΄పాలలో నానబెట్టి, పేస్టు చేయాలి. ∙కుర్మా మసాలా దినుసులన్నింటిని దోరగావేయించి పొడిచేసి పక్కనపెట్టుకోవాలి. ∙మందపాటి బాణలిని స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కిన తరువాత బిర్యానీ ఆకు, కారం వేయాలి. అరనిమిషం వేగాక మటన్ ముక్కలు, పసుపు, ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ఉప్పు వేసి పదినిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మంటను మీడియంకు తగ్గించి, కుర్మా మసాలా టీస్పూను పక్కన పెట్టి మిగతాది వేయాలి, ఉల్లి΄పాయ పేస్టు, పూల్ మఖనీ పేస్టు, పెరుగు కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మటన్ సూప్,పావు కప్పుపాలు, రుచికి సరిపడా ఉప్పు వేసి సన్నని మంట మీద ముక్క మెత్తబడే వరకు ఉడికించాలి. చివరిగా కుర్మా మసాలా పొడి, జీడిపప్పు వేసి మగ్గనిచ్చి దించేయాలి.

పాటనుకుంటివా.. ఫైర్ ఇంజన్లు..!
అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ యేడాది ఒడిశా (Odisha) 4,500 హెక్టార్లకు (11,120 ఎకరాలు) పైగా అడవులను మంటలు (wildfires) ప్రభావితం చేశాయి. ఈ సమస్య ప్రతి యేటా ఎదుర్కొనేదే. అధికారులు సీసీ కెమెరాలు, ఉపగ్రహ డేటా వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మంటలను ట్రాక్ చేస్తున్నారు. అడవిలో ఎండు ఆకులను కాల్చడం వల్ల కూడా వేడిగాలులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఈ మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. వాటిని ఆర్పడం మరింత కష్టతరం అవుతోంది. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదాల నుంచి గ్రామ ప్రజలను రక్షించడం కోసం ఒకప్పుడు పురుషులు జట్లు జట్లుగా కలిసి ఊళ్లన్నీ తిరిగి పాటలుపాడి అగ్నిప్రమాదాలు జరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించేవారు. ఇప్పుడు ఆ బాధ్యతను స్త్రీలు స్వీకరించడమే కాదు. మరింత బాగా అవగాహన కల్పిస్తూ... ప్రమాదాల నుంచి రక్షిస్తున్నారని కియోంఝర్ జిల్లాలోని అటవీ డిప్యూటీ పరిరక్షకుడు హనుమంత్ ధమ్ధేరే అన్నారు.ఒడిషా రాష్ట్రంలోని ముర్గపహాడి గ్రామంలోని మహిళలు సంవత్సరాల తరబడి నిశ్శబ్దంగా పొలం పనులు, పిల్లలను సాకడం చేస్తుండేవారు. దీంతోపాటు అడవుల్లో పువ్వులు, కట్టెలు సేకరిస్తుంటారు. ఉపాధి లేనప్పుడు వారి భర్తలు నగరాల్లో పని చేస్తుంటే వీళ్లు ఇళ్లను నడిపిస్తుండేవారు. రెండేళ్లుగా మహిళలు కూడా బృందాలుగా చేరి, పాటలుపాడుతూ అవగాహన కల్పిస్తున్నారు. ఇది వారి స్వీయ గౌరవాన్ని పెంచడమే కాదు సమాజంలో వారి పాత్రను మరింత బలపరుస్తోంది.సంప్రదాయ గీతాలతో ఆధునిక పరిష్కారంఈ ప్రయత్నం ఫలితంగా అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు 20–30 శాతం తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ధమ్ధేరే కొన్ని మహిళా సంకీర్తన బృందాలను చేర్చుకున్నారు. ఈ బృందాలు స్థానిక భాషలలో కాపాడతాయి. వాటిని స్థానిక ప్రజలు సులభంగా అర్థం చేసుకోవడంతోపాటు అవగాహనతో అటవీ పరిరక్షణకు పాటు పడుతుంటారు. ఈ పని చేసినందుకు గాను ఈ బృందాలకు అటవీశాఖ నుంచి ఆదాయం కూడా లభిస్తుంది.సాంస్కృతిక పునరుద్ధరణసంకీర్తన మండళ్ళు 15వ శతాబ్దం నుంచి ఉన్న సంప్రదాయ గీతాల సమూహాలు. ఈ సంప్రదాయాన్ని ఆధునిక అవసరాలకు అన్వయించి, పర్యావరణ పరిరక్షణలో ఉపయోగిస్తున్నారు. దీన్ని ఒక సాంస్కృతిక పునరుజ్జీవనంగా పరిగణించవచ్చు. అయితే, సంకీర్తన మండలి బృందాలలో సాధారణంగా పురుష గాయకులు, నృత్యకారులు ఉండేవారు. వీరు డ్రమ్స్ వాయించడం, మతపరమైన భక్తిపాటలు పాడేవారు. ‘గ్రామాల్లోని పురుషులు ఫ్యాక్టరీలలో పని చేయడానికి హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వలస వెళ్లినప్పుడు సంకీర్తన మండళ్ళు దాదాపుగా పనిచేయడం లేదు. మేం దానిని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నాం’ అని ముర్గపహాడిలోని బృందానికి నాయకత్వం వహిస్తున్న 35 ఏళ్ల ప్రమీలా ప్రధాన్ చెప్పారు. ప్రధాన్ బృందంలో 17 మంది ఉండగా, వారిలో తొమ్మిదిమంది మహిళలు ఉన్నారు.పురుషులు ఈ మండళ్ళను వదిలి వెళ్లాక, గ్రామీణ మహిళలు ‘సంకీర్తన మండలి’ అనే సంప్రదాయ సంగీత సమూహాన్ని మళ్లీ ప్రారంభించారు. ఈ గీతాలు దేవుని గురించి మాత్రమే కాక, ప్రకృతి పరిరక్షణ, అగ్నిప్రమాదాల నివారణ వంటి సామాజిక అంశాలను కూడా ప్రస్తావిస్తాయి. ఇది ఒకవైపు వారిని సాధికారతవైపుకు తీసుకెళ్తుండగా, మరోవైపు పర్యావరణాన్ని రక్షించడంలో సహాయపడుతోంది.చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకంఉపాధి గీతాలురాష్ట్రంలో దాదాపు 20,000 సంకీర్తన బృందాలు ఉండగా వాటిలో కనీసం 1,000 బృందాలు మహిళలే నిర్వహిస్తున్నారు. అటవీ మంటలు వారి ఆదాయాలను, పిల్లల పోషణను ప్రభావితం చేస్తున్నాయని మహిళలు అంటున్నారు. ‘కుటుంబ పోషణ కోసం అడవిదుంపలు, ఆకుకూరలు, పుట్టగొడుగులను సేకరిస్తాం. పెద్ద అగ్నిప్రమాదం జరిగితే, ప్రభుత్వం నుంచి మాకు లభించే బియ్యంతోనే సరిపెట్టుకోవాలి. ఇప్పుడు సమాజానికి ఉపయోగపడేలా సంకీర్తన మండలిలో చేరినందుకు మాకు ఉపాధి కూడా లభిస్తోంది‘ అని 42 ఏళ్ల బాలమతి చెప్పారు. చదవండి: మాల్యా లగ్జరీ విల్లాను దక్కించుకున్న బాలీవుడ్ జంట ఎవరో తెలుసా?కేతకి నాయక్కి 10 ఏళ్ల వయసులో పెళ్లి అయ్యింది. ఇప్పుడు ఆమెకు పాతికేళ్లు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ‘నా చిన్నతనంలో పాటలు పాడేదాన్ని. పెళ్లయ్యాక నా నోరు మూతపడిపోయింది. ఇప్పుడు బృందంలో చేరి, ఊరంతా తిరిగి పాటలు పాడుతున్నాను. ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు’ అని ఆనందంగా చెబుతుంది. ఇప్పుడు ఈ మండళ్ళలో యువతులు, విద్యార్థులు కూడా చేరి శిక్షణ తీసుకుంటున్నారు. దీని ద్వారా తరువాతి తరం అడవుల పరిరక్షణకు ఏం చేయగలరో నేర్చుకుంటున్నారు. ఇదీ చదవండి: Food Safety ఆహార భద్రతకు 5 శక్తివంతమైన ప్రయోజనాలు

World Food Safety Day 2025 ఆహార భద్రతకు 5 శక్తివంతమైన ప్రయోజనాలు
World Food Safety Day 2025 సాధారణంగా కలుషిత ఆహారం, నీళ్ల ద్వారా బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవులు, రసాయనాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. ఈ సమస్య అంతా వంట గది నుంచే మొదలవుతుంది. ఈ సమస్యకు అడ్డుకట్ట వేయాలంటే..? ప్రతి యేటా సురక్షితం కాని ఆహారం తినడం వల్ల 60 కోట్ల మంది అనారోగ్యానికి గురవుతున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి. నేడు ఫుడ్ సేఫ్టీ దినోత్సవ సందర్భంగా కొన్ని సురక్షితమైన అలవాట్ల గురించి తెలుసుకుందాం...చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. వాడిన పాత్రలను, వాడాలనుకున్న పాత్రలను తప్పనిసరిగా కడిగాకనే తిరిగి ఉపయోగించాలి. ముడి పదార్థాలను, వండిన పదార్థాలను వేరుగా ఉంచడం వల్ల క్రాస్–కాలుష్యాన్ని నివారించ వచ్చు. పూర్తిగా ఉడికించాలి. ముఖ్యంగా మాంసం, మాంసాహారం, సముద్రపు ఆహారం.. బాగా ఉడికించిన తర్వాతనే తీసుకోవాలి. ఆహారాన్ని సరైన పద్ధతుల్లో నిల్వ చేయాలి. అతి చల్లని, అతి వేడి పదార్థాలను తీసుకోవడం నివారించాలి. సురక్షితమైన నీరు, ముడి పదార్థాలను ఉపయోగించాలి. పదార్థాల తాజాదనాన్ని చెక్ చేసి, తీసుకోవాలి. ఇది పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిలో చాలా ముఖ్యం.ఆహార భద్రతకు 5 శక్తివంతమైన ప్రయోజనాలుఆహారాన్ని శుభ్రంగా వుంచుకోవడం అన్నది 200 కంటే ఎక్కువ ఆహార సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచుతుంది.ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చు. తాజా ఆహారం వల్ల ఆహార నష్టం, వ్యర్థాలను తగ్గించవచ్చు. సురక్షితమైన ఆహారం ప్రతి ఒక్కరి హక్కు. ఇంట్లో/రెస్టారెంట్లలో ఆహారాన్ని ఎక్కడ తీసుకున్నా ఆరోగ్యకరమైన దాని పట్ల తప్పక దృష్టి పెట్టాలి.
ఫొటోలు
అంతర్జాతీయం

జ్యోతి మల్హోత్రాకు పాకిస్తానీ రిటైర్డ్ అధికారితో లింకు ?
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో పలు ఆసక్తికర వివరాలు వెలుగుచూస్తున్నాయి. పాకిస్తానీ రిటైర్డ్ అధికారి నాసిర్ ధిల్లాన్తో జ్యోతి మల్హోత్రాకు సంబంధం ఉన్నట్లు తాజాగా వెల్లడయ్యింది. దర్యాప్తు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం జ్యోతికి ధిల్లాన్తో నేరుగా సంబంధం ఉంది. ఆమె ఒక పాడ్కాస్ట్లో అతని పక్కన కనిపించింది.పాకిస్తాన్ పర్యటన కోసం వచ్చిన జ్యోతిని నాసిర్ ధిల్లాన్ కలుసుకున్నాడు. పాకిస్తాన్ పోలీసు దళం నుంచి పదవీ విరమణ చేసిన ఆయన సొంతంగా యూట్యూబ్ ఛానెల్ను ప్రారంభించాడు. ధిల్లాన్ పాకిస్తాన్ ఐఎస్ఐతో పాటు సైన్యం ఆదేశాల మేరకు పనిచేస్తుంటాడని, నిఘా సమాచారం రాబట్టేందుకు భారతీయ యూట్యూబర్లతో అతను స్నేహం చేస్తుంటాడని అధికారులు చెబుతున్నారు.భారత సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించడడమే లక్ష్యంగా దిల్లాన్ పనిచేస్తుంటాడని అధికారులు తెలిపారు. ధిల్లాన్ తన ప్లాన్లో భాగంగా మొదట భారత్కు చెందిన యూట్యూబర్ల నమ్మకాన్ని సంపాదిస్తాడని, అనంతరం వారిని ఐఎస్ఐ ఏజెంట్లకు పరిచయం చేస్తాడని, వారు యూట్యూబర్లకు గూఢచర్యానికి సంబంధించిన పనులను అప్పగిస్తారని అధికారుల దర్యాప్తులో తేలింది. ఇది కూడా చదవండి: డిప్యూటీ సీఎం షిండేకు షాకిచ్చిన పైలట్

మస్క్.. ‘ది అమెరికా పార్టీ’కి 80 శాతం మద్దతు
వాషింగ్టన్ డీసీ: ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. ఇటీవల మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో యూఎస్లో కొత్త రాజకీయ పార్టీ కోసం పిలుపునిచ్చారు. అగ్రరాజ్యంలో కొత్త పార్టీకి సమయం ఆసన్నమయ్యిందా? అని మస్క్ ‘ఎక్స్’ యూజర్లను అడిగారు. దీనికి వచ్చిన ఆసక్తికర ఫలితాలను తాజాగా ఆయన వెల్లడించారు.మస్క్ తెలిపిన వివరాల ప్రకారం అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు 80 శాతం మంది యూజర్లు మద్దతు పలికారు. ఈ ఫలితాల వెల్లడి తరువాత మస్క్ తన రాజకీయ పార్టీకి ‘ది అమెరికా పార్టీ’ అని పేరు పెడుతున్నట్లు తెలిపారు. ‘ఎక్స్’లో వైరల్ అవుతున్న ఈ పోస్టులో మస్క్.. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందని, 80 శాతం ప్రజలు దీనికి మద్దతు పలుకుతున్నారని తెలిపారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్లో మస్క్ పలు విమర్శలు చేశారు. తాను లేకుంటే ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవారని, అతనికి కృతజ్ఞత లేదని మస్క్ ఆరోపించారు. దీనికి స్పందనగా ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫారం ట్రూత్లో మస్క్ కంపెనీలకు ఫెడరల్ కాంట్రాక్టులు, సబ్సిడీలను రద్దు చేస్తానని హెచ్చరించారు. ఎలాన్ మస్క్- డోనాల్డ్ ట్రంప్ మొన్నటి వరకూ ఎంతో సన్నిహితులుగా మెలిగారు. గత జూలైలో పెన్సిల్వేనియా ర్యాలీలో హత్యాయత్నం నుండి ట్రంప్ తృటిలో బయటపడిన అనంతరం మస్క్ బహిరంగంగా ఆయనకు మద్దతును ప్రకటించారు. అయితే ప్రస్తుతం వీరి మధ్య వైరం తారాస్థాయికి చేరింది. ఇది కూడా చదవండి: 400 డ్రోన్లు, 40 క్షిపణులతో ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా

ట్రంప్తో ఫైటింగ్.. మస్క్కు రష్యా బంపరాఫర్
మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)ల మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎలాన్ మస్క్ను రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. మస్క్ తమ దేశానికి రావాలని.. రాజకీయ శరణార్థిగా ఉండేందుకు మస్క్కు అవకాశం కల్పిస్తామని రష్యా తెలిపింది. ఈ మేరకు దిమిత్రి నోవికోవ్ చెప్పుకొచ్చారు.డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య స్నేహ బంధం బీటలు వారింది. ఈ నేపథ్యంలో మస్క్ను మచ్చిక చేసుకునేందుకు రష్యా రంగంలోకి దిగింది. తాజాగా రష్యాకు చెందిన స్టేట్ డూమా ఫెడరేషన్ కమిటీ ఛైర్మన్ దిమిత్రి నోవికోవ్ ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎలాన్ మస్క్ భిన్నమైన వ్యక్తి. ఆయన ఆలోచనా విధానం వేరుగా ఉంటుంది. మస్క్ పూర్తిగా భిన్నమైన ఆట ఆడతారని నేను అనుకుంటున్నా. ఆయనకు రాజకీయ శరణార్థిగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన అలా చేయాలనుకుంటే రష్యా సహకరిస్తోంది. అమెరికాకు చెందిన ఎడ్వర్డ్ స్నోడెన్ లాగానే మస్క్కు కూడా రష్యాలో ఉండేందుకు అవకాశం కల్పిస్తాం అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అమెరికాలో తర్వాత జరిగే ఎన్నికల్లో డెమోక్రట్లు రావాలని మస్క్ కోరుకోవడం లేదని తాను అనుకుంటున్నానని దిమిత్రి తెలిపారు.మరోవైపు.. ట్రంప్, మస్క్ల మధ్య నెలకొన్న వివాదంపై జోక్యం చేసుకునేందుకు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ నిరాకరించారు. ఇది యూఎస్ సమస్య అని, తమకు ఇందులో జోక్యం చేసుకొనే ఉద్దేశం లేదని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడే స్వయంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటారని తాము అనుకుంటున్నట్లు తెలిపారు.Breaking News 🔴Russian MP Dmitry Novikov states that Elon Musk may be offered political asylum in Russia. pic.twitter.com/rp2pwqomuD— Global Report (@Globalrepport) June 6, 2025ఇదిలా ఉండగా.. నిజానికి ట్రంప్, మస్క్ సంబంధాలు కొంతకాలంగా ఒడిదొడుకులమయంగానే సాగుతున్నాయి. ప్రభుత్వ పనితీరుపై మస్క్ పెత్తనం మరీ మితిమీరుతోందని ట్రంప్ బృందం ఆక్షేపిస్తూ వస్తోంది. ఆ క్రమంలో ట్రంప్ గద్దెనెక్కిన ఒకట్రెండు రోజుల నుంచే ఆయన సన్నిహితులతో మస్క్ తరచూ గొడవ పడుతూ వస్తున్నారు. వ్యవహారం శ్రుతి మించుతోందని భావించిన ట్రంప్ కూడా క్రమంగా ఆయనను దూరం పెడుతూ వచ్చారు. డోజ్ సారథిగా కేవలం 130 రోజుల కోసం జరిగిన తన నియామకాన్ని పొడిగిస్తారని మస్క్ ఆశించారని కూడా అంటారు. అలాంటి సూచనలు కన్పించకపోవడంతో ఇటీవల ఆయనే తప్పుకున్నారు. ట్రంప్ ఇటీవల తెరపైకి తెచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ వ్యయానికి కత్తెర వేస్తానని గొప్పలు చెప్పుకున్న పెద్దమనిషి చివరికిలా భారీ దుబారాకు వీలు కలి్పంచే బిల్లుకు రూపమిచ్చారంటూ నిప్పులు చెరిగారు. దాంతో అప్పటిదాకా సంయమనం పాటిస్తూ వచ్చిన ట్రంప్ కూడా శషభిషలన్నీ పక్కనపెట్టి మస్క్ పై విరుచుకుపడ్డారు.

400 డ్రోన్లు, 40 క్షిపణులతో ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా
కీవ్: ఉక్రెయిన్పై రష్యా భీకర దాడికి దిగింది. ఏకంగా 400 డ్రోన్లు, 40 క్షిపణులను ప్రయోగించి, అతిపెద్ద దాడికి పాల్పడింది. ఈ దాడి దేశమంతటినీ ప్రభావితం చేసిందని, లెక్కలేనంత మంది గాయపడ్డారని, వందలాదిమంది శిథిలాల కింద చిక్కుకున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. రష్యాకు చెందిన వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి వాహక నౌకలను లక్ష్యంగా చేసుకుని, ఉక్రెయిన్ ‘ఆపరేషన్ స్పైడర్వెబ్’ను నిర్వహించిన దరిమిలా, రష్యా తాజాగా ఉక్రెయిన్పై భీకరదాడి చేసింది.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ‘ఈరోజు, మన దేశంలోని వివిధ ప్రాంతాలు, నగరాల్లో రెస్క్యూ ఆపరేషన్తో పాటు అత్యవసర కార్యకలాపాలు రోజంతా కొనసాగాయి. రష్యన్లు 400కు మించిన డ్రోన్లు, 40కిపైగా క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడుల్లో 80 మంది గాయపడ్డారు. కొందరు ఇప్పటికీ శిథిలాల కింద విలవిలలాడుతున్నారు. ప్రపంచంలోని కొందరు ఇటువంటి దాడులను ఖండించరు. పుతిన్ ఈ కోవకు చెందిన వ్యక్తి. యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు’ అని పేర్కొన్నారు.ఉక్రెయిన్ రాజధాని కైవ్లో ఈ దాడి కారణంగా ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది మృతిచెందారు. లుట్స్క్లో ఇద్దరు పౌరులు, చెర్నిహివ్లో మరొక వ్యక్తి మృతిచెందారు. మొత్తం ఆరుగురు మరణించారని, పలువురు గాయపడ్డారని ఉక్రేనియన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ (సీఎన్ఎన్) మీడియాకు తెలిపింది. రష్యా జరిపిన ఈ సైనిక దాడి ఇరు దేశాల మధ్య మూడేళ్లుగా కొనసాగుతున్న దాడులలో అతిపెద్ద దాడి. కైవ్ ఉగ్రవాద చర్యలకు ప్రతిగా ఈ దాడులు చేపట్టినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: కాళ్ల బేరానికి పాక్.. ‘సింధు ఒప్పందం’పై వేడుకోలు
జాతీయం

గురుదక్షిణగా ఐసీటీకి రూ.151 కోట్ల విరాళం
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ ముకేశ్ అంబానీ మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. ముంబైలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐసీటీ)కి రూ.151 కోట్ల విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆయన 1970వ దశకంలో ఇక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అప్పట్లో ఈ విద్యాసంస్థను యూనివర్సిటీ డిపార్టుమెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(యూడీసీటీ)గా పిలిచేవారు. ముకేశ్ అంబానీ శుక్రవారం ఐసీటీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పటి తమ ప్రొఫెసర్ శర్మ బోధించిన పాఠాలు, అందించిన స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు. భారత ఆర్థిక సంస్కరణల రూపకల్పనలో ప్రొఫెసర్ శర్మ కీలక పాత్ర పోషించారని చెప్పారు. మన దేశం అన్ని రకాల సవాళ్లను అధిగమించి గ్లోబల్ లీడర్గా ఎదగాలని తన తండ్రి ధీరూబాయ్ అంబానీ తరహాలోనే ప్రొఫెసర్ శర్మ కూడా ఎంతగానో తపనపడ్డారని తెలిపారు. ప్రైవేట్ పారిశ్రామికవేత్తలకు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా తోడైతే ఆర్థిక రంగంలో ఇండియా పరుగులు తీస్తుందని వారు విశ్వసించారని పేర్కొన్నారు. వారిద్దరూ గొప్ప దార్శనికులు అని కొనియాడారు. ప్రొఫెసర్ శర్మ కృషి వల్లే ఐసీటీ అత్యున్నత విద్యాసంస్థగా మారిందని చెప్పారు. ప్రొఫెసర్ శర్మను ‘భారత్ గురు’గా అభివర్ణించారు. ఆయనకు గురుదక్షిణగా ఐసీటీకి రూ.151 కోట్లు ఎలాంటి షరతులు లేకుండా ఇస్తున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు. తన గురువు ప్రొఫెసర్ శర్మ సూచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విద్య నేరి్పన ఐసీటీకి పెద్ద మేలు చేయాలని చెప్పడంతో ఆయన ఆదేశాలను శిరసావహించినట్లు పేర్కొన్నారు.

విపత్తులను ఎదుర్కోవాలంటే కలిసి పని చేయాలి
న్యూఢిల్లీ: విపత్తులను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన మౌలిక సదుపాయాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విపత్తులను ఎదుర్కొనే విషయంలో ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకోవాలని చెప్పారు. అన్ని దేశాలు కలిసి పనిచేస్తేనే నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించవచ్చని స్పష్టంచేశారు. ‘డిజాస్టర్ రీసైలియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్–2025’అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ శనివారం వీడియో సందేశం ఇచ్చారు. విపత్తుల నివారణ విషయంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అత్యుత్తమ విధానాలు పరస్పరం పంచుకోవడానికి గ్లోబల్ డిజిటల్ వేదిక, నిధుల సేకరణ అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. విపత్తులను ముందుగానే గుర్తించి హెచ్చరించే వ్యవస్థతోపాటు దేశాల మధ్య సహకారం కచి్చతంగా అవసరమని అన్నారు. ఇండియా ఏర్పాటు చేసిన సునామీ వార్నింగ్ సిస్టమ్తో 29 దేశాలు ప్రయోజనం పొందుతున్నాయని గుర్తుచేశారు. కాలుష్యం, వాతావరణ మార్పులతోపాటు ప్రకృతి విపత్తుల సముద్ర తీర ప్రాంతాలు, దీవులకు పెద్ద ముప్పు పొంచి ఉందని ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తంచేశారు. ఈ అంశంపై ప్రపంచ దేశాలు తక్షణమే దృష్టి పెట్టాలని కోరారు.

‘తీవ్రమైన పేదరికం’ తగ్గుముఖం
న్యూఢిల్లీ: భారతదేశంలో ‘తీవ్రమైన పేదరికం’రేటు క్రమంగా తగ్గిపోతోందని ప్రపంచ బ్యాంకు ఒక నివేదికలో వెల్లడించింది. 2011–12లో పేదరికం రేటు 16.2 శాతం ఉండగా, పదేళ్ల తర్వాత 2022–23 నాటికి 2.3 శాతానికి తగ్గిపోయినట్లు పేర్కొంది. రోజుకు 3 డాలర్లు (రూ.257) సంపాదిస్తే పేదలు కానట్లేనని ప్రపంచ బ్యాంకు గతంలో స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. రోజుకు 2.15 డాలర్లు సంపాదిస్తే పేదలు కాదనే సూత్రీకరణ 2017 దాకా ఉండేది. దాన్ని 2021లో 3 డాలర్లకు పెంచారు. ఇండియాలో 2011–12లో దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) 34 కోట్ల మంది ఉండగా, 2022–23 నాటికి వారి సంఖ్య 7.5 కోట్లకు పడిపోయినట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక స్పష్టం చేసింది. పేదరిక నియంత్రణలో ఇండియా చక్కటి పురోగతి సాధిస్తున్నట్లు తెలియజేసింది. → 2024లో ఇండియాలో 5.46 కోట్ల మంది రోజువారీ సంపాదన 3 డాలర్ల కంటే తక్కువే ఉంది. ఈ లెక్కన తీవ్రమైన పేదరికం రేటు 5.44 శాతంగా ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు లెక్కగట్టింది. → ఉచితం లేదా రాయితీతో కూడిన ఆహారాన్ని ప్రభుత్వాలు పంపిణీ చేస్తుండడం, కొత్తగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తుండడంతో పేదరికం తగ్గుముఖం పడుతోంది. → అలాగే పేదరికం విషయంలో పల్లెలు–పట్టణాల మధ్య అంతరం తగ్గిపోతుండడం మరో కీలక పరిణామం. → అత్యంత పేదల్లో 54 శాతం మంది ఐదు అధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లోనే ఉన్నారు. → 2011–12 నుంచి 2022–23 మధ్య దేశంలో 17.1 కోట్ల మంది తీవ్రమైన పేదరికం నుంచి బయటపడ్డారు. → ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన పేదరికం 18.4 శాతం నుంచి 2.8 శాతానికి, పట్టణాల్లో 10.7 శాతం నుంచి 1.1 శాతానికి పడిపోయింది. పల్లెలు–పట్టణాల మధ్య అంతరం 7.7 శాతం నుంచి 1.7 శాతానికి తగ్గిపోయింది.

బిహార్లో చెరో సగం!
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగనున్న బిహార్ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల సంఖ్యపై ఎన్డీఏ కూటమి పార్టీలు సీట్ల పంపకంపై ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కూటమిలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, జేడీయూలో సమాన స్థాయిలో సీట్లు తీసుకోవాలని ఒక ప్రాథమిక నిర్ణయానికి వచ్చాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 243 స్థానాలకు గానూ బీజేపీ, జేడీయూలు చెరో వంద స్థానాలు పోటీ చేసేలా అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బిహార్లోని ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జేడీయూలతో పాటు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలో ని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) , జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ అవామీ మోర్చా (హెచ్ఏ ఎం), ఉపేంద్ర కుష్వాహా రాష్ట్రీయ లోక్మంచ్ (ఆర్ఎల్ఎం) ఉన్నాయి. గడిచిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 17, జేడీయూ 16, ఎల్జేపీ 5, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎం ఒక్కొక్క స్థానంలో పోటీ చేశాయి. పార్లమెంటరీ ఎన్నికల్లో బీజేపీ ఒక స్థానంలో అధికంగా పోటీ చేసినప్పటికీ ఈసారి సమానంగా సీట్ల పంపకాలు ఉంటాయని తెలుస్తోంది. 243 అసెంబ్లీ సీట్లలో జేడీయూ 102–103 సీట్లలో, బీజేపీ 101–102 సీట్లలో పోటీ చేయవచ్చని సమాచారం. మిగిలిన 40 సీట్లు కూటమిలోని మిగతా పార్టీలకు వదిలేస్తారని భావిస్తు న్నారు. పార్లమెంట్లో ఐదుగురు సభ్యుల ప్రాతినిధ్యం దృష్ట్యా ఎల్జేïపీ దాదాపు 28 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశాలున్నాయి. హెచ్ఏఎంకు 7 సీట్లు, ఆర్ఎల్ఎంకు 4–5 సీట్లు కేటాయించవచ్చని అంటున్నారు. కొద్ది నెలల కిందట అసెంబ్లీ నియోజక వర్గాలన్నింటిలో నిర్వహించిన అంతర్గత బీజేపీ సర్వేల ఆధారంగా సీట్ల పంపిణీపై ఒక అవగాహన వచ్చినట్లు తెలుస్తోంది. సీట్ల కేటాయింపుతోపాటు అభ్యర్థుల ఎంపిక కోసం ఈ సర్వే చేశారు. ఎన్నికల తేదీలను ప్రకటించకముందే అభ్యర్థులను ప్రకటించేలా రెండు పార్టీల ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
ఎన్ఆర్ఐ

పెళ్లి బరాత్తో దద్దరిల్లిన వాల్స్ట్రీట్
మన దేశంలో ఏం రేంజ్లో వివాహ వేడుకలు జరుగుతాయో చెప్పాల్సిన పనిలేదు. అందుకోసం పెట్టే డీజేలు, బరాత్ల సందడితో ఊరు ఊరే హోరెత్తిపోతుంది. పైగా పెళ్లి వేడుక కావడంతో ఎవ్వరూ అభ్యంతరాలు చెప్పారు. ఓ వీధిలో పెళ్లి ఊరేగింపుతో కోలాహాలంగా ఉంటే..ఆటోమేటిగ్గా ఆ రోడ్డంతా బ్లాక్ అయిపోతుంది..వాహనదారులు, బాటసార్లు మరోదార్లో వెళ్తారు. అది సర్వసాధారణం. మరీ దేశం కానీ దేశంలో అదే రేంజ్లో ఆర్భాటంగా పెళ్లి చేయాలంటే.. కష్టమనే చెప్పాలి. (చదవండి: క'రెంట్' ట్రెండ్..అద్దెకు అ'డ్రెస్'..! ప్రీ వెడ్డింగ్ షూట్స్ నుంచి రీల్స్ వరకు..)ఎందుకంటే ఎన్నో పర్మిషన్లు కావలి. ముఖ్యంగా శబ్ద కాలుష్యం, ట్రాఫిక్కి అంతరాయం కలుగకుండా ఆయా అధికారుల నుంచి అనుమతి వంటివి ఎన్నో కావాలి. మరీ ఈ పెళ్లి సముహం అనుమతి తెచ్చుకుని మరీ ఏకంగా వాల్స్ట్రీట్లో వివాహ వేడుక ధూం ధాంగా నిర్వహించింది. అచ్చం మన దేశంలో నిర్వహించినట్లుగా పెళ్లి బరాత్ నిర్వహించి..ఓ లెవెల్లో ఆడిపాడి ఎంజాయ్ చేశారు వారంతా. ఈ వేడుక కోసం అత్యంత రద్దీగా ఉండే వాల్స్ట్రీట్ మూసేశారు. ఆ వాల్స్ట్రీట్ వీధుల్లో దాదాపు 400 మంది పెళ్లి సముహంతో కోలాహాలంగా ఉంది. అందుకోసం పెళ్లి వారు ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఉంటారో కదూ..!. ఎందుకంటే మన కరెన్సీ ప్రకారం..లక్షలకు పైగానే ఛార్జ్ చేస్తారు. అక్కడ ఓ పక్క డీజే మ్యూజిక్ సందడి..మరోవైపు ఆ బీట్లకు అనుగుణంగా డ్యాన్స్లతో కన్నులపండుగ ఉంది. ఈ వేడుక జరిగేలా సహకరిస్తుందా అన్నట్లు వాల్స్ట్రీట్ వీధులు వాహానాల రద్దీ లేకుండా నిర్మానుష్యంగా ఉన్నాయి. నెటిజన్లు మాత్రం మన వివాహ సంప్రదాయాలు న్యూయార్క్ వీధుల్లోకి వచ్చేశాయి. పైగా అక్కడ ఉండే స్థానికులు ఫోటోలు తీసుకుంటూ ఈ పెళ్లి వేడుకలో భాగమవ్వడం చూస్తుంటే.. మన సంస్కృతికి ఉన్న గొప్పదనం మరోసారి తేటతెల్లమైంది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇంకెందు ఆలస్యం అందుకు సంబంధించిన వీడియోపై మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by DJ AJ (@djajmumbai) (చదవండి: పచ్చి క్యాబేజ్ సలాడ్లు తింటున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్)

FNCA -మలేషియా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పురస్కారాలు
ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా (FNCA -మలేషియా) ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు 2025 మలేషియాలో ఘనంగా జరిగాయి. మలేషియా కోలాలంపూర్ లోని MAB కాంప్లెక్స్ ఈవెంట్ హాల్ బ్రిక్ ఫీల్డ్స్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాసులు , స్థానిక తెలుగు వారు పాల్గొన్నారు. పిల్లలు తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా ఆడి పాడి సందడి చేశారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు ఎక్సపెట్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా డిప్యూటీ ప్రెసిడెంట్ ఆనంద్ , మలేషియా ఆంధ్ర అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామ్, మలేషియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు దాతో కాంతారావు , తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా డిప్యూటీ ప్రెసిడెంట్ సత్య సుధాకరన్ , మలేషియా తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాతో డాక్టర్ ప్రకాష్ రావు ,తెలుగుఇంటలెక్చువల్ సొసైటీ ఆఫ్ మలేషియా ప్రెసిడెంట్ కొణతాల ప్రకాష్ రావు , పెళ్లి చూపులు అసోసియేషన్ ఆఫ్ మలేషియా ప్రెసిడెంట్ శివ ప్రకాష్ , బి ర్ స్ మలేషియా ప్రెసిడెంట్ మారుతి, మలేషియా తెలంగాణ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్, ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డాక్టర్ MJR వరప్రసాద్ , ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సారి ఉగాది పురస్కారాలు సమాజ సేవా కార్యక్రమాలను, కోవిడ్ లాక్ డౌన్ సమయములో మలేషియ లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆశ్రయం కల్పించి వారి స్వదేశానికి పంపించే వరకు అన్ని రకాల సదుపాయాలు అందించిన అసోసియేషన్ నాయకులకు మరియు మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడు కోవడానికి కృషి చేసిన వారిని గుర్తించి వారిని గౌరవించే ఉగాది కీర్తి రత్న పురస్కారాలతో సత్కరించామని ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి మోహన్ రెడ్డి తెలిపారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆ తరువాత ఆపరేషన్ సిందూర్లో అమరులైన జవాన్లకు, పహల్గమ్ టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం ఒక్క నిమిషం పాటు మౌనం వహించి నివాళులు అర్పించారు. అనంతరం ఉగాది పురస్కారాలను ఈ కార్యక్రమ ముఖ్య అతిధులు చేతుల మీదుగా అందజేశారు . ఈ సంవత్సరం ఉగాది కీర్తి రత్న అవార్డు గ్రహీతలు వీరే తెలుగు ఎక్సపెట్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా నుంచి ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజు సూర్యదేవర ,షైక్ సుభాని సాహెబ్, మలేషియా ఆంధ్ర అసోసియేషన్ నుండి శ్రీమతి విజయ శారద గరిమెళ్ళ ,వెంకట్ చిక్కం, మలేషియా తెలుగు ఫౌండేషన్ నుంచి ప్రకాష్ రావు, జగదీశ్వర్ రావు, మలేషియా తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ నుండి కృష్ణ మూర్తి , సుబ్బారావు,తెలుగు ఇంటలెక్చవల్ సొసైటీ అఫ్ మలేషియా నుంచి శ్రీ రాములు సన్నాసి ,తొండ కృష్ణ మూర్తి చంద్రయ్య , పెళ్లి చూపులు అసోసియేషన్ ఆఫ్ మలేషియా నుంచి పారు ఆపతినారాయణన్ ,గువేంద్ర శ్రీనివాస్ రావు అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు . అలాగే ఫెడరేషన్ అఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా 2025-2026 కి గాను నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఆ తర్వాత కార్యక్రమంలో ఆట పాటలతో ఆలరించిన చిన్నారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే ఇటీవల మలేషియా ప్రభుత్వం ప్రకటించిన మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం 2.0 (PRM 2.0) ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకం మే 19 నుంచి ఏప్రిల్ 30, 2026 వరకు అమలులో ఉంటుందని ఈ విషయాన్ని ఇతర సంఘాల ప్రతినిధులు వారి వారి అధికార ప్రసార మాధ్యమాలలో దీని గురించి తెలియ జేయాలని, ఈ ఆమ్నెస్టీ సంబంధించి ఏదైనా సహాయం కావలసినవారు ఫెడరేషన్ అఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియాను info@fnca.com.my or website www.fnca.com.my సంప్రదించాలని బూరెడ్డి మోహన్ రెడ్డి కోరారు. ఆమ్నెస్టీ సద్వినియోగం అయ్యే దిశగా మలేషియా లో ఉంటున్న కార్మికులను స్వదేశానికి చేరుకునేలా తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు చర్యలు తీసు కోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు, అలాగే ఈ కార్యక్రమం గురించి మలేషియాలో ఉంటున్న కార్మికులకు తెలిసే విధంగా తెలంగాణ ఆంధ్రా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి, సహాధ్యక్షులు కృష్ణ ముత్తినేని,ఉపాధ్యక్షులు రవి వర్మ కనుమూరి, ప్రధాన కార్యదర్శి శివ సానిక,సంయుక్త కార్యదర్శి భాస్కర్ రావు ఉప్పుగంటి, కోశాధికారి రాజ శేఖర్ రావు గునుగంటి, యువజన విభాగం అధ్యక్షులు క్రాంతి కుమార్ గాజుల,సాంస్కృతిక విభాగం అధ్యక్షులు సాయి కృష్ణ జులూరి, కార్యనిర్వాహక సభ్యులు నాగరాజు కాలేరు, నాగార్జున దేవవరపు, ఫణీంద్ర కనుగంటి, సురేష్ రెడ్డి మందడి, రవితేజ శ్రీదాస్యాం, మహిళా విభాగం అధ్యక్షురాలు శిరీష ఉప్పుగంటి, మహిళా ఉపాధ్యక్షురాలు దుర్గా ప్రవళిక రాణి కనుమూరి, కార్యనిర్వాహక సభ్యురాలు సూర్య కుమారి , రజిని పాల్గొన్నారు.

ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు తెలిసి..కన్నీళ్లు ఆగలేదు!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీగా భారత్ మే7న ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. భారత్ ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్ గురించి విని పహల్గాం బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరూ ఒక్కో రీతీగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. తాజాగా ఆ పహల్గాం ఉగ్రదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న భారత సంతతి సింగపూర్ మహిళ వైశాలి భట్ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ సందేశాన్ని తీసుకెళ్తున్న ప్రతినిధి బృందంతో సింగపూర్లో ఉన్న బీజేపీ ఎంపీ హేమాంగ్ జోషితో జరిగిన సంభాషణలో..ఇలా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు వైశాలి భట్. నాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ..ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి గంటన్నర ముందు తన భర్తతో కలిసి బైసారన్ లోయ నుంచి బయలదేరామని చెప్పారు. ఆ తర్వాత ఆ భయంకరమైన ఉగ్రదాడి గురించి వార్తల్లో విని భయాందోళనలకు లోనైనట్లు తెలిపారు. తాము తృటిలో ఆ దాడి నుంచి తప్పించుకున్నామని తెలిసి..వొళ్లు గగుర్పొడించిందన్నారు. అయితే తాము ఈ ఉగ్రదాడిపై తక్షణమే భారత ప్రభుత్వం చర్ తీసుకుంటుందని ఆశించా..కానీ రోజుల గడిచేకొద్ది నిరాశ వచ్చేసిందని చెప్పారు. కానీ మే7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు విన్నానో..వెంటనే కళ్ల వెంబడి నీళ్లు వచ్చేశాయన్నారు. అస్సలు ఎంతలా కంట్రోల్ చేసుకుందామన్నా ఆగలేదంటూ భావోద్వేగంగా మాట్లాడారు. నాటి భయంకరమై ఉగ్రదాడిలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన ఎన్నో కుటుంబాల ఆక్రందనే ఈ ఆపరేషన్ సిందూర్ అని అన్నారామె. పైగా దీనికి సిందూర్ అని పేరు పెట్టడం సముచితంగా ఉంది. మహిళ నుదిట కుంకుమన చెరిపేసి వికృత ఆనందం పొందిని ఉగ్రవాదులపై ఉక్కుపాదంలా ఈ ఆపరేషన్ సిందూర్ ప్రతిధ్వనించిందని చెప్పారామె. నాటి ఘటనలో పురుషులను మాత్రమే చంపి వారి భార్యలను వితంతువులుగా మార్చినందుకు గానూ భారత ప్రభుత్వం సిందూర్ పేరుతోనే ఈ ఆపరేషన్ని చేపట్టడం ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాముఖ్యతను సంతరించుకుందని అన్నారు వైశాలి భట్. కాగా, ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను బలిగొన్న ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో.. భారత త్రివిధ దళాలు ఉగ్రమూకల్ని, వారి మౌలిక సదుపాయల్ని, స్థావరాలని మట్టుబెట్టింది.(చదవండి: రేపు పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో భారత్ మాక్ డ్రిల్)

అమెరికా అంతటా గులాబీ మయం..!
అమెరికా,డల్లాస్ లోని డాక్టర్ పెప్పర్ ఎరినా వేదికగా జూన్ 1న బీఆర్ఎస్ రజతోత్సవం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ విభాగం కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల పేర్కొన్నారు. డల్లాస్ సభను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ సన్నాహక సభల్లో భాగంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ సందడి నెలకొంది. ఆస్టిన్, న్యూజెర్సీ, రాలీలో నిర్వహించిన సన్నాహక సభలు విజయవంతమయ్యాయి.ఆస్టిన్ లో నిర్వహించిన సన్నాహక సభలో 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే లు, గండ్ర వెంకట రమణ రెడ్డి, పెద్ది సుధర్శన్ రెడ్డి, చల్ల ధర్మారెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగల, యూఎస్ఏ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ మహేష్ తన్నేరు, అభిలాష్ రంగినేని, వంశీ కంచర్ల కుంట్ల, శ్రీధర్ రెడ్డి, వ్యాళ్ల హరీష్ రెడ్డి, వెంకట్ మంతెన, శ్రీనివాస్ పొన్నాల, శీతల్ గంపవరం, అరుణ్ బీఆర్ఎస్ , వెంకట్ గౌడ్ దుడాల, రాజ్ పడిగల, మల్లిక్ , నవీన్ కనుగంటి, సుధీర్ జలగం, గాయకురాలు స్పూర్తి జితేంద్ర తదితరులు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీని రాబోయే రోజుల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని ఆస్టిన్లో వక్తలు వివరించారు. ఇక న్యూజెర్సీలోని గోదావరి ప్రిన్స్టన్లో జరిగిన సన్నాహక సమావేశం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బాల్కా సుమన్, మాజీ ఎమ్మెల్యే గదరి కిషోర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, బాల మల్లు, కార్పొరేటర్ రోజా మాధవరం, యుగంధర్, జక్కిరెడ్డి శ్రీనివాస్ , రవి ధన్నపునేని, మహేష్ పొగాకు తదితరులు పాల్గొన్నారు. జూన్ 1న డల్లాస్లో జరిగే గ్రాండ్ సమావేశానికి అందరినీ ఆహ్వానించారు. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం యూఎస్ఏ.. నార్త్ కరోలినాలోని రాలీలో.. యూనిటీ, సన్నాహక సమావేశం నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, టీటీజీఏ అధ్యక్షుడు భారతి వెంకన్నగారి, మాజీ అధ్యక్షులు చంద్ర ఎల్లపంతుల, కృష్ణ పెండోటి, మహిపాల్ బేరెడ్డి, హరీష్ కుందూర్, పున్నం కొల్లూరు, వీరేందర్ బొక్కా, శంకర్ రేపాల, అరుణ జ్యోతి కట్క, శ్రీధర్ అంచూరి, రఘు యాదవ్ , రాజు కటుకం , శ్రీనాథ్ అంబటి , క్రాంతి కుమార్ కట్కం, ఉమేష్ పరేపల్లి , హరి అప్పని, రాఘవ రావు తదితరులు హాజరై ప్రసంగించారు. రానున్న రెండు రోజుల్లో హ్యూస్టన్, డెలావేర్, వాషింగ్టన్, కాలిఫోర్నియా, డల్లాస్లో సన్నాహక సభలు నిర్వహించనన్నారు. అలాగే, మే 30 సాయంత్రం అతిథులతో భారీ ఎత్తున సభ నిర్వహించనున్నారు. కేటీఆర్ యూఎస్ పర్యటన వివరాలను మహేశ్ బిగాల తెలిపారు. అమెరికాలో తెలంగాణ ఎన్ఆర్ఐలు నిర్వహించే కీలక కార్యక్రమాలకు కేటీఆర్ హాజరవుతారని వివరించారు. జూన్ 1న టెక్సాస్లోని ఫ్రిస్కోలోని కొమెరికా సెంటర్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ భారీ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వేలాది ఎన్ఆర్ఐలు హాజరవుతారు.జూన్ 2న యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్ లో భారతీయ విద్యార్థులను కేటీఆర్ కలుస్తారు. గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తారు. తన ఉపన్యాసాలు, పనితీరుతో యువతకు స్పూర్తిగా నిలిచే కేటీఆర్, నూతన ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్షిప్, భవిష్యత్ భారత నిర్మాణంలో విద్యార్థుల పాత్ర గురించి మాట్లాడనున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ యూఎస్ పర్యటనపై అక్కడి ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రవాస తెలంగాణవాసులతో పాటు ప్రవాస భారతీయులు, విద్యార్థులను తన పర్యటనలో కేటీఆర్ కలవనున్నారు.(చదవండి: యూకేలో ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకలు)
క్రైమ్

పాపం జుబేదా!
మైలార్దేవ్పల్లి(హైదరాబాద్): సమీపంలోని నివాసంలో భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవ గురించి తెలుసుకునేందుకు వారింటికి వెళ్లిన మహిళపై కత్తితో దాడి చేసిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు..మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన సలీమ్, రేష్మ దంపతులు. బక్రీద్ పండగను పురస్కరించుకొని ఇక్కడ ఉంటున్న కూతురి దగ్గరికి వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో సలీమ్ మద్యం తాగి భార్యతో గొడవకు దిగాడు. పెద్దగా అరుపులు వినిపిస్తుండటంతో పక్కనే ఉంటున్న జుబేదా (26) అనే మహిళ అక్కడికి వెళ్లింది. అప్పటికే సలీం కొట్టడానికి రావడంతో భార్య రేష్మ ఇంటి నుంచి బయటకు పరుగులు తీసింది. సలీం కూరగాయలు కోసే కత్తిని చేతపట్టుకొని ఆమె కోసం గాలిస్తున్నాడు. అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన జుబేదాను తన భార్య అనుకొని కత్తితో పొడిచాడు. ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో సలీం అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలికి చేరుకుని నిందితుడిని గాలించి పట్టుకున్నారు. తీవ్రంగా గాయపడిన జుబేదాను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈత రాకున్నా నదిలోకి వెళ్లి..
భూపాలపల్లి/కాళేశ్వరం: వారంతా విద్యార్థులు.. పైగా సమీప బంధువులు.. ఓ వివాహ వేడుకలో కలుసుకున్నారు... ఎవరికీ ఈత రాకున్నా మేడిగడ్డను చూసి సరదాగా గోదావరిలో స్నానం చేద్దామని నదిలోకి దిగారు. కానీ నీటి ప్రవాహాన్ని అంచనా వేయలేక ఒకరిని కాపాడబోయి ఒకరు మొత్తం ఆరుగురు నదిలో గల్లంతయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబట్పల్లిలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోల్కొండ మల్లయ్య కుమార్తె త్రివేణి వివాహం ఈ నెల 5న జరిగింది. వివాహం అనంతరం సమీప బంధువులైన అదే గ్రామానికి చెందిన పట్టి మధుసూదన్ (18), పట్టి శివమనోజ్ (15), తొగరి రక్షిత్ (13), కర్ణాల సాగర్ (16)తోపాటు మహాముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన బొల్లెడ్ల రాంచరణ్ (17), స్తంభంపల్లి (పీపీ)కి చెందిన పసుల రాహుల్ (19), పట్టి శివమణి.. మేడిగడ్డ ఎగువ భాగంలో మూడో బ్లాక్ వద్ద స్నానం చేసేందుకు శనివారం సాయంత్రం 6 గంటలకు వెళ్లారు. మోకాలి లోతు నీళ్లలో స్నానం చేసే క్రమంలో ఆడుకుంటుండగా తొలుత ఒకరు నీటమునిగారు. ఆపై ఒకరిని కాపాడబోయి ఒకరు.. ఆరుగురు నీటమునిగారు. నది ఒడ్డునున్న పట్టి శివమణి వెంటనే పట్టి మధుసూదన్ను కాపాడేందుకు ప్రయత్నించాడు. సాధ్యంకాకపోవడంతో చివరకు ఒడ్డుకు వచ్చేశాడు. మిగిలిన ఆరుగురు నదిలో గల్లంతయ్యారు. వద్దని వారిస్తున్నా వినకుండా... అంబట్పల్లి గ్రామానికి చెందిన పట్టి వెంకటస్వామికి కుమారులు మధుసూదన్, శివమనోజ్ ఉన్నారు. వారితోపాటు మిగిలిన ఐదుగురు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్తుండగా వెంకటస్వామి అడ్డుకున్నాడు. నదిలో నీటిమట్టం ఎక్కువగా ఉందని.. వెళ్లొద్దని వారించినా వినకుండా వారు వెళ్లా రు. దీంతో అతను కూడా వారితో అక్కడికి వెళ్లాడు. మోకాలి లోతు వరకు వెళ్లాక తిరిగి రావాలని పిలుస్తున్న క్రమంలోనే తన కుమారులు సహా ఆరుగురు ఒకరి వెనుక ఒకరు నీటము నగడంతో వెంకటస్వామి అచేతన స్థితిలో ఉండిపోయాడు. ఘటనాస్థలిలో 5,100 క్యూసెక్కుల నీరు.. కొద్ది రోజులుగా గోదావరి ఎగువన వర్షాలు కురుస్తుండటంతో నీటిమట్టం పెరుగుతోంది. ప్రమాదం జరిగిన మేడిగడ్డ ఎగువ భాగం మూడో బ్లాక్లో ప్రస్తుతం 5,100 క్యూసెక్కుల నీరు ఉంది. పిల్లలు నీటిని అంచనా వేయలేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఆరుగురు యువకుల గల్లంతు వార్త తెలుసుకున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెంటనే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టాయి. అయినా గల్లంతైన వారి ఆచూకీ లభించలేదు. ఈతకు వెళ్లి విద్యార్థి మృతి హసన్పర్తి: వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలోని రెడ్డిపురం చెరువులో ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మునిగి మృతిచెందాడు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం టేకులకుంట తండాకు చెందిన తేజావత్ గణేష్ నగరంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సెకండియర్ చదువుతున్నాడు. అదే హాస్టల్లోని నలుగురు స్నేహితులతో కలిసి రెడ్డిపురం సమీపంలోని చెరువులోకి ఈతకు వెళ్లాడు. గణేశ్ ఈత కొడుతూ ముందుకు వెళ్లి మునిగిపోయాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గణేశ్ మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి తండ్రి తేజావత్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు.

భార్య తల నరికి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన భర్త.. కారణం ఏంటంటే?
బెంగళూరు,సాక్షి: బెంగళూరు సమీపంలో ఒళ్లు గగూర్పొడిచే సంఘటన చోటు చేసుకుంది. అనేకల్ ప్రాంతంలోని హీలాలిగె గ్రామంలో నివసిస్తున్న ఓ యువకుడు తన భార్యను నరికి, ఆమె తలతో పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయిన ఘటన కలకలం రేపింది.28 ఏళ్ల శంకర్ అనే వ్యక్తి తన 26 ఏళ్ల భార్య మానసను తల నరికి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శంకర్, మానస దంపతులు కొంతకాలంగా హీలాలిగె గ్రామంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. జూన్ 3 రాత్రి శంకర్ తన పని ముగించుకొని ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో మానస మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడం చూసి శంకర్ తీవ్రంగా కోపోద్రిక్తుడయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి, మానస పుట్టింటికి వెళ్లింది.అయితే, ఆ తర్వాత కొన్ని రోజులు మానస తిరిగి ఇంటికి వచ్చి శంకర్ను వేధించినట్లు సమాచారం. హత్యకు ముందు రోజు కూడా ఆమె ఇంటికి వచ్చి గొడవ పడ్డట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, జూన్ 6 రాత్రి శంకర్ తాను మానసను హత్య చేసి, ఆమె తల నరికి, నేరుగా సూర్యనగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. అక్కడే తాను హత్య చేసినట్టు పోలీసులకు చెప్పిన శంకర్, తలను కూడా పోలీసులకు చూపించాడు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (బెంగళూరు రూరల్) సీకే బాబా మాట్లాడుతూ...రాత్రి దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదంలో భార్యను తలను నరికి స్టేషన్కు తీసుకువచ్చాడు. మానసకు మరో వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో గత వారం రోజులుగా ఈ దంపతులు తరచూ గొడవపడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, శంకర్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

తెలుగు నేతలే టార్గెట్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/ఆదిలాబాద్ /చర్ల: వరుస ఘటనలు చూస్తుంటే... తెలుగు నేతలే టార్గెట్గా స్పెషల్ ఆపరేషన్లు చేపడుతున్నట్టు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఇంద్రావతి టైగర్ రిజర్వ్ నేషనల్ పార్కులో గురు, శుక్రవారాల్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు అగ్రనేతలు మృతి చెందారు. గురువారం కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం, శుక్రవారం తెలంగాణ కమిటీ సభ్యుడు మైలారపు ఆడెళ్లు అలియాస్ భాస్కర్ చనిపోయారు. కాగా, ఆయన తెలంగాణ కమిటీతోపాటు స్పెషల్ జోనల్ కమిటీలోనూ సభ్యుడిగా కొనసాగుతున్నారు. భాస్కర్పై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి రూ.25 లక్షలు, తెలంగాణ నుంచి రూ.20 లక్షల రివార్డు ఉండగా, ఆయన మృతదేహం వద్ద ఏకే 47 తుపాకీ లభించింది. మూడో అంచెపై వలమావోయిస్టులను దెబ్బ తీసేందుకు పోలీసులు, భద్రతా దళాలు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను అమలుచేస్తున్నా యి. అగ్ర నేతలకు మూడంచెల భద్రత ఉంటుంది. ఇందులో తొలి అంచెలో అగ్రనేతతోపాటు అతని సపోర్టింగ్ స్టాఫ్, రెండు, మూడో అంచెలో ఇతర మావోలు ఉంటారు. వీరిలో ఎక్కువమంది బస్తర్ వాసులే ఉంటున్నారు. అగ్రనేతలే టార్గె ట్గా దాడులు జరిగినప్పుడు ఎక్కువగా చనిపోయే వారిలో వీరే ఉంటున్నారు. ఇదే విషయాన్ని హైలెట్ చేస్తూ ‘తెలుగు నేతలను కాపాడేందుకు మీరు ఎందుకు చనిపోవాలి’అంటూ ప్రచార కార్యక్రమాన్ని వ్యూహత్మకంగా నిర్వహిస్తూ వస్తున్నా రు.ఇది సత్ఫలితాలను ఇస్తోందని పోలీసులే బాహాటంగా ఒప్పుకుంటున్నారు. దీనికి తగ్గట్టే ఆ పార్టీ చీఫ్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్కు ముందు ఆయన రక్షణ టీమ్లో ముగ్గురు మావోలు లొంగిపోవడం తీవ్రనష్టానికి దారి తీసింది. అంతకు ముందు దండ కారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రేణుక అలియాస్ భాను విష యంలో ప్రస్తుతం సుధా కర్, మైలారపు ఆడెళ్లు విష యంలోనూ ‘కోవర్ట్’ తర హా ఆపరేషన్ జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే పరంపరలో నేటి తరం అగ్రనేత, బస్తర్ మూలవాసి, మోస్ట్వాంటెడ్ మావోయిస్టుగా ఉన్న మడావి హిడ్మా లేటెస్ట్ ఫొటోను సైతం భద్రతా దళాలు సంపాదించాయి. హిట్లిస్ట్లో తెలుగు నేతలుతెలంగాణ నుంచి మల్లోజుల వేణుగోపాల్ తి ప్పర్తి తిరుపతి. పాక హనుమంతు , కడారి సత్యనారాయణరెడ్డి, తక్కెళ్లపల్లి వాసుదేవరావు, చంద్రన్న, బండి ప్రకాశ్, రామన్న, పాపారావు, కంకణాల రాజిరెడ్డిలు మావోయిస్టు పార్టీలో అగ్రనేతలుగా కొనసాగుతున్నారు. వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి దామోదర్తో పాటు కొయ్యాడ సాంబయ్య, వెంకటేశ్ కూడా కీలక నేతలుగా ఉన్నారు. వీరి కదలికపై కన్నేసిన భద్రతా దళాలు అనుకూల సమయం చూసి దాడి చేస్తున్నట్టు తెలు స్తోంది. ఇంద్రావతి నదీతీరంలో రెండో రోజైన శుక్రవారం కూడా మావోలు – పోలీసుల బలగాల నడుమ కాల్పులు కొనసాగాయని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ చెప్పారు.మూడు దశాబ్దాల క్రితమే ఉద్యమంలోకి..మైలారపు ఆడెళ్లుది ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చర స్వస్థలం. బోథ్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన ఆడెళ్లు...1989లో నిర్మల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్లో చేరాడు. ఆ సమయంలో భూపోరాటాలు ఉధృతంగా సాగేవి. అభ్యుదయ భావాలు కలిగిన ఆయన రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చేరాడు. దానికి అధ్యక్షుడిగా పనిచేశాడు.ఆ తర్వాత ఉద్యమం వైపు మళ్లి 1995లో నక్సల్స్లో చేరాడు. మొదట బోథ్ దళ సభ్యుడిగా, ఆ తర్వాత ఇంద్రవెల్లి దళ డిప్యూటీ కమాండర్గా పనిచేసి, దండకారణ్యంలోకి వెళ్లిపోయాడు.ఉద్యమంలో ఉన్న సమయంలోనే నిర్మల్ జిల్లా కడెం మండలం లక్ష్మిసాగర్ గ్రామానికి చెందిన దళ సభ్యురాలు కంతి లింగవ్వను వివాహం చేసుకున్నారు. 2022 డిసెంబర్లో మహారాష్ట్ర–ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆమె మృతిచెందింది. అప్పటి నుంచి అడెల్లు దండకారణ్యంలోనే ఉంటున్నారు. ఆయన సోదరులు మాత్రమే స్వగ్రామంలో ఉంటున్నారు. ఆడెళ్లు మరణ వార్తతో పొచ్చరలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అతని పెద్ద సోదరుడు పేరు కూడాఆడెళ్లు. మావోయిస్టు ఆడెళ్లు మృతిచెందిన వార్త తెలిసిన తర్వాత ఆయన తన ఇంటివైపు ఎవరూ రావద్దని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆడెళ్లు మృతదేహాన్ని పొచ్చరకు తీసుకొస్తారా.. అందుకు సోదరులు సమ్మతిస్తారా అనేది చూడాల్సిందే.