
నగరంలో క్రిస్మస్ కోలాహలం మొదలైంది. ఈ నెల 25న జీసస్ జన్మదినం.. క్రైస్తవులకు పర్వదినం. ఈ సందర్భంగా క్రిస్మస్ ట్రీలు, శాంటాక్లాజ్ బొమ్మలు, క్రిస్మస్ స్టార్ల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ప్రీ కిస్మస్ వేడుకలు, కేక్ మిక్సింగ్లతో సందడి వాతావరణం నెలకొంది. పంజాగుట్టలోని ఓ షాపింగ్ మాల్లో మంగళవారం ఈ దృశ్యాలు కనిపించాయి.






















