celebration
-
సునీతా విలియమ్స్ స్వగ్రామంలో సంబరాలు
న్యూఢిల్లీ: దాదాపు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్(Astronaut Sunita Williams) సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఈ నేపధ్యంలో ఆమె స్వస్థలమైన గుజరాత్లోని ఝులసాన్లో ప్రజలు భగవంతునికి హారతులు అర్పిస్తూ, ప్రార్థనలు చేశారు. అలాగే సంబరాలు జరుపుకున్నారు.అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన వారిలో వ్యోమగామి సునీతా విలియమ్స్తో పాటు బుచ్ విల్మోర్, నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ ఉన్నారు. వ్యోమగాములంతా డ్రాగన్ క్యాప్సూల్(Dragon Capsule) నుండి బయటకు వచ్చారు. వెంటనే వైద్యులు వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వ్యోమగాములు విజయవంతంగా తిరిగి వచ్చిన తరుణంలో భారతదేశంతో పాటు అమెరికాలో వేడుకల వాతావరణం నెలకొంది. సునీతా విలియమ్స్తో పాటు క్రూ-9 సభ్యుల ధైర్యసాహసాలు, విజయాల గురించి జనం చర్చించుకుంటున్నారు. #WATCH | Mehsana, Gujarat | People express joy and burst firecrackers in Jhulasan - the native village of NASA astronaut Sunita Williams after the successful Splashdown of SpaceX Dragon spacecraft carrying Crew-9 at Tallahassee, FloridaNASA's astronauts Sunita Williams and… pic.twitter.com/fKs9EVnPSf— ANI (@ANI) March 18, 2025డ్రాగన్ క్యాప్సూల్ నుండి బయటకు వచ్చిన మూడవ వ్యక్తి సునీతా విలియమ్స్. ఆమె బయటకు రాగానే అందరినీ చిరునవ్వుతో పలకరించారు. క్యాప్సూల్ నుండి వ్యోమగాములను బయటకు తీసుకువచ్చే ప్రక్రియ క్లిష్టంగా ఉంటుంది. క్యాప్సూల్ లోపల వ్యోమగాములంతా సీట్ బెల్టులతో కట్టి ఉంటారు. సునీతా విలియమ్స్తో పాటు ఇతర వ్యోమగాములను తీసుకువస్తున్న క్యాప్సూల్ భూ వాతావరణం(Earth's atmosphere)లోకి ప్రవేశించినప్పుడు, 3500 డిగ్రీల ఫారెన్హీట్ వేడి కారణంగా అది ఎర్రటి అగ్ని బంతిలా కనిపించింది. అయితే ఆ క్యాప్యూల్ లోనికి ఉష్ణోగ్రత ప్రవేశించకుండా దానిని తయారుచేస్తారు. క్యాప్సూల్ లోపల ఉష్ణోగ్రత దాని బయట ఉష్టోగ్రత కంటే చాలా తక్కువగా ఉంటుంది.ఇది కూడా చదవండి: భూమిపైకి క్షేమంగా సునీత.. -
New Zealand: హోలీ వేడుకల్లో న్యూజిలాండ్ ప్రధాని
భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో నేడు హోలీ వేడుకలు(Holi celebrations) జరుగుతున్నాయి. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ హోలీ ఆడుతూ ఆనందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో న్యూజిలాండ్ ప్రధాని ప్రజల మధ్య హోలీ ఆడుతున్న దృశ్యాన్ని చూడవచ్చు.ఈ వీడియోను న్యూజిలాండ్(New Zealand)లోని ఇస్కాన్ ఆలయం వద్ద చిత్రీకరించారు.ఇక్కడ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్(Christopher Luxon) సమక్షంలో హోలీ వేడుకలు జరిగాయి. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు ఇస్కాన్ ఆలయానికి జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని జనసమూహంపై రంగులు చల్లుతూ కనిపించారు. అలాగే అక్కడున్నవారంతా ఒకరిపై ఒకరు ఎంతో ఉత్సాహంగా రంగులు చల్లుకున్నారు. Prime Minister of New Zealand Christopher Luxon celebrating #Holi. pic.twitter.com/xjPbxPLeyT— The Gorilla (News & Updates) (@iGorilla19) March 12, 2025వేడుకలు జరుగుతున్న సమయంలో న్యూజిలాండ్ ప్రధాని మెడలో పూల దండ వేసుకున్నారు. అతని భుజంపైవున్న టవల్పై హ్యాపీ హోలీ అని రాసివుంది. కాగా హిందువులు ఎంతో వేడుకగా జరుపుకునే హోలీ, దీపావళి అంతర్జాతీయ పండుగలుగా పరిణమిస్తున్నాయి. అమెరికా, కెనడా, మారిషస్, ఫిజి, గయానా, నేపాల్, న్యూజిలాండ్ సహా ప్రపంచంలోని అన్ని దేశాలలో ఈ పండుగలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.ఇది కూడా చదవండి: Holi: మధుర.. కోల్కతా.. ఢిల్లీ.. అంతా రంగులమయం -
Holi 2025 : ఎపుడూ వైట్ డ్రెస్సేనా? కలర్ ఫుల్గా, ట్రెండీగా.. ఇలా!
హోలీ (Holi) అంటే.. రంగుల రాజ్యం. ఆద్యంతం హుషారుగా సాగే ఏకైక పండుగ ఇదేనేమో.. డ్యాన్స్, మ్యూజిక్, విందు వినోదాల కలయికగా సాగే ఈ పండుగ సందర్భంగా అనుసరించే ఫ్యాషన్ కూడా కలర్ఫుల్గా ఉండాలి కదా.. కాబట్టి కలర్ ఫెస్ట్లో ప్రత్యేకంగా కనబడేందుకు తాను చెప్పే స్టైల్స్తో లుక్ని కొత్త లెవల్కి తీసుకెళ్లండి అని సూచిస్తున్నారు నగరానికి చెందిన ఫ్యాషన్ కన్సెల్టెంట్ సుమన్ కృష్ణ. ఈ ఏడాది ఆరంభం నుంచి ట్రెండింగ్లో ఉన్న కలర్.. బ్లాక్ని సెంటరాఫ్ ఫ్యాషన్గా చేసి హోలీ వేడుకలో త‘లుక్’మనవచ్చని అంటున్నారామె. ఆమె అందిస్తున్న విశేషాలు, సూచనలివీ.. – సాక్షి, సిటీబ్యూరో కలర్ బ్లాకింగ్ అంటే..? ఇది విభిన్న, కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ స్టైల్. మామూలు వైట్ కుర్తా బోరింగ్గా ఉంటుంది. సో.. ట్రెండీ కలర్ కాంబినేషన్లతో లుక్కి ఎక్స్ట్రా గ్లామర్ వస్తుంది.. ఒకే షేడ్లో ఉండే డ్రెస్సింగ్ కంటే, రెండు లేదా మూడింటికి పైగా బ్రైట్ కలర్స్ మిక్స్ చేసి ధరించడం ద్వారా మరింత స్టైలిష్గా కనిపిస్తారు. కొన్ని కలర్ కాంబినేషన్స్.. ధరించే దుస్తుల మధ్య సరైన కలర్ కాంబినేషన్ చాలా కీలకం. పింక్–ఆరేంజ్ హోలీకి చాలా ఎనర్జిటిక్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అలాగే..ఎల్లో–పర్పుల్ వంటి బ్రైట్ షేడ్స్ ట్రెడిషనల్ హోలీ లుక్కి సరైన ఎంపిక. అంతేకాకుండా బ్లూ–రెడ్ కూడా ట్రెండీ లుక్ అందిస్తాయి. వైట్–రేసింగ్ గ్రీన్లు క్లాసిక్గా కనపడాలంటే బెస్ట్. పీచ్లను సున్నితమైన, పండుగ కళ తెచ్చే కలర్స్గా పేర్కొనవచ్చు.స్టైల్–కంఫర్ట్ రెండింటి మేళవింపులా ఇంపుగా అనిపించాలంటే, కాటన్ లేదా లినెన్ ఫ్యాబ్రిక్స్ ఎంచుకోవడం మంచిది. బ్రైట్ టాప్ + లైట్ బాటమ్ – లేదా ఆపోజిట్ కలర్ బ్లాక్ డ్రెస్సింగ్ ట్రై చేయవచ్చు. బాగీ/లూజ్ కుర్తాస్, ఫ్యూజన్ ధోతి ప్యాంట్స్ హోలీ మూడ్కి సరిగ్గా సరిపోతాయి. హోలీ డాన్స్లో ఫుల్ ఫన్ కోసం బెస్ట్ ఆప్షన్గా పాదాలకు స్నీకర్స్ బెస్ట్. సన్గ్లాసెస్, వాటర్ ప్రూఫ్ మేకప్ – హోలీ ఎఫెక్ట్స్ స్టైలిష్గా హ్యాండిల్ చేయండి. ఇలా చేయొద్దు.. పూర్తిగా వైట్ డ్రెస్సింగ్ వద్దు. దీనివల్ల రంగుల మిక్స్ తక్కువగా కనిపిస్తుంది. హెవీ మెటీరియల్స్, సిల్క్ ధరిస్తే అన్ ఈజీగా అసౌకర్యంగా ఉంటుంది. అలాగే కాళ్లకు హీల్స్ ధరిస్తే జారిపడే చాన్స్ ఎక్కువ. మేకప్, హెయిర్ ప్రొటెక్షన్ లేకుండా వెళ్లడం పెద్ద పొరపాటు అవుతుంది.ఫైనల్ టచ్.. ఈ హోలీలో బ్లాక్ కలర్తో మ్యాజిక్ ట్రై చేయవచ్చు. ఫొటోలు మరింత ట్రెండీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఈ హోలీ జ్ఞాపకాలతో ఆనందాన్ని ఏడాది పాటు కొనసాగించవచ్చు. -
హరహర మహాదేవ! ఘనంగా శివరాత్రి వేడుకలు
సాక్షి, ముంబై: ముంబైలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఆలయాలకు పోటెత్తారు. పశ్చిమ అంధేరితోపాటు నగరంలోని పలుప్రాంతాల్లో శివాలయాలన్నీ మహాదేవుడి నామస్మరణతో మార్మోగిపోయాయి. అంధేరి వెస్ట్లోని ఆరంనగర్, వర్సోవా, ఇతర ప్రాంతాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అభిషేకాలు, విశేష పూజలతో ఆధ్యత్మిక సౌరభాన్ని వెదజల్లాయి. భక్తులు శివ భజనలు, శివ తాండవ స్తోత్రాలు, ఇతర భక్తి గీతాలతో ఆది దేవుణ్ణి స్మరిస్తూ రాత్రంతా జాగరణ చేశారు. గురు వారం తెల్లవారుజామున ప్రత్యేకపూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం వివి ధ ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు మహాప్రసాదాలను అందించారు. వర్లీ, శివకృప క్రీడా మండల్ ఆధ్వర్యంలో... వర్లీ, నెహ్రూనగర్లో బుధవారం మహాశివరాత్రి సందర్భంగా శివ మహాపూజ, సత్యనారాయణ మహాపూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మండల్ ఆధ్వర్యంలో గత 36 సంవత్సరాలుగా శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, ఇకపై ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను విస్తృతంగా చేపడతామని మండల్ నిర్వాహకులు తెలిపారు. బ్రహ్మకుమారీ సంస్థ ఆధ్వర్యంలో... ప్రముఖ ఆధ్యాత్మిక సంస్ధ ‘ప్రజాపితా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయ్’ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. లోయర్పరేల్, దీపక్ టాకీస్ సమీపంలో ఉన్న పద్మావతి భవనం ఆవరణలో బుధవారం ఉదయం, సాయంత్రం వివిధ భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు పలు ఆధ్యాత్మిక సేవా సంస్ధలు, తెలుగు సంఘాల ప్రముఖులు, పదాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాల ముఖ్య అతిథి, ఆంధ్ర మహాసభ సాంస్కృతిక శాఖ మాజీ ఉపాధ్యక్షురాలు రాధా మోహన్ శివరాత్రి ఉత్సవ పతాకాన్ని ఆవిష్కరించారు. అనేక సంవత్సరాలుగా బ్రహ్మకుమారి సంస్ధ చేపడుతున్న వివిధ సేవా కార్యాక్రమాలను గురించి రాధా మోహన్ ప్రశంసించారు. ఈ సందర్భంగా వేడుకలకు హాజరైన భక్తులందరినీ ఆధ్యాత్మిక గురువులు, మాతాజీలు బి.కే.శీతల్ బేన్, బి.కే.పుష్పబేన్, బి.కే.అరుణబేన్ ఆశీర్వదించారు. వారికి ప్రసాదాలు పంపిణీ చేసి కానుకలు అందజేశారు. అనంతరం సాయంత్రం జరిగిన ప్రవచన కార్యక్రమంలో యూబీటీ శివసేన ఎమ్మెల్సీ, రాష్ట్రపతి అవార్డు గ్రహిత సునీల్ శిందే, ప్రభాదేవి–దాదర్ నియోజక వర్గం ఎమ్మెల్యే మహేశ్ సావంత్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో సంస్ధ ఆర్గనైజింగ్ ఇన్చార్జ్ డా.నాయిని రవి, తెలుగు డాక్టర్స్ అసోసియేషన్ (టీడీఎస్) అధ్యక్షుడు డా.ఎన్.ఎం.తాటి, మాజీ అధ్యక్షుడు డా.కే.ఆర్.దుస్సా, పదాధికారులు, సభ్యులు డా.స్వాతి, డా.వేముల గోదావరి, డా.పల్లాటి రాజు, డా. ఆడెపు, డా.ఎల్.ఎన్.గుడ్డేటి, డా.వేముల సుదర్శన్, డా.ఆర్.ఆర్.అల్లే, డా.శ్రీనివాస్, డా.వెంకటేశ్, ఆంధ్ర మహాసభ ట్రస్టీలు, కార్యవర్గ పదాధికారులు ఏక్నాథ్ సంగం, వాసాల శ్రీహరి (వంశీ), నడిమెట్ల ఎల్లప్ప, వేముల మనోహర్, యాపురం వెంకటేశ్, షేర్ల ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు
-
‘ఉమ’ నిస్టు సగమై సంగమమై!
లోకంలో భార్యను ప్రేమించే వారు చాలామంది ఉండొచ్చు. అయితే శివుడు తన భార్యను ప్రేమించినంతగా మరొకరెవరూ ప్రేమించలేరేమో అనిపిస్తుంది. ఎందుకంటే శివుడికి పార్వతి మీద ప్రేమ ఎంతటి గొప్పదంటే ఆమెకు తన శరీరంలో సగభాగాన్ని పంచి ఇచ్చేటంత! శివుడి అర్ధనారీశ్వర తత్వాన్ని, శివుడిలో శక్తిగా వెలిగే అమ్మవారిని దర్శించడానికి సౌందర్యలహరిలో అనేక ఉదాహరణ లున్నాయి కానీ... మచ్చుకు మొదటి రెండు శ్లోకాలు పట్టుకుంటే చాలు. ‘శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చే దేవం దేవో న ఖలు కుశలః స్పందితు మపి అత స్త్వా మారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథ మకృత పుణ్యః ప్రభవతి‘శివుడు శక్తితో కలిసినప్పుడే శక్తిమంతుడై సృష్టి స్థితి లయలు చేయగలుగుతున్నాడు. శక్తి కలవనప్పుడు కనీసం స్పందించే శక్తి కూడా లేనివాడుగా ఉన్నాడు. అలాంటి నీగురించి చెప్పాలంటే గతజన్మల్లో పుణ్యం లేకపోతే...బ్రహ్మ–విష్ణు–రుద్రులకైనా సాధ్య మవుతుందా? అమ్మవారిని పొగుడుతూ మొట్టమొదటి శ్లోకం మొట్టమొదటి మాట ‘శివ‘ అని అయ్యవారితో మొదలుపెట్టడంలో శంకరుడి హృదయాన్ని పట్టుకోవాలి. ‘కలాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మేశివాభ్యా మస్తోక త్రిభువన శివాభ్యాం హృది పున ర్భవాభ్యా మానందస్ఫురదనుభవాభ్యాం నతి రియమ్‘ శివపార్వతులు ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైనవారు. ఒకరు ఎక్కువా కాదు. ఒకరు తక్కువా కాదు. ఆది దంపతులు ఇద్దరూ సమానం. అమ్మవారి సౌందర్యానికి తగిన శబ్దసౌందర్యంతో సాగిన రచన ఇది. శంకరాచార్యుల సంస్కృతంలో శబ్ద సౌందర్యం, అర్థగాంభీర్యం వర్ణించడానికి మాటలు చాలవు. కవిత్వం, ప్రాసలు, తూగు, చమత్కారం, భావం, సాంద్రత, ఎత్తుగడ, ముగింపు, మకుటం, పునరుక్తి లేకుండా ఒకే విషయాన్ని రక రకాలుగా చెప్పడం, అత్యంత సంక్లిష్టమైన విషయాలను అరటిపండు ఒలిచిపెట్టినట్లు అత్యంత తేలికగా చెప్పడం... ఇలా తోడుకున్నవారికి తోడుకున్నన్ని అందాలు, ఆనందాలు, అర్థాలు, పరమార్థాలు. శంకరుడు పుట్టక΄ోయి ఉంటే దేవుళ్ళకు ఇన్నిన్ని స్తోత్రాలే ఉండేవి కావు. చదవండి: Shivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి?బ్రహ్మ సృష్టి చేయాలనుకున్నప్పుడు అవసరమైన శివుడి అర్ధనారీశ్వర రూపంలో ఇంకా అనేక ఆధ్యాత్మిక, యోగ సాధనా రహస్యాలు దాగున్నాయి. కాళిదాసు రఘువంశ ప్రార్థన శ్లోకాల్లో చెప్పినట్లు–‘వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే,జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ‘అని శివరాత్రి పూట శివుడిలో భాగమైన పార్వతికి; పార్వతిలో భాగమైన శివుడికి; వేరు చేయడానికి వీల్లేకుండా కలిసి ఉన్న జగత్తుకు తల్లిదండ్రులైన ఆదిదంపతులిద్దరికీ నమస్కారం పెట్టి... లోకంలో దంపతులు కూడా అలా వేరు చేయడానికి వీల్లేకుండా కలిసి ఉండాలని కోరుకుందాం. – పమిడికాల్వ మధుసూదన్ -
పుష్ప 2 సెలబ్రేషన్స్ కు దూరంగా పుష్ప టీమ్
-
Womens Day: కన్న పేగు బంధం అమ్మది..
-
Keerthy Suresh: భర్త ఆంటోనితో కీర్తి మొదటి సంక్రాంతి.. స్పెషల్ గెస్ట్గా విజయ్ (ఫోటోలు)
-
విభేదాలూ, విద్వేషాలను దహించేసి.. భోగాల రాగాలు
మన్మథుడికి వసంతుడి లాగా, భోగి పండగ సంక్రాంతికి సామంతుడు. పెద్ద పండగకు హంగుదారు. ‘సంక్రాంతి లక్ష్మి వేంచేస్తు న్నదహో, బహుపరాక్!’ అని ముందస్తు హెచ్చరికలు చేస్తూ, ఊరంతటినీ ఉత్తేజపరిచి, పండగ కళకు పటిష్ఠమైన పునాది వేస్తుంది.ధనుర్మాసపు ముచ్చటలకు యథోచితంగా భరతవాక్యం పలికి, పౌష్యయోష ఆగమనానికి అంగరంగ వైభవంగా రంగం సిద్ధం చేస్తుంది. మకర సంక్రమణం జరగ బోతున్న మహత్తర ముహూర్తం వేళకు, చప్పటి సాధారణ జీవితపు స్తబ్ధతను వది లించే ప్రయత్నం చేస్తుంది. చలిమంటల నెపంతో, ఆబాల గోపాలంలోనూ సంబరాల వేడి పుట్టిస్తుంది. పల్లె సీమలలో ప్రతి ఇంటి ముంగిటా సమృద్ధికి సంకేతాలుగా, సంతుష్టికి గుర్తులుగా, పూర్ణ కలశాల ‘కుండ ముగ్గులు’ పూయిస్తుంది.వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి/ వచ్చింది వచ్చింది లచ్చి సంక్రాంతి! /అరటి స్తంభాలతో అందగింతాము, / బంతి పూదండలన్ భావించుదాము, / తామరాకులతోడ దళ్ళల్లు దాము, / కలవ కాడల తోడ మెలికలేతాము! అంటూ (రాయప్రోలు వారి) పాటలు పాడుతూ వచ్చి, అందరినీ హుషారు చేస్తుంది.మరో రకంగా చూస్తే, సుదీర్ఘమైన సంక్రాంతి ఉత్సవంలో భోగి పండగ భోగానుభవాల రోజు. పులకింతలు కలిగించే చలిమంటలూ, ఉత్సాహం పెంచే ఉష్ణోదక అభ్యంగన స్నానాలతో ఆరంభించి, కొత్త బట్టల కోలాహలాలతో, వంటలు, పిండి వంటల ఆటోపాలతో, ఆత్మారాముడిని ఆనందపరిచే రోజు భోగి. సంక్రాంతి రోజు ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభ సమయం. మార్తాండుడి మకర సంక్రమణ వేళ. కనుక దానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఎక్కువ. ఆ రోజు ఆస్తికులు దానాలూ, తపాలూ, పితృతర్పణాల లాంటి ఆధ్యాత్మిక వ్యాసంగాలలో ఎక్కువ కాలం గడుపుతారు. కాబట్టి, సరదాలకూ, భోగాలకూ సమయం సరిపోక పోవచ్చు. కాబట్టి భోగినాడే చలిమంటలలో విభేదాలూ, విద్వేషాలూ, ఈర్ష్యా సూయల లాంటి నకారాత్మక భావనలు యథాశక్తి దహించేసుకొని, ఆ రోజంతా బంధుమిత్రుల సాంగత్యంలో ఉల్లాసంగా గడిపి, జీవితంలో కొత్త శక్తినీ, ఉత్సాహాన్నీ నింపుకొని, ఆపైన జరపవలసిన సంక్రాంతి విధులకు సన్నద్ధం కావాలి.అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు!– ఎం. మారుతి శాస్త్రి -
Sankranti 2025 : అసలు భోగి పళ్లు ఎలా పోయాలో తెలుసా?
దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి సూర్యుడు అడుగుపెట్టే సమయంలో వచ్చే అందమైన పండుగ సంక్రాంతి. ఊరూ వాడా అంతా సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా మొదలైపోయాయి. తెల్లవారుఝామున భోగి మంటలతో ఆరంభమై మకర సంక్రాంతి, పొంగళ్లు, కనుమ, ముక్కనుమ మూడు రోజుల పాటు ముచ్చటైన వేడుకలతో పల్లెలన్నీ కళకళ లాడతాయి. ఈ వేడుకల్లో ప్రధానమైంది భోగిపళ్లు. పిల్లలకు భోగి పళ్లు పోయడం అనేది మన సంప్రదాయాల్లో ఒకటి. అసలు పిల్లలకు భోగి పళ్లు ఎందుకు పోస్తారు? ఎలా పోయాలి? ఈ విషయాలు తెలుసుకుందాం రండి.సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లలకు భోగిపళ్లు పోస్తారు..చిన్నారుల్లో రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అందుకే రేగుపళ్లు పోయడం ద్వారా చాలా రోగాల నుంచి రక్షణ లభిస్తుందంటారు పెద్దలు. అంతేకాదు వారిపై ఉన్న చెడు దిష్టి మొత్తం పోతుందని ప్రతీతి. సూర్యుడికి ప్రతీకగా, పోషకాల ఖజానాగా పిలిచే వీటిని తలపై పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారనీ, అలాగే ఆరోజన పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోస్తే సంవత్సరం మొత్తం శ్రీమన్నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.రేగి పండును అర్కఫలం అని కూడా అంటారు. ‘అర్కుడు’ అంటే సూర్యుడు. భోగి మరునాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్లుతాడు. అందుకే ఆ లోక నాయరాణుని కరుణాకటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగి పళ్ల పోసే వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా పాటిస్తారు. భోగి రోజు వచ్చిందంటే... ఇంట్లో చిన్నపిల్లలందరికీ భోగి పళ్లు పోసే వేడుక నిర్వహించేందుకు ఉవ్విళ్లూరుతారు అమ్మమ్మలు, అమ్మలు. ఎలాగా పిల్లలందరికీ భోగి రోజు పొద్దున్నే భోగి మంటల సందడి ఉంటుంది. పొద్దున్నే లేచి భోగి మంటలు వేసుకొని, తలారా స్నానాలు చేసి, కొత్త బట్టలు వేసుకొని భోగిమంటల విభూదిని దిద్దుకుంటారు.నోటి తీపి చేసుకుంటారు. ఇక భోగి పళ్లు పోస్తున్నామంటూ ముత్తుయిదువలను పేరంటానికి ఆహ్వానిస్తారు. సాయంత్రం ఇంట్లో 10 ఏళ్ల లోపు పిల్లలందరికీ కొత్త బట్టలు తొడిగి ముస్తాబు చేస్తారు. రేగి పళ్లు, పూల రెక్కలు, చిల్లర నాణేలు, చెరుకు గడల ముక్కలు, నానబెట్టిన సెనగలు, అక్షింతలు మొదలైనవి కలిపి ఉంచుతారు. అందరు రాగానే, తూర్పు ముఖంగా కానీ, ఉత్తరముఖంగా చిన్నారులను కూర్చోపెడతారు. ఎలా పోయాలి? ఇంట్లోని పెద్దవాళ్లు (అమ్మమ్మ, నానమ్మ) తల్లి కలిపి ఉంచుకున్న భోగిపళ్లను మూడు గుప్పిళ్లతో పిల్లల శిరస్సు చుట్టూ దిష్టి తీసినట్టు తలచుట్టూ తిప్పి పోయాలి. అంటే మూడు సార్లు సవ్య దిశలో, మూడు సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసి తలమీద పోయాలి. ఆ తరువాత పేరంటాళ్లు కూడా ఇలాగే చేయాలి. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని పిల్లల్ని నిండు మనస్సుతో దీవించాలి.ఈ సందర్భంగా "ఓం సారంగాయ నమః" అనే నామం చెప్పాలని పెద్దలు చెబుతారు.ముత్తయిదువలకు పండూ ఫలం కానుకగా ఇస్తారు. ఇలా కార్యక్రమం పూర్తైన తర్వాత వాటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో వదిలిపెడతారు. పిల్లలకు దిష్ట పోవాలని తీసినవి కాబట్టి, ఈ రేగు పళ్లును ఎవరూ తినకూడదని కూడా చెబుతారు.విశిష్టతశ్రీమన్నారాయణుడు రేగుచెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడనీ, ఆ ఫలాన్ని తింటూనే తపస్సు చేశాడని చెబుతారు. రేగుపళ్లను అర్కఫలం అంటారు. ‘అర్కుడు’ అంటే సూర్య భగవానుడు. సూర్యుడితో సమానంగా రేగుపళ్లను భావించి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటూ భోగిపళ్లు పోస్తారు. రేగుపళ్లతోపాటు బంతిపూల రెక్కలు కూడా ఉండడంతో చర్మ సంబంధిత సమస్యలు దూరమవుతాయట. -
Sankranti 2025 : సులువుగా చేసుకునే పిండి వంటలు మీకోసమే!
భారతదేశం అంతటా మకర సంక్రాంతిని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలుగువారు ఎంతో పవిత్రంగా భావించే అతి ముఖ్యమైన పండుగ. భోగి, సంక్రాంతి, కనుక, ముక్కనుమ ఇలా ఒక్కోరోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. సంక్రాంతి వస్తోందంటే బోలడెన్ని పిండి వంటలు చేయాలి. చుట్టాలు, బంధువులు ముఖ్యంగా కొత్త అల్లుళ్లకి మర్యాదల సందడి ఎక్కువగా ఉంటుంది. మరి సంక్రాంతికి ఈజీగా చేసుకునే కొన్ని వంటకాల్ని చూద్దాం. పూర్ణం బూరెలుకావల్సినవి: పచ్చి శనగపప్పు - 2 కప్పులుమినప్పప్పు - కప్పుకొత్త బియ్యం - 2 కప్పులుబెల్లం తురుము - 2 కప్పులునెయ్యి - అర కప్పునూనె -సరిపడతయారి: మినపప్పు, బియ్యం కడిగి సరిపడా నీళ్లు పోసి కనీసం నాలుగైదు గంటలు నానబెట్టాలి. తర్వాత జారుగా కాకుండా, మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. శనగపప్పులో తగినన్ని నీళ్లు పోసి కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకోవాలి. చల్లారాక మందపాటి గిన్నెలో ఉడికించిన శనగపప్పుతోపాటు తరిగిన బెల్లం వేసి మళ్లీ ఉడికించాలి. బెల్లం పాకం వచ్చి, ఈ మిశ్రమం ఉండ చేసుకునే విధంగా అయ్యేలాగా ఉడికించుకోవాలి. చివరగా యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి దింపేయాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవాలి. ఆ తరువాత కడాయిలో నూనె పోసి బాగా కాగనివ్వాలి. ఇపుడు ముందే చేసిపెట్టిన ఒక్కో ఉండనూ మెత్తగా రుబ్బిన పప్పు మిశ్రమంలో ముంచి జాగ్రత్తగా నూనెలో వేసి, బంగారురంగు వచ్చేవరకు వేయించాలి. వేడివేడిగా బూరెల్లో నెయ్యి వేసుకొని తింటే భలే రుచిగా ఉంటాయి. నువ్వుల బొబ్బట్లు, బెల్లంతోకావల్సిన పదార్తాలు : తెల్ల నువ్వులు - 2 కప్పులు; బెల్లం తురుము - 2 కప్పులు; యాలకుల పొడి - ఒకటిన్నర టీ స్పూన్; మైదాపిండి- ఒకటిన్నర కప్పులు; నెయ్యి - సరిపడినంతతయారి: మైదాపిండిలో చిటికెడు ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసి చపాతీ పిండిలాగా మృదువుగా కలుపుకోవాలి. ఆ తరువాత దీనిని కొద్దిసేపు తడిబట్ట కప్పి ఉంచాలి. ఈలోపు బాణలిలో నువ్వులు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి. నువ్వులు చల్లారిన తర్వాత బెల్లం తురుము వేసి, రెండూ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో రుచికి, సువాసన కోసం యాలకులకు కూడా కలపాలి.ఇపుడు కలిపి ఉంచుకున్న పిండిని చిన్న ఉండలుగా చేసుకొని, చపాలీగా వత్తి అందులో నువ్వుల మిశ్రమం పెట్టి బొబ్బట్టు మాదిరిగా వత్తాలి. దీనిని పెనం మీద నెయ్యి వేస్తూ రెండు వైపులా మాడిపోకుండా జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఇదీ చదవండి : ఆంధ్ర దంగల్కు సై అంటున్న.. తెలంగాణ కోళ్లు! ఇంట్రస్టింగ్ విషయాలు పాకం గారెలుకావల్సినవి: మినప్పప్పు -అర కిలో, బెల్లం అర కిలో, కొద్దిగా నీళ్లు, నూనె - వేయించేందుకు సరిపడా నెయ్యి - 50 గ్రాములు యాలకుల పొడి - 1 టీ స్పూన్ ఉప్పు - రుచికి సరిపడాతయారి: పొట్టు తీసిన మినప్పప్పును ముందురోజు రాత్రి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నీళ్లన్నీ వంపేసి, గారె చేయడానికి అనువుగా పిండి గట్టిగా ఉండేలా రుబ్బుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు కలుపుకోవాలి.బెల్లం తురుములో తగినన్ని నీళ్లు పోసి లేతపాకం పట్టి, అందులో యాలకుల పొడి కలిపి పక్కన ఉంచాలి.గారెలు వత్తుకొని, నెయ్యి కలిపిన నూనెలో దోరగా వేయించి, వేడిగా ఉండగానే పాకంలో వేయాలి. వీటిని ఓ పూటంతా కదపకుండా ఉంచితే పాకంలో గారెలు బాగా నాని రుచిగా ఉంటాయి.గోధుమరవ్వ హల్వాకావల్సినవి: చిన్నగోధుమ రవ్వ - 1కప్పుపాలు - 2 కప్పులు; నీళ్లు - 1 కప్పుయాలకుల పొడి - చిటికెడుజీడిపప్పు పలుకులు - 10కిస్మిస్ - 10పంచదార - 2 కప్పులునెయ్యి - 4 పెద్ద చెంచాలుకుంకుమపువ్వు - కొద్దిగాతయారీ: మందపాటి గిన్నెలో నెయ్యి కొద్దిగా వేసి వేడిచేసుకోవాలి. ఇందులో జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే నెయ్యిలో రవ్వ వేసి దోరగా కమ్మని వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ రవ్వను ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇపుడు మరో గిన్నెలో చిక్కని పాలు, నీళ్లు కలిపి బాగా మరిగించాలి. దానిలో గోధుమరవ్వను కొద్ది కొద్దిగా పోస్తూ, ఉండలు లేకుండా కలుపుతూ ఉడకనివ్వాలి. రవ్వ బాగా ఉడికాక అందులో పంచదార, నెయ్యి కూడా వేసి బాగా కలపాలి. పంచదార కరిగి, హల్వా కొద్దిగా దగ్గరకి వచ్చేవరకు కలుపుతూ సన్నని మంట మీద ఉడికించాలి. దీంట్లో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, కుంకుమ పువ్వు వేసి మంట తీసేయాలి. ఘుమఘుమలాడే గోధుమరవ్వ హల్వా రెడీ. ఇదీ చదవండి : HMPV : మళ్లీ మాస్క్ వచ్చేసింది.. నిర్లక్ష్యం వద్దు! -
తరతరాల చరిత్రకు ఆలవాలం
టాటా సెంట్రల్ ఆర్కైవ్స్ తరతరాల చరిత్రకు ఆలవాలం. కేవలం ఇది టాటా కుటుంబ వ్యాపార చరిత్రకు మాత్రమే కాదు, దేశ స్వాతంత్య్రపూర్వ ఆర్థిక, రాజకీయ చరిత్రకు, స్వాతంత్య్రానంతర అభివృద్ధి చరిత్రకు కూడా ఆలవాలం. చారిత్రక ఆనవాళ్లను భద్రపరచి, తర్వాతి తరాలకు అందించడంలో మన భారతీయులకు శ్రద్ధ కొంత తక్కువ. మన దేశంలోని పెద్దపెద్ద వ్యాపార సంస్థలు ఇందుకు మినహాయింపు కాదు. దేశంలోని తొలి వ్యాపార ఆర్కైవ్స్ను టాటా సంస్థ ప్రారంభించింది. టాటా గ్రూప్ సంస్థలకు దాదాపు ఒకటిన్నర శతాబ్దాలకు పైబడిన చరిత్ర ఉంది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి, డెబ్బయి ఏడేళ్లు గడిచాయి. టాటా గ్రూప్ చరిత్ర స్వాతంత్య్ర భారత చరిత్రకు దాదాపు రెట్టింపు. ఆనాటి బ్రిటిష్ కాలంలో జెమ్షెడ్జీ నుసర్వాన్జీ టాటా తొలుత తండ్రి చేసే వ్యాపారానికి సçహాయంగా ఉంటూ వచ్చారు. తర్వాత 1868లో ఈ వ్యాపార సామ్రాజ్యానికి పునాది వేశారు. అప్పట్లో ఆయన రూ.21 వేల పెట్టుబడితో ఒక ట్రేడింగ్ కంపెనీ ప్రారంభించారు. ఆ తర్వాత ఒక కాటన్ మిల్లును ప్రారంభించి, వ్యాపారాలను క్రమంగా విస్తరించుకుంటూ, 1874లో నాగపూర్లో సెంట్రల్ ఇండియా స్పిన్నింగ్, వీవింగ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీని నెలకొల్పారు. బ్రిటిష్ రాజ్యంలో స్థానిక భారతీయుడు ఒకరు ప్రారంభించిన తొలి జాయింట్ స్టాక్ కంపెనీ ఇది. ఆనాటి నుంచి టాటా గ్రూప్ వ్యాపార ప్రస్థానం నేటికీ అప్రతిహతంగా కొనసాగుతూ వస్తోంది. టాటా కుటుంబ వారసుల్లో మూడో తరానికి చెందిన జె.ఆర్.డి. టాటా ఈ చరిత్రను ఒక తరం నుంచి మరో తరానికి అందించడానికి, దేశ పౌరులకు అందుబాటులో ఉంచడానికి వీలుగా టాటా సెంట్రల్ ఆర్కైవ్స్ను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. తొలుత 1991 జనవరిలో బాంబేలో దీనిని ఏర్పాటు చేశారు. తర్వాత 2001లో పుణేలోని సువిశాలమైన ప్రాంగణంలో నిర్మించిన భవనంలోకి దీనిని తరలించారు. ఎంప్రస్ మిల్స్ నుంచి ఎయిర్ ఇండియా వరకుటాటా గ్రూప్ ప్రస్థానం ఎంప్రస్ మిల్స్ నుంచి ఎయిర్ ఇండియా వరకు రకరకాల రంగాల్లో కొనసాగింది. టాటా గ్రూప్ ప్రారంభించిన కొన్ని వ్యాపారాలు కారణాంతరాల వల్ల నిలిచిపోయాయి. ఇంకొన్ని చేతులు మారాయి. అయినా, టాటా గ్రూప్ వ్యాపార ప్రస్థానం దేశ పారిశ్రామిక రంగంలో తన ఉనికిని నేటికీ నిలుపుకుంటూ వస్తోంది. టాటా గ్రూప్ వ్యాపారాలకు సంబంధించి టాటా సెంట్రల్ ఆర్కైవ్స్లో భద్రపరచిన ఎన్నో అరుదైన విశేషాలు నేటి తరానికి తెలియవు. స్వాతంత్య్రోద్యమ కాలంలో టాటాలు పోషించిన పాత్ర, స్వాతంత్య్రానంతరం దేశ ఆర్థికాభివృద్ధిలో పోషించిన పాత్ర నిరుపమానమైనవి. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడైన జెమ్షెడ్జీ నుసర్వాన్జీ టాటా నాగపూర్లో 1874లో ప్రారంభించిన సెంట్రల్ ఇండియా స్పిన్నింగ్, వీవింగ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ ఆధ్వర్యంలో విక్టోరియా మిల్లును నెలకొల్పారు. బ్రిటిష్ రాణిగా విక్టోరియా 1877 జనవరి 1న భారత సామ్రాజ్ఞిగా పట్టాభిషిక్తురాలు కావడంతో ఈ మిల్లు పేరును ఎంప్రెస్ మిల్స్గా మార్చారు. కాలక్రమంలో ఈ కంపెనీ పరిధిలోకి మరో మూడు మిల్లులు చేరాయి. అవన్నీ కలిపి టాటా టెక్స్టైల్ మిల్స్గా పేరుపొందాయి. టాటా టెక్స్టైల్ మిల్స్ వ్యాపారం 1997లో నిలిచిపోయింది. జె.ఆర్.డి.టాటా హయాంలో టాటా గ్రూప్ 1932లో విమానయాన రంగంలోకి ‘టాటా ఎయిర్లైన్స్’ పేరుతో అడుగుపెట్టింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1953లో భారత ప్రభుత్వం దీనిని జాతీయం చేసి, దీని పేరును ‘ఎయిర్ ఇండియా’గా మార్చింది. ప్రభుత్వం 2000–01 కాలంలో ఎయిర్ ఇండియాను ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. చివరకు 2022లో ఈ కంపెనీని తిరిగి టాటా గ్రూప్ కైవసం చేసుకోగలిగింది. ఈ చరిత్రకు సంబంధించిన ఆధారాలన్నీ టాటా సెంట్రల్ ఆర్కైవ్స్లో భద్రంగా అందుబాటులో ఉంచడం విశేషం.మహాత్మాగాంధీకి తొలి విరాళంటాటా గ్రూప్ వారసులు నేరుగా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనకపోయినా, భారత స్వాతంత్య్రోద్యమానికి బాసటగా నిలిచారు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా కొనసాగుతూ, భారత స్వాత్రంత్య్రోమానికి సన్నాహాలు చేస్తున్న కాలంలోనే 1909లో జెమ్షెడ్జీ టాటా చిన్న కొడుకు సర్ రతన్జీ టాటా ఆయనకు తొలి విరాళంగా రూ.25 వేలు పంపారు. అప్పట్లో అది చాలా పెద్దమొత్తం. టాటాల తొలి కంపెనీ పెట్టుబడి కంటే కూడా నాలుగువేల రూపాయలు ఎక్కువ. గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమానికి సర్ రతన్జీ టాటా బాసటగా ఉండేవారు. గాంధీజీకి ఆయన 1910లో మరో రూ.25 వేలు, 1912లో మూడో విరాళం పంపారు. ఈ సంగతిని గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమ ప్రచార పత్రిక అయిన ‘ఇండియన్ ఒపీనియన్’లో రాసిన ఒక వ్యాసంలో ప్రస్తావించారు. గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత్కు వచ్చి, స్వాతంత్య్రోద్యమానికి నాయకత్వం చేపట్టారు. అనతికాలంలోనే దేశ ప్రజలు ఆయనను ‘మహాత్మా’ అని పిలువసాగారు. గాంధీజీ 1925లో జెమ్షెడ్పూర్ వచ్చారు. అక్కడి టాటా ఉక్కు కర్మాగారం కార్మికులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో దేశం పట్ల, దేశ ప్రజల పట్ల టాటాలు కనబరుస్తున్న నిబద్ధతపై ఆయన ప్రశంసలు కురిపించారు. గాంధీజీ చేపట్టిన స్వదేశీ ఉద్యమానికి జెమ్షెడ్జీ టాటా పెద్ద కొడుకు సర్ దొరాబ్జీ టాటా భార్య లేడీ మెహర్బాయి టాటా కూడా మద్దతు తెలిపారు. ఇందుకోసం 1919లో ఆమె స్వయంగా రాట్నంపై నూలు వడకడం నేర్చుకున్నారు. జె.ఆర్.డి.టాటా తండ్రి ఆర్.డి.టాటా కూడా గాంధీజీ నేతృత్వంలోని స్వాతంత్య్రోద్యమానికి మద్దతు పలికారు. స్వదేశీ ఉద్యమం కోసం ఆయన టాటా సంస్థ తరఫున లక్ష రాట్నం కుదురులను, ఇతర చేనేత సామగ్రిని పంపారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో గాంధీజీ, నెహ్రూ, సరోజినీ నాయుడు, సర్దార్ వల్లభ్భాయ్ పటేల్, మహమ్మద్ అలీ జిన్నా తదితర జాతీయ నేతలు బాంబేలో టాటాలకు చెందిన తాజ్మహల్ పాలెస్ హోటల్లో తరచుగా సమావేశాలు జరుపుకొనేవారు.నెహ్రూ కోరికపై లాక్మే ప్రారంభంమన దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశంలో సౌందర్య సాధనాలను తయారు చేసే కంపెనీలు లేవు. సబ్బులు, పౌడర్లు తప్ప మిగిలిన సౌందర్య సాధనాలు కావాలంటే విదేశీ ఉత్పత్తులపై ఆధారపడే పరిస్థితులు ఉండేవి. ఫలితంగా భారీ ఎత్తున విదేశీ మారకద్రవ్యం వీటి కోసం ఇతర దేశాలకు తరలిపోయే పరిస్థితి ఉండేది. విదేశీ మారకద్రవ్యం సౌందర్య ఉత్పత్తుల కోసం విదేశాలకు తరలిపోకుండా ఉండాలంటే, దేశంలో సౌందర్య సా«ధనాల తయారీ సంస్థ ఒకటి ఏర్పాటు చేయాలని తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అప్పట్లో జె.ఆర్.డి.టాటాను కోరారు. నెహ్రూ కోరిక మేరకు జె.ఆర్.డి.టాటా 1952లో తొలి స్వదేశీ సౌందర్య సాధనాల సంస్థగా ‘లాక్మే’ను ప్రారంభించారు. అప్పట్లో ‘లాక్మే’ అనే ఫ్రెంచ్ ఒపేరా ప్రపంచ ప్రసిద్ధి పొందడంతో జె.ఆర్.డి.టాటా తమ సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్కు ఆ పేరు పెట్టారు. లక్ష్మీదేవిని ఫ్రెంచ్లో ‘లాక్మే’ అంటారు. చాలాకాలం టాటా గ్రూప్లో ఉన్న ఈ బ్రాండ్ 1998లో హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ చేతుల్లోకి చేరింది.విద్యా పరిశోధన సేవా రంగాల్లోనూ ముద్రజె.ఆర్.డి.టాటా దాదాపు అర్ధశతాబ్ద కాలం టాటా గ్రూప్ సంస్థలకు నాయకత్వం వహించారు. ఆయన నేతృత్వంలో టాటా గ్రూప్ వ్యాపారాలకు వెలుపలి సేవలకు కూడా విస్తరించాయి. జె.ఆర్.డి.టాటా హయాంలోనే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, టాటా మెమోరియల్ హాస్పిటల్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్, నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్ఫర్మింగ్ ఆర్ట్స్ వంటి సంస్థలు ప్రారంభమయ్యాయి. విద్యా పరిశోధన రంగాల్లో ఇవి నేటికీ ప్రతిష్ఠాత్మక సంస్థలుగా తమ ప్రత్యేకతను నిలుపుకుంటున్నాయి. ఈ సంస్థల ఏర్పాటు కోసం జె.ఆర్.డి.టాటా చేసిన కృషికి సంబంధించిన వివరాలన్నింటినీ టాటా సెంట్రల్ ఆర్కైవ్స్లో భావితరాల కోసం భద్రపరచారు. వీటిని పరిశీలిస్తే, ఒక్కో సంస్థ వెనుక ఉన్న సంకల్పం, వాటి ఏర్పాటు కోసం పడిన తపన అర్థమవుతాయి. ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ పేరుతో ఇటీవలి కాలంలో కార్పొరేట్ సంస్థలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీపై ఎలాంటి నిర్బంధం, నిబంధనలు లేనికాలంలోనే టాటాలు సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించారు. స్వాతంత్య్రానికి మూడేళ్ల ముందే, 1944లో సేవా కార్యక్రమాల కోసం జె.ఆర్.డి.టాటా తన సొంత డబ్బుతో జె.ఆర్.డి.టాటా ట్రస్టును ఏర్పాటు చేశారు. తర్వాత కొంతకాలానికి కంపెనీలోని తన షేర్లు కొన్నింటిని, బాంబేలోని ఒక అపార్ట్మెంట్ను అమ్మేసి, ఆ డబ్బుతో పేద మహిళల స్వావలంబన కోసం తన పేరిట, తన భార్య పేరిట జె.ఆర్.డి.టాటా అండ్ థెల్మా టాటా ట్రస్టును ఏర్పాటు చేశారు. టాటా సంస్థల సుదీర్ఘ చరిత్రను నిక్షిప్తం చేసుకున్న టాటా సెంట్రల్ ఆర్కైవ్స్లోని అరుదైన విశేషాలను ఎవరైనా సందర్శించవచ్చు. ఇది ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. టాటా సెంట్రల్ ఆర్కైవ్స్ను సందర్శించడమంటే, దేశ ఆర్థిక స్వావలంబన చరిత్రను సింహావలోకనం చేయడమే! -
పిల్లల భవిష్యత్ కు బాటలు వేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం
-
వైఎస్ జగన్ బర్త్ డే వేడుకల్లో ఆర్కే రోజా
-
హైదరాబాద్ : నగరంలో క్రిస్మస్ కోలాహలం (ఫోటోలు)
-
ఓకే ఫ్రేమ్లో ఘట్టమనేని ఫ్యామిలీ.. చాలా రోజుల తర్వాత ఇలా! (ఫోటోలు)
-
హీరోయిన్ రమ్య పాండియన్ హల్దీ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజం దశమ వార్షికోత్సవం
-
Nita Ambani birthday: దీపాలతో వేడుక : ఉత్సాహంగా చిన్న కోడలు
రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ వ్యాపారవేత్త ,పరోపకారి, నీతా అంబానీ 60వ పుట్టిన రోజు (నవంబరు 1). ఈ సందర్భంగా కొత్తకోడలు, నీతా చిన్న కుమారుడు అనంత్ అంబానీ భార్య, రాధిక మర్చంట్, కంపెనీ సిబ్బంది ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్ఎంఏసీసీ కూడా నీతా అంబానీకి స్పెషల్ విషెస్ తెలుపుతూ ట్వీట్ చేసింది. Paltan, join us in wishing Mrs. Nita Ambani, a very Happy Birthday! 💙#MumbaiMeriJaan #MumbaiIndians pic.twitter.com/MQlPXKqLGx— Mumbai Indians (@mipaltan) November 1, 2024అలాగే పలువురు సెలబ్రిటీలు నీతా అంబానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అందించారు. ఐపీఎల్టీం ముంబై ఇండియన్స్ కూడా ఎక్స్ ద్వారా విషెస్ తెలిపింది. Today, on the birthday of our Founder and Chairperson, Mrs. Nita Ambani, we celebrate her passion for the arts! pic.twitter.com/Sq47Fpg55r— Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) November 1, 2024నీతా బర్త్డేను కంపెనీ సిబ్బంది దీపాలతో స్పెషల్గా సెలబ్రేట్ చేశారు. దీపాలను వెలిగించిన పళ్లెంతో ఆమెకు హారతి ఇచ్చారు. హ్యాపీ బర్త్డే పాటను ఆలపించారు. దీంతో నీతా అంబానీ ఆనందంతో మెరిసి పోయింది. ఈ వేడుకలో చిన్నకోడలు రాధిక మర్చంట్ ఉత్సాహంగా పాల్గొంది. పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ గులాబీ రంగు చీరలో మెరిసారు. మెడలో మూడు పేటల ముత్యాల హారం, మ్యాచింగ్ చెవిపోగులు, రింగుల జుట్టుతో మరింత అందంగా కనపించారు. అత్తగారికి తగ్గట్టుగా చోటి బహు, రాధిక మర్చంట్ కూడా గులాబీ రంగు పూల దుస్తుల్లో మెరిసింది. -
థాయ్లాండ్లో దీపావళి వేడుక వేరే లెవల్! చూసి తరించాల్సిందే!
వెలుగుల పండుగ దివాలీని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. భారతదేశంలో పాటు ప్రపంచంలో చాలా ప్రదేశాల్లో దీపావళిని వేడుకగా నిర్వహించు కుంటారు. ముఖ్యంగా మిరుమిట్లు కొలిపే దీపకాంతులతో థాయ్లాండ్ మెరిసి పోతుంది. నింగిలోనూ, నీటిలోనూ లాంతర్ల వెలుగు, దీపాలతో థాయలాండ్లో దీపావళి వేడుక ఒక రేంజ్లో జరుగుతుంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా!థాయ్లాండ్లో నవంబర్ నెలలో లాయ్ క్రాథోంగ్, యి పెంగ్ పేరుతో దీపావళిని జరుపుకుంటారు . అరటి ఆకులతో చేసిన దియాలు (దీపాలు) ప్రత్యేక ఆకర్షణ. ఈ దీపాలు తామరపువ్వు ఆకారాల్లొ నదిపై తేలియాడుతూ అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఈ దీపాలపై ఒక నాణెం, ధూపంతో పాటు కొవ్వొత్తులనూ ఉంచుతారు. దీపావళి రోజున మిఠాయిలు పంచిపెట్టుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు .లాయ్ క్రాథోంగ్ (లాంతర్ల పండుగ)దీన్నే "ఫ్లోటింగ్ బాస్కెట్ ఫెస్టివల్" అని పిలుస్తారు. loi అంటే 'ఫ్లోట్' అని, క్రాథాంగ్ అనేది పూలతో అలంకరించబడిన బుట్ట అని అర్థం. థాయ్లాండ్ లైట్స్ ఫెస్టివల్ అని పిలువబడే లాయ్ క్రాథాంగ్ ఫెస్టివల్, థాయ్ చంద్ర క్యాలెండర్లోని 12వ నెల పౌర్ణమి రాత్రి జరుగుతుంది. కొవ్వొత్తులు , పువ్వులతో అలంకరించిన తామరపువ్వు ఆకారంలో ఉన్న బుట్టలను నదులు మరియు జలమార్గాలపై విడుదల చేయడం ద్వారా నీటి దేవతకు కృతజ్ఞతలు తెలుపుతూ జరుపుకుంటారు. ఇది వర్షాకాలం ముగింపుకు గుర్తుగా , శీతాకాలాన్ని స్వాగతించే వార్షిక వేడుకగా కూడా భావిస్తారు. మంత్రముగ్ధం చేసే ఈవెంట్లో అద్భుతమైన ప్రదర్శనలు , నదులు, కాలువలు, సరస్సులలో తేలియాడే బుట్టలు నిజంగా అద్భుతంగా ఉంటుంది. లాయ్ క్రాథాంగ్ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటే, ఉత్తర థాయిలాండ్లో, యి పెంగ్ అని చియాంగ్ మాయిలో ఈ లాంతరు పండుగ నిర్వహస్తారు. యి పెంగ్స్కై లాంతర్ ఫెస్టివల్ యి పెంగ్: రాత్రివేళ ఆకాశంలో వేల సంఖ్యలో కొవ్వొత్తుల లాంతర్లను ఎగువేవేస్తారు. చియాంగ్ మాయిలో మాత్రమే ఈ రెండు పండుగలను ఒకే రోజు జరుపు కుంటారు.దురదృష్టాన్ని గాల్లోకి వదిలి, అదృష్టాన్ని స్వాగతించడానికి ప్రతీకగా ఈ వేడుక ఉంటుంది. ఈ కార్యక్రమంలో బౌద్ధసన్యాసులు, స్థానికులు, పర్యాటకులు వేలాదిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఈవెంట్లు, స్పెషల్ ప్రోగ్రాములతో సందడిగా ఉంటుంది. వ్యాపారం కూడా బాగానే జరుగుతుంది. -
సింగం పాఠశాలలో దీపావళి వేడుకలు
సోలాపూర్: దత్తు నగర్లోని దత్తు మందిర్ దేవస్థానం కమిటీ దివంగత వెంకటనరసు వీరయ్య సింగం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు దీపావళి వేడుకలు ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. విద్యార్థులు తమకు ఇష్టమైన ఛత్రపతి శివాజీ మహారాజ్ కోటను అప్రతిమంగా తయారుచేసి తీర్చిదిద్దారు. అలాగే పట్టణానికి చెందిన ప్రముఖ వాణిజ్యవేత్త గణేశ్ రంగయ్య గుడుమల్ పాఠశాలలోని 250 మంది విద్యార్థులకు సకినాలు, గారెలు, మడుగులు, శంకరపల్లిలు, లడ్డూ వంటి ఫలహారాల పాకెట్లను పంపిణీ చేశారు. అలాగే సంజయ్ మడూర్ తరఫున ఉపాధ్యాయులకు దీపావళి బహుమతులు అందజేసి సన్మానించారు. (ఎఫ్–టామ్ ఆధ్వర్యంలో గిరిజన పిల్లల దీపావళి)ఈ సందర్భంగా దత్త మందిర్ దేవస్థానం సంస్థ కమిటీ అధ్యక్షుడు మహేశ్ దేవసాని, సంజయ్ మడూర్, కిశోర్ దేవసాని, గణేశ్ దేవసాని, నరేశ్ దేవరశెట్టి, దామోదర్ మాచర్లను దేవస్థానం ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులతో పాటు స్థానిక ప్రజలు ఈ కార్యక్రమం వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ దేవసాని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దీపావళి పర్వదినాన్ని ఆనందాన్ని ఆస్వాదించాలని ఆకాంక్షించారు. బడుగు బలహీన వర్గాలు పేదలు కూడా సనాతన కాలంగా వస్తున్న దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. -
ఎఫ్–టామ్ ఆధ్వర్యంలో గిరిజన పిల్లల దీపావళి
ముంబై: ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా ఎఫ్–టామ్ ఆధ్వర్యంలో గ్రామీణ, గిరిజన పిల్లలతో దీపావళి పండుగ స్నాక్స్, గిఫ్ట్స్ టపాకాయలతో ఘనంగా జరిగింది. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర అధ్యక్షుడు గంజి జగన్బాబు ఆధ్వర్యంలో బృందావనం ఫారమ్స్, ఖోపోలిలో ఈ వేడుకలను నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామ పంచాయతీ, గిరిజన ప్రాంతాల పేద విద్యార్థులు వేడుకల్లో పాల్గొన్నారు. వారికి ఆటలు, పర్యావరణం, మంచి అలవాట్ల గురించి పూజ పలు సూచనలిచ్చారు. కార్యక్రమానికి విఠల్, రమాకాంత్, ప్రశాంత్, గణేశ్, దిలీప్, అర్చన తదితరులు సేవలందించారు. కపిల్ పాటిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ భివండీ: కపిల్ పాటిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీపావళి పండుగ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కల్యాణ్లోని సాయి చౌక్ వద్ద నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బీజేపీ మాజీ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్ నేతృత్వంలో నవంబర్ 2వ తేదీన ఉదయం 5 గంటల నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని నిర్వాహకులు తెలిపారు. హిందీ–మరాఠీ చలనచిత్ర గీతాలు, ప్రసిద్ధి గాంచిన వెండితెర, బుల్లి తెర కళాకారులు హాస్యనటుల ప్రదర్శనలు, భారతీయ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ముఖ్యంగా బంజారా బృందం, బెల్లీ డ్యాన్స్, భరతనాట్యం తదితర నృత్యాల ప్రదర్శనలు కొనసాగుతాయని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇండియన్ ఐడల్ విన్నర్, బిగ్బాస్ ఫేమ్ సింగర్ అభిజిత్ సావంత్, ప్రజక్తా శుక్రే, భూమి త్రివేది, జూలీ జోగ్లేకర్తో పాటు పాతిక మంది కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకలను అలరించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. . -
విజయవాడ: శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా ఇంద్రకీలాద్రి అమ్మవారు.. ప్రత్యేక పూజలు (ఫొటోలు)
-
ఆ ఐదు చోట్ల అంబరాన్నంటే దాండియా వేడుకలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దసరా సందడి నెలకొంది. ఈ నవరాత్రుల వేడుకల్లో దాండియాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దాండియా అనేది గుజరాత్ సంప్రదాయ నృత్యం. అయితే ఇప్పుడు దేశమంతటా దాండియాకు ఎంతో ఆదరణ లభిస్తోంది. దేశంలోని ఆ ఐదు ప్రాంతాల్లో జరిగే దాండియా వేడుకల్లో పాల్గొనాలని చాలామంది తహతహలాడుతుంటారు. మరి ఆ ప్రాంతాలెక్కడున్నాయి? అక్కడ వేడుకల్లో పాల్గొనాలంటే ఎంత రుసుము చెల్లించాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.అహ్మదాబాద్ (గుజరాత్)గుజరాత్లోని పలు నగరాల్లో దాండియా వేడుకలు జరుగుతాయి. అయితే అహ్మదాబాద్లోని పసిఫిక్ మాల్లో జరిగే దాండియా నైట్కు ఎంతో ఆదరణ ఉంది. బుక్ మై షో తెలిపిన వివరాల ప్రకారం ఇక్కడ జరిగే దాండియా వేడుకల్లో పాల్గొనాలంటే రూ.399 చెల్లించాల్సి ఉంటుంది.వడోదర (గుజరాత్)వడోదరలో నిర్వహించే దాండియా నైట్కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇక్కడ దాండియా టిక్కెట్ల ధరలు రూ.400 నుండి రూ.500 వరకు ఉంటాయి. కొన్నిచోట్ల టిక్కెట్ ధర రూ. రెండువేలకు పైగానే ఉంటుంది.థానే (మహారాష్ట్ర)దాండియా వేడుకలు థానేలోని ఆక్ట్రాయ్ మైదానంలో జరుగుతుంటాయి. దేశవ్యాప్తంగా ఇక్కడి దాండియాకు గుర్తింపు ఉంది. దాండియా వేడుకలు చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వస్తుంటారు. ఈ ఈవెంట్లో పాల్గొనాలంటే ఒక్కొక్కరికి టిక్కెట్టు ధర రూ.300.ఢిల్లీఢిల్లీలోని రాజ్వాడ ప్యాలెస్లో దాండియా నైట్ నిర్వహిస్తారు. ఇక్కడ దాండియా ప్లేస్ 22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ ఎయిర్ కండిషన్డ్ ఏరియాలో దాండియా ఆడేందుకు సకల ఏర్పాట్లు చేశారు. ఇక్కడ జరిగే దాండియాలో పాల్గొనేవారు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.బెంగళూరుబెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోనూ అత్యంత వేడుకగా దాండియా నైట్ నిర్వహిస్తారు. జేపీ నగర్లో జరిగే ఈ ఈవెంట్కు వెళ్లాలంటే ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టిక్కెట్ ధర రూ. 100 వరకూ ఉంటుంది.ఇది కూడా చదవండి: అయోధ్యలో నవరాత్రి వేడుకలు.. మారిన దర్శన, హారతి సమయాలు -
HYD : నిధంలో అట్టహాసంగా పర్యాటక దినోత్సవం (ఫొటోలు)
-
Varalakshmi Vratham: లక్ష్మీ కళ ఉట్టిపడుతున్న నేటి వర మహాలక్ష్ములు (ఫొటోలు)
-
తెలంగాణ పార్టీ ఆఫీసుల్లో స్వాతంత్ర్య వేడుకలు
-
Naga Panchami: భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు (ఫొటోలు)
-
ఎడిసన్ లో ఘనంగా MATA బోనాల జాతర
-
Mehaboob Dil Se : అనాథాశ్రమంలో మెహబూబ్ బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
వండర్లాలో ఫ్రెండ్షిప్ డే
సాక్షి, హైదరాబాద్: అందరూ ఎంతో ఇష్టంగా ఎదురు చూసే ఫ్రెండ్షిప్ డే వేడుకల కోసం నగరంతో పాటు వండర్లా కూడా సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా ఆగస్టు 4న స్నేహితుల దినోత్సవం సందర్భంగా నగరంలోని ప్రతిష్టాత్మక అమ్యూజ్మెంట్ పార్క్ వండర్లా ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. స్నేహానికి ప్రతీకగా ఆ రోజు వండర్లా టిక్కెట్ ఒకటి కొంటే మరొకటి ఉచితంగా అందిస్తున్నారు. ఈ ప్రత్యేక ఆఫర్ ఆన్లైన్లో మాత్రమే అందిస్తున్నామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె.చిట్టిలపిల్లి తెలిపారు. లైవ్ డీజే, స్పెషల్ ఈవినింగ్ జుంబా సెషన్లు, ఫన్ గేమ్స్, ఉత్కంఠ భరిత పార్క్ రైడ్లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. సాధారణ రోజుల్లో కన్నా పార్క్లు ఎక్కువ సేపు తెరిచి ఉంటాయన్నారు. బుక్కింగ్ కోసం https://bookings.wonderla.com/ లేదా హైదరాబాద్ పార్క్ – 084 146 76333, +91 91000 63636ను సంప్రదించవచ్చు. -
అయోధ్యలో గురుపౌర్ణమి వేడుకలు
యూపీలోని అయోధ్యలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడి సరయూ నదీతీరంలో భక్తివిశ్వాసాలు పెల్లుబికాయి. నేటి (ఆదివారం) ఉదయం నుంచి భక్తులు సరయూ నదిలో స్నానాలు చేసి, శ్రీరాములవారిని దర్శనం చేసుకుంటున్నారు.గురు పూర్ణిమ సందర్భంగా రామనగరికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ కారణంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆదివారం తెల్లవారుజామున 3:00 గంటల నుంచి సరయూలో భక్తుల స్నానాలు మొదలయ్యాయి. శ్రీ రాముడు తన గురువైన వశిష్ణుడిని ఆరాధించాడని చెబుతారు. ఈరోజు రామాలయంలో రోజంతా గురు పూర్ణిమవేడుకలు జరగనున్నాయి. Uttar Pradesh: On Guru Purnima in Ayodhya, devotees flocked to the Sarayu River for holy dips and rituals. The city buzzed with celebrations, honoring the ancient guru-disciple tradition with extensive security measures in place pic.twitter.com/2jfVkbFhlB— IANS (@ians_india) July 21, 2024 -
3న శిల్పకళా వేదికలో చింగ్ హార్ట్స్..
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నేపథ్య గాయిని మంగ్లీ స్వరాలతో నగరంలోని శిల్పకళా వేదికగా ‘చింగ్ హార్ట్స్’ పేరుతో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ను నిర్వహించనున్నారు. ఆగస్టు 3న జరగనున్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను రామానాయుడు స్టూడియోస్ వేదికగా సింగర్ మంగ్లీ, జబర్దస్త్ ఫేం బుల్లెట్ భాస్కర్, సంస్థ సభ్యులు అరుణ ప్రదీప్, విజయలక్షి్మ, సాయి గౌరీ, శ్రీ వల్లి ఆవిష్కరించారు. 35వ వార్షికోత్సవం నేపథ్యంలో..నిరాదరణకు గురైన బాలికలు, అనాథ చిన్నారులకు అన్నీ తామై చూసుకుంటోంది నగరంలోని సాయి సేవా సంఘ్ సామాజిక సేవా సంస్థ. 35వ వార్షికోత్సవం సందర్భంగా చిన్నారుల సహాయార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు 2 వేల మంది బాలికలకు ఉచిత విద్య, వసతితో పాటు వారికి అవసరమైన సంపూర్ణ ఆరోగ్య సంరక్షణను అందింస్తుంది. నృత్యం, సంగీతం వంటి విభిన్న కళల్లో శిక్షణ అందిస్తుంది. ఆ సంస్థ వల్లే..ఈ స్థాయికి...ఏ ఆధారం లేని బాలికల ఆలనా పాలనా చూసుకోవడం అనిర్వచనీయమని మంగ్లీ అన్నారు. తనని కూడా ఆర్టీడీ అనే సంస్థ చేరదీయడం వల్లే ఈ స్థాయికి ఎదిగానని గుర్తు చేసుకున్నారు. ఇంతటి సేవను అందిస్తున్న సాయి సేవా సంఘ్ సంస్థ కోసం తాను కన్సర్ట్లో పాడుతున్నానని, బుక్ మై షో టిక్కెట్ల ద్వారా వచ్చే డబ్బునే కాకుండా వ్యక్తిగతంగా లక్ష రూపాయలను విరాళంగా అందిస్తానని ప్రకటించారు. ఇందులో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్కతో పాటు జబర్ధస్త్ ఫేం ఆటో రామ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్, నాటీ నరేష్ వంటి ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు. -
కళామందిర్ ఫౌండేషన్ డే వేడుకలో ప్రముఖుల సందడి.. (ఫోటోలు)
-
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
వరలక్ష్మి శరత్ కుమార్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ (ఫొటోలు)
-
తొలిసారి T20వరల్డ్కప్ సెమీస్లో.. అఫ్గన్లో అంబరాన్నంటిన సంబరాలు (ఫొటోలు)
-
International Yoga day 2024 ప్రముఖులు, సెలబ్రిటీల యోగ పోజులు (ఫొటోలు)
-
శ్రీనగర్ లో యోగా డేలో పాల్గొన్న ప్రధాని మోదీ
-
హుస్సేన్ సాగర్లోని బుద్ధ విగ్రహం వద్ద ఘనంగా బుద్ధ పూర్ణిమ ఉత్సవాలు (ఫొటోలు)
-
రాయ్ లక్ష్మీ బర్త్డే సెలబ్రేషన్స్.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)
-
Abhinayashree Photos: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
-
Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
శ్రీశైలంలో కనుల పండువగా ప్రభోత్సవం (ఫొటోలు)
-
Good Friday 2024 : భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే (ఫొటోలు)
-
Hyderabad Holi Photos 2024: హైదరాబాద్లో హోలీ వేడుకలు..(ఫొటోలు)
-
రంగులు చల్లుకోని హోలీ గురించి తెలుసా?
ప్రకృతిలో సరికొత్త సొగసు కనుల విందు చేస్తుందంటే అది వసంత రుతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు.. మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా. ఎందుకంటే..? ఆ రుతువులోనే ఎండిన చెట్లు, కొమ్మలు, రెమ్మలు చిగురిస్తాయి. అంతేనా ఆ కొమ్మలపైన కుహు.. కుహు.. అంటూ మనసు పులకరించేలా కోయిలమ్మ మధురగానాలతో వీనుల విందు చేస్తుంది. మరోవైపు ఆ పచ్చదనపు ప్రకృతి సోయగాలు పుష్ప పరిమళ వికాసాలు అన్నీ ఏకమై ఆవిష్కృతమవుతాయి. ఆ ఆనందభరిత సమయాన చిన్న, పెద్ద, ఆడ, మగ తేడాలు లేకుండా కులమతాలకు అతీతంగా దేశ వ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ. హోలీ పండుగ రంగుల పండుగ.. అదో ఆనంద కేళీ… ప్రజలు ఎంతో ఇష్టంగా పాల్గొనే పండుగ. వసంతాగమనంలో వస్తుంది ఈ రంగుల హోలీ. గజగజా వణికించిన చలికి టాటా చెబుతూ.. వేసవి వెచ్చదనంలోకి అడుగుపెడుతున్న వేళ హోలీ వస్తుంది. భారతీయ పండుగల్లో హోలీ మరీ ప్రత్యేకం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు హోలీని ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. సంవత్సరంలో కేవలం ఒక్క సారి మాత్రమే ఘనంగా జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ఒకటి. ఈ పండుగను సత్య యుగం నుంచి జరుగుతున్నట్లుగా హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి. హోళి అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ హోళిని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. పురాణాల ప్రకారం చూస్తే విష్ణు భక్తుడు ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశ్యపుడు. ప్రహ్లాదుడిని చంపడానికి రాక్షసి హోలికా ప్రయత్నిస్తుంది. ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కావడం, తనని మాత్రమే పూజించాలన్నా.. తన మాట వినకపోవడంతో హిరణ్యకశ్యపుడే తన కొడుకు ప్రహ్లాదుడిని చంపాలని హోలికాకి ఆదేశాలు ఇచ్చాడు. ఎందువల్ల ఇలా చేస్తాడంటే..రాక్షస రాజు.. హిరణ్యకశ్యపుడు .. కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు.. అది హిరణ్యకశ్యపుడికి నచ్చదు దీంతో భక్త ప్రహ్లాదుని చంపేయాలి అనుకుంటాడు. తన సోదరి అయిన హోలికను పిలుస్తారు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుని మంటలలో ఆహుతి చేయమని ఆమెను కోరతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకొని, మంటల్లోకి దూకుతుంది. విష్ణు మాయతో ప్రహ్లాదుడు బయటపడతాడు. హోలిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చిక్కుకొని చనిపోతుందట. మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. సతీవియోగంతో తపస్సులో ఉన్న శివునికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతిని ఇచ్చి దేవతలు వివాహం చేయాలనుకుంటారు. కానీ తపస్సులో ఉన్న శివునికి ఎలా తపో భంగం కలిగించాలోనని ఆలోచించి మన్మథున్ని శివుని మీదకు పంపుతారు. కామదేవుడు శివుని తపస్సును భగ్నం చేసేందుకు పూల బాణాలు వదలడంతో శివుని మనస్సు పెండ్లి వైపు మరలిస్తాడు. దీంతో పార్వతీ పరమేశ్వరుల వివాహం జరుగుతుంది. మన్మథ బాణం ప్రభావం తగ్గగానే శివుడు తనకు మన్మథుడి వల్ల తపో భంగం కలిగిందని తన మూడో నేత్రంతో కామదేవుడిని భస్మం చేస్తాడు. పతీ వియోగంతో కామదేవుడి భార్య రతీదేవి శివునితో తన భర్త కామదేవున్ని బతికించమని వేడుకుంటుంది. శివుడు అనుగ్రహించి శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున ప్రసాదిస్తాడు. కాముడు తిరిగి బతికిన రోజు కావడంతో కాముని పున్నమిగా పిలుస్తారు. పూర్వం ఈ పండుగ రోజున రకరకాల పూలను ఒకరిపై ఒకరు చల్లుకుని.. అలా వారి సంతోషాన్ని వ్యక్తపరిచేవారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పూల స్థానంలో రకరకాల రంగులు వచ్చాయి. ఈ రంగులను నీళ్ళలో కలుపుకొని ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ప్రేమ తోపాటు, సౌభాగ్యాలు వెల్లి విరుస్తాయి అని అందరూ భావిస్తారు. హోలీ ఎలా వచ్చిందంటే.. ఇక మరో కథనం ప్రకారం.. అప్పట్లో శ్రీకృష్ణుడు గోపికలతో కలసి బృందావనంలో పువ్వులు, రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకునేవారు. ఇలా చేయడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. పురాణ కథల ప్రకారంగా.. కృష్ణుడు ముదురు రంగులో ఉంటాడు. రాధ చాలా అందంగా ఉంటుంది. ఓ రోజు కృష్ణుడు తల్లి యశోద వద్దకు వెళ్లి రాధ గురించి చెబుతాడు. రాధ మేని మెరుపు తన ఒంటి ఛాయ పూర్తి విరుద్ధంగా ఉంది, ఆమె నా ప్రేమను అంగీకరిస్తుందా అని అడుగుతాడు. అప్పుడు యశోద బదులిస్తూ, రాధ ముఖానికి కూడా నీకు నచ్చిన రంగు పూయమని సరదాగా అంటుంది. దీంతో తల్లి యశోద సలహాను అనుసరించి, శ్రీకృష్ణుడు రాధ ముఖానికి రంగులు పూస్తాడు. అలా హోలీ మొదలైంది ఈ దినాన రాక్షస పీడ పోయే౦దుకు "హోళికా" అనే ఒక విధమైన శక్తిని ఆరాధిస్తారు. ఈ రోజునే మహాలక్ష్మీ ఆవిర్భావం.. ఆమె ప్రీతి కోస౦ అ౦దరూ కలిసి గానాలు చేయడ౦, పరిహాసాలాడడ౦ చేస్తారు. హోలికాగ్నిని రగిల్చి ఆరాధి౦చే స౦ప్రదాయ౦ ఇప్పుడు తగ్గిపోయి పరిహాసాది క్రియలే మిగిలాయి. శ్రీమహాలక్ష్మి క్షీరసాగర౦ ను౦డి ఆవిర్భవి౦చి౦దని పురాణ కథ. ఈ ఏడాది పూర్ణిమ, ఉత్తర ఫల్గుణి కలిసి వచ్చాయి. కనుక ఈ దినాన భక్తి శ్రధ్ధలతో మహాలక్ష్మిని షోడశోపచారములతో చక్కగా ఆరాధి౦చి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, కనకధారాస్తోత్ర౦, వ౦టివి పారాయణ చేయడ౦ మ౦చిది. ఈరోజున లక్ష్మిని శ్రద్ధగా అర్చి౦చే వారికి సమస్త ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజుననే శ్రీకృష్ణుని ఉయ్యాలలో వేసి ఆరాధి౦చాలి. దీని ’డోలోత్సవ౦’ అని అ౦టారు. ఒరిస్సావ౦టి ప్రా౦తాలలో డోలా పూర్ణిమ పేరుతో ఇప్పటికీ దీనిని ఆచరిస్తారు. నరాడోలాగత౦ దృష్ట్వా గోవి౦ద౦ పురుషోత్తమ౦! ఫాల్గుణ్యా౦ ప్రయతో భూత్వా గోవి౦దస్య పుర౦వ్రజేత్!! ఉయ్యాలలో అర్చి౦పబడిన పురుషోత్తముడైన గోవి౦దుని ఈరోజున దర్శి౦చిన వారికి వైకు౦ఠలోక౦ ప్రాప్తిస్తు౦దని ధర్మశాస్త్రాల వాక్య౦. (చదవండి: జీవితం వర్ణమయం) -
సికింద్రాబాద్ : హ్యాపీగా నవ్రోజ్..(ఫొటోలు)
-
‘ఈశా’ శివరాత్రి వేడుకలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్
ఈ నెల 8న మహాశివరాత్రి. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా పలుచోట్ల ఆధ్మాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులోగల ‘ఈశా’ ఫౌండేషన్ రాబోయే మహశివరాత్రి వేడుకలను ఆదియోగి విగ్రహం ముందు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ మెగా వేడుక మార్చి 8వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి మార్చి 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు సద్గురు యూట్యూబ్ ఛానల్లో, ప్రధాన మీడియా నెట్వర్క్లలో ప్రసారం కానుంది. ఆరోజు అర్ధరాత్రి, బ్రహ్మ ముహూర్త సమయంలో ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ‘సద్గురు’ జగ్గీవాసుదేవ్ భక్తులను శివుని ధ్యానంలో లీనమయ్యేలా చేయనున్నారు. కాగా గతంలో జరిగిన ‘ఈశా’ మహాశివరాత్రి వేడుకల లైవ్ స్ట్రీమింగ్ పలు రికార్డులను బద్దలు కొట్టింది. 2023లో ‘ఈశా’లో జరిగిన మహాశివరాత్రి వేడుకలను 14 కోట్ల మంది వీక్షించారు. -
Australia : యాత్ర 2 కార్ ర్యాలీ.. YSRCP సిద్ధం
‘‘యాత్ర 2” సినిమా విజయవంతమైన సందర్భంగా వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ సూర్యనారాయణ రెడ్డి నేతృత్వంలో “టీమ్ మెల్బోర్న్ - వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా’’ ఆధ్వర్యంలో కార్ ర్యాలీ నిర్వహించారు. దివంగత నేత వైఎస్సార్ జీవితంలోని కీలక ఘటనలను, అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి, YSRCP అధ్యక్షడు వైఎస్ జగన్ రాజకీయ ప్రారంభ దశలోని ముఖ్యమైన అంశాలను ఆధారంగా సినిమాని తెరకెక్కించడంలో దర్శకుడు మహి రాఘవ సక్సెస్ అయ్యాడని ప్రశంసించారు. ప్రజల మనసులను గెలిచిన మారాజు డా.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి జీవన వృత్తాంతాన్ని చక్కగా సినిమాగా రూపొందించారని ప్రశంసించారు. ఈ ర్యాలీని మెల్బోర్న్ టీమ్ సభ్యులు కృష్ణారెడ్డి, భరత్, రామాంజి, నాగార్జున, మణిదీప్, సతీష్లు చక్కగా సమన్వయం చేశారు. సిద్ధం పోస్టర్ను ఆవిష్కరించడంతో పాటు, వైఎస్సార్సీపీ పోరాటానికి తిరుగులేని మద్దతునిస్తూ “జై జగన్”, “జోహార్ వైఎస్ఆర్”, “ఎన్నికల సమరానికి మేము సిద్ధం” నినాదాలతో.. వేదిక వద్ద వాతావరణం మారుమోగింది. ఉత్సాహభరితమైన ర్యాలీ తరువాత, వైఎస్సార్సీపీ మద్దతుదారులు "యాత్ర 2" చిత్రం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసారు. 2024లో జరగబోయే ఏపీ 175 అసెంబ్లీ ఎన్నికలకు, అలాగే లోక్సభ 25 స్థానాల ఎన్నికలకు YSRCP సిద్ధంగా ఉందని, సీఎం జగన్ నినాదం వైనాట్ 175ని నిజం చేసేందుకు ప్రతీ ఒక్క ప్రవాసాంధ్రుడు కృషి చేస్తారని తెలిపారు. గడచిన ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన ప్రయోజనలు, విద్యా, వైద్య, పారిశ్రామిక, మౌలిక సదుపాయాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రతీ ఒక్క ఎన్నారై స్టార్ క్యాంపెయినర్గా మారి ప్రచారం చేస్తారని తెలిపారు. -
వైఎస్సార్సీపీకి మద్దతుగా మెల్బోర్న్లో భారీ కార్ ర్యాలీ
-
Niharika Konidela: మెగా ఇంట సంక్రాంతి వేడుకల్లో నిహారిక జోరు మామూలుగా లేదు (ఫొటోలు)
-
Celebrities Sankranti Celebrations Pics: పండుగ వేళ అగ్రతారల సందడి ఇలా.. (ఫొటోలు)
-
కోనసీమ ‘ప్రభ’
సాక్షి, అమలాపురం: కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ప్రభల తీర్థం. ఇది సంక్రాంతి పండుగ వేళ జరుపుకోవడం ఇక్కడి ప్రజల ఆనవాయితీ. దేశ రాజధాని న్యూఢిల్లీలో గతేడాది అట్టహాసంగా జరిగిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర శకటంపై కొలువుదీరిన ఈ ప్రభల తీర్థం భారతీయుల మనస్సులను గెలిచాయి. కోనసీమ ‘ప్రభ’ను నలుదిక్కులా చాటి చెప్పాయి. వివరాల్లోకి వెళితే...డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగే ప్రభల తీర్థాలకు ఐదు శతాబ్దాల చరిత్ర ఉంది. అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట తీర్థానికి జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. తీర్థం జరిగే ప్రాంతంలో గుడి, గోపురాలు ఉండవు. కౌశిక నదిని ఆనుకుని ఉన్న కొబ్బరి తోటలో ఈ తీర్థం జరగడం ఇక్కడి ప్రత్యేకత. తీర్థం జరిగే ప్రాంతం చుట్టూ ఉన్న రెండు నియోజకవర్గాల పరిధిలోని మూడు మండలాలకు చెందిన పదకొండు ప్రభలు ఇక్కడకు వస్తాయి. ఇక్కడ జరిగే ప్రభల తీర్థం లోక కల్యాణార్థం అని భక్తుల విశ్వాసం. పెద్దాపురం సంస్థానా«దీశుడు రాజా వత్సవాయి జగన్నాథరాజు (జగ్గన్న) హయాంలో తొలిసారిగా 17వ శతాబ్ధంలో ఈ తీర్థాన్ని ప్రారంభించారని చెబుతారు. మహారాజుకు పరమేశ్వరుడు స్వప్నంలో సాక్షాత్కరించి ప్రభల తీర్థం నిర్వహించమని కోరారంటారు. అప్పటి నుంచి ఇక్కడ తీర్థం జరుగుతోందని భక్తుల విశ్వాసం. మరో కథలో.. 17వ శతాబ్దంలో పరమ శివభక్తుడు, ఏకసంధాగ్రాహి అయిన విఠలా జగ్గన్న ఇక్కడున్న కౌశిక నది చెంతన శివ పూజ చేసేవారు. ఇందుకు పెద్దాపురం సంస్థానాధీశుడు అభ్యంతరం చెప్పడంతో హైదరాబాద్ నిజాం నవాబును తన ప్రతిభతో మెప్పించి ఇప్పుడు తీర్థం జరిగే జగ్గన్నతోట వద్ద 8 పుట్లు (64 ఎకరాలు) భూమిని దానంగా పొందారని చెబుతారు. ఈ కారణంగానే ఇది జగ్గన్నతోటగా పేరొందిందని నమ్మకం. ప్రభల తీర్థాలు జరిగేదెక్కడంటే.. జగ్గన్నతోటతో పాటు కొత్తపేట సెంటర్, అవిడి డ్యామ్ సెంటర్, కాట్రేనికోన, మామిడికుదురు మండలం కొర్లగుంట వంటి చోట్ల పెద్ద తీర్థాలు జరుగుతాయి. ఇవికాకుండా జిల్లా వ్యాప్తంగా 84 వరకూ తీర్థాలు నిర్వహిస్తారు. 60 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తున ప్రభలు ఉంటాయి. ప్రభలు తయారు చేయడాన్ని యజ్ఞంగా భావిస్తారు. తాటి శూలం, టేకు చెక్క, పోక చెట్ల పెంటిలు, మర్రి ఊడలు, వెదురు బొంగులతో మూడు రోజులపాటు శ్రమించి ప్రభలు తయారు చేస్తారు. రంగురంగుల నూలుదారాలు (కంకర్లు), కొత్త వ్రస్తాలతో అందంగా తీర్చిదిద్దుతారు. ప్రభపై పసిడి కుండ ఉంచి చుట్టూ నెమలి పించాలు, జేగంటలు వేలాడదీస్తారు. వరి కంకుల కుచ్చులు, గుమ్మడి, ఇతర కూరగాయలు, పెద్దపెద్ద పూల దండలతో ప్రభకు వేలాడదీస్తారు. వీటిని భక్తులు తమ భుజస్కంధాలపై ఉంచి కిలోమీటర్ల కొద్దీ మోసుకు వస్తారు. కొబ్బరి తోటలు, వరిచేలు, పంట కాలువల మీదుగా సాగే ప్రభల యాత్ర చూసేందుకు రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. జాతీయస్థాయిలో గుర్తింపు గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివ కేశవ యూత్ సభ్యులు ఈ తీర్థ విశేషాలను ప్రధాని నరేంద్ర మోదీకి వివరిస్తూ 2020లో మెయిల్ చేశారు. దీంతో మోదీ తీర్థాన్ని అభినందిస్తూ తిరిగి సందేశం పంపించారు. గతేడాది ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్లో రాష్ట్ర ప్రభుత్వ శకటంపై జగ్గన్నతోట తీర్థాన్ని ప్రదర్శించారు. దీంతో జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. గతేడాది ప్రముఖ సినీ నటుడు నాగార్జున నటిస్తున్న ఒక సినిమాలో విజువల్స్ కోసం ప్రభల తీర్థాన్ని చిత్రీకరించారు. యువత ప్రభల తీర్థాలపై పలు లఘు చిత్రాలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఈ తీర్థానికి పెద్ద ఎత్తున ప్రచారం లభించింది. దీంతో ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేసి, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మకర సంక్రాంతి తర్వాత వచ్చే ఉత్తరాయణ కాలంలో ప్రభలను ఊరి పొలిమేర దాటిస్తే ఊరుకు మంచిదనేది ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసమని అర్చకుడు చంద్రమౌళి కామేశ్వరశాస్త్రి తెలిపారు. -
2024 New Year Celebrations Pics: ప్రజలు తమ ప్రత్యేక పద్ధతిలో 2024 నూతన సంవత్సరాన్ని జరుపుకున్నారు
-
Hyderabad Christmas Celebrations: వైభవంగా క్రిస్మస్ వేడుకలు (ఫొటోలు)
-
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర వివాహా వార్షికోత్సవ వేడుక (ఫొటోలు)
-
విశాఖపట్నం: బీచ్లో బాంబుల మోత (ఫొటోలు)
-
తిరుమలలో వైభవంగా దీపావళి ఆస్థానం
-
లండన్లో వైభవంగా చేనేత బతుకమ్మ, దసరా సంబరాలు!
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్లో చేనేత బతుకమ్మ, దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి మూడు వేలకు పైగా ప్రవాస భారతీయ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా స్థానిక ఎంపీ, సీమ మల్హోత్రా ,(లేబర్ పార్టీ షాడో మినిస్టర్) స్థానిక హౌంస్లౌ మేయర్ ఆఫ్జాల్ కియాని, కౌన్సిలర్ ఆదేశ్ ఫార్మహాన్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అదే స్పూర్తితో రాష్ట్ర మంత్రి కే.టి.ఆర్ గారి కృషికి మా వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ప్రతీ సంవత్సరం లాగా "చేనేత బతుకమ్మ మరియు దసరా" వేడుకలను జరుపుకున్నామని యూకే ఎన్నారై బీఆర్ఎస్ అధ్యక్షుడు, టాక్ నేషనల్ కన్వీనర్ అశోక్ గౌడ్ దూసరి తెలిపారు. టాక్ కార్యవర్గానికి అన్ని సందర్భాల్లో కవితక్క వెన్నంటి ఉండి ప్రోహించారని, టాక్ తలపెట్టిన ప్రతీ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసి ప్రవాస సమాజంలో టాక్ ప్రత్యేక గుర్తింపుని పొందిందని టాక్ ఉపాధ్యక్షురాలు శుష్మున తెలిపారు. మా పిలుపు మేరకు హాజరైన ప్రవాసులు చేనేత బట్టలు ధరించి పాల్గొనడం మాకెంత సంతోషాన్ని, స్ఫూర్తినిచ్చిందని టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి,స్వాతి బుడగం, క్రాంతి రేతినేని,జాహ్నవి దూసరి, శ్రావ్య వందనపు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యక్షుడు సత్య చిలుముల మాట్లాడుతూ, దసరా పండుగ సందర్బంగా స్వదేశం నుంచి తెచ్చిన శమీ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన దసరా " అలాయ్ - బలాయ్ " కార్యక్రమంలో.. చేనేత శాలువాలను ఒకరికొరకు పరస్పరం వేసుకొని, జమ్మి( బంగారం)ని ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకొని శుభాకాంక్షలు చెప్పుకోవడమేగాక చేనేతకు చేయూతగా చేనేత బట్టలు దరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. జమ్మి ఆకులు పంచుకుంటూ లండన్ పట్టణానికి ‘అలాయ్ బలాయ్’ల తెలంగాణ స్నేహమాధుర్యాన్ని ప్రత్యక్షంగా రుచి చూపించారని పలువురు ప్రశంసించారు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ, దసరా పండగ సందర్బంగా మహిళలందరు భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ బద్దంగా గౌరీ దేవికి పూజలు జరిపి బతుకమ్మ ఆట పాటలతో, కోలాటాల నృత్యాలతో, చప్పట్లు కలుపుతూ, రంగు రంగుల బతుకమ్మలతో సందడి చేసారు. విదేశాల్లో స్థిరపడ్డా కానీ తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరిని ఆకట్టుకుంది. చిన్నారులు సైతం ఆటల్లో పాల్గొనడం కాకుండా, చిన్న చిన్న బతుకమ్మలతో సంబరాలకు సరికొత్త అందాన్ని తెచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులతోతో పాటు ప్రవాస సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. చేనేత పేరుతో బతుకమ్మ వేడుకల్ని నిర్వహించడం వినూత్నంగా ఉందని, వీరి ప్రయత్నం ఫలించి నేత కుటుంబాలకు మేలు జరగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలంగాణ ప్రత్యేకతను చాటి చెప్పేలా బతుకమ్మను ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తునందుకు టాక్ సంస్థను పలువురు అభినందించారు. ఉద్యమ బిడ్డలుగా ప్రతి కార్యక్రమానికి సామాజిక బాధ్యతను జోడించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అన్నింటిని ప్రోత్సహించి విజయవంతం చేస్తున్న ప్రవాసులందరికి టాక్ అడ్విసోరీ బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి మరియు టాక్ ఈవెంట్స్ ఇంచార్జి మల్లా రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ ప్రధాన కార్యదర్శి సురేష్ బుడగం మాట్లాడుతూ ఈ వేడుకలలో భాగంగా గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నట్టు పండుగకి వచ్చే ప్రతీ ఒక్కరినీ చేనేత వస్త్రాలు ధరించాలని కోరామని అలాగే చాలామంది ఈ రోజు చేనేత వస్త్రాలు ధరించడం సంతోషంగా ఉందన్నారు. టాక్ సంస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు అన్ని సందర్భాల్లో వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న మాజీ ఎంపీ కవిత గారికి టాక్ ప్రధాన కార్యదర్శి జాహ్నవి దూసరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి ఆలోచలనకు ఆశయాలకు అనుగుణంగా మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి అన్నిరకాలుగా కృషి చేస్తామని, ఎప్పటికప్పుడు వారి సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని తెలిపారు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాతే మన పండగలకు, మన సంస్కృతికి సరైన గౌరవం గుర్తింపు లభించిందని, ఉద్యమ నాయకుడే నేడు మనకు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే నేడు అధికారికంగా రాష్ట్ర పండుగగా బతుకమ్మను నిర్వహించుకోగలుగుతున్నామని, కాబట్టి కేసిఆర్ గారి పేరు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని తెలిపారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చేనేతకు చేయూతగా చేస్తున్న వేడుకల్లో ఎంతో సామాజిక బాధ్యత ఉందని తెలిపారు. టాక్ కార్యదర్శులు రవి రేతినేని, సుప్రజ పులుసు మరియు గణేష్ కుప్పాల మాట్లాడుతూ.. మా వేడుకలకు హాజరైన ప్రవాస సంస్థల ప్రతినిధులకు సహకరించిన స్పాన్సర్ సంస్థలకు స్థానిక అధికారులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రైమ్ స్పాన్సర్ అన్నపూర్ణ రైస్ వారు ప్రత్యేక బహుమతులు అందజేసినందుకు అశోక్ గౌడ్ దూసరి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు . ఇక్కడికి వచ్చిన ప్రవాసులు, టాక్ సంస్థ ప్రతినిధులను ఉద్దేశించి ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణా సంస్కృతి ని ప్రపంచానికి చాటి చెప్తున్న టాక్ సంస్థని ముఖ్య అతిధులు ప్రశంసించారు. ఒక పక్క వ్యక్తిగతంగా ఇక్కడున్న బిడ్డలు రోజు వారి పనుల్లో బిజీగా వున్నప్పటికీ, బాద్యత గల తెలంగాణా బిడ్డలుగా ఆనాడు ఉద్యమంలో నేడు పునర్నిర్మాణంలో పోషిస్తున్న పాత్ర ఎందరికో స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఉత్తమ బతుకమ్మ తెచ్చిన ఆడబిడ్డలకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో టాక్ నేషనల్ కన్వీనర్ అశోక్ గౌడ్ దూసరి, టాక్ ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి, సత్యమూర్తి చిలుమూలా, టాక్ ప్రధాన కార్యదర్శులు సురేష్ బుడగం, జాహ్నవి దుసరి, అడ్వైసరి బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి, కమ్మూనిటీ, ముఖ్య సభ్యులు స్వాతి బుడగం, సుప్రజ పులుసు, వెంకట్ రెడ్డి దొంతుల,మల్లా రెడ్డి, సత్యపాల్ పింగిళి, గణేష్ కుప్పలా, గణేష్ పాస్తం, రాకేష్ పటేల్, రవి రేటినేని, రవి ప్రదీప్ పులుసు, మాధవ రెడ్డి ,సతీష్ రెడ్డి గొట్టిముక్కుల, శ్రావ్య వందనపు, హరి గౌడ్ నవాబ్ పేట్, క్రాంతి రేటినేని, శ్వేతా మహేందర్, శశి దొడ్లే, శ్రీ లక్ష్మి, ప్రశాంత్ మామిడాల, శ్రీకాంత్ ముదిరాజ్, తేజ, నిఖిల్, మౌనిక, ప్రవీణ్ వీర, శ్రీకాంత్ జెల్ల, శైలజ, శ్రీధర్ రావు, కార్తీక్, ప్రశాంత్ మామిడాల, మహేందర్, శ్రీవిద్య, స్నేహ, విజిత, సత్యం కంది, రంజిత్, వంశీ, నరేష్, నాగరాజు, మ్యాడి, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు!) -
విచ్ఛిన్న శక్తులను ఏరేద్దాం
న్యూఢిల్లీ: మత, ప్రాంతీయవాదాలతో దేశాన్ని విభజించాలని చూస్తున్న విచ్చిన్న శక్తులను తుదముట్టించాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దసరా సందర్భంగా మంగళవారం ఢిల్లీలో దసరా వేడుకల్లో పాల్గొని అక్కడి వారినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. కేవలం రావణ దిష్టిబొమ్మల దహనానికే పరిమితం కాకుండా, దేశాభివృద్ధిని గాలికొదిలి స్వీయ ప్రయోజనాల సాధనకు తాపత్రయపడే సిద్ధాంతాలనూ దహనం చేయాలని హితవు పలికారు. విభజన శక్తులపై దేశభక్తి సాధించిన విజయంగా దసరాను జరుపుకోవాలన్నారు. విలక్షణ ఇండియా కూటమిని ఉద్దేశించే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. వివక్ష, సామాజిక రుగ్మతలను నిర్మూలించాల్సి ఉందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అయోధ్యలో రామాలయ వచ్చే రామనవమి నాటికి పూర్తవుతుందని ప్రకటించారు. శతాబ్దాల ఎదురుచూపుల తర్వాత రాముడు అయోధ్యలో కొలువుదీరనున్నాడని చెప్పారు. దసరా సందర్భంగా ప్రతి ఒక్కరూ కనీసం పది మంచి పనులు చేస్తామని ప్రతిజ్ఞ చేయాలన్నారు. సామాజికంగా కనీసం ఒక పేద కుటుంబాం పైకి ఎదిగేందుకు చేయూత ఇవ్వాలని హితవు పలికారు. మన సరిహద్దులను ఎలా కాపాడుకోవాలో తమకు బాగా తెలుసన్నారు. ‘దసరా నాడు ఆయుధ పూజ జరుగుతుంది. భారత్ ఎప్పుడూ ఆయుధాలను స్వీయ రక్షణకే ఉపయోగిస్తుంది‘ అని స్పష్టంచేశారు. -
సింగపూర్లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరం!
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో అంబరాన్ని అంటిన బతుకమ్మ సంబరం. తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఇక్కడి సంబవాంగ్ పార్క్లో అక్టోబర్ 21 న ఎంతో కన్నుల పండుగ గా జరిగాయి. ఈ వేడుకల్లో చిన్న పెద్ద తేడా అనే లేకుండా అందరు సాంప్రదాయ పాటలు ఆటలతో ఎంతో హుషారుగా గడిపారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సింగపూర్ బతుకమ్మ ఉయ్యాలో పాటలతో ఈ వేడుకలు మిన్నంటాయి. ఈ సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు ఎంతో మంది ఎన్నారైలు సుమారు 3 వేల నుంచి 4 వేల వరకు పాల్గొని బతుకమ్మ ఆడారు. సింగపూర్లో నివసిస్తున్న తెలుగు వారందరు స్థానికులకు బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను తెలియజేసేలా విశేష ఆదరణ కలుగజేసినందుకు టీసీఎస్ఎస్ చరిత్రలో నిలిచిపోయిందని సొసైటీ సభ్యులు అన్నారు. ఈ సంబురాల్లో అందంగా ముస్తాబైన బతుకమ్మలకు సౌజన్య డేకోర్ వారు బహుమతులు అందజేశారు. వీరితో పాటు సింగా దాండియా వారు లక్కీ డ్రాలో 10 మంది అదృష్ట విజేతలకు చీరలు అందజేయడం జరిగింది. ఇరు తెలుగు రాష్ట్రాల తెలుగు వారు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ వైభవాన్ని చాటి చెప్పడం ఎంతో సంతోషకరం అని సంబరాలు విజయవంతంగా జరుగుటకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు టీసీఎస్ఎస్ సభ్యులు. టీసీఎస్ఎస్ ప్రేరణతో ఇతర సంస్థలు కూడా బతుకమ్మ నిర్వహించుకోవడం అభినందినీయం అని అన్నారు. ఈ ఏడు బతుకమ్మ సంబురాలకు టీసీఎస్ఎస్ ప్రత్యేకంగా తయారు చేయించిన బతుకమ్మ ప్రధాన ఆకర్షణ గ నిలిచింది. ఈ సారి యూట్యూబ్లో విడుదల చేసిన సింగపూర్ బతుకమ్మ ప్రోమో పాట వేల వీక్షణాలతో దూసుకుపోయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్ కార్యవర్గ సభ్యులు రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి మొదలగు వారు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు సొసైటీ మహిళా విభాగ సభ్యులు రోజా రమణి, గడప స్వాతి, బసిక అనిత రెడ్డి, జూలూరు పద్మజ, సునీత రెడ్డి, హేమ లత, దీప నల్ల, గోనె రజిత, కాసర్ల వందన, రాధికా రెడ్డి నల్ల, బొందుగుల ఉమా రాణి, నంగునూరు సౌజన్య, నడికట్ల కళ్యాణి, హరిత విజాపుర్, ఆవుల సుష్మ, పులిగిల్ల హరిత, సౌజన్యమాదారపు, ఎర్రమ రెడ్డి దీప్తి, సృజన వెంగళ, హర్షిణి మామిడాల, సుధా రాణి పెసరు మొదలగు వారు ఈ బతుకమ్మ పండుగ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈ సారి వేడుకలను సొసైటీ ఫేస్ బుక్ యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగింది. (చదవండి: సింగపూర్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు) -
హైదరాబాద్లో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం: మంత్రి కొట్టు
సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఇంద్రకీలాద్రి పై దసరా మహోత్సవాల ఏర్పాట్లను శనివారం.. మంత్రి పరిశీలించారు. ఆయన వెంట మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, దుర్గగుడి ఈవో కె.ఎస్.రామారావు, దుర్గగుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబు, నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, డీసీపీ విశాల్ గున్నీ, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ప్రతీ భక్తుడికి అమ్మవారి దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఓమ్ టర్నింగ్ వరకూ మూడు క్యూలైన్లు.. అక్కడి నుంచి ఐదు వరుసల క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. కేశ ఖండన చేసుకున్న వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఇటీవల కొండ చరియలు విరిగిపడిన దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ‘‘సబ్ కలెక్టర్ కార్యాలయం, వీఎంసీలో ఒక టికెట్ కౌంటర్ పెట్టాం. 3,500 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం. ప్రోటోకాల్ వీవీఐపీలకు మాత్రమే అంతరాలయ దర్శనం. 500 రూపాయల తీసుకున్న వారికి ముఖమండపం నుంచి దర్శనం. భక్తులకు పాలు, మజ్జిగ, బిస్కెట్లు క్యూలైన్లు లో ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. మూలా నక్షత్రం రోజు సీఎం రాకకు సంబంధించి ప్రత్యేక ఏర్పాటు చేశాం. గతేడాది సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అందుకే ఈసారి బీఎస్ఎన్ఎల్, ఫైబర్ నెట్, ఏసీటీ నుంచి కనెక్షన్లు తీసుకున్నాం. వృద్ధులకు దర్శనం కోసం ఉదయం, సాయంత్రం రెండు ప్రత్యేక స్లాట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. చదవండి: టీడీపీ వీరాభిమానికి గుండె వ్యాధి.. ఆదుకున్న సీఎం జగన్ ప్రభుత్వం -
సౌదీలో దీపావళి వేడుకలకు సన్నాహాలు!
సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలోని భారత రాయబార కార్యాలయ ఆవరణలో కాన్సులేట్ ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా దీపావళ వేడుకలు జరగనున్నాయి. ఈ మేరకు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) వ్యవస్థాపక అధ్యక్షులు మల్లేష్ నవంబర్ 10న శుక్రవారం సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు దీపావళి సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. దీపావళి వేడుకలలో జిద్దా భారత రాయబార కార్యాలయం కాన్సుల్ జనరల్ మహ్మద్ షాహిద్ ఆలం ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సౌదీ అరేబియాలోని సుమారు వెయ్యి మంది ప్రవాస భారతీయులు పెద్దలు, పిల్లలు పాల్గొంటారని 'సాటా' వెస్ట్రన్ రీజియన్ ప్రధాన కార్యదర్శి కుద్రత్ మీర్జా తెలిపారు. సభా ప్రాంగణంలో దీపావళి నేపథ్య అలంకరణ చేస్తామని భరత నాట్యం, కూచిపూడి, కథాకళి లాంటి సంప్రదాయ నృత్యాల తోపాటు దాండియా, పాటలు, ప్రత్యక్ష్య సంగీతం ఉంటాయని 'సాటా' వెస్ట్రన్ రీజియన్ సాంస్కృతిక ఉపాధ్యక్షురాలు లక్ష్మీ నాగరాజ్ తెలిపారు. భారతీయ కుటుంబాలు సాంప్రదాయ వస్త్రధారణతో వచ్చి దీపావళి పండుగను జరుపుకోనున్నారని 'సాటా' వెస్ట్రన్ రీజియన్ అధ్యక్షుడు నరేష్ తెలిపారు. సంఘసేవ వాలంటీర్లకు సన్మానం, రాత్రి 9 గంటలకు భోజనాలతో కార్యక్రమం ముగుస్తుందని ఆయన తెలిపారు. (చదవండి: భారత సంతతి విద్యార్థికి.. ఒకేరోజు ఏకంగా ఆరుసార్లు గుండె ఆగిపోడమా!..) -
Chandrayaan 3 Success Viral Photos: నెట్టింట చంద్రయాన్-3 సక్సెస్ హల్చల్
-
Maamannan: ఉదయనిధి స్టాలిన్ ‘మామన్నన్’ మూవీ 50 రోజుల వేడుక (ఫొటోలు)
-
Parsi Navroz : ఘనంగా పార్శీలు నవ్రోజ్ ఉత్సవాలు (ఫొటోలు)
-
సామాన్యులే అతిథులు
-
హ్యాపీ ఇండిపెండెన్స్ డే 2023: భారత తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల చిత్రాలు
-
ఆగస్టులో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముగింపు వేడుకలు
సాక్షి, అమరావతి : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముగింపు వేడుకల్లో భాగంగా ఆగస్టు 9–15 తేదీల మధ్య ‘మేరీ మిట్టి మేరా దేశ్’ నినాదంతో దేశవ్యాప్తంగా 2.50 లక్షల గ్రామ పంచాయతీలు, 7,500 బ్లాకులు, 90 వేల మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. అదే నెల 29, 30 తేదీల్లో ఢిల్లీలోని కర్తవ్య పథ్లో ముగింపు వేడుకల గ్రాండ్ ఫినాలే నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. వీటి నిర్వహణ, ఏర్పాట్లపై శనివారం ఆయన రాష్ట్రాల సీఎస్లతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలకులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఏపీ తరఫున జవహర్రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కీలక అంశాలపై కార్యక్రమాలు.. ఆయా గ్రామాలు, పట్టణాల నుంచి దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్య్ర సమరయోధులు, రక్షణ దళాల విశ్రాంత సిబ్బంది, కేంద్ర ఆర్మ్డ్ రిజర్వు పోలీసు, రాష్ట్ర పోలీసు దళాలకు చెందిన వారికి సంఘీభావాన్ని తెలియజేయాలి. వివిధ తాగునీటి వనరుల వద్ద శిలాఫలకాలను ఏర్పాటుచేయాలి. జాతీయ జెండా ఆవిష్కరణ, జాతీయ గీతాలాపన చేయాలి. ప్రతి పంచాయతీలో వసుధ వందన్ కింద కనీసం 75 మొక్కలను నాటాలి. అలాగే, వీరన్ కా వందన్ కింద స్వాతంత్య్ర సమరయోధులు, అమర వీర సైనిక కుటుంబాలకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించాలి. -
మోదీ ఫ్రాన్స్ పర్యటన.. మరింత పదునెక్కిన చెలిమి!
అంతర్జాతీయ వ్యవహారాల్లో సొంత గొంతు వినిపించటంలో సారూప్యత కలిగివుండే భారత్–ఫ్రాన్స్ల మధ్య వ్యూహాత్మక చెలిమి ఏర్పడి ఇరవై అయిదు వసంతాలు పూర్తయిన తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆ గడ్డపై అడుగుపెట్టారు. రెండు రోజుల పర్యటనలో శుక్రవారం ఆయన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించే బాస్టిల్ డే ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నావికా దళ అవసరాల కోసం ఉద్దేశించిన 26 రాఫెల్ జెట్ ఫైటర్లు, మూడు స్కార్పీన్ రకం జలాంతర్గాముల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలవుతున్నాయి. రక్షణ రంగంలో సహకరిస్తున్న ఫ్రాన్స్ ఈ ఒప్పందాలతో రష్యా తర్వాత మనకు ఆయుధాలు విక్రయించే రెండో పెద్ద సరఫరాదారు కాబోతోంది. ఇప్పటికే మనం ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ జెట్ విమానాలు, ఆరు స్కార్పీన్ రకం జలాంతర్గాములు కొనుగోలు చేశాం. ఇరు దేశాలమధ్యా సాన్నిహిత్యం ఈనాటిది కాదు. 1916లో మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఫ్రాన్స్ను చేజిక్కించుకొనేందుకు నాటి జర్మనీ చేసిన ప్రయత్నాలను డన్కిర్క్ పట్టణంలో వమ్ము చేసింది మన దేశానికి చెందిన పంజాబ్ రెజిమెంట్ జవాన్లే. ఆ విజయానికి గుర్తుగా అప్పట్లో పారిస్ వీధుల్లో మన జవాన్లు కవాతు కూడా జరిపారు. దాన్ని గుర్తుచేసుకుంటూ శుక్రవారం బాస్టిల్ డే సందర్భంగా అదే రెజిమెంట్కు చెందిన మన సైనికులు 107 ఏళ్ల సుదీర్ఘకాలం అనంతరం కవాతు చేశారు. మనకు స్వాతంత్య్రం వచ్చాక తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సైతం ఫ్రాన్స్తో సాన్నిహిత్యాన్ని కోరుకున్నారు. 1950 తర్వాతనుంచీ రెండు దేశాల మధ్యా అణు, అంతరిక్ష రంగాల్లో సహకారం కొనసాగుతోంది. ముఖ్యంగా వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడిన గత 25 సంవత్సరాలుగా భారత్–ఫ్రాన్స్ చెలిమి ఎన్నో సంక్లిష్ట సందర్భాలను తట్టుకుని నిలబడింది. 1998లో అప్పటి ప్రధాని వాజ్పేయి హయాంలో మన దేశం పోఖ్రాన్లో అణ్వస్త్ర పరీక్ష నిర్వహించినప్పుడు అమెరికాతో సహా అగ్ర రాజ్యాలు తీవ్ర విమర్శలకు దిగాయి. కానీ ఆ సమయంలో ఫ్రాన్స్ అన్నివిధాలా అండగా నిలబడింది. యూరోప్ యూనియన్ (ఈయూ) శిఖరాగ్ర సదస్సులో భారత్ను అభిశంసిస్తూ, దానిపై ఆంక్షలకు పిలుపునిస్తూ బ్రిటన్ తీర్మానం ప్రతిపాదించబోయినప్పుడు వీటో చేస్తానని హెచ్చరించి ఆ ప్రయత్నాన్ని నిలువరించింది ఫ్రాన్సే. చదవండి: ఫ్రాన్స్లోకి అడుగు పెట్టిన ‘యూపీఐ’.. ఈఫిల్ టవర్ నుంచే చెల్లింపులు రెండు దేశాల విదేశాంగ విధానంలో ఎన్నో పోలికలు కూడా ఉన్నాయి. అమెరికాతో సఖ్యంగా మెలగుతూనే ఏదోమేరకు స్వతంత్రతను పాటించటం భారత్, ఫ్రాన్స్లు మొదటినుంచీ అనుసరిస్తున్న విధానం. అమెరికా బద్ధశత్రువులైన ఇరాన్, రష్యాలతో సాన్నిహిత్యం నెరపడంలోనూ ఇద్దరిదీ ఒకే ఆలోచన. ఏకధ్రువ ప్రపంచం ఏర్పడాలని, అది కూడా తన నాయకత్వంలోనే ఉండాలని తహతహలాడే అమెరికా వైఖరికి భిన్నంగా ఏ ఒక్కరి ఆధిపత్యమో ఉండటం చేటు తెస్తుందని భావించటంలోనూ భారత్, ఫ్రాన్స్లమధ్య పోలిక ఉంది. ఎవరిపైనా సంపూర్ణంగా ఆధారపడే ధోరణి సరికాదని, ఏ దేశానికైనా స్వాలంబన సాధించటం అవసరమని గుర్తించటంలోనూ ఇద్దరూ ఇద్దరే. బహుశా అందువల్లే కావొచ్చు... పరస్పరం సహకరించుకోవటం ద్వారా భిన్న రంగాల్లో ఎదగటానికి రెండు దేశాలూ ప్రయత్నిస్తున్నాయి. వ్యూహాత్మక చెలిమిలో ముందడుగు వేస్తున్నాయి. అమెరికా మనతో సఖ్యంగా ఉంటున్నా ఆ చెలిమికి ఎప్పుడూ పరిమితులుంటున్నాయి. ఆ దేశంతో మనం కుదుర్చుకునే రక్షణ ఒప్పందాలకు ఎన్నో అవరోధాలుంటాయి. అక్కడి కాంగ్రెస్ వాటిని ఆమోదించాలి. రక్షణ పరికరాలకు సంబంధించి అమల్లోవుండే ఎగుమతుల నియంత్రణ వ్యవస్థలను దాటాలి. ఈ క్రమంలో ఎక్కడైనా ఆగిపోవచ్చు. లేదా జాప్యం చోటుచేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో రక్షణ కొనుగోళ్లకు అంగీకరించినా, సాంకేతికత బదిలీ సాధ్యపడదు. ఉదాహరణకు మన తేలిక రకం యుద్ధ విమానం తేజస్కు జీఈ ఎఫ్ 414 ఇంజిన్ అమర్చేందుకు అమెరికాతో ఒప్పందం కుదిరింది. దాని సాంకేతికత బదిలీకి మాత్రం అంగీకరించలేదు. ఫ్రాన్స్తో ఈ పేచీ లేదు. దానితో కుదుర్చుకునే ఒప్పందాలకు అవాంతరాలుండవు. సాంకేతికత బదిలీకి అభ్యంతరాలుండవు. జీఈ ఎఫ్ 414 ఇంజిన్ మాదిరే పనిచేసే ఫ్రాన్స్ సఫ్రాన్ ఇంజిన్ను ఇక్కడే ఉత్పత్తి చేయడానికి ఆ దేశం అంగీకరించింది. సాంకేతికత బదిలీ చేయటం వల్ల కేవలం రక్షణ ఉత్పత్తులు విక్రయించే దేశమే కాక, కొనుగోలు చేస్తున్న దేశం కూడా లబ్ధిపొందటానికి అవకాశముంటుంది. రెండు దేశాలూ పర్యావరణ రంగంలో కూడా పరస్పరం సహకరించుకోవటానికి ఇప్పటికే నిర్ణయించాయి. నిరుడు అక్టోబర్లో గ్రీన్ హైడ్రోజన్పై ఒప్పందం కుదుర్చుకుని, పరస్పర భాగస్వామ్యంతో ప్రపంచానికి విశ్వసనీయమైన, స్థిరమైన హరిత ఇంధనాన్ని అందించే దిశగా ఇరు దేశాలూ అడుగులు వేస్తున్నాయి. ఇంకా కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, డిజిటల్ టెక్నాలజీ, 6జీ తదితర అంశాల్లో సమష్టిగా పనిచేస్తున్నాయి. క్వాడ్, జీ 20 తదితర వేదికల్లో ఒకే గళం వినిపిస్తున్నాయి. అలాగని విభేదాలు లేకపోలేదు. ఉక్రెయిన్ యుద్ధంలో ఫ్రాన్స్ ఉక్రెయిన్కు గట్టి మద్దతుదారుగా నిలబడింది. ఆయుధాలు సరఫరా చేస్తోంది. మన దేశం మాత్రం దురాక్రమణ ఆపాలని రష్యాను కోరడం మినహా అమెరికా, ఈయూ దేశాల తరహాలో రష్యా వైఖరిని ఖండించటంలేదు. అలాగే చైనా విషయంలోనూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానియెల్ మాక్రాన్ భిన్న వైఖరితో ఉన్నారు. విభేదించుకునే అంశాల్లో అవతలి పక్షం అవగాహన తెలుసుకోవటం, వారిని ఒప్పించే ప్రయత్నం చేయటంలోనే దౌత్య నైపుణ్యం వెల్లడవుతుంది. చిరకాల మిత్ర దేశమైన ఫ్రాన్స్ మోదీ పర్యటన తర్వాత మనకు మరింత సన్నిహితమవుతుందని ఆశించాలి. -
Dil Raju : కుమారుడితో కలిసి దిల్ రాజు దంపతుల అల్లరి (ఫోటోలు)
-
America Independence Day : అట్టహాసంగా అమెరికా స్వాతంత్య్ర వేడుకలు (ఫొటోలు)
-
నా కొడుకు తప్పు చేయలేదు.. బక్రీద్ వేళ బోధన్ ఎంఐఎం నేత తండ్రి రోదన
-
నా పెళ్లి.. నా ఇష్టం..అప్పుడే ఏడాది!
-
మహేష్ బాబు బర్త్ డే సప్రైజ్ ఫిక్స్.. ఇక ఫాన్స్ కి పూనకాలు లోడింగ్..!
-
మహబూబాబాద్ జిల్లాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
-
బీజేపీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
-
సిలికానాంధ్ర ఆధ్వర్యంలో అన్నమయ్య జయంత్యుత్సవం
కాలిఫోర్నియా: ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర వారి డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో శనివారం అన్నమయ్య 615వ జయంత్యుత్సవం వైభవంగా జరిగింది. గోవిందనామ సంకీర్తనలతో మిల్పిటాస్ నగరం మారుమోగింది. ఈ సందర్భగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గాయకులు గరిమెళ్ళ అనీల్ కుమార్, గాయత్రి అవ్వారి, పద్మిని సరిపల్లె, సుధా దూసిల నేతృత్వంలో రమేష్ శ్రీనివాసన్, వారి శిష్య బృందం మృదంగ వాద్య సహకారంతో జరిగిన గోష్టిగానం భక్తులను పరవశింపచేసింది. వీరి గానం సాగుతుండగా చిత్ర కళాకారుడు కూచి సద్యోజాతంగా వేసిన చిత్రం ఆశ్చర్యానందాలను కలిగించింది. అనంతరం సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు చిత్రాకారుడు కూచిని ఘనంగా సన్మానించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో గత 20 సంవత్సారాలుగా అన్నమయ్య ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. ఇక్కడే పుట్టి పెరుగుతున్న పిల్లలకు తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను పరిచయం చేసేందుకు సిలికానాంధ్ర చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. సాయంత్రం జరిగిన సంగీత కచ్చేరిలో వీణ విద్వాంసులు ఈమని కళ్యాణి లక్ష్మీనారాయణ, వారి కుమార్తె పద్మిని పసుమర్తి తమ వీణా నాదాలతో ఆకట్టుకున్నారు. వీరికి కలైమామణి రమేష్ శ్రీనివాసన్ మృదంగ సహకారం అందించారు. తరువాత జయప్రద రామమూర్తి వాయులీన గానంతో అలరించారు. వారికి అనూరాధ శ్రీధర్ వయలిన్, శ్రీరామ్ బ్రహ్మానందం మృదంగ సహకారాన్ని అందించారు. సిలికానాంధ్ర వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి సాంస్కృతిక కార్యవర్గ బృందం కళాకారులను సత్కరించారు. చివరిగా గరిమెళ్ళ అనీల కుమార్ గారి గాత్రంతో స్వామి వారికి పవళింపు సేవ నిర్వహించారు. అనంతరం అందరికీ భోజన ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమం విజయవంతం అవ్వడానికి కృషి చేసిన సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు కందుల సాయి, సంగరాజు దిలీప్, పరిమి శివ, సింహాద్రి కిరణ్, ఉద్దరాజు నరేంద్ర, కార్యకర్తలు వంశీ నాదెళ్ళ, సృజన నాదెళ్ళ, అనిరుధ్ తనుగుల, ప్రియ తనుగుల, కోట్ని శ్రీరాం, జయంతి కోట్ని, శాంతి కొండ, ఉష మాడభూషి, మమత కూచిభొట్ల, విజయసారథి మాడభూషి, యేడిది శర్మలకు కార్యదర్శి వేదాంతం మహతి కృతజ్ఞతలు తెలియజేశారు. -
గోవాలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఫీజు భారీగా చెల్లించాల్సిందే
గోవా తీరంలో పెళ్లి చేసుకోవాలనుకునేవారికి ఇది చేదువార్త. గోవా కోస్టల్ జోన్ మేనేజిమెంట్(జీసీజెడ్ఎంఏ) ఇక్కడ నిర్వహించుకునే పెళ్లిళ్లకు సంబంధించిన దరఖాస్తు రుసుమును రెండింతలు చేసింది. దీంతో ఇక్కడ పెళ్లి చేసుకోవాలనుకునేవారు దరఖాస్తుతోపాటు లక్ష రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే వారికి అనుమతి లభిస్తుంది. గతంలో అంటే 2020 ఏప్రిల్లో ఇందుకు సంబంధించిన ఫీజును పెంచారు. అప్పటి వరకూ రూ.10 వేలు ఉన్న రుసుమును రూ. 50 వేలకు పెంచారు. కాగా నూతన నిబంధనల ప్రకారం పెళ్లి వేడుకలను గరిష్టంగా ఐదు రోజులు నిర్వహించుకునేందుకు అనుమతి కోసం లక్ష రూపాయలు చెల్లించాల్సివుంటుంది. అలాగే ప్రతీరోజూ పార్టీల నిర్వహణకు రూ. 10 వేలు చెల్లించాల్సివుంటుంది. పెళ్లిళ్లు మాత్రమే కాకుండా ఇతర కార్యక్రమాల నిర్వహణకు కూడా నదీ తీరాన్ని అద్దెకు తీసుకోవచ్చు. జీసీజెడ్ఎంఏ అధికారి తెలిపిన వివరాల ప్రకారం ప్రతీ ఏడాదీ తమకు వేసవి, చలికాలాల్లో పెళ్లిళ్ల నిర్వహణకు సంబంధించిన దరఖాస్తులు వస్తాయన్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించడం తమకు భారంగా మారిందన్నారు. దరఖాస్తులలో చాలామంది వెయ్యిమంది అతిథులకు 800 చదరపు మీటర్ల తీరం కావాలని కోరుతుంటారని, ఇందుకోసం అనుమతివ్వాలని అడుగుతుంటారని తెలిపారు. ఇదేవిధంగా డిసెంబరు, జనవరి నెలల్లో పార్టీలు, వివాహాలు చేసుకునేందుకు దరఖాస్తులు వస్తాయన్నారు. ఈ సమయంలోనే చాలామంది ఇక్కడ వేడుకలు చేసుకునేందుకు మొగ్గు చూపుతుంటారన్నారు. ఈ పార్టీలు ముఖ్యంగా సముద్రతీరంలోని హోటళ్ల సమీపంలో జరుగుతుంటాయన్నారు. ఈ నేపధ్యంలోనే తీరంలోని హోటళ్లు అత్యధికంగా బుక్ అవుతుంటాయని తెలిపారు. -
హైదరాబాద్ : రాజ్భవన్లో ఉగాది ఉత్సవాలు (ఫోటోలు)
-
హరహర మహాదేవ... రాజన్నను దర్శించుకున్న 3 లక్షల మంది భక్తులు
వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజన్న క్షేత్రం శివనామస్మరణతో మారుమోగింది. మహాశివరాత్రిని పురస్కరించుకొని రాజన్న దర్శనానికి దాదాపు 3 లక్షల మంది వరకు వేములవాడకు తరలివచ్చారు. ఒక్కోభక్తుడి దర్శనానికి దాదాపు పది గంటల సమయం పట్టింది. శివమాలాధారులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. సాయంత్రం 6 గంటల నుంచి నిరంతరం లఘు దర్శనాలకు అవకాశం కల్పించారు. ఉదయం వేళలో మధ్య మధ్యలో దర్శనాలు నిలిపివేయడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆర్జిత సేవలు రద్దు చేశారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో క్యూలైన్లలో భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. లింగోద్భవ సమయంలో స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఏర్పాట్లను కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎసీపీ అఖిల్ మహాజన్, అడిషనల్ కలెక్టర్లు ఖీమ్యానాయక్, సత్యప్రసాద్, ఏఎస్పీ చంద్రయ్య, తహసీల్దార్ రాజారెడ్డి పరిశీలించారు. రాజన్నకు వెంకన్న పట్టువస్త్రాలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజన్నకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలను డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ బృందం సమర్పించారు. వీరికి ఆలయ ఈవో కృష్ణప్రసాద్ ప్రసాదాలు అందించి, సత్కరించారు. రూ.50 కోట్లతో అభివృద్ధి : మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వేములవాడ, సిరిసిల్ల పట్టణాలను రూ.50 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. హాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీరాజరాజేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రులకు కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే రమేశ్బాబు, ఆలయ ఈవో కృష్ణప్రసాద్, అడిషనల్ కలెక్టర్లు ఖీమ్యానాయక్, సత్యప్రసాద్ స్వాగతం పలికారు. రాజన్న దర్శనం అనంతరం మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వేములవాడపై ప్రత్యేక దృష్టి పెట్టారని, రాష్ట్రంలోనే ఎములాడ రాజన్న ఆదాయంలో నంబర్ వన్గా నిలుస్తుందన్నారు. గుడి చెరువు, ధర్మ గుండంలను ఎల్లప్పుడు గోదావరి జలాలతో నింపుతామన్నారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థఫు మాధవి, కౌన్సిలర్లు ఉన్నారు. మార్మోగిన ఆలయాలు కరీంనగర్కల్చరల్: కరీంనగర్ పట్టణంతో పాటు జిల్యావ్యాప్తంగా ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. కరీంనగర్ పాతబజారులోని శివాలయం, కమాన్ వద్ద రామేశ్వరాలయంలో స్వామివారి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు బారులుతీరారు. ► శుక్రవారం అర్ధరాత్రి 12 నుంచి శనివారం వేకువజాము 3.30 గంటలు: స్థానికుల దర్శనాల అనంతరం నిరంతరం లఘు దర్శనాల కొనసాగింపు. ► శనివారం ఉదయం 7 గంటలు: టీటీడీ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ ఆధ్వర్యంలో రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు. ► ఉదయం 8: రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే రమేశ్బాబు, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ దంపతులు, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి పట్టువస్త్రాలు సమర్పించారు. ► మధ్యాహ్నం 3.30: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజన్నను దర్శించుకున్నారు. ► సాయంత్రం 4: శివమాలధారులు రాజన్నను దర్శించుకున్నారు. ► సాయంత్రం 6: అద్దాల మండపంలో అనువంశిక అర్చకుల ఆధ్వర్యం లో సామూహిక మహాలింగార్చన. ► సాయంత్రం 6 నుంచి ..: రాష్ట్ర భాషా, సాంస్కృతికశాఖ జాయింట్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో శివార్చన. ► రాత్రి 11.35 నుంచి ఉదయం 4 గంటలు: లింగోద్భవ సమయంలో రాజన్నకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం. సేవలు ఇలా.. ► రాజన్న మహాజాతరలో 2 వేల మంది పోలీసులు బందోబస్తు చేపట్టారు. ► 650 మంది శానిటేషన్ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు విధులకు హాజరయ్యారు. ► ఎంపీవోలు 80 మంది, మెడికల్ సిబ్బంది 300, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ 150, అంగన్వాడీలు 150, స్వచ్ఛంద సంస్థ సభ్యులు వెయ్యి మంది జాతరలో విధులు నిర్వహించారు. ► ఆలయ సిబ్బంది 850, సెస్ ఉద్యోగులు 90, ఎక్సైజ్ 75 మంది విధులకు హాజరయ్యారు. ► 800 బస్సుల్లో భక్తులను వివిధ ప్రాంతాలకు చేరవేశారు. ► 14 ఉచిత బస్సులు తిప్పాపూర్ నుంచి రాజన్న ఆలయానికి భక్తులను ఉచితంగా చేరవేశాయి. చదవండి: ఊరూవాడా శివనామ స్మరణ -
ఘనంగా సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు
-
సంక్రాంతి సంబరాలు షురూ.. గిరి పల్లెల్లో మొదలైన సందడి
బుట్టాయగూడెం (ఏలూరు జిల్లా): సంక్రాంతి.. ఇది ఒక పండుగ మాత్రమే కాదు. ఎన్నెన్నో అనుభూతులు, మరెన్నో మేళవింపులు... భావోద్వేగాలు... ఒక మాటలో చెప్పాలంటే ఏడాదికి సరిపోయే ఎన్నో అద్భుతమైన తీపి జ్ఞాపకాల సంబరం. అలాంటి పండుగ రెండు వారాల్లో రాబోతుంది. అయితే అంతకన్నా ముందే పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఆట పాటలతో హోరెత్తించారు. సంక్రాంతి అనగానే వెంటనే గుర్తుకు వచ్చేవి భోగిమంటలు.. సంప్రదాయ పంచెకట్లు, పట్టు పరికిణీలు, గంగిరెడ్లు, డూడూ బసవన్నలు, సన్నాయి వాయిద్యాలు, రంగురంగుల ముగ్గులు, ఎడ్ల పందేలు, కోడి పందేలు, జానపదాలు, సరదాలు, షికార్లు ఇలా అనేక రకమైన కళలు, సాంస్కృతిక మైమరపుల కలబోతే సంక్రాంతి. సంక్రాంతి పండుగలో సాంస్కృతిక శోభను అదిమి పట్టుకునే విధంగా బుట్టాయగూడెం మండలంలోని తెల్లంవారిగూడెం పాఠశాలలో సంక్రాంతి సంబరాలను ఉపాధ్యాయులు నిర్వహించారు. హరిలో రంగ హరి అంటూ హరిదాసు సందడి, భోగిమంటలు, గొబ్బెమ్మలతో ముగ్గులు, రోలులో పిండి కొట్టే సాంప్రదాయం ఇలా అన్ని ఉట్టిపడేలా ఏర్పాటు చేసి ముందుగానే సంక్రాంతి సందడిని తీసుకువచ్చారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద సంక్రాంతి వచ్చిందే తుమ్మెద.. సరదాలు తెచ్చిందే తుమ్మెద... అంటూ సాగే పాటకు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో పాటు ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సైతం నృత్యాలు చేశారు. అదేవిధంగా భోగి తెచ్చే భోగం అనే పాటకు కూడా విద్యార్థులతో పాటు బాలరాజు నృత్యం చేసి అందరినీ అలరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పండగను ఆనందోల్సాహాలతో జరుపుకున్నారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు సంక్రాంతి, జానపద పాటలకు నృత్యాలు విద్యార్థినులను ఉత్సాహపరిచారు. (క్లిక్ చేయండి: ఆంధ్రా ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి) -
విశాఖపట్నం : సందడిగా ఫ్రెషర్స్ డే వేడుక (ఫొటోలు)
-
పాపం బర్త్డే బాయ్...ఆ కేక్ ఏంటి మచ్చా! పగలబడి నవ్వండి!
సాక్షి, హైదరాబాద్: బర్తడేను సెలబ్రేట్ చేసుకోవడమంటే అందరికీ కాకపోయినా చాలామందికి సరదానే. అందులోనూ యూత్ అయితే ఇంకా ఇంట్రస్ట్ ఎక్కువ. ఇక స్నేహితులతో అయితే ఆ మజానే వారు. కేక్ కటింగ్లు, స్వీట్లు, సినిమాలు షికార్లతో ఎంజాయ్ చేస్తారు. అయితే ఒక యువకుడి బర్తడేకి సంబంధించిన ఒక వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఈ వీడియో చూసి..అరే ఏంటిరా ఇది అనుకుంటారు. ఆ కేక్ ఏంటి మచ్చా..పాపం రా అని కచ్చితంగా అంటారు. ఆ తరువాత పగలబడి నవ్వుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరూ చూసేయండి మరి! Laughter dose 😂🤣😆. #hilarious #funny #bunny #funnymoments #humor #comedy #comic #fun #funnyvideos #laugh #funnymeme #hilariousvideos #enjoy #laughter #banter #joke #meme #Memes #stressbuster #stressrelief #MEMES #memesdaily #savetheplanet #memeslover @hvgoenka pic.twitter.com/ia1vkSn2Ce — Tarana Hussain (@hussain_tarana) November 15, 2022 -
Divorce Celebration: వివాహ రద్దు వేడుక.. ఆహ్వాన ప్రతిక చూశారా!
వివాహం అనేది మనుషులు జీవితాల్లో ముఖ్యమైన ఘట్టం. అందుకే పెళ్లి జ్ఞాపకాలు చిరకాలం గుర్తుండిపోయేలా వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటారు. ఆలుమగల మధ్య అంతా సవ్యంగా సాగితే ఏ సమస్యా ఉండదు. పొరపొచ్చాలు వస్తే పెళ్లి కాస్తా పెటాకులు అవుతుంది. ఇటీవల కాలంలో విడాకులు అనేవి సాధారణంగా మారిపోయాయి. రాజీపడి బతకడానికి ఎవరు ఇష్టపడటం లేదు. విడాకులు తీసుకుని ఎవరికి వారు హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తున్నవారు ఎంతో మంది మనకు కనబడుతున్నారు. ఇక విషయానికి వస్తే వెడ్డింగే కాదు విడాకులను కూడా సెలబ్రెట్ చేసుకుంటామంటూ సోషల్ మీడియాలో పెట్టిన ఇన్విటేషన్ తెగ వైరలయింది. రెండున్నరేళ్ల పాటు కోర్టులు చుట్టూ తిరిగి డివోర్స్ సాధించిన 18 మంది పురుషులు తమ ‘సింగిల్’ స్టేటస్ను సెలబ్రెట్ చేసుకోవాలని అనుకుని.. ఈ ఆహ్వానపత్రికను తయారు చేయించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివారులోని బిల్ఖిరియాలోని రిసార్ట్లో సెప్టెంబర్ 18న ఈ కార్యక్రమం తలపెట్టారు. భాయి వెల్ఫేర్ సొసైటీ అనే ఎన్జీవో ఆధ్వర్యంలో ‘వివాహ రద్దు’ను వేడుకగా చేసుకోవాలని నిర్ణయించారు. స్వేచ్ఛ లభించినపుడు సెలబ్రెట్ చేసుకోవడంలో తప్పేంలేదని, విడాకుల అనంతర జీవితం కూడా ఆనందంగానే సాగుతుందన్న సందేశం ఇవ్వడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు భాయి వెల్ఫేర్ సొసైటీ చెప్పుకొచ్చింది. తాము మహిళలకు వ్యతిరేకం కాదని.. చట్టాలను దుర్వినియోగం కాకుండా చూడాలన్నదే తమ అభిమతమని వివరణయిచ్చింది. అన్నట్టు విడాకుల కేసులతో సమస్యలను ఎదుర్కొంటున్న పురుషుల కోసం ఈ ఎన్జీవో హెల్ప్లైన్ను కూడా నడుపుతోందట! వివాహ రద్దు వేడుక సాగేదిలా.. పెళ్లి తంతుకు రివర్స్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. పెళ్లి దండలను నిమజ్జనం చేయడం, జెంట్స్ సంగీత్, సద్బుద్ధి శుద్ధీకరణ యజ్ఞం వంటి క్రతువులు చేస్తారు. మనుషుల గౌరవాన్ని కాపాడతామని ఏడడుగుల సాక్షిగా ప్రమాణం చేయిస్తారట. (క్లిక్ చేయండి: పెళ్లి అనుకుంటే లొల్లి) సంప్రదాయవాదుల మండిపాటు భాయి వెల్ఫేర్ సొసైటీ నిర్వహించ తలపెట్టిన వివాహ రద్దు కార్యక్రమంపై సంప్రదాయవాదులు తీవ్రస్థాయిలో మడిపడుతున్నారు. కొన్ని స్థానిక హిందూ సంస్థలు కూడా ఆక్షేపించడంతో నిర్వాహకులు వెనక్కు తగ్గారు. ‘ప్రైవేట్ ఈవెంట్’ను రాజకీయం చేయాలని తాము కోరుకోవడం లేదని.. అందుకే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని నిర్వాహకులు ప్రకటించారు. (క్లిక్ చేయండి: చెప్పులతో చితక్కొట్టుకున్న అంకుల్స్..) -
జీఆర్టీ జ్యువెలర్స్ నుంచి వెడ్డింగ్ కలెక్షన్
హైదరాబాద్: వివాహ వేడుకల కోసం జీఆర్టీ జ్యువెలర్స్ సాటిలేని హస్తకళతో ఆభరణాల డిజైన్లను విడుదల చేసింది. బంగారం, వజ్రాలు, ప్లాటినం, వెండి, విలువైన రత్నాలతో రూపొందిచిన ఉంగరాలు, గాజులు, చెవిదిద్దులు, నెక్లెస్లు, హారాలు, వడ్డాణాలు, వంకీలు వంటివి ఈ విస్తృత శ్రేణి కలక్షన్లో ఉన్నాయి. సంప్రదాయ ఆభరణాలకు బంగారు స్పర్శ, ట్రెండ్ జోడించిన ఈ ప్రత్యేక డిజైన్లు వివాహ వేడుకలను మరుపురాని క్షణాలుగా చిరస్మరణీయం చేస్తాయని కంపెనీ ఎండీ జీఆర్ అనంత పద్మనాభన్ తెలిపారు. -
నేటి నుంచి తెలుగు భాషా అమృతోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు భాష, సాహితీ, సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఈ నెల 29 వరకు తెలుగు భాషా అమృతోత్సవాలను జరుపతలపెట్టినట్లు సంస్థ వ్యవస్థాపక చైర్మన్ కంచర్ల సుబ్బానాయుడు తెలిపారు. రవీంద్రభారతిలో మంగళవారం టంగుటూరి ప్రకాశం పంతులు జయంత్యుత్సవాలతో ఇవి ప్రారంభమవుతాయని, తొలిరోజు జరగనున్న కార్యక్రమాలకు సమన్వయకర్తలుగా లక్ష్మీ పెండ్యాల, పేరి,, ఖాదర్ బాషా, అమరనేని సుకన్య, ఇమ్మడి రాంబాబు, వడ్డేపల్లి విజయలక్ష్మి వ్యవహరిస్తారని వివరించారు. వారం పాటు ప్రతీ రోజూ సాహితీ సదస్సులు, సాహితీ ప్రక్రియలు, కవి సమ్మేళనాలు, కవులకు గౌరవ పురస్కారాలు, పుస్తకావిష్కరణలు, పుస్తక ప్రదర్శనలు ఉంటాయన్నారు. (చదవండి: బంగారు కాదు బార్ల తెలంగాణ: షర్మిల) -
ఇంటింటా త్రివర్ణ పతాకం రెపరెపలు
-
సోదరుడు అర్జున్ రెడ్డితో కలిసి సింగపూర్లో మంత్రి రోజా రాఖీ సెలబ్రేషన్
సింగపూర్: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సోదరుడు అర్జున్రెడ్డితో కలిసి సింగపూర్లో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య విడదీయరాని బంధానికి, ప్రేమానురాగాలకు ప్రతీక అయిన రక్షాబంధన్ సందర్భంగా సోదరుడికి రాఖీకట్టి శుభాకాంక్షలు తెలిపారు. -
ఏపీ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు
-
హైదరాబాద్: రాజ్భవన్లో ఘనంగా బోనాల వేడుకలు
-
వైభవంగా జగన్నాథుని రథయాత్ర
పూరీ (ఒడిశా): ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒడిశాలోని పూరీలో జగన్నాథ రథయాత్ర వైభవోపేతంగా మొదలైంది. శుక్రవారం ఉదయం మొదలైన ఈ యాత్ర తొమ్మిది రోజులు సాగుతుంది. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఈ యాత్రను నిర్వహించలేదు. దీంతో ఈ యాత్రకి భక్తులు వెల్లువెత్తారు. పూరీ పట్టణం భక్తజన సంద్రంగా మారింది. జై జగన్నాథ, హరిబోల్ నామస్మరణతో చుట్టుపక్కల ప్రాంతాలు మారుమోగాయి.అంతరాలయం నుంచి చతుర్థా మూర్తులు బలభద్రుడు, దేవీ సుభద్ర, జగన్నాథుడు, సుదర్శనునితో పాటు మదన మోహనుడు, రామ, కృష్ణ ఉత్సవ మూర్తులను వరుస క్రమంలో రథాలపైకి తరలించారు. మంగళస్నానాలు, సకలధూపం, హారతి వంటివి శాస్త్రోక్తంగా నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి, ఆయన శిష్యులు కొందరు జగన్నాథుడిని తొలి దర్శనం చేసుకున్నారు. పూరీ గజపతి వంశం మహారాజు దివ్యసింగ్ దేబ్ బంగారు చీపురుతో రథాలన్నీ శుభ్రం చేశారు. ఆ దేవదేవుడి ముందు అందరూ సమానమేనన్న సందేశాన్ని ఇవ్వడానికే మహరాజులే ఈ రథాలను ఊడుస్తారు. ఏడాదిపాటు పూరీ జగన్నాథ ఆలయ గర్భగుడిలో ఉండే సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుడు ఆషాఢ మాసం శుక్లపక్ష విదియనాడు ఈ యాత్ర మొదలవుతుంది. మొదట తాళధ్వజ రథంపై బలభద్రుడుని తీసుకువచ్చారు. ఆ తర్వాత దర్పదళన్ రథంపై సుభద్ర, చివరగా నందిఘోష్ రథంపై జగన్నాథుడిని ఊరేగింపుగా గుండిచా మందిరానికి బయల్దేరాయి. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, గవర్నర్ గణేషిలాల్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరై లాంఛనంగా రథాల్ని లాగి యాత్రను ప్రారంభించారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జగన్నాథ రథయాత్ర దేశవ్యాప్తంగా పలు ఇతర నగరాల్లో కూడా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. యాత్రను పురస్కరించుకుని మూల విరాటులను వరుస క్రమంలో రథాలపైకి ఎక్కించి, దించడం గొట్టి పొహొండిగా వ్యవహరిస్తారు. గుండిచా మందిరం అడపా మండపంపై కొలువు దీరిన జగన్నాథుని దర్శించుకుంటే జీవితం పావనం అవుతుందని భక్తులు విశ్వాసం. ఈ ప్రాంగణంలో స్వామికి నివేదించిన అన్న ప్రసాదాలు(ఒభొడా) లభించడం పుణ్యప్రదంగా భావిస్తారు. శ్రీమందిరానికి యథాతధంగా తరలి వచ్చేలోగా జరిగే ప్రత్యేక ఉత్సవాలు యాత్రికుల్ని మరింత ఉత్సాహపరుస్తాయి. వీటిలో హిరా పంచమి, సంధ్యా దర్శనం(నవమి), మారు రథయాత్ర(బహుడా), హరి శయన ఏకాదశి(స్వర్ణాలంకారం), అధర సేవ, గరుడ శయనసేవ, నీలాద్రి విజే ప్రధానమైనవి. -
అల్లూరి ఖ్యాతిని ఇనుమడింపజేసేలా..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు వచ్చేనెల 4న భీమవరంలో ఘనంగా నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర సహాయ మంత్రి కిషన్రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. భీమవరంలో సభా ప్రాంగణం ఏర్పా ట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే స్పెషల్ ఎస్పీజీ, ఏఐజీ హిమాన్షుగుప్త, కేంద్ర కల్చరల్ డైరెక్టర్ అతుల్మిశ్రాలు ప్రాంగణాన్ని పరిశీలించి భద్రతా పరమైన ఏర్పాట్లపై స్థానిక అధికారులతో చర్చించారు. బుధవారం సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, జీఐడీ అదనపు కార్యదర్శి, ప్రధాని పర్యటన నోడల్ అధికారి రేవు ముత్యాలరాజు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజిత్ భార్గవ్లు సభా ప్రాంగణాన్ని, హెలిప్యాడ్ను పరిశీ లించారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 14 ఎకరాల ప్రాంగణంలో బహిరంగ సభావేదికను సిద్ధం చేస్తున్నారు. ప్రధాని సభావేదిక, వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీతోపాటు ఇతర ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రధాని పర్యటన ఖరారైన నేపథ్యంలో పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. భీమవరంలో ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ ప్రాంతాలపైనా అధికారులు దృష్టి పెట్టారు. మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఉండి నియోజకవర్గ గడపగడపకు మన ప్రభుత్వం ఇన్చార్జి, డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నర్సింహరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు ఏర్పాట్లను పరిశీలించారు. భీమవరంలో 30 అడుగుల అల్లూరి విగ్రహం భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని మున్సిపల్ పార్కు లో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరుగనుంది. వచ్చేనెల 4న అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని, ముఖ్యమంత్రి చేతులమీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. రూ.3 కోట్ల వ్యయంతో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేయించి పార్కులో ఏర్పాటుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా అల్లూరి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పకడ్బందీ ఏర్పాట్లు సాక్షి, భీమవరం: ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జీఏడీ అదనపు కార్యదర్శి, ప్రధాని పర్యటన నోడల్ అధికారి రేవు ముత్యాల రాజు అధికారులను ఆదేశించారు. బుధవారం భీమవరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఆయన సమావేశమై ప్రధాని పర్యటన ఏర్పాట్లపై శాఖల వారీగా సమీక్షించారు. అధికారులు, నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులపై పూర్తి అవగాహన కలిగి పీఎంఓ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సభాస్థలికి వెళ్లే మార్గాల్లో బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి ప్యాకెట్లు, అల్పాహారం, బయో టాయిలెట్స్ ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజిత భార్గవ్తో కలిసి హెలిప్యాడ్లు, బహిరంగ సభ ప్రదేశాన్ని పరిశీలించారు. -
అది బతుకమ్మో, భోగిమంటలో కాదు కదా!
రోజురోజుకి పెరిగిపోతున్న పర్యావరణ కాల్యుషం నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించాలంటూ ప్రభుత్వాలు, స్వచ్చంధ సంస్థలు ఎంతగా మొత్తుకున్నా క్షేత్రస్థాయిలో ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండేవి. అయితే ఓలా రాకతో పరిస్థితులు మారిపోయాయి. భవీశ్ అగర్వాల్ ఎంతో ముందు చూపుతో తెచ్చిన ఓలా స్కూటర్లు దేశంలో హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ప్రీ బుకింగ్లోనే లక్షకు పైగా ఆర్డర్లు సాధించింది. ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో రోజుకు వెయ్యికి పైగా బైకులు తయారు చేస్తూ.. డెలివరీ చేస్తున్నా ఇంకా ఓలాకి డిమాండ్ తగ్గడం లేదు. ఓలా బైకు తమ చేతికి వస్తే కస్టమర్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఇటీవల ఓలా స్కూటర్ను సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా పెట్టుకుని మన దగ్గర బతుకమ్మ. భోగిమంటల చుట్టు నృత్యం చేసినట్టుగా యువతీ యువకులు సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ఓలా ఫౌండర్ భవీశ్ అగర్వాల్ ఆ వీడియోను షేర్ చేస్తూ... ఓలా స్కూటర్ను తయారు చేసినప్పుడు దీన్ని ఇలా కూడా ఉపయోగిస్తారని అస్సలు అనుకోలేదంటూ ఆశ్చర్యంతో కూడిన ఆనందం వ్యక్తం చేశారు. తన మదిలో మెదిలిన చిన్న ఆలోచన అనూహ్యమైన రేంజ్లో సక్సెస్ కావడం పట్ల భవీశ్ అగర్వాల్ ఆనందంలో మునిగితేలుతున్నాడు. Never thought of this use case while designing it😄❤️ https://t.co/y5JQWveH0r — Bhavish Aggarwal (@bhash) June 25, 2022 చదవండి: వావ్! ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు తగ్గినా.. కళ్లు తిరిగే ఆదాయం -
డాలస్లో వైభవం గా యోగాడే వేడుకలు
డాలస్ (టెక్సాస్): మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో అమెరికాలోనే అతి పెద్దదైన, డాలస్లో ఉన్న మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరిపారు. 2022 జూన్ 21న ప్రవాస భారతీయులు ఉత్సాహంగా యోగా శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ మెమోరియల్ ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇండియన్ కాన్సుల్ జనరల్ అసీం మహాజన్కి స్వాగతం పలికారు. భారత దేశం ప్రపంచానికి అందించిన యోగా కేవలం జూన్ 21నే కాకుండా నిత్యం అభ్యాసం చెయ్యవలసిన కార్యక్రమమన్నారు. యోగావల్ల శరీరం, మనస్సు స్వాధీనంలో ఉంటాయని తెలియజేశారు. యోగా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా విశ్వవ్యాప్తంగా జూన్ 21 వ తేదీన యోగా కార్యక్రమం జరపడం ఎంతో సంతోషదాయకమని ఇండియన్ కాన్సుల్ జనరల్ అసీం మహాజన్ అన్నారు. ప్రతి రోజూ యోగా చెయ్యడం వల్ల ఒనగూరే ప్రయోజనాలు వివరించారు. ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ ఉత్తరాధ్యక్షుడు దినేష్ హూడా, బోర్డు సభ్యులు రాజీవ్ కామత్, షబ్నం మోడ్గిల్, పలు సంస్థల సభ్యులు, ప్రవాస భారతీయులు, చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారను. ఈ కార్యక్రమం విజయవంతం చెయ్యడంలో సహాయపడిన కార్యకర్తలకు, యోగా శిక్షణ ఇచ్చిన యోగా మాస్టర్ విజయ్, ఐరిస్, ఆనందీలకు, ముఖ్య అతిథి కాన్సల్ జనరల్ అసీం మహాజన్ కు, మహాత్మా గాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యుడు దినేష్ హూడా కృతజ్ఞతలు తెలియజేశారు. చదవండి: అగ్రరాజ్యాన అంగరంగ వైభవంగా అచ్యుతుడి కల్యాణం -
ఎన్టీఆర్ షేర్ చేసిన స్పెషల్ ఫొటో.. క్షణాల్లో వైరల్
Jr NTR Prashanth Neel Celebrate Wedding Anniversary: 'రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్)' సక్సెస్తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ పాన్ ఇండియా చిత్రంతో పాన్ ఇండియా స్టార్గా కూడా మారాడు. మరోవైపు 'కేజీఎఫ్ 2'తో భారీ విజయం సాధించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కొరటాల శివ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమా చేయనున్నారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరి కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ సెలబ్రేషన్ సినిమా గురించి అనుకుంటే పొరపాటే. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఎవరికివారి పర్సనల్ లైఫ్కు సంబంధించిన విషయాన్ని ఒకే రోజు వేడుక చేసుకున్నారు. మే 5న ఇటు తారక్తోపాటు అటు ప్రశాంత్ నీల్ వివాహ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవాన్ని వారిద్దరు తమ ఫ్యామిలీలతో కలిసి జరుపుకున్నారు. ఈ విషయానికి సంబంధించిన ఒక స్పెషల్ ఫొటోను తారక్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇందులో ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి దంపతులతోపాటు ప్రశాంత్ నీల్, ఆయన భార్య లిఖిత ఉన్నారు. ఈ రెండు జంటల వివాహ వార్షికోత్సవం మే 5న కావడంతో ఇరు జంటలు కలిసి ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించి ఫొటోను షేర్ చేస్తూ 'ఒకే రోజు మా రెండు జంటల వివాహ వార్షికోత్సవం జరుపుకోవడం వేడుకగా ఉంది. ఇదొక కొత్త ఆరంభం.' అని ఎన్టీఆర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు రిహార్సల్స్కు రాలేదు: శేఖర్ మాస్టర్ View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రామయ్య పెళ్లికి ముస్తాబు
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో అభిజిత్ లగ్న సుముహూర్తమున పాంచరాత్ర ఆగమం ప్రకారం శ్రీసీతారామచంద్రుల తిరు కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మిథిలా స్టేడియంలో స్వామివారి కల్యాణ వేడుక శాస్త్రోక్తంగా జరగనుంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో సీతారాములవారి శిరస్సులపై అర్చక స్వాములు జీలకర్ర బెల్లం ఉంచి కల్యాణ ఘట్టాన్ని కమనీయంగా జరుపుతా రు. ఈ మేరకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకల సందర్భంగా రామాలయం విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి మిథిలా స్టేడియం ఎదురుగా ఉన్న ఉత్తర ద్వారం వద్ద ఎదుర్కోలు ఉత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. సీతమ్మవారి తరఫున కొందరు, రామయ్య వారి తరఫున కొందరు అర్చకులు విడిపోయి ‘మా వంశం గొప్పదంటే మా వంశం గొప్పదంటూ’వేడుకను రక్తి కట్టించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి దంపతులు, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సీతారాముల కల్యాణానికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ము త్యాల తలంబ్రాలు సమర్పించడం తానీషా కాలం నుంచి వస్తున్న సం ప్రదాయం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ ముత్యాల తలం బ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించాల్సి ఉండగా.. వరుసగా ఆరోసారి ఆయన గైర్హాజరవుతున్నారు. దీంతో సర్కారు తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. -
తానా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం వేడుకలు
అట్లాంటా: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు 2022 ఫిబ్రవరి 21న వర్చువల్గా జరిగాయి. తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తెలుగు భాషా వైభవాన్ని వివరిస్తూ.. పర దేశంలో ఉంటూనే మాతృభాషను పరిరక్షించి పరివ్యాప్తం చేయడం లో తానా చేస్తున్న కృషిని అభినందించారు. తానా తీరు అభినందనీయం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మిజోరాం రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరి బాబు మాట్లాడుతూ మాతృదేశానికి ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఉంటూ కూడా నెల నెలా తెలుగు వెన్నెల పేరిట సాహిత్య సదస్సులు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇప్పుడు 32 వ సమావేశం జరుపుకుంటున్న తానా సంస్థకు అభినందనలు తెలియజేశారు. మిజోరాంలో తెలుగు ప్రతిభ గౌరవ అతిధిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్ పిల్లంగోల్ల శ్రీలక్ష్మి మాట్లాడుతూ అంగ్ల భాష ఎంతో అవసరం అయినప్పటికీ దాని మోజులో పడి మన మాతృభాష తెలుగును నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. మరో గౌరవ అతిధిగా పాల్గొన్న మిజోరాం కేంద్రీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు మాట్లాడుతూ మిజోరాం రాష్ట్రం చాలా ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడుకుని ఉన్న, అక్షరాస్యతలో అగ్రస్థానం లో ఉన్న రాష్ట్రమన్నారు. అక్కడ చాలా తక్కువమంది తెలుగు వారు ఉన్నప్పటికీ వివిధ రంగాల్లో మంచి ఖ్యాతి గడిస్తున్నారని తెలిపారు. ప్రముఖులు తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహించిన ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకల్లో వివిధ రాష్ట్రాలనుండి తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు. వీరిలో దాట్ల దేవదానం రాజు, పుదుచ్చేరి (యానాం), ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ (తమిళనాడు), యజ్ఞ నారాయణ (కేరళ), విజయభాస్కరరెడ్డి (మహారాష్ట్ర), తుర్లపాటి రాజేశ్వరి (ఒడిశా), లండ రుద్రమూర్తి (ఛత్తీస్ గడ్), రాపోలు బుచ్చిరాములు(గుజరాత్), వింజమూరి బాలమురళి (పశ్చిమ బెంగాల్), ఆచార్య యన్. లక్ష్మి అయ్యర్ (రాజస్తాన్), కమలాకర రాజేశ్వరి ( న్యూ ఢిల్లీ)లు ఉన్నారు. ఇది నేపథ్యం తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ప్రతి ఏటా ఫిబ్రవరి 2 1 వ తేదిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకోవడానికి కారణాలను వివరించారు... అప్పటి తూర్పు పాకిస్తాన్, ఇప్పటి బంగ్లాదేశ్ లో అత్యధికంగా బెంగాలీ భాష మాట్లాడే ప్రజలపై అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వం ఉర్దూ భాషను జాతీయ భాష గా బలవంతంగా రుద్దినప్పుడు అక్కడి బెంగాలీలు తీవ్ర నిరసన తెలియజేస్తూ సాగించిన మహోద్యమంలో ఫిబ్రవరి 21, 1952 లో ఎంతో మంది మరణించగా, కొన్ని వందలమంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఈ విషాదకర సంఘటనలను ఐక్యరాజ్యసమితి గుర్తించి 2000 సంవత్సరం నుండి ఏటాఫిబ్రవరి 21 ని అన్ని దేశాలు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది అని తెలిపారు. సంతాపం గుండెపోటుతో మృతిచెందిన ఆంధ్ర ప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నాగళ్ల గురుప్రసాద రావుల మృతికి తానా సంతాపం తెలిపింది. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర వారికి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. -
ఘంటసాల స్వర రాగ మహాయాగం
అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి సంవత్సర సందర్భంగా 366 రోజులపాటు ఘంటసాల స్వర రాగ మహాయాగం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, వంశీ ఇంటర్నేషనల్ మరియు శుభోదయం గ్రూప్స్ సంయుక్తంగా చేపడుతున్నాయి. 2021 డిసెంబరు 04 నుంచి 2022 డిసెంబరు 04 వరకు ప్రతీ శని, ఆదివారాలలో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు (భారత కాలమానం) వర్చువల్గా ఈ వేడుకలు జరుగుతాయి. ప్రారంభోత్సవ ప్రత్యేక కార్యక్రమం డిసెంబరు 4 సాయంత్రం 5:30 గంటలకు మొదలవుతుంది. -
కార్తీక సోమవారం పర్వదినాన భక్తుల సందడి
-
భక్తిశ్రద్ధలతో ఛట్ పూజలు
-
వెలుగుల పండుగ.. మురిసె మనసుల్ నిండుగ
-
మా ఊరికి డాక్టరమ్మ వచ్చిందోచ్..
సాక్షి,రఘునాథపాలెం( ఖమ్మం): ఇప్పటి వరకు ఆర్ఎంపీ వైద్యుడే దిక్కు... చిన్నాపెద్ద అనారోగ్యం ఏదైనా ఖమ్మం లేదంటే మంచుకొండ ప్రాథమిక వైద్యశాలకు వెళ్లాల్సిందే. అయితే, ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన పల్లె దవాఖానా ద్వారా గ్రామానికి వైద్యురాలిని కేటాయించడంతో రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గ్రామంలోని ఆరోగ్య సబ్సెంటర్లో మంగళవారం డాక్టర్ కె.హారిక బాధ్యతలు స్వీకరించగా ప్రజాప్రతినిధులతో పాటు ఊరంతా ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మెంటంరామారావు, ఎంపీటీసీ సభ్యురాలు మాలోత్ లక్ష్మి, మాజీ సర్పంచ్ తమ్మిన్ని నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ గ్రామంలోనే వైద్యురాలు ఉండనుండడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డుసభ్యులు, గ్రామ పెద్దలు సీతారామయ్య, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. చదవండి: హుజురాబాద్ ఫలితాలు: టీవీలో వీక్షిస్తూ మీసేవ కార్యాలయంలోనే -
ఆటా ఆధ్వర్యంలో న్యూజెర్సీలో ఘనంగా దసరా
న్యూజెర్సీ: అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూజెర్సీలో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాయల్గ్రాండ్ మ్యానర్లో జరిగిన ఈ వేడుకలకు న్యూజెర్సీ పరిసర ప్రాంతాలకు చెందిన వెయ్యికి మందికి పైగా తెలుగు వారు హాజరయ్యారు. దుర్గమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ వేడుకలను న్యూజెర్సీ కాన్సులేట్ జనరల్ విజయ్ కృష్ణన్, ప్రారంభించారు. ఈ సందర్భంగా అటా అధ్యక్షుడు భువనేశ్ బూజాల మాట్లాడుతూ వచ్చే ఏడాది జరగనున్న అటా మెగా సదస్సుకు రావాల్సిందిగా ప్రతీ ఒక్కరిని ఆహ్వానించారు. అటా తరఫున చేపడుతున్న కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ దసరా వేడుకల్లో వివిధ తెలుగు సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
న్యూజెర్సీలో ఘనంగా గణేశ్ నిమజ్జనోత్సవం
ఎడిసన్ (న్యూజెర్సీ): అమెరికాలో హిందు ఆధ్యాత్మిక వైభవాన్ని కొనసాగిస్తున్న సాయి దత్త పీఠం, న్యూజెర్సీ ఆధ్వర్యంలో గణేశ్ నవరాత్రులు ఘనంగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకారాలతో ఆ గణనాథుడిని తీర్చిదిద్దారు. తొమ్మిది రోజుల నిత్య పూజల అనంతరం అంగరంగ వైభవంగా నిమజ్జనోత్సవం జరిగింది. డప్పు వాయిద్యాల హోరులో భక్తుల ఆనందంతో చేసిన నృత్యాలతో ఎడిసన్ వీధులు కొత్త శోభను సంతరించుకున్నాయి. న్యూజెర్సీ సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగాయి. తొమ్మిది రోజుల పాటు భక్తులు భారీగా హాజరై ఆ గణనాథుడి పట్ల తమ భక్తిని చాటుకున్నారు. ఎడిసన్ నడిబొడ్డున ఉన్న శివ, విష్ణు ఆలయ ప్రాంగణంలో హేరంభ పంచముఖ గణపతి కొలువై ఉన్నాడు. చదవండి : షికాగోలో వినాయక చవితి వేడుకలు -
వర్జీనియాలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆగస్ట్ 15న అమెరికా వర్జీనియాలోని రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం ప్రతి నిధులు 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు . ఈ సందర్భంగా అధ్యక్షురాలు సుధారాణి కొండపు మాట్లాడుతూ.. ఇక్కడ పుట్టి పెరిగిన మన భావితరాలు ఆనందించేలా మన భారతీయతను ప్రతిబింబించే జెండా రంగులలోని కాషాయరంగు ,తెలుపు, ఆకుపచ్చ వర్ణాల అలంకరణతో పార్క్ ఏరియా కళకళలాడుతుందని అన్నారు. పిల్లలకు చాక్లెట్లను, బహుమతులను పంచుతూ తమ కార్యవర్గసభ్యులు అంతా కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలు,స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాట్స్ వ్యవస్థాపకులు రామ్మోహన్ కొండా, ట్రస్టీలు, గోపాల్ నున్న , వెంకట్ కొండపోలు కార్యవర్గసభ్యులు సతీష్ వడ్డి, దుర్గాప్రసాద్ గంగిశెట్టి , పార్ధ బైరెడ్డి ,హరీష్ కొండమడుగు , రామచంద్ర ఏరుబండి , రాజు గొడుగు, సతీష్ సుంకనపల్లి,రమణారెడ్డి, ఉదయ్ , సాయి, రంగా, కౌశిక్ , విష్ణు, వినీత్ , కృష్ణకిశోర్, సంధ్య, రాధిక, అవని, లావణ్య, సుప్రజ ,విజయ,హరిత తదితరులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. -
ఏపీ హైకోర్టులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సీజే అరూప్ గోస్వామి జాతీయ జెండా ఆవిష్కరించారు. శాసనసభలో జాతీయ జెండా ఆవిష్కరించిన స్పీకర్ తమ్మినేని శాసనసభలో స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలిలో ఛైర్మన్ బాలసుబ్రహ్మణ్యం జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఏపీ సచివాలయంలో స్పెషల్ సీఎస్ సతీష్చంద్ర జాతీయ జెండా ఎగురవేశారు. -
రేపు అనేది ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలి: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునే సమయం ఇదని.. రేపు అనేది ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం.. జాతీయ జెండా ఆవిష్కరించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ అధికారులకు సేవా పతకాలను సీఎం అందజేశారు. ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. హక్కులు అందరికీ సమానంగా అందాలన్నారు. పారదర్శక పాలన అందిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరిగేలా చూస్తున్నామని, 26 నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఇక్కడ చదవండి: జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్ వ్యవసాయ రంగంపై రూ.83 వేల కోట్లు.. వ్యవసాయ రంగంపై రూ.83 వేల కోట్ల వ్యయం చేశామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. రైతులకు పగటిపూటే నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతుభరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నామన్నారు. పెట్టుబడి సాయం కింద రైతులకు ఇప్పటివరకు రూ.17వేల కోట్లు ఇచ్చామని, 31 లక్షల మంది రైతులకు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అందించామని సీఎం పేర్కొన్నారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడంతో పాటు, ధాన్యం కొనుగోలు సేకరణ కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేశామని’’ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రతినెలా ఒకటో తేదీనే గడప వద్దకే పింఛన్ ‘‘గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లక్షా 30 వేల శాశ్వత ఉద్యోగాలిచ్చాం. ప్రతినెలా ఒకటో తేదీనే గడప వద్దకే పింఛన్ అందిస్తున్నాం. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ఆర్బీకేల ద్వారా సేవలు అందిస్తున్నాం. ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.1039 కోట్లు చెల్లించాం. ఏపీ అమూల్ పాలవెల్లువతో పాడి రైతులకు అండగా నిలిచామని’’ సీఎం అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులు.. "నాడు-నేడు" ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చాం. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను మారుస్తున్నాం. జగనన్న గోరుముద్ద ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. మా ప్రభుత్వం.. మహిళా పక్షపాత ప్రభుత్వం. అక్కాచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చామని’’ సీఎం అన్నారు. అమ్మఒడి ద్వారా రెండేళ్లలో రూ.13వేల కోట్లు.. ‘‘అమ్మఒడి ద్వారా రెండేళ్లలో రూ.13వేల కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ చేయూత ద్వారా రూ.9వేల కోట్లు ఇచ్చాం. డ్వాక్రా మహిళలకు ఇప్పటివరకు రూ.6,500 కోట్లు అందించాం. మహిళల భద్రతకు దిశా చట్టం, దిశా పోలీస్స్టేషన్లు, దిశా యాప్లు తీసుకొచ్చాం. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. 5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారిని ఆరోగ్యశ్రీకిందకు తీసుకొచ్చాం. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నాం. గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్ల నిర్మాణం జరుగుతోంది. కరోనాను ఆరోగ్యశ్రీలోకి తెచ్చి ఉచితంగా చికిత్స అందించాం. కొత్తగా 16 వైద్య బోధనా ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. అర్హత ఉన్న 61 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని’’ సీఎం వైఎస్ జగన్ అన్నారు. -
పంద్రాగస్టుకు ముస్తాబవుతున్న ఢిల్లీ
-
నేడు తల్లిదండ్రుల దినోత్సవం: ప్రత్యక్ష దైవాలు అమ్మానాన్న..
సాక్షి, సిరిసిల్ల (కరీంనగర్): క్షీరసాగర మథనంలో అమృతం లభించినప్పుడు దేవతలు పరస్పరం పంచుకున్నట్లు పురాణాలు చెప్తున్నాయి. కానీ అదే అమృతం దొరికితే కడుపున పుట్టిన బిడ్డల కోసం పంచిపెట్టగలిగిన అమృత మూర్తులు తల్లిదండ్రులు. కని పెంచడంతో పాటు బిడ్డల భవిష్యత్తు కోసం అహర్నిశలూ శ్రమించే నిత్య కార్మికులు అమ్మానాన్నలు. తమలా బిడ్డలు కష్టపడకూడదనే ఆకాంక్షతో కాలు కింద పెట్టకుండా అపురూపంగా చూసుకునే అమ్మానాన్నల ను అవసాన దశలో వృద్ధాశ్రమాలకు పరిమితం చేసే నవతరం సంతానం ఇప్పుడు కనిపించడం ప్రపంచీకరణ చేసిన దారుణం. పరిస్థితులు ఏవైనా తమ ఉనికికి రూపం ఇచ్చి, ఉన్నతికి ఉన్నదంతా ధారపోసే తల్లిదండ్రుల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనిది. ఉన్న కొన్నాళ్లూ కంట తడి పెట్టకుండా చూసుకోగలిగితే అదే పదివేలు అనుకునే కన్నవాళ్లకు కొదవ లేదీ లోకంలో.. నేడు తల్లిదండ్రుల దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా తల్లిదండ్రుల దినోత్సవం జరపాలన్న ప్రతిపాదన అమెరికాలో ప్రారంభమైంది. 1984లో అప్పటి దేశాధ్యక్షుడు బిల్ క్లింటన్ అధికారికంగా ఈ రోజుకు ఆమోద ముద్ర వేశారు. అమ్మానాన్నల్లో ఎవరూ తక్కువ కాదనే సందేశాన్ని విస్తరింపజేయడమే ఈ దినోత్సవం అసలు నేపథ్యం. మన అస్తిత్వానికి పునాది అమ్మానాన్నలే.. ఎవరి జీవితం ఉన్నత స్థితికి చేరినా, వారి వెనక నిరంతరం శ్రమించిన తల్లిదండ్రులే ఉంటారనేది సత్యం. మనందరం ఈనాడీ స్థితిలో ఉన్నామంటే నిన్నటి వరకు వాళ్లు మన కోసం పడిన కష్టానికి ఫలితమే. వాళ్ల సహకారం, ప్రేరణతోనే ఈ స్థితికి చేరుకున్నామని జీవితాంతం గుర్తుంచుకోవాలి. ఇపుడున్న యువతరం నిర్ణయించుకున్న లక్ష్యాన్ని ఛేదించాలి. తమ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో శ్రమించిన తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా పూజించాలి. వాళ్ల రుణం తీర్చుకునేందుకు బతికి ఉన్నంత వరకు ప్రయత్నించాలి. ఈ పేరెంట్స్ డే అందుకు ప్రేరణ కలిగించాలి. – రాహుల్ హెగ్డే, ఎస్పీ రాజన్న సిరిసిల్ల అమ్మానాన్నల కల నిజం చేయాలని.. చిన్న వయసులో జిల్లా స్థాయి అధికారిగా ఈ స్థితిలో ఉన్నానంటే కారణం కేవలం మా అమ్మానాన్నలు మాత్రమే. సింగరేణి కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించిన నాన్న చిన్న జీతంతో మమ్మల్ని సంతోషంగా పెంచారు. చదువు విషయంలో నన్ను, తమ్ముడిని, అమ్మను కూడా ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహం కారణంగానే మా అమ్మ పెళ్లయిన పదిహేనేళ్ల తర్వాత లెక్చరర్ ఉద్యోగం సాధించగలిగింది. మా అమ్మ నాకు మంచి స్నేహితురాలు. నా పెళ్లయ్యాక కూడా తల్లిదండ్రుల ప్రోత్సాహం, ప్రోద్బలం చాలా ఉంది. నన్నో కలెక్టర్గా చూడాలన్న అమ్మానాన్న కల నిజం చేసేందుకు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నా. ఎప్పటికైనా సాధించి చూపాలన్నది నా డ్రీమ్. – అలేఖ్య పటేల్, సీడీపీవో, రాజన్న సిరిసిల్ల కుమారుడిని కలెక్టర్ చేసిన ట్రాన్స్కో ఉద్యోగి కోరుట్ల: దురిశెట్టి మనోహర్ ఓ సాధారణ ట్రాన్స్కో ఉద్యోగి. భార్య జ్యోతి గృహిణి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామం. వీరికి ఇద్దరు కుమారులు అనుదీప్, అభినయ్. మనోహర్ ట్రాన్స్కో సబ్ ఇంజనీర్గా విధుల్లో ఎంత బిజీగా ఉన్నా కొడుకులను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దాలన్న తపన వీడలేదు. ఆయన తపనకు తోడు పిల్లలను భార్య ఆ దిశలో సంసిద్ధం చేసే పనిలో పాలుపంచుకుంది. తల్లిదండ్రుల తపనను అర్ధం చేసుకున్న పెద్ద కుమారుడు అనుదీప్ వారి కలలను సాకారం చేసే దిశలో ముందుకు సాగాడు. 2011లో బిట్స్ పిలానీ ఇంజనీరింగ్ పూర్తి చేసి సివిల్స్ ప్రిపరేషన్పై దృష్టి సారించాడు. 2013లో సివిల్స్ ర్యాంకు సాధించి ఐఆర్ఎస్కు ఎంపికయ్యాడు. 2017లో అఖిల భారత స్థాయిలో సివిల్స్ మొదటి ర్యాంకు సాధించి తల్లిదండ్రుల కలలు పండించాడు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రెండో కుమారుడు అభినయ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ సివిల్స్కు ప్రిపేరవుతున్నాడు. -
జాతి రత్నాలు సక్సెస్ సెలబ్రేషన్ ఫోటోలు
-
ప్రేమికులకు స్వాగతం..
-
ఆహా మొదటి వార్షికోత్సవ వేడుకలు
-
అమెరికాలో 'అయోధ్య' సంబరాలు
సాక్షి, న్యూయార్క్ : అయోధ్యలోని రామమందిరం నిర్మాణానికి చేపట్టిన భూమిపూజను పురస్కరించుకొని అమెరికాలోని హిందువులు సంబరాలు జరుపుకున్నారు. శంకుస్థాపనకు మద్దతుగా న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. జైశ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. 500 ఏళ్లనాటి హిందువుల పోరాటం సాకారం అయిందని, కోట్లాది హిందువుల కల నిజమయ్యిందని భావోద్వేగానికి లోనయ్యారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం చాలా గొప్ప నిర్ణయమని, ప్రతీ హిందువూ గర్వించదగ్గ విషయమని ఆనందం వ్యక్తం చేశారు. టైమ్స్ స్కెవ్లో భారతీయ హిందువుల సంబరాలపై సాక్షి టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ -
అంగరంగ వైభవంగా ప్రభల తీర్థం
అమలాపురం/ అంబాజీపేట(పి.గన్నవరం): కోనసీమలో ప్రభల తీర్థాలతో సంక్రాంతి, కనుమ పండుగల నాడు ఆధ్యాత్మిక పరవళ్లు తొక్కింది. చిన్న పెద్దా అనే తేడా లేకుండా సీమలో పలు ప్రాంతాల్లో ప్రభల తీర్థాలు నభూతో...అన్నట్టుగా సాగాయి. ముఖ్యంగా కనుమ పండగ నాడు పచ్చని సీమలో రంగురంగులు హద్దుకున్న ప్రభలు కొలువుదీరాయి. ఊరేగింపుగా వెళుతూ వీధులు.. చేలు.. తోటలను పుణీతం చేశాయి. ఈ గ్రామం తిరునాళ్లు చూసినా ఇసుక వేస్తే రాలని జనంతో కిటకిటలాడాయి. సముద్ర ఘోషను తలపించేలా వేలాది మంది భక్తుల ఓంకార నాదాలు..వందల మంది భక్తులు తమ భుజస్కాందాలపై ప్రభులను మోస్తూ ముందుకు సాగారు. బాణా సంచా కాల్పులు.. ప్రభలకు వేలాడదీసిన జేగంటల శబ్దాలతో కోనసీమ వ్యాప్తంగా ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లాయి. కోనసీమలో ఈ తీర్థాలు నాలుగు రోజులపాటు సాగుతాయి. కొత్తపేట తీర్థం బుధవారం జరగగా, గురువారం కనుమ పండుగ రోజున అంబాజీపేట మండలం జగ్గన్నతోట, వాకలగరువు, మామిడికుదురు మండలం కొర్లగుంటతోపాటు సుమారు 60కు పైగా తీర్థాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా కొత్త ప్రాంతాల్లో కూడా ప్రభల తీర్థలు జరిగాయి. తీర్థాలకు కొత్త ప్రభలు కూడా తరలివచ్చాయి. చారిత్రాత్మక ప్రధాన్యత ఉన్న అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట ప్రభల తీర్థం వేడుకలు ఆకాశమే హద్దుగా అన్నట్టుగా జరిగాయి. తీర్థానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. వివిధ రాష్ట్రాలకు చెందినవారు..ఎన్ఆర్ఐలు తీర్థానికి కుటుంబాలతో కలిసి వచ్చారు. సంప్రదాయ వస్త్రధారణలతో యువతులు ప్రభల అందాలతో పోటీ పడ్డారు. వృద్ధులు, యువకులు, మహిళలు అనే తేడా లేకుండా తీర్థానికి వచ్చి సందడి చేశారు. ప్రభల ఊరేగింపు సంప్రదాయ పద్ధతిలో సాగింది. రంగురంగు ప్రభలు ఒకచోట కొలువుదీరిన అందమైన దృశ్యాన్ని తిలకించి భక్తులు పులకరించిపోయారు. తీర్థానికి వ్యాఘ్రేశ్వరం నుంచి వచ్చిన వ్యాఘ్రేశ్వరరావు స్వామి ప్రభ వచ్చినప్పుడు మిగిలిన ప్రభలను గౌరవ సూచకంగా ఒకసారి పైకెత్తి లేపారు. గంగలకుర్రు అగ్రహారం శ్రీ ఉమా పార్వతి సమేత వీరేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నకేశవ మల్లేశ్వరస్వామి ప్రభలు అప్పర కౌశిక దాటుకుని వచ్చే దృశ్యాన్ని వేలాది మంది భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. తీర్థానికి పెద్దవి 11 ప్రభలు కాగా, వాటితోపాటు చిన్నచిన్న ప్రభలు మరో ఎనిమిది వరకు వచ్చాయి. ఉదయం 11 గంటలకు తీర్థానికి ప్రభల రాక ఆరంభమైంది. మధ్యాహ్నం 12.30 గంటలకు గంగలకుర్రు, 1.00 గంట సమయంలో గంగలకుర్రు అగ్రహారం ప్రభులు కౌశిక దాటి వచ్చాయి. కేరళ డప్పు వాయిద్యాలు, మేళ తాళాలు, బాణాసంచా కాల్పులతో గంగలకుర్రు ప్రభ ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. భక్తుల దర్శనానికి కొద్దిసేపు ఉంచి తరువాత వెనకకు తీసుకుని వెళ్లారు. ఎప్పటిలానే సంప్రదాయబద్ధంగా పలు కుటుంబాల వారు గూడు ఎడ్లబండ్లపై తీర్థానికి రావడం పలువురిని ఆకట్టుకుంది. ఆ ప్రభ ఎత్తు 54 అడుగులు: అంబాజీపేట మండలం వాకలగరువులో జరిగే ప్రభల తీర్థం మొత్తం కోనసీమలో జరిగే తీర్థాల్లో హైలెట్గా నిలిచింది. కోనసీమలో ఎక్కడా లేని విధంగా వాకలగరువుకు చెందిన శ్రీ ఉమా సర్వేశ్వరస్వామి ప్రభను భక్తులు 54 అడుగుల ఎత్తున తయారు చేశారు. గత ఏడాది 48 అడుగులు ఉన్న ప్రభను ఈసారి ఏకంగా ఆరు అడుగులు పెంచారు. అదే విధంగా తీర్థానికి వచ్చే తొండవరం ఉమా తొండేశ్వరస్వామి 48 అడుగులు ఎత్తున ఏర్పాటు చేశారు. గత ఏడాది ఇది 46 అడుగులు మాత్రమే. ఈ రెండు ప్రభలు వాకగరువు రావిచెట్టు సెంటరు వద్ద ఏర్పాటు చేయగా పెద్ద ఎత్తున భక్తులు తిలకించారు. ఇదే మండలం చిరతపూడి చిట్టి చెరువు గట్టు వద్ద కూడా ప్రభల తీర్థం జరిగింది. పి.గన్నవరం మండలం గాజులుగుంట, నాగుల్లంక, ఉడిమూడిలోను, వాడ్రేవుపల్లి, కొత్తపేటలో మందపల్లి, అవిడి డ్యామ్ సెంటరు, వాడపాలెం, రావులపాలెం మండలం దేవరపల్లిలో గురువారం ప్రభల తీర్థాలు జరిగాయి. మామిడికుదురు మండలం కొర్లగుంటలో జరిగిన తీర్థంలో 12 ప్రభలు కొలువుదీరాయి. ఇక్కడకు సైతం ప్రభలు పంటచేలు, కాలువులు దాటుకుని వచ్చాయి. అమలాపురం మండలం సాకుర్రు గరువు, బండారులంక, అమలాపురం పట్టణంలో గనికమ్మగుడి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, రాజోలు నియోజకవర్గ పరిధిలో మలికిపురం మండలం కేశనపల్లి, తూర్పుపాలెం, రాజోలు పొదలాడ, ముమ్మిడివరం మండలం పల్లిపాలెం, క్రాప చింతలపూడి, చెయ్యేరు, ఐ.పోలవరం శివారు పెదమడి, ఐ.పోలవరం మండలం గుత్తెనదీవిలల్లో ప్రభలు తీర్థాలు అంగరంగ వైభవంగా సాగాయి. -
కోనసీమలో అంగరంగ వైభవంగా ప్రభల తీర్థం
-
అమ్మమ్మ అశీర్వాదం
కడుపు పండటం.. తమలపాకుతో నోరు పండటం.. గోరింటాకుతో చేయి పండటం.. దైవధ్యానంతో బతుకు పండటం.. ఎన్ని పంటలు జీవితంలో! సంక్రాంతికి కూడా ధాన్యపు సిరులతో పాటుగా పండవలసినవి ఎన్నో ఉంటాయి. అవి పండకపోతే సంక్రాంతి లక్ష్మి కళ కాస్తయినా తగ్గుతుంది. కళ తగ్గితే ఆ లక్ష్మీదేవి ఎలా ఉంటుందన్న ఆలోచనకు అక్షరరూపమే ఈ సృజన రచన. ‘రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా ఈ కోవెల నీ ఇల్లు కొలువై ఉందువుగానీ’ అంటూ నన్ను ఎంత సాదరంగా ఆహ్వానించేవారో! ఇప్పుడెక్కడో గానీ ఆ స్వాగత గీతం వినిపించడం లేదు. స్వాగత తోరణం కనిపించట్లేదు’’ అని కలతపడింది సంక్రాంతి లక్ష్మి. ఆ మాటకు అమ్మమ్మ ఫక్కున నవ్వింది. సంక్రాంతి లక్ష్మి నిర్లిప్తంగా కూర్చుని ఉంది. ఆమె వదనంలో చిరునవ్వుల కాంతులు మినుకు మినుకుమంటున్నాయి తప్ప ప్రకాశించడం లేదు. ఊహ తెలిశాక ఎనభై సంక్రాంతులను చూసిన అమ్మమ్మ అక్కడికి వచ్చింది. వస్తూనే, ‘‘అమ్మా! సంక్రాంతి లక్ష్మీ.. నీ నిర్లిప్తతకు కారణం చెప్పు. మేం తీర్చగలిగేదైతే తీరుస్తాం. నువ్వు విషయం చెబితేనే కదా మాకు తెలిసేది’ అంటూ సంక్రాంతి లక్ష్మి చేతిలో చేయి వేసింది. అనునయించింది. ‘‘చెప్పు తల్లీ’’ అని మరొకసారి అడిగింది. సంక్రాంతి లక్ష్మి మౌనం వీడింది. ‘‘అమ్మమ్మా! కొన్నేళ్ల వరకు నేను కళకళలాడుతూ ఉండేదాన్ని. హరిదాసులు చిటితాళాలు మీటుతూ హరినామస్మరణ చేస్తుంటే, వీనుల విందుగా ఉండేది నాకు. వారి కావళ్లు ధాన్యాలతో నిండిపోతుంటే, నా మనసు కూడా పరవళ్లు తొక్కేది. గంగిరెద్దుల మేళాలు ఇంటింటికీ వచ్చి, డోలుసన్నాయి వాయిస్తూ, గంగిరెద్దును ఆడిస్తూ, ఆ ఎద్దును రకరకాల పాత చీరలతో అలంకరిస్తుంటే, వారి కళ్లలోని ఆనందాన్ని చూసి ఎంత సంబరపడేదాన్నో. ఇంటింటా ఆడపిల్లలు తెల్లవారుజామునే లేచి, వెన్నెల వన్నెతో పోటీ పడే ముగ్గుపిండితో రంగవల్లులు తీర్చుతుంటే, ఆకాశంలోని చుక్కలు నేల మీద చుక్కల్ని చూసి ఈర్ష్య పడుతుంటే, నాకు ఎంత ఆహ్లాదంగా అనిపించేదో. ధనుర్మాసం నెల్నాళ్లు గజగజ వణికే చలిలో దుప్పట్లు కూడా కప్పుకోకుండా, ఆవు పేడ కోసం బయలుదేరేవారు. గోవులను పెంచేవారి ఇళ్లన్నీ ఈ ఆడపిల్లల్తో కళకళలాడేవి. వారంతా వరుసలో నిలబడి, ఆవు పేడ తెచ్చుకుని, ఇంటికి వచ్చి, వాటిని గొబ్బెమ్మలుగా తయారుచేసి, పసుపు కుంకాలతో, పూలతో అలంకరించి, ఇంటి ముందున్న ముగ్గులో వాటిని ఉంచితే.. నేను కళకళలాడేదాన్ని. ఇప్పుడు ఆ కళకళలు పోయి వెలవెలలాడుతున్నాను. ఏ ఇంట్లోనూ చంటి పిల్లలకు భోగం చేసే భోగి పళ్లు కనిపించట్లేదు, భోగి మంటలు తగ్గిపోయాయి. బొమ్మల కొలువైతే లక్షమందిలో ఒకరు కూడా పెట్టట్లేదు. పిండి వంటలు మానేశారు. పొంగళ్లు, బొబ్బట్లు, అరిసెలు, గారెలు.. ఏవీ ... అసలు పండుగే జరుపుకోకపోతుంటే, ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తాయి నా పిచ్చితనం కాకపోతేను. ‘రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా ఈ కోవెల నీ ఇల్లు కొలువై ఉందువుగానీ’ అంటూ నన్ను ఎంత సాదరంగా ఆహ్వానించేవారో! ఇప్పుడెక్కడో గానీ ఆ స్వాగత గీతం వినిపించడం లేదు. స్వాగత తోరణం కనిపించట్లేదు. మరి నేను బాధ పడకుండా ఉండగలనా అమ్మమ్మా!’’ అంటూ అమ్మమ్మ చేతి కొంగుతో ముఖాన్ని దాచుకుంది సంక్రాంతి లక్ష్మి. అమ్మమ్మ ఫక్కున నవ్వింది. అయ్య.. వెర్రిపిల్లా! ఇందుకా నువ్వు బాధ పడుతున్నది. మరి నేను ఇంకెంత బాధపడాలి. నీ కంటె ఎక్కువ కష్టాలు చూశాను నా జీవితంలో. ముప్పై ఏళ్ల క్రితం వరకు పండుగ సెలవులకు నా మనవలంతా ఇంటికి వచ్చేవారు. వాళ్లకి ఎన్ని పిండివంటలు చేసిపెట్టేదాన్నో. ఒకరికి తెలియకుండా ఒకరు వచ్చి, రహస్యంగా అడిగి తినేవారు. నేను ఇన్నేళ్లు ఇంత ఆయుర్దాయంతో ఉండటానికి కారణం ఆ జ్ఞాపకాలే. నా మనవలు, మునిమనవలు నా దగ్గరకు రావటం మానేసి పాతికేళ్లయ్యింది. ఇప్పుడు మళ్లీ రెండు మూడు సంవత్సరాలుగా వస్తున్నారు. అంటే నీకు అర్థమైందా! ఆనందమైనా, బాధ అయినా ఎక్కువకాలం ఉండదు. కష్టసుఖాలు, వెలుగునీడలు, తెలుపునలుపుల్లాగా.. పండుగలు కూడా కొన్నాళ్లు ఆనందంగాను, కొన్నాళ్లు ఏమీ లేకుండాను, మళ్లీ ఆనందంగాను గడుస్తాయి. నీ శోభ చిరకాలం చిరస్థాయిగానే ఉంటుంది. నువ్వు దిగులు పడకు. నువ్వు మళ్లీ తెలుగు లోగిళ్లలో సంబరాలు చూస్తావు. సంతోషంగా న వ్వుతూ ఉండు. తథాస్తు! చిరంజీవ! స్వస్తి!’’ అంటూ అమ్మమ్మ సంక్రాంతి లక్ష్మిని ఆశీర్వదించింది. – వైజయంతి పురాణపండ -
సంక్రాంతి సంబరాల్లో ఉప రాష్ట్రపతి..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని శిల్పారామం సంక్రాంతి శోభను సంతరించుకుంది. గురువారం శిల్పారామంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ.. తాను సాధారణ స్థాయి నుంచి ఉప రాష్ట్రపతి స్థాయి వరకు వెళ్లానని.. నాకు వేరే ఆశలు లేవన్నారు. ఈ సంక్రాంతి ప్రజలందరికి క్రాంతి ప్రసాదించాలన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని..కట్టు,బొట్టు మరిచిపోకూడదని పిలుపునిచ్చారు. సంపాదించిన దాంట్లో కొంత ఇతరులకు సాయం చేయాలన్నారు. తెలుగు భాష అమ్మఒడి లాంటిదని అందరూ కాపాడుకోవాలన్నారు. శిల్పారామంలో గ్రామీణ వాతావరణం ప్రతిబింబించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సంక్రాంతి సంబరాల్లో నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, హీరో వెంకటేష్, ముప్పవరపు కుటుంబ సభ్యులు, సుజనా చౌదరి, పరిటాల శ్రీరామ్, అశ్వినీదత్, ఎమ్మెల్సీ రామచంద్రారావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ గవర్నర్ తమిళి సై, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. నిజ జీవితంలోనూ ఆయన రోల్మోడల్.. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా సంక్రాంతి పండగ జరుపుకోవడం గొప్పగా ఉందని గవర్నర్ తమిళసై అన్నారు. రాజకీయాల్లోనే కాదని..నిజ జీవితంలోనూ వెంకయ్యనాయుడు రోల్మోడల్ అని కొనియాడారు. ఎంతో మంది పేదలకు సేవలందిస్తున్న స్వర్ణభారతి ట్రస్ట్ను అభినందించారు. నిరుద్యోగులకు చేదోడువాదోడుగా నిలిచారు.. ఢిల్లీకి రాజైన తల్లికి మాత్రం కొడుకే అనే విధంగా సొంతగడ్డకు వెంకయ్యనాయుడు సేవలు అందిస్తున్నారని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. నిరుద్యోగ యువతకు వెంకయ్యనాయుడు చేదోడు వాదోడుగా నిలిచారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి మెలిసి అన్నదమ్ముల్లా ఉంటున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలకు జాతీయ ప్రాజెక్టులను తెచ్చి రైతాంగానికి నీరివ్వాలని కోరారు. ఎంతో మందికి ఆయన స్ఫూర్తి.. పేదలకు ఏదో ఒకటి చేయాలనే కోరుకునే వ్యక్తి వెంకయ్యనాయుడు అని, తన లాంటి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ముప్పువరపు ఫౌండేషన్,స్వర్ణ భారతి ట్రస్ట్తో వేలాది మందికి ఉపాధి కల్పించారని తెలిపారు. సంక్రాంతికి నా సినిమా విడుదల కావడం సంతోషంగా ఉంది.. సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు పండగ సంక్రాంతి అని..ఇదే పండగకు తన సినిమా విడుదల కావడం సంతోషంగా ఉందని హీరో మహేష్ బాబు అన్నారు. -
ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
-
విశాఖ ఉత్సవ్ వైభవోపేతం
-
క్రిస్మస్ సందడి
-
శారద పీఠంలో ముగింపు దశకు చేరుకున్న శరన్నవరాత్రి ఉత్సవాలు
-
సీఎం జగన్ కీలక నిర్ణయం.. పాలాభిషేకాలు, హర్షాతిరేకాలు
సాక్షి, అమరావతి : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న సంచనలన నిర్ణయం పట్ల ఆ సంస్థ కార్మికులు, ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కల సాకారమయిదంటూ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ, స్వీట్లు పంచుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు అంగీకరించిన సీఎం జగన్కు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పేర్ని నానితో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఆర్టీసీని ప్రభుత్వంలో చేసినందుకుగాను మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో ఈయూ నాయకులు వలిశెట్టి దామోదరరావు(వైవీ రావు), ఎన్ఎమ్యూ నాయకులు వై శ్రీనివాసరావు, ఏ విష్ణు రెడ్డి, ఏ సుధాకర్, వెంకటరమణ తదితరులు ఉన్నారు. విజయవాడలో ఈయూ నేతల సంబరాలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల్లో సంబరాలు చేశారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పుష్పార్చన చేసి, స్వీట్లు పంచుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఇచ్చిన మాటలను నిలబెట్టుకునేందుకు సంతోషంగా ఉందన్నారు. ఆర్టీసీ విలీన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విలీనంతో పాటు ఆర్టీసీలోని ఇతర సమస్యలు, తమకు దక్కాల్సిన బెనిఫిట్స్పై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కోరారు. సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం ఆర్టీసీ కార్మీకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మచిలీపట్నం ఈయూ సంఘ నేతలు అనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను తెలిపారు. తిరువూరులో ఆర్టీసీ కార్మికుల సంబరాలు సీఎం వైఎస్ తీసుకున్న సంచలన నిర్ణయం పట్ల కృష్ణా జిల్లా తిరువూరు ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాల తమ కల నెరవేరిందంటూ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలు సంబరాలు చేసుకున్నారు. విలీనాన్ని హర్షిస్తూ సీఎం జగన్, రవాణా మంత్రి పేర్నినాని, ఎమ్మెల్యే కే.రక్షణనిది చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. తిరుపతిలో.. ఆర్టీసీ ఉదోగుల్లో సంబరాలు అంబరాన్ని తాకాయి. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న సంచలన నిర్ణయం పట్ల తిరుపతిలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కేకులు కట్ చేసి సంతోషంగా ఒకరికి ఒకరు తినిపించుకొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువనేత భూమన అభినయ రెడ్డి కూడా పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ కు తాము జీవితాంతం రుణపడి ఉంటామని ఆర్టీసీ కార్మికులు అన్నారు. నెల్లూరులో.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటంపై ఎంఎంయూ నేత రమణ రాజు ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్ర పటానికి పూలాభిషేకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ మాట ఇస్తే నిలబెట్టుకొంటారనే దానికి ఇదే ఉదాహరణ అన్నారు. సీఎం జగన్కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. చిత్తూరులో.. ఆర్టీసి విలీనాన్ని హర్షిస్తూ మదనపల్లిలో ఎమ్మెలే నవాబ్ బాషా సమక్షంలో ఆర్టీసీ కార్మికులు బారీ కేక్ను కట్ చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. తమ దశాబ్దాల కలను నెరవేర్చినందుకు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖలో.. ఆర్టీసీ ను ప్రభుత్వం లో విలీనం చేస్తూ కాబినెట్ ఆమోదముద్ర వేయడంతో మద్దిలపాలెం ఆర్టీసీ డిపోలో ఎన్ఎంయూ ఆధ్వర్యంలో కార్మికులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చిత్ర పటానికి పుష్పాభిషేకం నిర్వహించారు. అనంతరం బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. గుంటూరులో.. విలీనాన్ని హర్షిస్తూ మాచర్ల ఆర్టీసీ కార్మికులు సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, వివిధ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. విజయనగరంలో.. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనాన్ని హర్షిస్తూ ఆర్టీసీ కార్మికులు జిల్లా వ్యాప్తంగా సంబరాలు నిర్వహించారు. మజ్దూర్ యూనియన్ నాయకులు ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. -
మహనీయుడు..ఖాదర్ లింగ స్వామి
సాక్షి, కౌతాళం(కర్నూలు) : మానవుడు ఆరాధిస్తున్న భగవంతుడు ఏ ఒక్క మతానికి చెందినట్లు కాదని, మతం అనేది మనిషి మనిషికి మధ్యనే కాని మనసుకు కాదని నిరూపించిన మహనీయుడు శ్రీజగద్గురు ఖాదర్లింగ స్వామి. చరాచర జీవకోటి రాశులకే మూల సూత్రమైన పరమేశ్వరుడినే మెప్పించి భక్తుల్లో మతసామరస్యాన్ని చాటారు. మండల కేంద్రమైన కౌతాళంలో వెలిసిన దర్గాకు ఎంతో విశిష్టత ఉంది. కులమతాలకు అతీతంగా దర్గాను సందర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఏటా ఖాదర్ లింగ స్వామి 315 ఉరుసును వైభవంగా నిర్వహిస్తారు. 14వ తేదీ (నేడు) స్వామి సమాధికి సుగంధ పానీయాలతో శుభ్రం చేస్తారు. 15న గంధం కార్యక్రమం, 16న ఉరుసు ఉత్సవం, 17న బుధవారం సఫ్రా (ప్రసాదం పంపిణీ), 18న జియారత్ వేడుక ఉంటుందని ధర్గా దర్మకర్త సయ్యద్ సాహెబ్పీర్ వుసేని చిష్తీ తెలిపారు. ఈ స్వామిని శ్రీజగద్గురు మహపురుష సయ్యద్–షా– ఖాదర్లింగస్వామి గా ఈ ప్రాంత వాసులతో నిత్యం కొనియాడబడుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఖాదర్ లింగ, లింగ్బంద్, జగద్గురు ఖాదర్లింగస్వామి, ఖాదర్వలిగా పేరుగాంచారు. స్వామి చరిత్ర: పూర్వం కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ పట్టణంలో కొలవైన అమినూద్దీన్ అలిఆలా షేర్ఏఖుదా వారికి హజరత్ ఖ్వాజా సయ్యద్షా అబ్దుల్ ఖాదరి వుసేని చిష్తీ 12 ఏళ్లు శిష్యరికం చేశారు. గురువు ఆజ్ఞానుసారం మానవుల్లో తమ మౌఢ్యాన్ని తొలగించి మతసామరస్యాన్ని చాటేందుకు కర్ణాటక సరిహద్దులో ఉన్న కౌతాళానికి చేరుకున్నారు. అప్పట్లో ఆయన మెడలో లింగమూర్తిని ధరించడాన్ని ఈ ప్రాంతంలో ఉన్న శైవ మతస్థులు కొందరు అభ్యంతరం చెప్పారు. భగవంతుడు ఎవరి సొంతం కాదని పరమేశ్వరుని ప్రతీక అయిన లింగంపై ఎవరికీ హక్కు లేదని వారితో వాదించారు. శైవ మతస్తులను సమావేశ పరిచి వారి మెడలో ఉన్న లింగాలను బావిలో వేసి వాటిని మరలా రప్పించి ధరిస్తానని, తాను అలా చేయని పక్షంలో గ్రామం వదలి వెళ్తానని చెప్పారు. ఈ ప్రయత్నంలో ఆయన శివున్ని మెప్పించి లింగాలను బావి నుంచి రప్పించారు. అప్పటి నుంచి గ్రామస్తులంతా ఆయనను ఖాదర్లింగ స్వామిగా పూజించడం ప్రారంభించారు. ఆయనకు ముగ్గురు భార్యలు, ఐదుగురు కుమారులు. 315 సంవత్సరాల క్రితం గ్రామంలోనే సమాధి అయ్యారు. ఆయన వంశస్థులు అయిన ప్రస్తుత ధర్మకర్త సయ్యద్ సాహెబ్పీర్ వుసేని చిష్తీ ట్రస్టీగా ఉన్నారు. -
ఆచంటలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు
-
వైఎస్సార్సీపీ సంబరాలు
-
నేడు పట్టాభిషేకం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారికి సోమవారం పట్టాభిషేకం చేయనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా కల్యాణం నిర్వహించిన మిథిలా స్టేడియం వేదికపైనే పట్టాభిషేకం కార్యక్రమాన్ని జరిపిస్తారు. సోమవారం ఉదయం మేళతాళాల నడుమ స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకిలో మిథిలా స్టేడియంలో ఆశీనులను చేస్తారు. అనంతరం విశ్వక్సేన ఆరాధనతో పట్టాభిషేకం మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. ఇందుకు వినియోగించే పూజా ద్రవ్యాలకు పుణ్యాహవచనం చేస్తారు. తర్వాత పవిత్ర నదీ జలా లతో స్వామివారికి అభిషేకం జరిపి అష్టోత్తర, సహస్రనామార్చన, సువర్ణ పుష్పార్చన గావిస్తారు. కల్యా ణంలో లాగే అభిజిత్ ముహూర్తంలో సరిగ్గా మధ్యా హ్నం 12గంటలకు రజిత సింహాసనంపై శ్రీ సీతారామచంద్రస్వామివారిని పట్టాభిషిక్తుడ్ని చేస్తారు. ఒక్కో ఆభరణం ధరింçపజేస్తూ... రాముడికి పట్టాభిషేకం నిర్వహించే సమయంలో రామదాసు చేయించిన ఆభరణాలను ధరింపజేయడం ఆనవాయితీ. స్వర్ణఛత్ర, స్వర్ణపాదుక, రాజ దండ, రాజపట్ట, రాజముద్ర, సామ్రాట్ కిరీటం.. ఇలా ఒక్కో ఆభరణాన్ని భక్తులకు చూపిస్తూ, వాటి విశిష్టతను తెలుపుతూ స్వామివారికి అలంకరిస్తా రు. త్రేతాయుగంలో శ్రీరాముని పట్టాభిషేకం జరిగిన ముహూర్తంలోనే భద్రాచలంలో కూడా పట్టాభిషేకం నిర్వహించడం రామదాసు కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. 60 ఏళ్లకు మహా సామ్రాజ్య పట్టాభిషేకం, 12 ఏళ్లకు ఒకసారి పుష్కర ప్రయుక్త సామ్రాజ్య పట్టాభిషేకం, ప్రతి యేటా కల్యాణం మరుసటి రోజున పట్టాభిషేకం నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో పట్టాభిషేక స్వర్గను పారాయణం చేస్తారు. వేడుక అనంతరం రామయ్యను అంతరాలయంలో వేంచేయింపజేస్తారు. హాజరుకానున్న గవర్నర్ ... శ్రీ సీతారామచంద్రస్వామి వారికి సోమవారం నిర్వహించే పట్టాబిషేక మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు. ఈ వేడుకను విజయవంతం చేసేందుకు ఆలయ అధికారులు, జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
విశాఖ వైఎస్ఆర్సీపీ ఆఫీసులో మహిళా దినోత్సవ వేడుకలు
-
తెలుగు రాష్ట్రాల్లో ‘యాత్ర’ సినిమా సందడి
-
కుచ్చు కుచ్చు హోతా హై!
కుచ్చులమ్మ కుచ్చులు మా ఊరు వచ్చాయి కుచ్చులు పెళ్ళి వారందరికీ నచ్చునండీ నచ్చును.వచ్చునండి వచ్చును అమ్మాయిలందరికీ కళ వచ్చును.నీజమే మరి, ఇది కుచ్చుల సీజన్కుచ్చు కుచ్చు హోతాహై! పెళ్ళి అంటేనే అందమంతా ఒక చోట రాసులుగా పోసిన కళతో ఉట్టిపడుతుంటుంది. అలాంటి చోట అమ్మాయిలంతా బుట్ట బొమ్మల్లా, యువరాణుల్లా మెరిసిపోతూ ఉంటారు. ‘ఎప్పుడూ వేసినట్టే పట్టు లంగా ఓణీ, చీరకట్టు అంతేనా, ఇంకేమీ స్పెషల్ లేదా..’ అనుకునే అమ్మాయిలు ఈ కొత్త రఫెల్ స్టైల్తో మెరిసిపోవచ్చు. లెహంగా, చోళీ కాన్సెప్ట్ పాతదే అయినా దీనికే కుచ్చులున్న దుపట్టాను జత చేసి చూడండి. మేని కళలో వచ్చిన తేడా మీకే తెలిసిపోతుంది. ►డిజైనర్ ష్రగ్ స్టైల్ చోలీ లెహెంగాకు జతగా కుచ్చుల నెటెడ్ దుపట్టా తోడైతే వేదిక ఏదైనా గ్రాండ్గా వెలిగిపోవచ్చు. ►షిమ్మర్ చోలీ, లెహెంగా డ్రెస్ ఏ వేడుకనైనా కాంతిమంతం చేస్తుంది. దానికి నెటెడ్ కుచ్చుల దుపట్టా జత చేర్చితే వేడుక కళ వెయ్యింతలు అవుతుంది. ►ప్లెయిన్ కలర్ లెహంగాని మరింత అందంగా చూపించేలా రఫెల్ దుపట్టా తోడైతే వేడుకలో బటర్ఫ్లైలా వెలిగిపోవచ్చు. ►రాసిల్క్ లెహంగాకి షిమ్మర్, పువ్వుల చోలీ ఆకర్షణ పెంచితే నెటెడ్ కుచ్చుల దుపట్టా రాణీ కళకు ఆహ్వానంపలుకుతుంది. ►రాసిల్క్ లెహంగాకి షిమ్మర్, పువ్వుల చోలీ ఆకర్షణ పెంచితే నెటెడ్ కుచ్చుల దుపట్టా రాణీ కళకు ఆహ్వానంపలుకుతుంది. ►దండలా కుచ్చిన దుపట్టా, దానికి జత చేసిన లేస్, కుచ్చుల లెహెంగా డ్రెస్ను మరింత ఆకర్షణీయంగా మార్చింది. ►లెహెంగా చోలీ దుపట్టా.. ఒకే రంగులో ఉన్నా కుచ్చులు జత చేరితే వచ్చే కళే వేరు. పెళ్లింట అది రెట్టింపు వెలుగై వేడుకలో కనువిందు చేస్తుంది. -
నూతన ఉత్సాహం
-
హ్యాపీ..హ్యాపీగా న్యూ ఇయర్ వేడుకలు
-
క్రిస్మస్ సందడి
-
లడ్డూలతో సెలబ్రేట్ చేసుకున్నారు..
సాక్షి, న్యూఢిల్లీ : విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన అనంతరం జరిగిన తొలి పార్టీ నేతల భేటీలో ప్రధాని నరేంద్ర మోదీని సహచర సభ్యులు అభినందనలతో ముంచెత్తారు. బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రధానికి లడ్డూలు తినిపించగా, ఇతర నేతలు పూల దండలతో సత్కరించారు. ప్రతిపక్షాలు చేపట్టిన అవిశ్వాసం పసలేనిదని, వారు ఎలాంటి సన్నద్ధం లేకుండా అవిశ్వాసంతో సభ ముందుకొచ్చారని పార్టీ ఎంపీలతో మాట్లాడుతూ ప్రధాని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వేదికపై ప్రధాని మోదీతో పాటు పార్టీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, రాజ్నాథ్ సింగ్, అనంత్ కుమార్, నితిన్ గడ్కరీ, సీనియర్ నేత ఎల్కే అద్వానీ వంటి అగ్రనేతలు ఆశీనులయ్యారు. గత సమావేశాలకు భిన్నంగా ఎన్నికల వేళ ఐక్యతను చాటేలా దిగ్గజ నేతలంతా వేదికపై ఉండేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.మరోవైపు ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చే యత్నాలపై ప్రధాని నరేంద్ర మోదీకి ఇటీవల లేఖ రాసిన యూపీకి చెందిన దళిత ఎంపీ అశోక్ దోహ్రే ప్రధాని మోదీకి పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించబోగా ఆయన వారించారు. -
బెల్గాంలో బీజేపీ సంబరాలు
జైనథ్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పంటల మద్దతు ధర పెంపుదల చేయడంతో బీజేపీ నాయకులు సంబ రాలు జరుపుకున్నారు. మండలంలోని బెల్గాం గ్రామంలో బీజేపీ జెండా ఆవిష్కరించి, టపా సులు కాల్చారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకొని, తమ సంతోషాన్ని పంచుకున్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు కట్కం రాందాస్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పంటల మద్దతు ధర పెంచడంతో రైతులకు ఎంతో లాభం చేకూరనుందన్నారు. పత్తికి క్వింటాల్కు ఏకంగా రూ.1100లు పెంచడం రైతుల పాలిటవరంగా మారిందన్నారు. రైతు పక్షపాతి అయిన ప్రధాని నరేంద్ర మోడీని 2019లో మరోమారు ప్రధాని చేయాలని ఆయన కోరారు. ఇలాంటి ప్రధాని ఉం టే రానున్న రోజుల్లో రైతులకోసం మరిన్ని పథకా లు వస్తాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పొచ్చిరాం, సురేశ్రెడ్డి, పోశాలు, ప్రమోద్, కిషన్, భగవాండ్లు పాల్గొన్నారు. -
ఘనంగా తెలంగాణ అవతరణ సంబరాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావుతోపాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు. ఉదయం 10గంటలకు తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు గన్పార్క్లో సీఎం కేసీఆర్ నివాళులర్పించనున్నారు. 10:30గంటలకు పరేడ్ గ్రౌండ్లో జాతీయజెండాను ఆవిష్కరించనున్నారు. తర్వాత 11గంటల సమయంలో ఆయన ప్రసంగం ఉంటుంది. జిల్లాల్లో జరగనున్న వేడుకలకు మంత్రులతో పాటు ప్రముఖులు హాజరుకానున్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆత్మగౌరవం కోసం తెలంగాణ సాధించుకున్నాం హక్కులు, ఆత్మగౌరవం కోసమే తెలంగాణ సాధించుకున్నామని స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. బంగారు తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారాయన. శనివారం అసెంబ్లీలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను పురష్కరించుకుని ఛైర్మన్ స్వామిగౌడ్ శాసనమండలిలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. వికారాబాద్ : వికారాబాద్ పోలీసు గ్రౌండ్లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారాయన. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఊమర్ జలీల్, ఎంఎల్ఏ సంజీవరావు, యాదయ్య, ఎంఎల్సీ పట్నం నరేందర్ రెడ్డి, ఎస్పీ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ : జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడకలకు రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన ఆయన ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. నల్గొండ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో అమరవీరుల స్థూపానికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు, జెడ్పి చైర్మన్ బాలు నాయక్, జిల్లా అధికారులు నివాళులు అర్పించారు. ఖమ్మం : జిల్లాలో జరిగిన తెలంగాణ అవతరణ వేడుకలలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారాయన. ఈ కార్యక్రమంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఎమ్మెల్యే అజయ్ కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , జడ్పీ చైర్ పర్సన్ గడిపల్లి కవిత తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. మహబూబ్ నగర్ జిల్లా : జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మక్తల్ ఎంపీడీఓ, ఎంఆర్ఓ, మార్కెట్ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. లోటస్ పాండ్లో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు హైదరాబాద్ : వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్లో తెలంగాణ అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయజెండాను ఆవిష్కరించారాయన. -
దేశాయిపేట్లో దళితులకు సాంఘిక బహిష్కరణ
బాన్సువాడ టౌ న్(బాన్సువాడ) : మండలంలోని దే శాయిపేట్లో 14 దళిత కుటుంబా లను గ్రామ పెద్ద లు సాంఘిక బహి ష్కరణ చేశారు. వివరాలిలా ఉన్నా యి. గ్రామంలో దళితులు గత 60 ఏళ్లుగా శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వేడుకల సమయంలో ఉచితంగా డప్పు కొట్టేవారు. ఈసారి తమకు డబ్బులు చెల్లిస్తేనే డప్పులు కొడతామని వాదించారు. దీంతో గ్రామ పెద్దలు సమావేశమై ఈ విషయంపై చర్చించారు. ఇన్నేళ్లుగా ఉచితంగా డప్పులు కొట్టి ఈసారి డబ్బులు డిమాండ్ చేయడం ఏంటని, డబ్బులు చెల్లించే ప్రసక్తే లేదని గ్రామ పెద్దలు తీర్మానం చేశారు. శ్రీరామనవమి రోజు నుంచి 14 దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసి, వారిని ఎవరైనా పనిలో పెట్టుకుంటే రూ.2500 జరిమానా చెల్లించాలని హుకూం జారీ చేశారు. దీనికి తోడు జీపీలో పనిచేసే ఇద్దరు దళిత కార్మికులను విధులకు రావద్దని సూచించారు. పాఠశాలలో అటెండర్గా విధులు నిర్వహించే మరో దళితుడిని విధుల నుంచి తొలగించారు. గత 15 రోజులుగా తమను సాంఘిక బహిష్కరణ చేసినట్లు బాధితులు పేర్కొంటున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులకు కూడా రానివ్వడం లేదని వాపోయారు. గ్రామంలో పని దొరకక ఇబ్బందులు పడుతున్నామని వారు అంటున్నారు. ఈ విషయంపై బాన్సువాడ పట్టణ సీఐ శ్రీనివాస్రెడ్డి వివరణ కోరేందుకు ప్రయత్నించగా, ఆయన ఫోన్ స్వీచ్ ఆఫ్ వచ్చింది. -
విద్యార్థినులు మార్షల్ ఆర్ట్స్
-
చీరకట్టు బంగారంగానూ..
-
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి
-
మరపురాని జ్ఞాపకం
రామాపురం జమీందారు రెడ్డెన్నగారిది పెద్ద మండువా లోగిలి ఇల్లు . ఇంటి చుట్టూ ఫలసాయానికి వచ్చే చెట్లు, ఇంటి ముందు చక్కని పూలతోట, ఖాళీ స్థలాల్లో పచ్చగడ్డి మొలిచి కన్నుల పండుగగా ఉండేది. ఆ ఇంట్లో తెల్లగా, బొద్దుగా ఉన్న ఓ కుక్కపిల్ల కూడా ఉండేది. ఆ కుక్కపిల్ల ముఖాన బొట్టు పెట్టినట్లు .. నుదుటి మీద నల్లని మచ్చ. అదే దానికి అందం. ఆ ఇంట్లో దానిది ఆడింది ఆట.. పాడింది పాట. రెడ్డెన్నగారు దాన్ని తన స్నేహితుని ఇంటి నుంచి పాలుతాగే వయసులో ఉన్నప్పుడే తెచ్చుకున్నారు. దానికిప్పుడు అయిదేళ్లు. జిమ్మి అని పేరుపెట్టి ఎంతో ప్రేమగా పెంచుకునేవారు. జిమ్మి తన యజమాని పట్ల, ఆ కుటుంబసభ్యుల పట్ల ఎంతో విశ్వాసంతో ఉండేది.లంకంత ఇంట్లో తిరుగుతూ అల్లారుముద్దుగా పెరుతున్న జిమ్మి మనసులో ఓ సామాన్యమైన కోరిక ఎప్పుడూ మెదులుతూ ఉండేది. తోటలో నిలబడి ఇంటికి రక్షణగా ఉన్న గేటు నుంచి బయటకి చూస్తే.. వీధిలో కుక్కలు కనిపించేవి. వాటికి తిండి సరిగ్గా దొరక్క బక్కచిక్కినట్లు ఉన్నా, స్వేచ్ఛగా తిరుగుతూ, తోటి స్నేహితులలో కలసి ఆటలాడుకోవడం, పోట్లాడుకోవడం చాలా సరదాగా అనిపించేది. ఇక్కడ తనకు ఏ లోటూ లేకపోయినా ఒంటరిది. ఎçప్పుడైనా గేటుకి దగ్గరగా వెళ్లి, తోటి స్నేహితులను పలకరించాలనుకున్నా ఇంట్లోంచి ఎవరో ఒకళ్లు చూసి పిలిచేవాళ్లు. ఆ పిలుపులకి తోటమాలి రంగయ్య పరిగెత్తుకుంటూ వచ్చి గొలుసుతో పెరట్లో ఉన్న చెట్టుకి కట్టేసేవాడు. అందుకే వేరే కుక్కలతో కలసి ఆడుకునే సరదా దానికి తీరలేదు.ఓ రోజు జమీందారు గారింట్లో ఆ ఇంటి చిన్నపాప పుట్టినరోజు వేడుక. అతిథులు వస్తూ ఉండడంతో గేటు తెరిచే ఉంచారు. అతి«థి సత్కారాల్లో మునిగిపోయి, జిమ్మి సంగతి మరచిపోయారు ఇంట్లోవాళ్లు.వచ్చిన జనాలను తప్పించుకొని తిరుగుతున్న జిమ్మికి, ఇంటి బయట ఉన్న ఇసుకగుట్ట మీద కొన్ని కుక్కలు ఆడుకోవడం కనిపించింది. గేటు తీసివుండడంతో సంతోషంగా వాటి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. అవి రోజూ చూస్తున్న కుక్కే కాబట్టి జిమ్మిని తమ జట్టులో కలుపుకున్నాయి. అలా ఆడుతూ ఆడుతూ ముందుకు పరుగులు తీశాయి. కాస్త దూరం వెళ్లేసరికి పక్కవీధిలో పెద్దకుక్కలు.. జిమ్మిని చూసి కొత్త కుక్క ఎక్కడి నుంచో వచ్చిందని వెంటబడి తరమ సాగాయి. దాంతో జిమ్మి భయపడిపోయి కనిపించిన దిక్కుకి పిక్క బలం కొద్దీ దౌడు తీసింది. అలా ఎంత దూరం పరుగు తీసిందో.. ఎక్కడికి వచ్చిందో తెలీదు. పరిగెత్తి, పరిగెత్తి బాగా అలసిపోయి నీరసపడిపోయింది. అప్పటికి చీకటి పడిపోయింది. భయమేసి ఇల్లు గుర్తొచ్చింది. ఇంటికి ఎంత దూరంలో ఉందో తెలుసుకోలేకపోయింది. ఆ రాత్రంతా బిక్కుబిక్కుమంటూ ప్రాణభయంతో గడిపింది. తెల్లవారింది.మళ్లీ ఇల్లు గుర్తొచ్చింది. ఆకలి వేసింది. పాలు, బిస్కెట్లు ఇచ్చేదెవరు? అన్నం పెట్టేదెవరు? అక్కడికి దగ్గర్లో చిన్న హోటలుకు చేరుకుంది. అది నారాయణ హోటలు. అక్కడ ఊర కుక్కలతో గొడవపడుతూ ఎంగిలి మెతుకులు తింటూ రెండురోజులు గడిపింది. ఆలనాపాలనా లేని బతుకు ఎంత దుర్భరమో అప్పుడే తెలిసింది. ఇన్ని రోజులూ తనకా కష్టం ఏమిటో తెలిసింది కాదు. వడ్డించిన విస్తరి లాంటి జీవితం. కానీ ఇప్పుడు కుక్కలు చింపిన విస్తరి అయింది. ఎంత తిరిగినా దానికి తన యజమాని రెడ్డెన్న ఇంటి జాడ తెలియలేదు. అక్కడక్కడే తిరుగుతున్న జిమ్మిని చూసి ఆ హోటలుకు వచ్చిన వాళ్లందరూ అడిగారు. ‘‘నారాయణా కొత్తగా కుక్కను పెంచుతున్నావా?’’ అని. దాంతో నారాయణకు జిమ్మి అంటే ఆసక్తి కలిగింది. ఎవరిదో జాతికుక్క దారితప్పి ఇటు వచ్చేసింది. యజమానులెవరో వచ్చి తీసుకుపోతారు అనుకున్నాడు ఇన్నాళ్లు. రోజులు గడుస్తున్నా దానికోసం ఎవరూ రాకపోవడంతో ఓరోజు ఇంటికే తీసుకెళ్లాడు. జిమ్మిని చూసి నారాయణ కొడుకు మున్నా ఎంతో సంతోషపడ్డాడు. సుబ్రహ్మణ్యం అని పేరు కూడా పెట్టేసుకున్నాడు. మున్నా దాన్ని అసలు నేల మీద వదిలేవాడు కాదు. అదృష్టం కొద్దీ మళ్లీ దానికొక ఆశ్రయం దొరికింది. ప్రేమగా సాకేవాళ్లు దొరికారు.అలా నాలుగేళ్లు గడిచాయి. జిమ్మి మనసులో జమీందారు రెడ్డెన్న గారి జ్ఞాపకం అలానే ఉంది. రెడ్డన్నగారిని మళ్లీ ఎప్పుడైనా చూడగలనా! లేదా! అని విచారిస్తోంది.ఓ రోజు అనుకోకుండా రెడ్డెన్నగారి తోటమాలి రంగన్న, నారాయణ హోటలుకు భోజనానికి వచ్చాడు. రంగయ్యను జిమ్మి పోల్చుకుంది. అతని కాళ్లను నాలుకతో నాకుతూ, తోక ఊపుతూ, అతని చుట్టూ తిరగసాగింది. వయసు మళ్లిన రంగయ్య జిమ్మిని గుర్తించలేకపోయాడు. ఏదో కుక్క మీద పడుతుంది అనుకున్నాడు.అల్లరి చేస్తుందని మున్నా దాన్ని గుంజకు కట్టేయడంతో ఉన్న చోటే కూర్చుండిపోయింది. భోజనం చేసి రంగయ్య వెళ్లిపోయాడు. జిమ్మి రంగయ్యతో పాటు వెళ్లిపోవాలనుకుంది. రంగయ్య వెళ్లిన దారి వైపే దృష్టి పెట్టింది. కాలువ గట్టు మీద ఉన్న వంతెన మీదుగా వెళ్లడం గమనించింది.గొలుసు విప్పిన తరువాత ఇన్నాళ్లూ పెంచినందుకు కృతజ్ఞతగా మున్నా కాళ్లను నాకి, ముద్దులు పెట్టుకొని రంగయ్య వెళ్లిన దారినే పరుగందుకుంది. మున్నా ‘సుబ్బు.. సుబ్రహ్మణ్యం’ అంటూ పిలవసాగాడు. అయినా ఆగలేదు. కాలువ గట్టు మీదుగా, వంతెన మీదుగా పరుగుతీసింది. అలా పరుగులు తీసి కాలువలూ, చెట్లూ, పుట్టల్ని దాటుకుంటూ రామాపురం పొలిమేరకు చేరుకుంది. ఆ పొలిమేరలో ఆంజనేయస్వామి గుడి ఉంది. ఆ గుడిని అçప్పుడప్పుడు చూసేది. ఇక అక్కడ నుంచి దానికి అంతా కొట్టిన పిండే. వీధులు దాటుకుంటూ.. ఊరి పెద్ద చెరువును దాటుకుంటూ, పెద్ద ఇనుపగేటున్న మండువా లోగిలికి వచ్చేసింది. ‘‘భౌ .. భౌ’’ మంటూ మొరగసాగింది. రెడ్డెన్న గారి భార్య రుక్మిణమ్మ బయటికొచ్చింది. అలవాటైన అరుపు.. కాలంతో పాటు ఎదిగిన జిమ్మి బాగా ఎత్తుగా, బలంగా రాజసం ఉట్టిపడేలా నుదుటి మీద మచ్చతో అలానే ఉంది. గేటు తెరవడంతో ఒక్క ఉదుటన ఆమెను చుట్టేసి, కాళ్లను నాకి ఇంట్లోకి దౌడు తీసింది. ‘‘కుయ్ .. కుయ్’’ మంటూ ఇల్లంతా గొడవ గొడవగా తిరిగింది. గదులన్నీ చూసుకుంది. ఇంటిల్లపాదీ దాని చుట్టూ మూగిపోయారు. దాని సంతోషానికి, వాళ్ల సంతోషానికి అంతులేదు. కాళ్ల మీద నిలబడి, చేతులందించింది. దాని భాషలో ఊసులాడింది.రెడ్డెన్న గారిని అస్సలు వదలలేదు. ఇంత జరుగుతున్నా.. ఇన్ని సంవత్సరాల తరువాత తిరిగివచ్చింది మన జిమ్మినేనా! కాదా! జిమ్మినే అయితే ఇన్నాళ్లు ఎక్కడుంది? అన్న అనుమానం కూడా వచ్చింది. ‘‘ఉండండి. నేనో పరీక్ష పెడతాను’’ అని రుక్మిణమ్మగారు ‘‘ జిమ్మీ.. ఇదివరకు నువ్వు ఎక్కడ పడుకునే దానివో.. అక్కడికి వెళ్లి ఓసారి పడుకో’’ అన్నారు.ఆ మాటని అర్థం చేసుకున్న దానిలా రెడ్డెన్న గారి ‘దివాన్’ కిందకు వెళ్లి పడుకుంది, తనదైన పంథాలో రాజసం ఉట్టిపడేలా.. ఎప్పటిలా... -
న్యూ ఇయర్ సందడి
-
విద్యార్థులతో స్టెప్పులేసిన రవితేజ
-
సమగ్రాభివృద్ధే లక్ష్యం
వరంగల్ అర్బన్ జిల్లా ఆవిర్భవించిన ఏడాదిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో జిల్లా యంత్రాంగం ముందంజలో ఉంది. రానున్న మూడు నుంచి ఐదేళ్లలో నగరం రూపురేఖలు మారనున్నాయి. సుందర, పరిశుభ్రత, హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టే పథకాలపై పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధం చేశాం. ఇప్పటికే అమలు చేస్తున్నాం. – అమ్రపాలికాట, కలెక్టర్ వరంగల్, హన్మకొండ: ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పనిచేసి జిల్లాను సమగ్రాభివృద్ధి చేయడమే లక్ష్యమని వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు. హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో బుధవారం నిర్వహించిన వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లా ఆవిర్భావ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసుకుందామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం కంకణబద్ధుడై కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వంతో అన్ని వర్గాలకు మేలు చేకూరే పథకాలు అమలు చేస్తూ అవినీతి రహిత పాలన అందిస్తున్నారన్నారు. ప్రజలకు పరిపాలన పారదర్శకంగా ఉండేందుకు.. పరిపాలన సౌలభ్యానికే చిన్న జిల్లాలు ఏర్పాటు చేశారన్నారు. చిన్న జిల్లాల ఏర్పాటుతో సామాన్య ప్రజలు జిల్లా కేంద్రానికి వచ్చి తమ పనులు తాము చేసుకోగలుగుతున్నారని పేర్కొన్నారు. అధికారులకు సైతం పర్యవేక్షణ సులువుగా ఉందన్నారు. తద్వారా ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారానికి నోచుకుంటున్నాయని వివరించారు. అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు వరంగల్ నగరంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు. ఈ క్రమంలో వరంగల్ నగరానికి రాష్ట్ర బడ్జెట్లో ఏడాదికి రూ.300 కోట్లు కేటాయిస్తున్నారని గుర్తు చేశారు. అభివృద్ధికి బలమైన పునాదులు పడ్డాయని.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసి పటిష్టమైన ప్రణాళిక రూపొందించారన్నారు. వచ్చే ఎన్నికల నాటికి వరంగల్ నగరం అద్భుతమైన అభివృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రూ.542 కోట్లతో మిషన్ భగీరథ పనులు నగరంలో ప్రారంభమయ్యాయన్నారు. వచ్చే ఏడాది నాటికి ఇంటింటికీ శుద్ధి చేసిన తాగు నీటిని అందించనున్నట్లు చెప్పారు. 58 వేల ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసి విద్యుత్ ఆదా చేస్తున్నామన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన లేని నగరంగా చేశామన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో 38 నుంచి 28వ ర్యాంక్కు చేరుకున్నామన్నారు. టూరిజంలో స్వచ్ఛత అవార్డు, స్కోచ్ అవార్డులు అందుకున్నామన్నారు. నగరంలో పరిశుభ్రత, తాగునీరు అందించడంలో ఏడాది కాలంలో సఫలమయ్యాన్నారు. దీనికి సహకరించిన కలెక్టర్, ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి పర్యాటకులను విశేషంగా అకట్టుకుంటామన్నారు. కాగా, స్త్రీనిధి కార్యక్రమం కింద మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.7.60 కోట్ల చెక్కులను అందించారు. కార్యక్రమంలో ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్, జాయింట్ కలెక్టర్లు హరిత, దయానంద్. ఐసీడీఎస్ మహిళ ఆర్గనైజర్ కమరున్నీసా బేగం, ట్రైనీ కలెక్టర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
స్వాతంత్ర్య వేడుకలకు సిద్ధమైన ఎర్రకోట
-
ఫిదా సందడి