Christmas
-
క్రిస్మస్ వేడుకల్లో ఓరీ - స్పెషల్ అట్రాక్షన్గా రాధికా మర్చెంట్ (ఫోటోలు)
-
స్పెషల్ ఫోటో షేర్ చేసిన మస్క్ - నెట్టింట్లో వైరల్
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ.. 'ఇలాన్ మస్క్' (Elon Musk) క్రిస్మస్ సందర్భంగా ఓ ప్రత్యేకమైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ ఫోటో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఒజెంపిక్ శాంటా (Ozempic Santa) అంటూ శాంటా డ్రెస్తో.. క్రిస్మస్ చెట్టు ముందు నిలబడిన ఫోటోను మస్క్ షేర్ చేశారు. ఇందులో పెద్ద గడ్డం, నడుముపై చేతులు పెట్టుకున్న మస్క్ను చూడవచ్చు.ఇలాన్ మస్క్ శాంటా వేషధారణలో కనిపించడం ఇదే మొదటి సారి కాదు. ఎందుకంటే తన చిన్న తనం నుంచే శాంటా దుస్తులు ధరించిన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇది ఎలా ప్రారంభమైంది.. ఎలా వెళుతోంది అంటూ మస్క్ మరో ట్వీట్ చేశారు. మేరీ క్రిస్మస్.. వండర్ఫుల్ న్యూ ఇయర్ అంటూ కూడా ట్వీట్ చేశారు.Ozempic Santa pic.twitter.com/7YECSNpWoz— Elon Musk (@elonmusk) December 26, 2024How it started vs how it’s going pic.twitter.com/fQeCQ7zCPC— Elon Musk (@elonmusk) December 26, 2024 -
ఫ్యాన్స్పై లవ్.. అలియా భట్ను మించిపోతున్న కూతురు రాహా (ఫోటోలు)
-
ఆయుధాల గర్జనలు ఆగిపోవాలి
వాటికన్ సిటీ: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవుల అత్యున్నత గురువు పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచ మానవాళికి శాంతి సందేశం ఇచ్చారు. ప్రపంచమంతటా ఘర్షణలు ఆగిపోవాలని, శాంతి సామరస్యం నెలకొనాలని ఆకాంక్షించారు. బుధవారం వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్కు తరలివచి్చన వేలాది మందిని ఉద్దేశించి పోప్ బాసిలికా చర్చి బాల్కనీ నుంచి ప్రసంగించారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు ఆశీస్సులు అందజేశారు. అమాయకుల ఉసురు తీస్తున్న యుద్ధాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయుధాలు నిప్పులు కక్కుతున్న చోట ఇకనైనా కాల్పుల విరమణ పాటించాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ఇప్పటికైనా ముగించాలని ఇరుపక్షాలకు హితవు పలికారు. జరిగిన నష్టం చాలని అన్నారు. సుదీర్ఘ శాంతిని నెలకొల్పే దిశగా చర్చలకు రెండు దేశాలూ చొరవ తీసుకోవాలని సూచించారు. యుద్ధాన్ని ముగించి, సంప్రదింపులకు తలుపులు తెరవాల్సిన సమయం వచి్చందన్నారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల పట్ల పోప్ ఆందోళన వ్యక్తంచేశారు. ఆ ప్రాంతంలో ఆయుధాల గర్జనలు ఆగిపోవాలని, నిశ్శబ్దం తిరిగి రావాలని పేర్కొన్నారు. గాజాలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని చెప్పారు. వారి క్షుద్బాధ తీర్చాలని, మానవతా సాయం విరివిగా అందించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. గాజాలో కాల్పుల విరమణకు సిద్ధం కావాలని హమాస్, ఇజ్రాయెల్కు పోప్ సూచించారు. బందీలను విడుదల చేయాలని, తద్వారా శాంతికి బాటలు వేయాలని హమాస్ మిలిటెంట్లకు హితవు పలికారు. లెబనాన్, మయన్మార్, సిరియా, ఆఫ్రికా తదితర దేశాల్లో సంఘర్షణల పట్ల మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ప్రారి్థస్తున్నట్లు తెలిపారు. వాతావరణ మార్పులు, దుష్పరిణామాలపైనా పోప్ మాట్లాడారు. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో వ్యాధుల బారినపడి పెద్దసంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి చికిత్స అందించాలని, సాంత్వన కలిగించాలని మానవతావాదులను కోరారు. -
శాంటా లుక్లో ఉప్పెన బ్యూటీ.. నా సామిరంగ హీరోయిన్ క్రిస్మస్ సెలబ్రేషన్స్
శాంటాక్లాజ్ లుక్లో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి..క్రిస్మస్ సెలబ్రేషన్స్ నా సామిరంగ హీరోయిన్..ఆదిపురుష్ భామ క్రిస్మస్ లుక్..మరింత హాట్ హాట్గా పూనమ్ బజ్వా..బలగం బ్యూటీ కావ్య కల్యాణ్ రామ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్.. View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) -
కుటుంబంతో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్ (ఫొటోలు)
-
క్రిస్మస్ సెలబ్రేషన్స్లో స్టార్ హీరోహీరోయిన్స్ (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు (ఫొటోలు)
-
క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనల్లో వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు (ఫొటోలు)
-
అవి క్రిస్మస్ పక్షులు.. వాటి కువకువలు సుమధుర సరాగాలు
పక్షుల కిలకిలారావాలు ఎవరినైనా మైమరపిస్తాయి. ఇక వాటి రూపం కూడా అమితంగా ఆకట్టుకుంటుంది. ఉత్తర అమెరికాలో క్రిస్మస్ సీజన్లో అందమైన వెర్మిలియన్ పక్షులు సందడి చేస్తుంటాయి. అందుకే వాటిని క్రిస్మస్ పక్షులని అంటారు. ఇవి ఎరుపురంగులో ఆకర్షణీయంగా ఉంటాయి.ఈ పక్షులను కార్డినల్స్ లేదా నార్తర్న్ కార్డినల్స్ అని కూడా పిలుస్తారు. క్రిస్మస్ రోజుల్లో ఈ పక్షులు తమ కువకువలను శ్రావ్యంగా వినిపిస్తాయి. ఈ పక్షులలోని ఆడ, మగ పక్షుల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది.నార్తర్న్ కార్డినల్స్ మగ, ఆడ పక్షుల మధ్య ప్రధాన వ్యత్యాసం వాటి రంగు. మగవెర్మిలియన్ ఎరుపు రంగులో ఉండగా, ఆడవి గోధుమ లేదా బూడిద రంగులో ఉంటాయి. వాటి తోక, శరీరంలోని కొన్ని భాగాలు ఎరుపు రంగులో ఉంటాయి. ఈ పక్షులు పసుపు, తెలుపు రంగులలోనూ కనిపిస్తాయి.కార్డినల్స్ లేదా నార్తర్న్ కార్డినల్స్ వాటి ఈకల నుండి ఎరుపు రంగును స్వీకరిస్తాయి. వాటి తోక, ముక్కు కూడా ఎరుపు రంగులో ఉంటాయి. అవి తాము తినే ఆహరం నుంచి ఇటువంటి రంగును పొందుతాయి. ఇవితినే ఆహారంలోని కెరోటినాయిడ్లు వీటికి ఎరుపు, నారింజ, పసుపు, గులాబీ రంగులను అందిస్తాయి. ఈ రంగులన్నీ వాటి ఈకలలో ప్రతిబింబిస్తాయి. ఆడపక్షులలో ఎరుపు రంగుకు బదులుగా, పసుపు బూడిద రంగు ఎక్కువగా కనిపిస్తుంది. ఎరుపు రంగు తక్కువగా ఉంటుంది.నార్తర్న్ కార్డినల్స్ ప్రత్యేకత ఏమిటంటే వీటి కిలకిలారావాలు పాటల మాదిరిగా వినిపిస్తాయి. అవి భూమిపైకి దిగి పరిగెత్తేటప్పుడు కిలకిలారావాలు చేస్తాయి. ఆడ, మగ రెండూ పాడతాయి. అవి 24 రకాలుగా కిలకిలారావాలు చేస్తాయని పరిశోధనల్లో తేలింది.కార్డినల్స్ జీవితాంతం ఒక భాగస్వామితోనే కలసి ఉంటాయి. ఎప్పుడూ కలసే కనిపిస్తాయి. కలిసి గూడు కట్టుకుంటాయి. అయితే గుడ్లు పెట్టిన తర్వాత మగ పక్షులు గూడుకు దూరంగా ఉంటాయి. తరువాత ఆరెండూ తమ పిల్లపక్షులను ఎంతో శ్రద్ధగా పెంచుతాయి. వాటికి ఆహారం అందిస్తాయి.ఆడ కార్డినల్స్ ఎక్కువగా కిలకిలారావాలు చేస్తాయి. వేటగాళ్ళు తమ గూడును గుర్తించకుండా ఉండేందుకే అవి సందడి చేస్తాయని పరిశోధనల్లో తేలింది. అలాగే మగపక్షితో ఆహారం తీసుకురమ్మని చెప్పేందుకు అవి ప్రత్యేక శబ్దాలు కూడా చేస్తాయి.కొన్నిసార్లు ఈకలు లేని కార్డినల్స్ కూడా కనిపిస్తాయి. అవి ప్రతి సంవత్సరం తమ ఈకలను తొలగిస్తాయి. ఆ తర్వాత పాత వాటి స్థానంలో కొత్త ఈకలు వస్తాయి. ఈ మధ్య నుండే సమయంలో అవి ఈకలు లేని పక్షులుగా కనిపిస్తాయి. -
మొదలైన క్రిస్మస్ సందడి..ముస్తాబైన చర్చ్ లు (ఫొటోలు)
-
గడ్డ కట్టిన నదిని కోసి మంచు ఉత్సవం
చైనాలో ప్రతి డిసెంబర్లో జరిగే ‘హర్బిన్ ఇంటర్నేషనల్ ఐస్ అండ్ స్నో స్కల్పప్చర్ ఫెస్టివల్’కు భారీగా పర్యాటకులు వస్తారు. కారణం ఏమిటంటే అక్కడ ప్రవహించే సొంగువా నది నవంబర్ నుంచి మార్చి వరకు గడ్డ కట్టి΄ోతుంది.హర్బిన్ నగరానికి దాపుగా ఈ నది ఉండటంతో నది ఉపరితలం మీద ఉన్న ఐస్ను కోసి వ్యా΄ారులు అమ్ముతారు. శిల్పులు ఆ ఐస్ కొని భారీ విగ్రహాలు చేసి ప్రదర్శనకు పెడతారు. ఇలా మంచు శిల్పాలు, ఆకారాలు, మంచుతో కట్టిన భవనాలు ఇవన్నీ కలిసి ‘హర్బిన్ ఐస్ ఫెస్టివల్’ పేరుతో జరుగుతాయి. ఈశాన్య చైనాలో ఉండే హర్బిన్ నగరం సైబీరియా మంచు ఎడారికి దగ్గర. నవంబర్ నుంచి సైబీరియా మంచు గాలులు మొదలయ్యి చలి పెరుగుతుంది. నది గడ్డ కడుతుంది. డిసెంబర్లో అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 16 డిగ్రీల వరకూ ఉంటాయి. అందుకే ఈ చలిలో బోర్ కొట్టకుండా ఉండేందుకు ఎంతకీ కరగని మంచుతో ఇలా ఉత్సవం చేసి ఆనందిస్తారు. మీ దగ్గర హుండీలో దాచిన డబ్బు ఉంటే వెళ్లి చూసి రండేం! -
మరోసారి మతపరమైన వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ గతేడాది వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పోలీసు కేసులు ఎదుర్కొన్న తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ యువనేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి మతపరమైన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో గురువారం జరిగిన క్రిస్మస్ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ.. తనను తాను గర్వించదగిన క్రైస్తవుడిగా ప్రకటించుకున్నారు. తనకు అన్ని మతాలు సమానమని, మత సామరస్యానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. మతం పేరుతో విభజించేవారిని, విద్వేషాన్ని చిమ్మేవారికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. నాకు అన్ని మతాలు సమానం‘గత ఏడాది క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు నేను క్రిస్టియన్నని సగర్వంగా చెప్పాను. ఇది పలువురు సంఘీలకు చిరాకు తెప్పించింది. ఈ రోజు మళ్లీ చెబుతున్నా. నేను గర్వించదగిన క్రైస్తవుడిని. నేను క్రిస్టియన్ని అని మీరు అనుకుంటే, క్రిస్టియన్ని. ముస్లింనని మీరు అనుకుంటే, ముస్లింను. హిందువు అనుకుంటే, నేను హిందువును. నాకు అన్ని మతాలు సమానం. అన్ని మతాలు మనకు ప్రేమను చూపించడమే నేర్పుతాయి’అని నొక్కి చెప్పారు.బీజేపీ–అన్నాడీఎంకే మధ్య రహస్య పొత్తుమతాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకునే వారు విద్వేషాలు, విభజనను వ్యాప్తి చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి ఆరోపించారు. ‘ఇటీవల అలహాబాద్కు చెందిన ఓ న్యాయమూర్తి ఒక మతాన్ని కించపరిచేలా మాట్లాడటం చూశాం. ఆయన ముస్లింలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి న్యాయమూర్తి పదవిలో ఉంటే ఆయన కోర్టులో న్యాయం ఎలా ఆశిస్తాం?’ అని ప్రశ్నించారు. ఆయనను తొలగించడానికి లోక్సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి కాంగ్రెస్, డీఎంకే ఎంపీలు సంతకాలు చేసినా, అన్నాడీఎంకే ఎంపీలు మాత్రం సంతకాలు చేయలేదన్నారు. ‘‘బీజేపీకి బానిసలుగా కొనసాగుతున్నారు కాబట్టే.. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించిన న్యాయమూర్తిని తొలగించాలని కోరుతూ చేసిన తీర్మానానికి అన్నాడీఎంకే మద్ధతివ్వలేదు’’ అని అన్నాడీఎంకేను విమర్శించారు.చదవండి: మీరూ ఏదో ఒకరోజు సీఎం అవుతారుబీజేపీ–అన్నాడీఎంకే మధ్య రహస్య పొత్తు కొనసాగుతోందని, రాజ్యాంగ విలువల కంటే రాజకీయ విధేయతకే అన్నాడీఎంకే ప్రాధాన్యమిస్తోందని ఆయన ఆరోపించారు. కాగా, సనాతన ధర్మంపై గతేడాది ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపాయి. ఆయనపై చాలా చోట్ల పోలీసు కేసులు నమోదయ్యాయి. -
హైదరాబాద్ : నగరంలో క్రిస్మస్ కోలాహలం (ఫోటోలు)
-
ట్రాన్స్జెండర్తో మార్కెటింగ్... గూగుల్ క్రిస్మస్ ప్రకటనపై వివాదం
మహిళల సంబంధ వస్తువులకు సంబంధించిన ప్రకటనను ట్రాన్స్జెండర్తో రూపొందించాలన్న టెక్ దిగ్గజం గూగుల్ ‘వినూత్న’ ఐడియా బెడిసికొట్టింది. దానిపై మహిళాలోకంలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. క్రిస్మస్ వేళ ఇలాంటి యాడ్ ఎందుకు తెచ్చారంటూ దుమ్మెత్తిపోశారు. అందమైన మహిళలే లేనట్టు ట్రాన్స్జెండర్తో యాడ్ చేస్తారా అంటూ నెటిజన్లు కూడా గూగుల్పై మండిపడుతున్నారు. క్రిస్మస్ సందర్భంగా గూగుల్ తన సొంత షాపింగ్ వేదిక ‘గూగుల్ షాపింగ్’లో మహిళల ఉత్పత్తులను ప్రమోషన్కు ఒక యాడ్ సిద్ధం చేసింది. టిక్టాక్లో పేరొందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్ 30 ఏళ్ల సైరస్ వెస్సీని ప్రచారకర్తగా ఎంచుకుంది. చంపేసే చలిలో అత్యంత నాణ్యమైన మేకప్, చర్మ సంబంధ ఉపకరణాలు, దుస్తులను తక్కువ ధరకే కొనుక్కోండంటూ వెస్సీతో ఒక యాడ్ డిజైన్ చేసి ఆన్లైన్ ప్రసారాలు మొదలెట్టారు. కానీ అందులో ట్రాన్స్జెండర్ నటించడంతో ఆదరణ దేవుడెరుగు, విమర్శలు వెల్లువెత్తాయి. ‘‘ఇది దారుణమైన అజెండాతో రూపొందించిన యాడ్. అమ్మాయిలను అవమానించాలని చేసినట్టుగా ఉంది’’ అంటూ పలు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న బ్రిటన్కు చెందిన ప్రముఖ వ్యాఖ్యాత ఓలీ లండన్ అన్నారు. దాంతో, మహిళలను కించపరచాలనే దురుద్దేశమేదీ లేదంటూ గూగుల్ వివరణ ఇచి్చంది. సోషల్ మీడియాలో పేరొందిన ‘విభిన్న’ వ్యక్తులతో యాడ్ చేద్దామనే ఉద్దేశంతోనే అలా రూపొందించినట్టు చెప్పుకొచ్చింది. – వాషింగ్టన్ -
సెమీ క్రిస్మస్ వేడుకలు
-
విధేయతే క్రిస్మస్కు పునాది
ఏదైనా భవనాన్ని గానీ మందిరాన్ని గానీ నిర్మాణం చేసేముందు ఒక ప్రణాళిక (ప్లాన్) వుంటుంది. ఆ నిర్మాణానికి కొంతమంది వ్యక్తులు కావాలి. నిపుణత కలిగిన వ్యక్తులు, పనివారు కష్టపడటం వల్లనే నిర్మాణాలు జరుగుతాయి. అలాగే మానవజాతి రక్షణార్థం దేవుడికి ఒక ప్రణాళిక వుంది. ఆ ప్రణాళికను అమలుపరచటానికి కొందరు వ్యక్తుల అవసరం వుంటుంది, కావాలి. అట్టివారు అవమానాలను శ్రమను భరించేవారుగా విధేయత కలిగినవారై వుండాలి. ఆ ప్రణాళికలో కొంతమంది విధేయత కలిగిన వ్యక్తులను ఎన్నిక చేసుకున్నాడు దేవుడు. వారే ప్రభువైన యేసు తల్లియైన మరియ ఆమె భర్త అయిన యేసేపు, తూర్పు దేశపు జ్ఞానులు. వారు దేవుని మాటకు విధేయత చూపటమే ‘క్రిస్మస్’. వారిని గూర్చి, వారి విధేయతను గూర్చి ఈ కింద తెలుసుకుందాం.ప్రభువైన యేసు తల్లి గలిలయలోని నజరేతను ఊరికి చెందినవారు. మరియ కన్యకగా వున్నప్పుడు అదే ఊరికి చెందిన యోసేపను పురుషునితో ప్రదానం చేయబడింది. కానీ యూదు మత ఆచారం ప్రకారం ప్రదానమైన తర్వాత ఒక సంవత్సరం తర్వాత వివాహం జరుగుతుంది. ఇది కన్యత్వానికి పరీక్షాకాలం. ఆ సంవత్సర కాలంలో కన్యత్వంలో జరగరానిది జరిగింది. అంటే ఆ మధ్యకాలంలో ఆమె కన్యత్వం గర్భం ధరించింది. ఏలయనగా ఆమె ఇంటిలో వుండగా దేవదూత దేవునిచేత పంపబడి ఆమెను చూసి ‘‘దయాప్రాప్తురాలా! నీకు శుభము. నీకు ప్రభువు తోడై వున్నాడు. దేవుని వలన కృప పొందావు. భయపడకుము. ఇదిగో నీవు గర్భం ధరించుదువు. ఒక కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు, ఆయన సర్వోన్నతుని కుమారుడు’’ అని చెప్పాడు. అప్పుడామె ఆ మాటలకు భయపడి–నేను పురుషుని ఎరుగని దాననే, అదెలాగు జరుగునని దూతతో అనగా దూత ‘పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును’ అనగా అందుకు మరియ ‘ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక’ అన్నది, ఆమె దేవుని మాటకు విధేయత చూపినది. అందుచేత క్రిస్మస్కు ప్రధానం విధేయత (లూకా 1: 26–38).మరియ భర్త అయిన యేసేపు నీతిమంతుడైనందున ఆ విషయం బహిర్గతం చేయక రహస్యంగా ఆమెను అతడు విడనాడదలచాడు. కానీ ఆ విషయాన్ని గూర్చి అతడు ఆలోచిస్తుండగా మరలా ప్రభువు దూత కలలో అతనికి కూడా ప్రత్యక్షమై ‘యేసేపూ! నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు సందేహింపకుము, ఆమె గర్భం పరిశుద్ధాత్మ మహిమ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. అతను తన ప్రజలను వారి పాపాలనుండి విమోచించును. ఆయనకు యేసు అను పేరు పెట్టుదురని దేవదూత చెప్పిన మాట ప్రకారం యేసేపు కూడా దేవుని మాటకు విధేయత చూపాడు. యేసేపుకు ఈ విషయంలో అనేకసార్లు దేవదూత ప్రత్యక్షపడ్డాడు. ఆ విధేయతే క్రిస్మస్ కారణం. (మత్తయి 1:18–25).తూర్పుదేశపు జ్ఞానులు యెరుషలేముకు వచ్చి వారు ఆ నక్షత్రం కాలం తెలుసుకుని, ఆ నక్షత్రం ఆ శిశువు ఉండే చోటికి వచ్చినప్పుడు ఆ శిశువుకు సాగిలపడి, పూజించి, పెట్టెలు విప్పి అందులోని బంగారాన్ని సాంబ్రాణిని, బోళమును కానుకలుగా సమర్పించి, దేవదూత ఆజ్ఞానుసారం హేరోదు రాజుకు ఈ విషయం తెలుపక వేరే మార్గమున వారు వారి దేశానికి వెళ్ళారు. ఆ విధంగా వారు కూడా దేవుని మాటకు విధేయత చూపారు. (లూకా 1:18,1–15).– కోట బిపిన్ చంద్రపాల్ -
మేలిమి బంగారంతో ఖరీదైన క్రిస్మస్ ట్రీ, ధర ఎంతో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా పవిత్ర క్రిస్మస్ సందడి నెలకొంది. క్రిస్మస్ వేడుకల్లో ప్రధానమైంది క్రిస్మస్ ట్రీని తయారు చేయిడం. తాజాగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రిస్మస్ ట్రీ వార్తల్లో నిలిచింది. జర్మనీ ఈ స్పెషల్ గోల్డెన్ క్రిస్మస్ ట్రీని మేలిమి బంగారు నాణాలతో రూపొందింది ఆవిష్కరించింది. ఆశ్చర్యంగా ఉంది కదా..రండి దీని విశేషాల గురించి తెలుసుకుందాం.అద్బుతమైన బంగారపు ట్రీని మ్యూనిచ్లోని బులియన్ డీలర్స్ ప్రో ఆరమ్ (Pro Aurum) తయారు చేసిందట. 10 అడుగుల ఎత్తు, దాదాపు 60 కిలోల బరువు, 2,024 (ఏడాదికి గుర్తుగా) బంగారు వియన్నా ఫిల్హార్మోనిక్ నాణేలతో ఈ ట్రీని తయారు చేశారు. ఈ నాణేం ఒక్కోటి ఒక ఔన్స్ బరువు ఉంటుంది. ఈ క్రిస్మస్ ట్రీల పైభాగంలో నక్షత్రం లేదా దేవదూత స్థానంలో 24 క్యారెట్ల బంగారు నాణెంతో(ప్రపంచంలోనే అత్యంత విలువైన నాణేల్లో ఇదొకటి) వినియోగించారు. ఈ ట్రీని వియన్నా మ్యూసిక్వెరిన్ గోల్డెన్ హాల్ లాగా కనిపించే ఒక వేదికపై ఉంచారు. దీని విలువ ఏకంగా రూ.46 కోట్ల రూపాయలు. ప్రస్తుతం ఇది అత్యంత ఖరీదైన క్రిస్మస్ చెట్లలో ఒకటిగా రికార్డు క్రియేట్ చేసింది.కంపెనీ ప్రతినిధి బెంజమిన్ సుమ్మ అందించిన వివరాల ప్రకారంప్రతీ ఏడాది ఇలా క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది తమ కంపెనీ 35వ వార్షికోత్సవానికి చిహ్నంగా ఈ గోల్డెన్ క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇది కేవలం పండుగ అలంకరణ మాత్రమే కాదనీ, బంగారం విలువ తెలియ చేయడం కూడా ఒక ముఖ్య అంశమని పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకు అత్యంత ఖరీదైన చెట్టుగా రికార్డుల్లో నిలిచిన ఘనత మాత్రం అబుదాబిలోని ఎమిరేట్స్ ప్యాలెస్ హోటల్లో ప్రదర్శించిన క్రిస్మస్ ట్రీకే దక్కుతుంది.2010లొ 43అడుగులతో 11.4 మిలియన్ డాలర్లు వెచ్చించి వజ్ర వైఢూర్యాలు, ముత్యాలు, ఇతర విలువైన రాళ్లతో దీన్ని తయారు చేశారు. -
ప్రభుయేసు ఆగమనం
విశ్వవ్యాప్తంగా క్రైస్తవ విశ్వాస సమాజం యేసుప్రభువు వారి జన్మదినం జరుపుకొనేందుకు నాలుగువారాలు ముందస్తుగా ‘క్రిస్మస్’ వేడుకలు ప్రారంభిస్తున్నారు. దీనినే ‘అడ్వెంట్’ అంటారు. అనగా ఆగమనం/రాకడ/ఆహ్వానం పలుకుటకు ముందస్తుగా ఏర్పాట్లు ప్రారంభించి, డిసెంబరు 24 సాయంత్రంతో ముగిస్తారు.దేవకుమారుడైన యేసుక్రీస్తు ఆగమనానికి ముందస్తు క్రైస్తవ విశ్వాస సమాజం ప్రార్థనలోను, సంఘ సహవాసంతోను కలిసి దేవుని వాక్యానుసారంగా ప్రార్థించుటకు ‘దేవుని మందిరమైన’ సంఘంలో పాల్గొని ‘క్రిస్మస్’ డిసెంబరు 25న క్రీస్తు జన్మదినం కొరకు సిద్ధపడటమే ‘అడ్వంట్’. చీకటిరాత్రి తొలగి అరుణోదయ కాంతి రావటమే ప్రధానాంశం.క్రీ.పూ. 5వ శతాబ్ద కాలంలో ‘మాలకీ’ అనే దేవుని దూత చెదిరిపోయిన ఇశ్రాయేలీయులు అనగా ప్రవాసులుగా భూమియంతట చెందినవారిని, నిస్సహాయక స్థితిలో ఉన్న వారిని భయభక్తులు కలిగి వుండాలని సందేశిమిచ్చాడు. కానీ వారిని భయభ్రాంతుల నిమిత్తం కాదన్నది వాక్యభావం, అందులో ప్రాముఖ్యంగా నియామ ఏకదినము, చిగురపుట్టను అన్న వచనాలు బలపరుస్తూ క్రీ.పూ 742–687 సంవత్సకాలంలో సింధూర వృక్షం నరకబడిన దానిమొద్దులోనుంచి పరిశుద్ధమైన చిగురు పుట్టునన్న వాక్యం దావీదు వంశావళిలో శాంతి, సమాధానాది ప్రదాతయైన యేసుప్రభువువారు జన్మించునని ముందస్తుగానే ప్రవచించారని వాక్యం స్పష్టీకరించుచున్నది. మలాకీ కాలం క్రీ.పూ. 5వ శతాబ్దం (మలాకీ 4 :1 –6; యెషయా 6 : 13).ఈ ముందస్తు క్రీస్తు ప్రభువువారి జన్మదిన సిద్ధపాటులో ప్రజలు లేక పెండ్లి విందుకు ఆహ్వానించినవారిలో కొందరు బుద్ధిమంతులు వుంటారని, మరికొందరు బుద్ధిహీనులుగా వుంటారని పెండ్లి కుమారుడు వచ్చేవరకు వేచి వున్న బుద్ధిమంతుల దీపము అనగా భక్తిపరులుగా వాక్యానుసారంగా ఎదురుచూస్తారని ఏల అనగా వారి దీపములలో అనగా భక్తిలో నూనెతో సిద్ధపడతారని, (‘నూనె’ భక్తికి సాదృశ్యం), బుద్ధిహీనులు దానికి బదులుగా విరుద్ధమైన సిద్ధపాటు పడతారని వారు బుద్ధిహీనులని యేసుప్రభువులవారు ఇశ్రాయేలీయుల ప్రజలతో ఉపమాన రీతిలో బోధించారని ఈ వాక్యం తెలియజేస్తున్న పరమార్థం (మత్తయి 5 :1–13).కనుక ముందస్తు ఆగమనం కొరకు ఎదురుచూసేవారు ఈ నాలుగువారాలు సంఘము నియమింపబడిన సమయంలో భక్తిపూర్వకంగా వాక్యానుసారమైన ప్రార్థన, సంఘ సహవాసంతో కలిసి ప్రార్థనలలో పాల్గొని పరిశుద్ధంగా అనగా ఆ ప్రార్థనల్లో 100 శాతం నిజాలు, ప్రభువు సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనలు వుండేలా సిద్ధపడుదురు గాక.– కోట బిపిన్చంద్రపాల్ -
క్రిస్మస్ కాదు టాలీవుడ్కి మినీ సంక్రాంతి
మరో నాలుగు రోజుల్లో 'పుష్ప 2' రిలీజ్ కానుంది. దీంతో ఈ వారం.. రిలీజైన తర్వాత వారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. కానీ క్రిస్మస్కి మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కుప్పలతెప్పలుగా మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఏకంగా డజను సినిమాలు క్రిస్మస్ వీకెండ్లో రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకీ అవేంటి వాటి సంగతేంటి?తెలుగు సినిమాల విషయానికొస్తే డిసెంబరు 20న అల్లరి నరేశ్ 'బచ్చలమల్లి' వస్తుంది. రీసెంట్గా రిలీజైన రా అండ్ రస్టిక్ టీజర్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నిజ జీవిత కథ ఆధారంగా తీశారు. దీనిపై అల్లరి నరేశ్ అంచనాలు పెట్టుకున్నారు. ప్రియదర్శి 'సారంగపాణి' కూడా ఇదే రోజున రిలీజ్ కానుంది. సున్నితమైన కామెడీ సినిమాలు తీస్తాడనే పేరున్న మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. ఇది హిట్ అవ్వడం వీళ్ల కెరీర్కి కీలకం.(ఇదీ చదవండి: నాన్న ఇంటికి రావొద్దన్నారు.. చచ్చిపోదామనుకున్నా: రాజేంద్ర ప్రసాద్)20నే 'మ్యాజిక్' అనే తెలుగు సినిమా కూడా రాబోతుంది. 'జెర్సీ' దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దీన్ని తీశారు. అనిరుధ్ మ్యూజిక్. ఇప్పటికైతే ఎలాంటి అంచనాల్లేవు. అదే రోజున విజయ్ సేతుపతి-వెట్రిమారన్ తమిళ డబ్బింగ్ మూవీ 'విడుదల 2' కూడా రానుంది. దీనికి సెపరేట్ ఆడియెన్స్ ఉన్నారు. అలానే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర 'యూఐ' కూడా ఇదే రోజున థియేటర్లలోకి రానుంది.హాలీవుడ్ నుంచి 'ముఫాసా' అనే కార్టూన్ మూవీ కూడా 20వ తేదీనే థియేటర్లలోకి రానుంది. సిటీల్లో మాత్రం పెద్ద చిత్రాలకు ఇది కాంపిటీషన్ అని చెప్పొచ్చు. మహేశ్ బాబు, షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు.. దీనికి ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ చెప్పారు. ఇది ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.(ఇదీ చదవండి: అఫీషియల్: చరణ్ సినిమాలో 'మీర్జాపుర్' మున్నా భయ్యా)డిసెంబరు 25న అంటే క్రిస్మస్ రోజున రాబోతున్న తెలుగులో సినిమాల్లో కాస్త చెప్పుకోదగింది నితిన్ 'రాబిన్ హుడ్'. శ్రీలీల హీరోయిన్, 'భీష్మ' లాంటి హిట్ తర్వాత నితిన్-వెంకీ చేసిన మూవీ కావడంతో ఓ మాదిరి అంచనాలున్నాయి. ఈ రోజున రిలీజయ్యే వాటిలో ఇదొక్కటే తెలుగు మూవీ. ఇది కాకుండా మ్యాక్స్ (కన్నడ డబ్బింగ్), మార్కో (మలయాళ డబ్బింగ్), బరోజ్ (మలయాళ డబ్బింగ్), బేబీ జాన్ (హిందీ) చిత్రాలు కూడా లైన్లో ఉన్నాయి. డిసెంబరు 27న 'పతంగ్' అనే తెలుగు సినిమా కూడా ఉందండోయ్.ఇలా క్రిస్మస్ వీకెండ్లో ఏకంగా 12 వరకు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓ రకంగా చూసుకుంటే 'పుష్ప 2' తర్వాత, సంక్రాంతికి ముందు ఇన్ని మూవీస్ రావడం సాహసమనే చెప్పాలి. మినీ సంక్రాంతికి అని చెప్పొచ్చేమో!(ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి 'మట్కా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
డిసెంబర్లో బ్యాంకులు పనిచేసేది కొన్ని రోజులే..
Bank Holidays in December 2024: నవంబర్ నెల ముగింపునకు వచ్చేసింది. త్వరలో డిసెంబర్ నెల ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో రాబోయే నెలలో బ్యాంకులు ఏయే రోజుల్లో పనిచేస్తాయి.. ఏయే రోజుల్లో మూతపడతాయి అన్న వివరాలతో డిసెంబర్ బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను ఇక్కడ అందిస్తున్నాం..ఆర్బీఐ ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం.. డిసెంబర్ నెలలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు అధిక మొత్తంలో వరుస సెలవులు ఉన్నాయి. ముఖ్యంగా పండుగలు, ప్రాంతీయ, జాతీయ విశేష సందర్భాల నేపథ్యంలో బ్యాంకులు కొన్ని రోజులే పనిచేయనున్నాయి.డిసెంబర్లో బ్యాంకులకు వారాంతపు సెలవులతో సహా కనీసం 17 లిస్టెడ్ సెలవులు ఉన్నాయి. కొన్ని దీర్ఘ వారాంతాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి బ్యాంకుకు మీ సందర్శనలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోండి. బ్యాంక్ సెలవులు దేశంలోని రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి.డిసెంబర్లో బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాడిసెంబర్ 1 - ఆదివారండిసెంబర్ 3 - శుక్రవారం - సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫీస్ట్ (గోవా)డిసెంబర్ 8 - ఆదివారం డిసెంబర్ 12 - మంగళవారం - పా-టోగన్ నెంగ్మింజ సంగ్మా (మేఘాలయ)డిసెంబర్ 14 - రెండవ శనివారండిసెంబర్ 15 - ఆదివారండిసెంబర్ 18 - బుధవారం - యు సోసో థామ్ వర్ధంతి (మేఘాలయ)డిసెంబర్ 19 - గురువారం - గోవా విమోచన దినం (గోవా)డిసెంబర్ 22 - ఆదివారండిసెంబర్ 24 - మంగళవారం - క్రిస్మస్ ఈవ్ (మిజోరం, నాగాలాండ్, మేఘాలయ)డిసెంబర్ 25 - బుధవారం - క్రిస్మస్ (దేశమంతా)డిసెంబర్ 26 - గురువారం - క్రిస్మస్ వేడుక (మిజోరం, నాగాలాండ్, మేఘాలయ)డిసెంబర్ 27 - శుక్రవారం - క్రిస్మస్ వేడుక (మిజోరం, నాగాలాండ్, మేఘాలయ)డిసెంబర్ 28 - నాల్గవ శనివారండిసెంబర్ 29 - ఆదివారండిసెంబర్ 30 - సోమవారం - యు కియాంగ్ నంగ్బా (మేఘాలయ)డిసెంబర్ 31- మంగళవారం - నూతన సంవత్సర వేడుక/లాసాంగ్/నామ్సూంగ్ (మిజోరం, సిక్కిం) -
రారాజు ఆగమనానికి... ‘అడ్వెంట్’
విశ్వవ్యాప్తంగా క్రైస్తవ విశ్వాస సమాజాలు అన్నీ ఆచరించే పెద్ద పండుగ క్రిస్మస్, క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అని అర్థం. క్రీస్తు జన్మదినం జరుపుకునే డిసెంబర్ 25కి ముందు నాలుగు వారాల నుంచి ముందస్తు క్రిస్మస్ వేడుకలు ప్రారంభిస్తారు. దీనినే ‘అడ్వెంట్’ అంటారు. లాటిన్ భాషలోని అడ్వెంటస్ అనే పదం దీనికి మూలం. అడ్వెంట్ అంటే ఆగమనం/ రాకడ/ ఆహ్వానం అని అర్థం. డిసెంబర్ 24 సాయంత్రంతో అడ్వెంట్ ముగుస్తుంది.అడ్వెంట్ నాలుగు వారాల్లో దేవాలయాల్లో ముందస్తు క్రిస్మస్ వాతావరణం ఏర్పడుతుంది. అడ్వెంట్ తొలి ఆదివారమే పెద్ద నక్షత్రాన్ని అలంకరిస్తారు. ఏసు జననానికి ముందు ఆకాశంలో పుట్టిన కొత్త నక్షత్రానికి గుర్తుగా నక్షత్రాన్ని అలంకరించడంతో క్రిస్మస్ పండుగ వాతావరణం ఏర్పడుతుంది. దేవాలయాల్లోనూ క్రిస్మస్ చెట్టును అలంకరించి రంగురంగుల దీపాలతో అలంకరణలు చేసి ముస్తాబు చేస్తారు. పచ్చని చెట్టు ప్రేమకు, శాంతికి, జీవిత విలువలకు ప్రతీక. అడ్వెంట్ నాలుగు వారాల్లో వరుసగా మూడు వారాలు ఊదారంగు మైనపు వత్తులూ, చివరివారం గులాబి రంగు మైనపు వత్తి వెలిగిస్తారు.ఈ అన్ని రోజుల్లో జరిగే ప్రార్థనలో ప్రేమ –ఆనందం, విశ్వాసం – శాంతికి గుర్తుగా రంగురంగుల మైనపు వత్తులు వెలిగించడం క్రీస్తుశకం 567 నుండి కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ వారు ప్రారంభించారు. ఈ నాలుగు వారాలూ దేవాలయం ప్రధాన పీఠభాగం (ఆల్టార్)ని ఉదారంగు వస్త్రాలతో అలంకరిస్తారు. దేవాలయ అధిపతులు కూడా అదే రంగు వస్త్రాలను ధరిస్తారు. ఊదారంగు రాచరికానికి గుర్తు. రారాజు ఆగమనానికి ఆహ్వానం పలకడానికి సమాజాన్ని సిద్ధం చేయడంలో మతాధిపతులు ప్రార్థనా సమావేశాలు నిర్వహిస్తారు. అడ్వెంట్ కాలమంతా తెల్లవారుజామునే ప్రార్థనలు నిర్వహించి, సమాజానికి క్రిస్మస్ ఆగమన సందేశం ఇస్తారు.అడ్వెంట్ కాలంలోనే క్రిస్మస్ కారల్స్ ప్రధాన భూమిక పోషిస్తాయి. యువకులు, పెద్దలు ఒక సమూహంగా ఏర్పడి ఆ యా గృహాలు సందర్శించి పాటలు, నృత్యాలతో పండుగ ఉత్సాహాన్ని నింపుతారు. ఈ నేపథ్యంలోనే ఆ యా ప్రాంతాల్లోని అనాథలను గుర్తించి వస్త్రాలు, ఆహారం పంచి ఇస్తారు. ‘నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించ’మన్న సందేశం అక్షరాలా పాటిస్తారు. అడ్వెంట్ వల్ల ఏసును హృదయంలో ప్రతిష్టించుకుని తప్పులు పునరావృతం కాకుండా ఆత్మక్షాళనం గావించుకోవడం ప్రధాన కర్తవ్యం. వ్యక్తిగత శుద్ధితో పాటు సమాజ ప్రక్షాళన జరుపుకుని మానవ సమాజమంతా ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఆనందించడం, ఒకరికొకరు చేయూతను అందించుకోవడం అడ్వెంట్ కాలంలో చేయవలసిన కర్తవ్యం.– ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి(నవంబర్ 24న అడ్వెంట్ ప్రారంభం) -
విజయవాడలో క్రిస్మస్ కేక్ మిక్సింగ్ ఈవెంట్ (ఫొటోలు)
-
క్రిస్మస్ రోజు ఉపాసన వేసుకున్న డ్రెస్ అన్ని లక్షలా?
మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. రామ్చరణ్ భార్యగానే కాకుండా స్వతహాగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది ఉపాసన. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ అభిమానులతో టచ్లో ఉంటుంది. ఇటీవలె బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన.. ప్రతీ అకేషన్ను స్పెషల్గా జరుపుకుంటుంది. రీసెంట్గా మెగా ఫ్యామిలి క్రిస్మస్ వేడుకల్లో ఉపాసన వేసుకున్న డ్రెస్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. చూడటానికి చాలా సింపుల్గా కనిపించిన ఆ డ్రెస్ ధర లక్షల్లో ఉండటమే ఇందుకు కారణం.ఈ క్రమంలో ఉపాసన వేసుకున్న డ్రెస్ గురించి నెట్టింట సెర్చ్ చేయగా, కళ్లు చెదిరే ధర చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.గూసీ బ్రాండ్కు చెందిన రెడ్ కలర్ స్కర్ట్లో తళుక్కున మెరిసింది ఉపాసన. చూడటానికి సింపుల్గా కనిపించిన ఈ డ్రెస్ ధర అక్షరాలా రూ. 3,01,545. దీంతో అంత సాదాసీదాగా ఉన్న డ్రెస్కు అన్ని లక్షలు పెట్టి కొన్నారా? అయినా సెలబ్రిటీలు అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఆ డ్రెస్లో ఉపాసన చాలా క్లాసీ లుక్లో కనిపిస్తున్నారంటూ పొగిడేస్తున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
విమానం గాల్లో ఉండగా గందరగోళం.. 11 మంది ప్రయాణికులకు గాయాలు
కరేబియన్ ద్వీపంలోని బార్బడోస్ నుంచి మాంచెస్టర్కు వెళుతున్న విమానం గాల్లో ఉండగా ఊహించని గందరగోళాన్ని ఎదుర్కొంది. విచిత్ర వాతావరణ పరిస్థితులతో విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనయ్యింది. బెర్ముడాలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో 11 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. విమానాన్ని అత్యవసర మళ్లింపు చేయడంతో ప్రయాణికులు క్రిస్మస్ పండగ రోజును, బాక్సింగ్ డేనాడు బెర్ముడాలో గడపాల్సి వచ్చింది. డిసెంబర్ 24న మలెత్ ఏరో ఫ్లైట్ 225 మంది ప్రయాణికులతో బార్బడోస్ నుంచి ఒక గంట ఆలస్యంగా బయలుదేరింది. ఇది ఉదయం 6 గంటలలోపు మాంచెస్టర్కు చేరుకోవాల్సి ఉంది. అయితే బయలుదేరిన రెండు గంటల తర్వాత ఎయిర్బస్ విమానం 38,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు, తీవ్రమైన గందరగోళాన్ని ఎదుర్కొంది. దీంతో పైలెట్లు విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ కోసం దగ్గర్లోని బెర్మాడాకు మళ్లీంచారు. అక్కడ విమానం ల్యాండ్ అవుతుండగా 11 మంది ప్రయాణికులకు స్పల్ప గాయాలయ్యాయి. వీరికి బర్ముడాలో చికిత్స అందించారు. అయితే సిబ్బందికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. -
Mega And Allu Family Christmas Celebration: అల్లు అర్జున్ క్రిస్మస్ పార్టీ.. హాజరైన మెగా ఫ్యామిలీ (ఫొటోలు)
-
రామ్ చరణ్పై ఉపాసన ప్రశంసలు.. పోస్ట్ వైరల్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ చెర్రీకి జోడిగా కనిపించనుంది. అయితే ప్రస్తుతం షూటింగ్కు కాస్తా గ్యాప్ ఇచ్చిన రామ్ చరణ్ ఫ్యామిలీ ఫుల్ టైమ్ గడిపేస్తున్నారు. ఇటీవలే ముంబై వెళ్లిన చెర్రీ దంపతులు శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. తొలిసారిగా తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి ఆలయంలో పూజలు నిర్వహించారు. అంతేకాకుండా మహారాష్ట్ర సీఎంను కలిసి రామ్ చరణ్ దంపతులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. (ఇది చదవండి: మనోజ్-మౌనికల కొత్త వ్యాపారం.. నాలుగున్నరేళ్లుగా సీక్రెట్గా..) అయితే ప్రస్తుతం సినీతారలంతా క్రిస్మస్ ఫెస్టివల్ మూడ్లో ఉన్నారు. ఇప్పటికే మెగా కుటుంబసభ్యులంతా కలిసి ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఉపాసన- రామ్ చరణ్ సైతం తమ గారాలపట్టి క్లీంకారతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. కుటుంబంతో కలిసి పండుగ జరుపకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. Merry Christmas ❤️❤️❤️@AlwaysRamCharan Best dad 🤗 pic.twitter.com/fKnkZIVQ6z — Upasana Konidela (@upasanakonidela) December 26, 2023 -
దుబాయ్లో ఘనంగా క్రిస్మస్ సంబరాలు
దుబాయ్లో ఘనంగా క్రిస్మస్ సంబరాలు జరిగాయి. యూఏఈలో బ్రదర్ సామ్యూల్ రత్నం నీలా ఆధ్వర్యంలో డేరా క్రీక్ ధోవ్ క్రూయిజ్లో క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులు, ఇతర మతస్థులు, వారి కుటుంబాలతో కలిసి వేడుకలను జరుపుకున్నారు. . ఇందులో భాగంగా క్రైస్తవ సంఘాల క్వయర్తో కలిసి అందరూ పాటలు, ప్రార్థనలతో అలరించారు. బ్రదర్ అరవింద్ వుడ్స్-సాక్సోఫోన్, యేసు,మేరి జ్యోతి బృందం వారు క్రిస్మస్ కేరల్స్తో కచేరితో అలరించారు. ఈ కార్యక్రమంలో దుబాయ్లోని వివిధ సంఘాల పాస్టర్స్, సంఘ పెద్దలతో పాటు పాస్టర్లు జాన్ ప్రసాద్, జైకుమార్ రబ్బి తదితరులు హాజరయ్యారు. -
క్రిస్మస్ వేడుకల్లో అలరించిన లైవ్ మ్యూజిక్ బ్యాండ్ (ఫొటోలు)
-
మెగా క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఒక్కచోట కనిపించిన ఆ ఇద్దరు!
క్రిస్మస్ హడావుడి ముగిసింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఈ పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. హీరోయిన్ల నుంచి హాట్ బ్యూటీస్ వరకు దాదాపు ప్రతి ఒక్కరూ ఫొటోలని తమ సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేశారు. ఆల్మ్టోస్ట్ సోమవారమంతా క్రిస్మస్ పిక్సే కనిపించాయి. మిగతా వాళ్ల సంగతి పక్కనబెడితే మెగా ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ పిక్ మాత్రం వైరల్గా మారిపోయింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే) ఏ పండగొచ్చినా సరే మెగా ఫ్యామిలీలో దాదాపు అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా క్రిస్మస్ జరగ్గా.. యంగ్ హీరోలతో పాటు కజిన్స్ అందరూ ఒక్కచోటకు చేరారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా ఒక్కటిగా కనిపించడం.. ఆయా హీరోల అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. ఎందుకంటే గత కొన్నిరోజుల ఈ హీరోల మధ్య బాండింగ్ సరిగా లేదని రూమర్స్ వచ్చాయి. అలానే ఈ ఏడాది చరణ్ పుట్టినరోజున అల్లు అర్జున్ బర్త్ డే విషెస్ చెప్పకపోవడం.. అల్లు అర్జున్కి నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు చరణ్.. సోషల్ మీడియాలో ఏం విష్ చేయకపోవడం తదితర అంశాల వల్ల వీళ్లిద్దరి మధ్య సఖ్యత లేదని అనుకున్నారు. కానీ తాజాగా క్రిస్మస్ సెలబ్రేషన్స్లో వీళ్లు కలిసి కనిపించారు. వరుణ్ తేజ్, నిహారిక, ఉపాసన, అల్లు స్నేహా, లావణ్య త్రిపాఠి, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ కూడా ఈ పిక్లో ఉన్నారు. (ఇదీ చదవండి: Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) -
Merry Christmas: బాల యేసులు ఎందరో యుద్ధంలో మరణిస్తున్నారు
వాటికన్ సిటీ: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ తన సందేశంలో గాజాపై ఇజ్రాయెల్ హేయ దాడులను ప్రస్తావించారు. పాలస్తీనియన్ల అపార ప్రాణనష్టానికి హేతువైన ఇజ్రాయెల్ దాడులను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చి ప్రధాన బాల్కనీ నుంచి సోమవారం పోప్ తన సందేశం వినిపించారు. ‘‘ గాజా సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల్లో బాలలు కన్నుమూస్తున్నారు. వారంతా నేటి తరం బాల యేసులు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు అక్కడి అమాయక పౌరుల నెత్తుటి పంట పండిస్తున్నాయి. ఇజ్రాయెల్పై అక్టోబర్లో హమాస్ మెరుపుదాడి దారుణం. నాడు అపహరించుకుపోయిన వారందర్నీ హమాస్ విడిచిపెట్టాలి. ప్రపంచ ఆయుధ విపణి యుద్ధవీణ తంత్రులను మోగిస్తోంది. గాజా, ఉక్రెయిన్, సిరియా, యెమెన్, లెబనాన్, ఆర్మేనియా, అజర్బైజాన్లలో సైనిక, సామాజిక, రాజకీయ సంక్షోభాలు సమసిపోవాలి. ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల హక్కులు పరిరక్షించబడాలి. గాజా స్ట్రిప్లో మానవతా సాయానికి దారులు తెరచి మానవీయ సంక్షోభాన్ని నివారించాలి’’ అని పోప్ వ్యాఖ్యానించారు. విశ్వవ్యాప్తంగా పెరిగిన ఆయుధ కొనుగోళ్లపై స్పందించారు. ‘‘ఆయుధాల ఉత్పత్తి, కొనుగోలు, రవాణా ఊహకందనంత పెరిగిన ఈ తరుణంలో కనీసం శాంతి అన్న పదం మనం ఉచ్ఛరించగలమా?’’ అని పోప్ ఆవేదన వ్యక్తంచేశారు. -
Russia-Ukraine War: రష్యా సంప్రదాయాలకు ఉక్రెయిన్ ‘నో’
కీవ్: తమ భూభాగంపై దురాక్రమణకు దిగిన రష్యాపై ఆగ్రహంగా ఉన్న ఉక్రెయిన్ శతాబ్దకాలంగా పాటిస్తూ వస్తున్న సంప్రదాయానికీ తిలోదకాలు ఇచి్చంది. వందేళ్లకుపైగా ఉక్రెయిన్ జనవరి ఏడో తేదీనే క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటోంది. రష్యా దండయాత్రతో ఆ దేశంతో శత్రుత్వం మరింత పెంచుకున్న ఉక్రెయిన్.. రష్యాతోపాటు అనుసరిస్తున్న రోమన్లకాలంనాటి జూలియన్ క్యాలెండర్ను పట్టించుకోవద్దని నిర్ణయించుకుంది. ప్రపంచంలో అత్యధిక క్రైస్తవ మెజారిటీ దేశాలు పాటించే గ్రెగోరియన్ క్యాలెండర్ను ఇకపై అనుసరించాలని తుది నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన చట్టానికి ఈ జూలై నెలలోనే దేశాధ్యక్షుడు జెలెన్స్కీ ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం ఈఏడాది తొలిసారిగా డిసెంబర్ 25వ తేదీనే క్రిస్మస్ వేడుకలు ఉక్రెయిన్ అంతటా జరిగాయి. దేశంలో డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ వేడుకలు జరగడం వందేళ్లలో ఇదే తొలిసారి. ఇన్నాళ్లూ రష్యాతోపాటు జూలియన్ క్యాలెండర్ను అనుసరిస్తూ జనవరి ఏడో తేదీన క్రిస్మస్ను జరుపుకుంది. ఈ సంవత్సరంతో ఉక్రెయిన్ కొత్త సంప్రదాయానికి తెరతీసింది. ‘ ఉక్రేనియన్లు సొంత సంప్రదాయాలు, సెలవులు, సొంత పర్వదినాలతో జీవించనున్నారు’ అని ఈ సందర్భంగా జెలెన్స్కీ అన్నారు. ఉక్రెయిన్లో క్రైస్తవ జనాభానే అధికం. ఉక్రెయిన్లో దశాబ్దాలుగా రష్యన్ ప్రాచీన చర్చి సంప్రదాయాలనే ఎక్కువగా పాటిస్తుండటం గమనార్హం. -
Nayanthara And Vignesh Christmas Pics: ట్విన్స్తో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న నయనతార (ఫొటోలు)
-
Hyderabad Christmas Celebrations: వైభవంగా క్రిస్మస్ వేడుకలు (ఫొటోలు)
-
కవల పిల్లలతో నయన్.. భర్తతో కలిసి వేడుకల్లో అమలాపాల్!
►క్రిస్మస్ వేడుకల్లో కవల పిల్లలతో నయన్ ►పెళ్లి తర్వాత తొలిసారి భర్తతో క్రిస్మస్ జరుపుకున్న అమలాపాల్ ►పండుగ వేళ చిల్ అవుతోన్న రాశి ఖన్నా ►కుటుంబంతో కలిసి క్రిస్మస్ వేడుకలో హీరో సుశాంత్ ►తన ఇద్దరు పిల్లలతో లాస్య క్రిస్మస్ సెలబ్రేషన్స్ ►ఫెస్టివ్ మోడ్లో మాళవిక మోహనన్ ►క్రిస్మస్ వేడుకలో తారకరత్న ఫ్యామిలీ View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Sushanth A (@iamsushanth) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
Christmas At PM Modi House Pics: క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ (ఫొటోలు)
-
Niharika Konidela: సీక్రెట్ సాంటాగా మెగా డాటర్.. ఫ్రెండ్స్తో క్రిస్మస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ
ఢిల్లీ: యేసుక్రీస్తు జీవిత సందేశాన్ని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. దయ, సేవాభావం ప్రస్తుత సమాజానికి అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం అందడానికి యేసుక్రీస్తు పనిచేశారని చెప్పారు. సమ్మిళిత సమాజాన్ని రూపొందించడానికి ఆయన పనిచేశారని కొనియాడారు. ఈ ఆలోచనలు దేశ అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. తన నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. "యేసుక్రీస్తు జన్మదినాన్ని మనం క్రిస్మస్ గా జరుపుకుంటాం. ఆయన అందించిన జీవిత సందేశం, విలువలను గుర్తుంచుకోవడానికి ఇది ఒక సందర్భం. దయ, సేవ ఆదర్శాలతో ఆయన జీవించారు. ప్రతి ఒక్కరికి న్యాయం అందే సమ్మిళిత సమాజాన్ని రూపొందించడానికి ఆయన కృషి చేశారు. ఈ ఆదర్శాలు మన దేశ అభివృద్ధికి మార్గదర్శకంగా పనిచేస్తాయి." అని ప్రధాని మోదీ అన్నారు. ప్రసంగంలో భాగంగా పోప్ను కలిసిన సమయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. చిరస్మరణీయ క్షణంగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి సామాజిక సామరస్యం, సోదరభావం, వాతావరణ మార్పు, సమ్మిళిత అభివృద్ధి వంటి అంశాలపై చర్చించామని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: Christmas: దేశమంతటా క్రిస్మస్ వెలుగులు -
Christmas: శ్రీలంక ప్రభుత్వ సంచలన నిర్ణయం
కొలంబో: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పలు నేరాల్లో జరిమానాలు కట్టకుండా జైలు పాలైన వెయ్యికిపైగా మంది ఖైదీలకు క్రిస్మస్ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమసింగే క్షమాభిక్ష ప్రసాదించారు. క్షమాభిక్షపొందిన 1004 మంది ఖైదీలను విడుదల చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. గత వారం దేశంలో డ్రగ్స్పై నిరోధానికి చేపట్టిన యాంటీ నార్కొటిక్ డ్రైవ్లో పోలీసులు ఏకంగా 15 వేల మందిని అరెస్టు చేశారు. వీరిలో 1100 మందిని నిర్బంధ మిలిటరీ పునరావాస కేంద్రంలో ఉంచారు. మిగతా వారిని జైళ్లలో ఉంచారు. దీంతో దేశంలో జైళ్లన్నీ నిండిపోయాయి. ఈ నేపథ్యంలో క్రిస్మస్ను పురస్కరించుకుని 1000 మందిని జైళ్ల నుంచి విడుదల చేయడం చర్చనీయాంశమవుతోంది. గడిచిన శుక్రవారం వరకు దేశంలోని జైళ్లలో 30 వేల మంది ఖైదీలు ఉన్నారు. అయితే దేశంలో ఉన్న జైళ్ల మొత్తం కెపాసిటీ కేవలం 11 వేలేనని జైళ్ల శాఖ అధికారిక గణాంకాలు చెబుతుండడం గమనార్హం. బౌద్ధ మతస్తులు మెజారిటీలుగా ఉండే శ్రీలంకంలో గతంలో బుద్ధ జయంతి రోజు కూడా భారీ సంఖ్యలో ఖైదీలను విడుదల చేశారు. ఇదీచదవండి..హిజాబ్ వివాదం: కర్ణాటక హోం మంత్రి కీలక వ్యాఖ్యలు -
కుటుంబ సభ్యులతో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ (ఫొటోలు)
-
హిమాచల్కు టూరిస్టుల తాకిడి!
హిమాచల్ ప్రదేశ్లో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు పర్యాటకులు లెక్కకుమించి తరలివచ్చారు. సిమ్లా, మనాలి ప్రాంతాలకు.. ఇసుకవేస్తే రాలనంత జనం వచ్చారు. గత మూడు రోజుల్లో నాలుగు లక్షల మంది పర్యాటకులు సిమ్లా, మనాలిలకు తరలి వచ్చారు. సిమ్లాలోని హోటళ్లలో ఆక్యుపెన్సీ 100 శాతానికి చేరుకుంది. సిమ్లా నగరంలోని హోటళ్లు కిక్కిరిసిపోయాయని ట్రావెల్ ఏజెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్ పాల్ తెలిపారు. శనివారం నుండి సోమవారం వరకు సెలవులు రావడంతో ఈ ప్రాంతాల్లో పర్యాటకుల తాకిడి పెరిగింది.ధర్మశాల, సిమ్లా, నర్కండ, మనాలి, డల్హౌసీ తదితర ప్రాంతాలతో పాటు హిమాచల్లో క్రిస్మస్ వేడుకలు చేసుకునేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. సిమ్లా పోలీసులు నగరంలో వాహనాల ప్రవేశ డేటాను విడుదల చేశారు దీని ప్రకారం గత 72 గంటల్లో సిమ్లాకు 55,345 వాహనాలు వచ్చాయి. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు కరోనా ముప్పు పొంచివున్న నేపధ్యంలో రద్దీ ప్రదేశాలలో మాస్క్లు ధరించడం, రెండు గజాల దూరం పాటించడం తదితర మార్గదర్శకాలను ఆరోగ్య శాఖ జారీ చేసింది. మరోవైపు సిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్లో సోమవారం నుంచి వింటర్ కార్నివాల్ ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో కోవిడ్ నిబంధనలపై పర్యాటకులకు అవగాహన కల్పించాలని జిల్లా యంత్రాంగం పలు హోటళ్ల యజమానులకు సూచించింది. ఇది కూడా చదవండి: బూస్టర్ డోసు అవసరమా? నిపుణులు ఏమంటున్నారు? -
Christmas 2023 Celebrations: దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు (ఫొటోలు)
-
Christmas: కళ తప్పిన క్రీస్తు జన్మస్థలం
బెత్లెహాం: క్రిస్మస్ వేడుకలు లేకపోవడంతో పాలస్తీనా వెస్ట్బ్యాంక్లోని క్రీస్తు జన్మస్థలం బెత్లెహాం నగరం కళ తప్పింది. రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులు, నగరంలోని మేంజర్ స్క్వేర్లో చేసే ప్రత్యేక అలంకారాలు ఏవీ కనిపించడం లేదు. ఎక్కడ చూసిన ముళ్ల కంచెలు, శిథిలాలు దర్శనమిస్తున్నాయి. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం కారణంగా క్రీస్తు జన్మించిన బెత్లెహాం నగరంలో ఈసారి క్రిస్మస్ వేడుకలు రద్దు చేశారు. క్రిస్మస్ సందర్భంగా మేంజర్ స్క్వేర్లో విదేశీ టూరిస్టులు, వందల మంది యువకులు చేసే మార్చ్ బ్యాండ్కు బదులు సైనికులు కవాతు చేస్తున్నారు. ‘ఈ ఏడాది బెత్లెహాంలో క్రిస్మస్ చెట్టు లేదు. వెలుగులు లేవు. కేలం చీకట్లే ఉన్నాయి’ అని జెరూసలెంలో ఆరు సంవత్సరాల నుంచి నివసిస్తున్న వియత్నాంకు చెందిన మాంక్ జాన్ విన్ ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్మస్ వేడుకల రద్దు బెత్లెహాం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బెత్లెహాం ఆదాయంలో 70 శాతం విదేశీ పర్యాటకుల నుంచే వస్తుంది. ఇది కూడా చాలా వరకు క్రిస్మస్ సీజన్లో వచ్చే ఆదాయమే. ఇప్పుడు ఈ ఆదాయం లేకపోవడంతో నగరంలోని 70 హోటల్లు మూతపడ్డాయి. వేల మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇదీచదవండి..హిజాబ్ వివాదం: కర్ణాటక హోం మంత్రి కీలక వ్యాఖ్యలు -
వివక్ష లేని వ్యవస్థ
సాక్షి ప్రతినిధి, కడప: పులివెందుల నియోజకవర్గం అభివృద్ధికి నిదర్శనంగా నిలిచిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా రెండోరోజు ఆదివారం పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. సింహాద్రిపురంలో రూ.11.6 కోట్లతో సుందరీకరించిన రహదారులు, జంక్షన్లను తొలుత ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో ఫోర్లైన్ సీసీ రోడ్, బీటీ రోడ్ జంక్షన్లున్నాయి. అనంతరం రూ.5.5 కోట్లతో 1.5 ఎకరాల్లో నిర్మించిన వైఎస్సార్ పార్కును ప్రారంభించారు. రూ.3.19 కోట్లతో నిర్మించిన నూతన తహసీల్దార్ కార్యాలయం, రూ.2 కోట్లతో రూపుదిద్దుకున్న నూతన పోలీసు స్టేషన్, రూ.3.16తో సిద్ధమైన ఎంపీడీవో నూతన కార్యాలయాలు సీఎం చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. వైఎస్సార్ ఘాట్ వద్ద ఉదయం క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఇడుపులపాయ ఎస్టేట్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి పాడా (పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పులివెందుల మండల ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు ప్రభుత్వ ఆశయాల సాధనకు సంపూర్ణ సహకారం అందిస్తున్న ప్రజలకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. సొంత నియోజకవర్గ ప్రజలపై మమకారం, బంధువులు, స్నేహితులు, సన్నిహితులను ఒకేచోట కలిసిన సంతోషంతో సీఎం జగన్ అందరినీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. కలసి చాలా రోజులైంది.. ‘మనమంతా కలసి చాలా రోజులైంది.. ఒకసారి కలిసినట్లుంటుంది.. కష్ట సుఖాలు పంచుకున్నట్లుంటుంది’ అనే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేసినట్లు సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతోందన్నారు. అందుకు అన్ని వర్గాల సమ్మతి, సహకారం ఎంతో అవసరమన్నారు. సచివాలయాల ద్వారా గ్రామ లోగిళ్లలోనే ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను సంతృప్తికరంగా ప్రజలకు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ఎక్కడా వివక్షకు తావివ్వకూడదనేదే మన ప్రభుత్వ సిద్ధాంతమని ముఖ్యమంత్రి తెలిపారు. పరిపాలన పారదర్శకంగా సాగినపుడే వ్యవస్థ పటిష్టంగా సాగుతుందనే విషయాన్ని నాలుగున్నరేళ్లుగా ప్రజలు గుర్తించారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వంపై వారి నమ్మకాన్ని రెట్టింపు చేసేలా సుపరిపాలన కొనసాగిస్తామన్నారు. ‘పాడా’ పరిధిలో పనులపై సమీక్ష.. ‘పాడా’ పరిధిలో అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ వి.విజయ్ రామరాజు ముఖ్యమంత్రికి క్లుప్తంగా వివరించారు. పులివెందుల రూరల్ మండలంలో గ్రామ పరిపాలన సంతృప్తికరంగా సాగుతోందన్నారు. పీబీసీ, సీబీఆర్ మైనర్, మైక్రో ఇరిగేషన్ ఆయకట్టు పరిధిలో దాదాపు 14 వేల ఎకరాలకు పైగా వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగులోకి తెచ్చామన్నారు. రూరల్ పరిధిలో పాడా, ఇతర శాఖల సమన్వయంతో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై పాడా ఓఎస్డీ అనిల్కుమార్రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రూ.44.40 కోట్లతో మంజూరు చేసిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటి వరకు రూ.31.08 కోట్లు వెచ్చించి పలు పనులను పూర్తి చేసినట్లు చెప్పారు. మైక్రో ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ, ఉపాధి హామీ, నాడు–నేడు పనులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో రూ.135.49 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి రూ.58.85 కోట్లు ఖర్చు చేశామని, పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. సీఎం దృష్టికి పలు ప్రతిపాదనలు.. పులివెందుల పరిధిలో చేపట్టాల్సిన ఇతర అభివృద్ధి పనులపై పలువురు మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు అందించారు. సీబీఆర్–ఎర్రబెల్లి నూతన పైప్లైన్ పరిధిలోని మోతున్నూతనపల్లెలో స్టోరేజీ పాయింట్ ఏర్పాటు చేస్తే వేలాది ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుందన్నారు. గవేశ్వరస్వామి ఆలయాన్ని పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయాలని కోరారు. ఎర్రబల్లె చెరువు నుంచి పంపింగ్ ద్వారా చిన్న గుంతలకు నీటిని సరఫరా చేస్తే వ్యవసాయ అవసరాలు తీరుతాయని కొందరు గ్రామస్తులు విన్నవించారు. షాదీ తోఫా, కళ్యాణమస్తు ఆర్థిక సాయాన్ని పెంచి దూదేకుల కుటుంబాలకు ఆర్థిక చేయూతనివ్వడాన్ని నూర్బాషా దూదేకుల సంఘం నాయకుడు మహమ్మద్ రఫీ స్వాగతించారు. సర్టిఫికెట్ల జారీలో నూర్ బాషాలను ముస్లింలుగా గుర్తించాలని కోరారు. పచ్చదనంతో కళకళ.. ‘మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పులివెందుల మండలం పచ్చదనంతో కళకళలాడుతోందని.. ఇదంతా ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వడంతోనే సాధ్యమైంది’ అంటూ పలువురు మండల నాయకులు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా ఎంపీ అవినాష్రెడ్డి ఆధ్వర్యంలో మండలంలో సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని సంతృప్తి వ్యక్తం చేశారు. రిజర్వాయర్ల పరిసర ప్రాంత గ్రామస్తులు, రైతులకు ఇంకా ఏవైనా సమస్యలుంటే పూర్తి వివరాలను అందజేస్తే సంబంధిత అధికారుల ద్వారా త్వరితగతిన చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. అందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ సమీక్షను ముగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, జేసీ గణేష్కుమార్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ సలహా కమిటీ మెంబర్ బలరామిరెడ్డి, మండలాధ్యక్షులు, ఎంపీటీసీలు ఖాదరబాధర వరలక్ష్మి, కొమ్మా వరలక్ష్మి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ సర్వోత్తంరెడ్డి, మాజీ ఉప మండలాధ్యక్షుడు పుష్పనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మానవత్వం పరిమళించి.. సింహాద్రిపురం: వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం సింహాద్రిపురం మండలంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాల అనంతరం తిరిగి వెళ్తుండగా రోడ్డు పక్కన కాగితాలతో నిరీక్షిస్తున్న పలువురు మహిళలను చూసి వాహనాన్ని నిలిపివేశారు. కాన్వాయ్ వేగంగా వెళ్తున్నప్పటికీ వారిని గుర్తించిన సీఎం వాహనాన్ని ఆపాలని ఆదేశించారు. తన పిల్లలకు ఆరోగ్యం సరిగా లేదని, సహాయం చేయాలని ఓ మహిళ కోరగా.. మరో మహిళ తన భర్త చనిపోయారని, సాయం అందించాలని వేడుకుంది. వెంటనే వారికి తగిన సహాయం అందించాలని కలెక్టర్ను సీఎం ఆదేశించారు. తన బిడ్డకు తలలో కణితి ఆపరేషన్కు సాయం చేయాలని తాడిపత్రికి చెందిన ఓ మహిళ అభ్యర్థించడంతో పూర్తి స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. -
మీకోసం సర్ప్రైజ్ గిఫ్ట్!
సాక్షి, హైదరాబాద్: క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. సర్ఫ్రైజ్ గిప్్టలని, పండగ ఆఫర్లు అంటూ బురిడీ కొట్టిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా మీకు ఉచిత బహుమతులు వచ్చాయంటూ వచ్చే మెసేజ్లను, ఫోన్కాల్స్ను నమ్మవద్దని తెలంగాణ సైబర్ బ్యూరో అధికారులు హెచ్చరించారు. అదేవిధంగా నూతన సంవత్సరం పేరిట దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్లు, ఇతర గృహోపకరణాలపై భారీ ఆఫర్లు ఉన్నాయంటూ వచ్చే ఎస్సెమ్మెస్లలోని లింక్లపై క్లిక్ చేయవద్దని వారు సూచిస్తున్నారు. ఇలాంటి లింక్లలో సైబర్ నేరగాళ్లు ఫోన్, ల్యాప్లాప్లలోకి వైరస్ను చొప్పించే ప్రమాదం ఉందని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరించారు. ఎలాంటి కొనుగోళ్లు చేయకుండా కూపన్లు, గిఫ్ట్లు రావన్న విషయాన్ని గుర్తించాలని, ఇలా మన బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలు తీసుకుని అకౌంట్లోని డబ్బులు కొల్లగొట్టే ప్రమాదం ఉందని తెలిపారు. అనుమానాస్పద లింక్లు, ఎస్సెమ్మెస్లపై 1930 టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని లేదా cybercrime.gov.in లోనూ సమాచారం ఇవ్వాలని సూచించారు. -
ఇడుపులపాయ:క్రిస్మస్ ప్రార్థనల్లో సీఎం జగన్
-
పురాతన క్రిస్మస్ సంత! ఎక్కడ జరుగుతుందంటే..?
దక్షిణ అమెరికా దేశమైన పెరులో పురాతనమైన క్రిస్మస్ సంత ఏటా డిసెంబర్ 24న ప్రారంభమవుతుంది. ఈ సంత దాదాపు ఐదువందల ఏళ్లకు పైగా కొనసాగుతోంది. పెరులోని కుస్కో నగరంలో ఏర్పాటు చేసే ఈ సంతకు దేశం నలుమూలలకు చెందిన హస్తకళా నిపుణులు తాము తయారు చేసిన బొమ్మలు, చిత్రపటాలు, ఇతర కళాఖండాలతో చేరుకుంటారు. క్రిస్మస్ రోజు అర్ధరాత్రి వరకు ఈ సంత కొనసాగుతుంది. ‘శాంచురాంటికై’ పేరుతో ఈ సంతను ఏర్పాటు చేయడాన్ని పెరు ప్రజలు పండుగలాగా జరుపుకొంటారు. వీథుల్లో నృత్యగానాలతో ఊరేగింపులు జరుపుతూ సందడి చేస్తారు. ఈ సంతలో రకరకాల పరిమాణాల్లో తయారు చేసిన బాల ఏసు బొమ్మలు, ఏసుక్రీస్తు జన్మించిన పశువులపాక నమూనా బొమ్మలు, ఉయ్యాలలోని ఏసు బొమ్మలు, బాల ఏసును తిలకించడానికి వచ్చిన దేవదూతల బొమ్మలు వంటివి అమ్ముతారు. వెదురు, కలప, పింగాణి, వెండి వస్తువులను, సంప్రదాయకరమైన ఆభరణాలను, క్రిస్మస్ అలంకరణల కోసం ఉపయోగించే ఆలివ్ కొమ్మలు, అడవి మొక్కలు వంటివి కూడా అమ్ముతారు. పెరులో జరిగే ఈ సంతను యూనిసెఫ్ ప్రపంచ వారసత్వ వేడుకగా గుర్తించింది. (చదవండి: మగువ కన్నీళ్ల వాసన పురుషుడులోని దూకుడుతనాన్ని తగ్గిస్తుందా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
ఆ ప్రభుండు పుట్టెను.. బేత్లెహేమునందున!
‘రక్షకుండు ఉదయించినాడట... మనకొరకు పరమ రక్షకుండు ఉదయించినాడట. పశువుల తొట్టిలోన భాసిల్లు వస్త్రములజుట్టి... శిశువును కనుగొందురని శీఘ్రముగను దూత తెల్పె’ అంటూ ఎముకలు కొరికే చలిలో రక్షకుని ఆగమన వార్తను పాడుకుంటూ, అనేకుల హృదయాలలో క్రిస్మస్ ఉల్లాసాన్ని నింపి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ మీటింగ్ నుంచి ఇంటికి బయలుదేరారు పాస్టర్ సైలస్. ఆయన దగ్గరకు ఓ ఖరీదైన కారు వచ్చి ఆగింది. దానిలో నుంచి ఒక ఘనమైన స్త్రీ దిగి పరుగు పరుగున పాస్టర్గారి దగ్గరకు వచ్చి ‘అన్నయ్యా బాగున్నారా!’ అంటూ ఆప్యాయంగా పలకరించింది. ఆమె చుట్టూ కొంతమంది అంగరక్షకులు కూడా ఉన్నారు. సామాన్య జనులంతా చాలా వింతగా చూస్తున్నారు. ఆమెను చూచి ‘బాగున్నానమ్మా! మీరెవరో గుర్తుకురావడం లేదు, కొంచెం పరిచయం చేసుకుంటారా?’ అడిగాడు. ‘నేనెవరో తెలుసుకోవాలనుకుంటే మీరొక పదేళ్లు వెనక్కు వెళ్ళాలి. యేసును నా సొంత రక్షకునిగా అంగీకరించిన ఆ మధుర రాత్రిని నేనెన్నడు మరువలేను. గురి, దరి లేని నా జీవితాన్ని మలుపుతిప్పి జ్యోతిర్మయుడైన ప్రభువు గొప్పదనాన్ని చాటి చెప్పడానికే ఈరోజు మీ ముందుకొచ్చాను. ఒకప్పుడు రోగిగా, అనాథగా, మోసపోయిన వనితగా, మృత్యువు ఒడిలో చేరిన అబలగా మీ దరికి చేరిన నన్ను– ఊహించలేని పరలోకపు ప్రేమతో ఆదరించి నన్ను తన కుమార్తెగా స్వీకరించి పరలోకపు ఔన్నత్యమును అనుగ్రహించాడు నా ప్రభువు. నాడు అభాగ్యురాలిగా నిలిచిన నన్ను ఉన్నత ఉద్యోగిగా, అర్హతలేని నన్ను ఎన్నో కృపలకు అర్హురాలుగా హెచ్చించాడు. నిజమైన క్రిస్మస్కు గుర్తుగా, సాక్షిగా నేను నేడు మీముందున్నాను’ అంటూ ఆనందబాష్పాలతో తనను తాను పరిచయం చేసుకుందామె. ‘ఆరోజు అర్ధరాత్రి మీ ఇంటి దగ్గర ఒక శవంలా పడి ఉండగా మీరే నన్ను క్రీస్తు ప్రేమద్వారా బతికించారు’ అని ఆమె వివరిస్తుండగా సైలస్గారు కాస్త ఉద్వేగానికి గురై ‘ఆ!... గుర్తొచ్చావమ్మా! కవితా, నువ్వా!’ అంటూ గతాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దైవ సేవకుడు పాస్టర్ సైలస్ వివాహం జరిగిన తరువాత తన భార్యతో కలిసి ఊరవతల ఒక చిన్న ఇంట్లో ఉంటూ సేవ ప్రారంభించాడు. భార్యాభర్తలిద్దరూ ఒక క్రిస్మస్ కూడికను ముగించుకొని ఆ అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నారు. కడుపు ఆకలితో అలమటిస్తున్నా, హృదయమంతా ప్రభువు నామస్మరణ ఉల్లాసంతో ఉరకలు వేస్తుంటే ఆ రోజు ఆ పశువుల పాకలో దూతలు పాడినట్లు ‘క్రీస్తు జన్మించాడు, రక్షకుడు ఉదయించినాడు’ అంటూ పాట పాడుకుంటూ గేటు తీసుకొని లోపలికి అడుగుపెట్టారు. ఒక స్త్రీ తమ ఇంటి ముందు పడి ఉండటం చూసి అవాక్కయ్యారు. అర్ధరాత్రి సమయంలో ఈ స్త్రీ ఇక్కడకు రావడమేంటి? సైలస్ గారి మదిలో చాలా ప్రశ్నలు.. అసలు ఎవరీమె? ఏమైంది? ఈమె బాధేమిటో, కథేమిటో? ఏమీ అర్థంకావట్లేదు. ఏ స్థితి లోనైనా మనం అడగగానే ప్రార్థించగానే జవాబిచ్చే పరమతండ్రి మనకు తోడున్నాడు కదా! ‘నాకు మొఱపెట్టుము నీకుత్తరమిచ్చెదను’ అని బైబిల్లో రాయబడిన మాట ఆ భార్యాభర్తలకు గుర్తుకొచ్చింది. ప్రేమ నిండిన హృదయంతో మెల్లగా ఆ స్త్రీ వద్దకు వచ్చి ఆమె మీద నీళ్ళు జల్లగానే ఆమె తేరుకుంది. భార్యాభర్తలిద్దరూ ఆమె చేయి పట్టుకొని పైకి లేవనెత్తి ఇంటిలోకి తీసుకెళ్ళారు. తీవ్రమైన జ్వరంతో ఆమె ఒళ్ళు కాలిపోతోంది. చలితో వణకిపోతున్న ఆమెకు వెచ్చని రగ్గు కప్పి తాము సిద్ధపరచుకున్న కొద్దిపాటి ఆహారం ఆమెకు ఇచ్చారు. గ్లాసుడు పాలు తాగించి, రాత్రంతా ఆమెకు పరిచర్య చేస్తూ ఆమె కోసం ప్రార్థించసాగారు. కవిత ఆ రాత్రి ఆ ఘనమైన దైవజనుల నీడలో స్వస్థత, సాంత్వన పొందింది. సూర్యుని లేలేత కిరణాలు మీద పడగా నిశీధి రాత్రి భీకర ఛాయలన్నీ మరచి ఉదయ కాంతులను ఆస్వాదిస్తూ నిద్రలేచింది. మెల్లగా పాస్టర్ సైలస్ గొంతు సవరించుకొని ‘ఏమీ భయపడకు. నీకొచ్చిన కష్టమేంటో మాతో పంచుకో! చేతనైనంత సహాయం నీకందిస్తాము’ అని ప్రభువు ప్రేమతో కవితను ఆదరించారు ఆ ఆదర్శ దంపతులు. ఆ మాటలు విన్న కవిత కృతజ్ఞతతో భోరున ఏడ్వసాగింది. ‘ముక్కూ మొహం తెలియని నన్ను, అభాగ్యురాలనై, రోగంతో, ఆకలితో బాధపడుతున్న నన్ను క్రీస్తు ప్రేమతో ఆదరించి ఆశ్రయించి అక్కున చేర్చుకొని క్రిస్మస్కు శ్రేష్ఠమైన అర్థాన్ని చెప్పారు. నా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క గారాలపట్టిగా ఉన్న నేను యౌవనాశలకు లొంగిపోయి ఒక కిరాతకుని ఉచ్చులోపడి, నమ్మి మోహించి వాడి చెంతకు చేరాను. వాడు నా బలహీనతను ఆధారంగా చేసుకొని దొడ్డిదారిన నన్ను ఒక వేశ్యాగృహానికి తాకట్టుపెట్టబోయాడు. విశ్వప్రయత్నాలు చేసి వాడి చెర నుంచి బయటపడ్డాను. గత ఐదు రోజుల నుంచి ఆ రైలు ఈ రైలు ఎక్కి ఈ పట్టణంలో ప్రవేశించాను. నా అన్నవారు లేక ఈ రోడ్డుమీద తిరుగుతూ ఎంగిలి విస్తరాకులు నాకుతూ డ్రైనేజీ నీళ్ళను కూడా తాగడానికి వెనుకాడక అత్యంత హీన, దీనస్థితికి దిగజారిపోయాను. ఈ బతుకుని బతకలేక విషం తాగి శవంగా మారిపోవాలని ఓపిక తెచ్చుకొని పయనమౌతుండగా గత రాత్రి క్రిస్మస్ కార్యక్రమంలో మీరు అందించిన క్రీస్తు ప్రభువు మాటలు దూరంగా నిలబడి విన్నాను. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అని మీరు చెబుతుంటే కన్నీటితో నా స్థితిని దేవునితో చెప్పుకున్నాను. క్రిస్మస్ కాంతులన్నీ నా జీవితంలో విరజిమ్మాయి. నాకోసం ఒక రక్షకుడు జన్మించాడన్న వార్త నాకు ఎంతో బలాన్నిచ్చింది. రక్తం కక్కుతూ అత్యంత భయానకంగా ఉన్న నా పరిస్థితి ఒక్కసారిగా చక్కదిద్దబడింది. నా హృదయంలో యేసయ్య చేరిన మరుక్షణం నా పాపాంధకార ఛాయలు మటుమాయమైపోయాయి. నా పాపఫలితమే ఇదంతా అని గుర్తించగలిగాను. నా ప్రతీ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాను. నా మనస్సులో గొప్ప ఆనందం, ఆదరణ, సమాధానం కలిగాయి. మీచెంతకు చేరి నా బాధంతా వెళ్ళబుచ్చుకొని తిరిగి నా తల్లిదండ్రుల వద్దకు చేరాలనే ఆశతో అతికష్టం మీద మీ అడ్రస్ సంపాదించి మిమ్ము చేరుకోగలిగాను. మీకెంతో బాధ కలిగించాను, ఇబ్బందిపెట్టాను. కానీ మీరే నాకు ఆ సమయంలో దిక్కనిపించారు. మీ వద్ద నుంచి వెళ్ళిన తదుపరి జీవంగల దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. దేవుని మాటలు హృదయంలో ఉంచుకొని నా తల్లిదండ్రులను చేరుకున్నాను. నన్ను నా బంధువులు ఏరికోరి వారి కోడలుగా చేసుకున్నారు. నా భర్త ఒక గొప్ప ప్రభుత్వ అధికారి. ఆయన నన్ను ప్రోత్సహించి బాగా చదివించి ఒక డాక్టరుగా చేయగలిగారు. ఆ రాత్రి మీరు ఏర్పాటు చేసిన క్రిస్మస్కు దేవుని సన్నిధికి రాకుండా ఉండుంటే, ఆ మాటలు వినకుండా వుండుంటే ఆ రాత్రే నేను దిక్కులేని చావుతో శవమైపోయేదాన్ని లేదా చిరిగిన విస్తరిలా నా జీవితం మారిపోయేది. క్రిస్మస్ మాధుర్యాన్ని నాకు కనపరిచి నవ్యకాంతులమయమైన జీవితంగా నన్ను చేసినందుకు మీకేమిచ్చినా ఋణం తీర్చుకోలేను’ అంటూ ఉండగా పరవశంలో నిండిపోయాడు దైవజనుడు సైలస్. క్రిస్మస్ అసంఖ్యాక జీవితాల్లో నిర్మలమైన వెలుగులు నింపింది. క్రీస్తు జన్మించినప్పుడు బేత్లెహేము పొలాల్లో తమ మందను కాచుకొనుచుండగా దేవుని దూత వారిని దర్శించింది. ఓ గొప్ప వెలుగు వారిని ఆవరించింది. ‘రక్షకుడు పుట్టియున్నాడు’ అనే వార్తను వారు విని యేసు దర్శించి పునీతులయ్యారు. క్రిస్మస్ అనుమాటకు క్రీస్తును ఆరాధించుట అని అర్థము. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది కుల మతాలకు అతీతంగా క్రిస్మస్ను ఒక పండుగగా ఆచరిస్తున్నారు. రక్షకుడైన యేసుక్రీస్తు సర్వమానవాళిని రక్షించడానికి భువిపై అరుదెంచిన శుభదినము క్రిస్మస్.యేసుక్రీస్తు శరీరధారిగా రెండువేల సంవత్సరాల క్రితం బేత్లెహేము గ్రామంలో జన్మించాడు. యేసుక్రీస్తు చరిత్రలో కనిపిస్తారా అనే సందేహం కొంతమందిలో ఉండవచ్చు. యేసుక్రీస్తు ఉనికిని ప్రశ్నించిన పంతొమ్మిదో శతాబ్దానికి చెందిన బ్రూనో బార్ అనే జర్మన్ చరిత్రకారుడు ఇలా అంటాడు. ‘యేసు గ్రీకోరోమన్ తత్వజ్ఞానం ద్వారా ప్రభావితం చెందిన మొదటి శతాబ్దపు ప్రజల యొక్క మానసిక ఆవిష్కరణే గాని వాస్తవం కాదు. కొత్తనిబంధన ఒక పురాణమే గాని వాస్తవిక ఆధారాలతో లిఖించబడినది కాదు.’ దీనికి సమాధానంగా ప్రపంచప్రఖ్యాత చరిత్రకారుడు ఇ.ఎఫ్. హ్యారిసన్ ఇలా అంటాడు: ‘ప్రపంచంలోని చాలా విషయాలకు చారిత్రక ఆధారాలు లేవు. అవి వాస్తవ సంఘటనలపై కాకుండా కేవలం మనుషుల ఆలోచనలపై ఆధారపడి ఉన్నవి. క్రైస్తవ్యం అటువంటిది కాదు.’ క్రీస్తు రక్షకుడు, దేవుడు అని మొదటి, రెండవ శతాబ్ద కాలపు చరిత్రకారులు ఒప్పుకోక తప్పలేదు. అందులో అత్యంత ప్రధానమైనవాడు ఫ్లావియస్ జోసెఫస్. ఇతడు ఒక యూదా యాజక కుటుంబానికి చెందినవాడు, రోమీయులకు వ్యతిరేకంగా జరిగిన మొదటి యూదా తిరుగుబాటులో గలిలయలోని దళమును నడిపిన వ్యక్తి. అతడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రెండు గ్రంథాలు– ‘ద జ్యూయిష్ వార్స్’, ‘జ్యూయిష్ యాంటిక్విటీస్’ రచించాడు. ఫ్లావియస్ అనే పేరు రోమా పేరు కాగా జోసఫస్ అనే పేరు తన యూదు పేరు. అతడు ఇలా అంటాడు: ‘దాదాపు అపుడు అదే కాలంలో యేసు అనే ఒక మనుష్యుడు ఉండేవాడు. అతనిని మనుష్యుడు అని పిలవవచ్చునో లేదో తెలియదు. అతడు అద్భుతమైన కార్యములు చేయువాడై ఉండి సత్యమును సహృదయంతో అంగీకరించువారికి బోధకునిగా ఉన్నాడు. తనవైపు అనేకమంది యూదులను అనేకమంది అన్యులను ఆకర్షించుకున్నాడు. ఆయనే క్రీస్తు. మనలోని ప్రముఖుల సూచనల మేరకు పిలాతు అతనికి సిలువ శిక్ష విధించినప్పుడు ఆయనను మొదట ప్రేమించినవారు ఆయనను విడిచిపెట్టలేదు. ఎందుకనగా ఆయన వారికి చనిపోయి మూడవ దినమున సజీవముగా అగుపడినాడు. ఆయన నుంచి పేరు సంతరించుకున్న క్రైస్తవులనే తెగ నేటికి అంతరించలేదు.’ ఫ్లావియస్ జోసఫస్ రాసిన సంగతులు నేటికినీ చరిత్రకు ఆధారముగా ఉన్నవి. అలాంటి గొప్ప చరిత్రకారుడు యేసుక్రీస్తు జననాన్ని, మరణాన్ని, పునురుత్థాన్ని కూడా ఒప్పుకున్నాడు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు జనన, మరణ, పునరుత్థానముల గురించి సవివరంగా ఉంది. ఆ సువార్తికులు ఎవరనగా... మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఇంగ్లండు దేశానికి చెందిన బైబిల్ పండితుడు జాన్ రాబిన్సన్ సువార్తలపై విస్తృత పరిశోధన చేశాడు. ‘యేసుక్రీస్తు దైవత్వాన్ని, మానవత్వాన్ని ప్రచురపరచే సువార్తలన్నీ క్రీస్తుశకం 70వ సంవత్సరం లోపే వ్రాయబడ్డాయి. అనగా యేసుక్రీస్తు ప్రభువు మరణించి, పునరుత్థానుడైన 40 సంవత్సరాల లోపే సువార్తలు, నూతన నిబంధనలోని చాలా పత్రికలు వ్రాయబడ్డాయి. ప్రపంచంలో దైవ గ్రంథము అని పిలువబడుతున్న ఏ గ్రంథము ఇంత తక్కువ వ్యవధిలో వ్రాయబడలేదు. మత్తయి ఒక సుంకపు గుత్తదారుడు. మార్కు పరిస్థితులన్నీ అవగాహన చేసుకొన్న ఒక మంచి యవ్వనస్థుడు. లూకా ప్రసిద్ధిగాంచిన ఒక వైద్యుడు. యోహాను యేసుక్రీస్తు ప్రియ శిష్యుడు. వీరందరూ క్రీస్తు జీవిత చరిత్రను వ్రాసారు. వాస్తవ సంగతుల ఆధారాలతో సువార్తలు వ్రాయబడ్డాయి గనుక ఎక్కడా కూడా భావ విరుద్ధమైనవి బైబిల్లో కనిపించవు’ అని జాన్ రాబిన్సన్ రాశాడు. యేసు శిష్యుడైన యోహాను నిర్ద్వంద్వంగా ఈ సత్యాన్ని వెల్లడిచేశాడు. ‘జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది యుండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను’– (1 యోహాను 1:1,2). క్రీస్తుకు పూర్వం ఏడు వందల సంవత్సరాలకు ముందు యెషయా అనే ప్రవక్త ఇలా ప్రవచించాడు. ‘కన్యక గర్భవతియై కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదువు’. ఇమ్మానుయేలు అనుమాటకు దేవుడు మనకు తోడు అని అర్థము. క్రీస్తు గురించి ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలన్ని చరిత్రలో నెరవేర్చబడ్డాయి. మీకా అనే మరొక ప్రవక్త యేసు ‘బేత్లెహేము’లో జన్మిస్తాడని చెప్పాడు. ఆ మాట చెప్పబడిన కొన్ని వందల సంవత్సరాల తరువాత యేసు సరిగ్గా అదే గ్రామంలో జన్మించాడు. ఆయన పుట్టినప్పుడు నక్షత్రం కనబడుతుందని, జ్ఞానులు ఆయన్ను వెదుకుతూ వస్తారని, క్రీస్తు ఆగమనాన్ని జీర్ణించుకోలేని హేరోదు రోదనధ్వనికి కారణమౌతాడని ఎన్నో విషయాలు ముందుగానే చెప్పబడ్డాయి. ఈ ప్రవచన నెరవేర్పు ప్రపంచానికి నేర్పించే పాఠము ‘క్రీస్తు ఒక ప్రవక్త కాదుగాని, ప్రవక్తలు ఎవరిగూర్చి ప్రవచించారో ఆ ప్రవచనాల సారము.’ బైబిల్లోని యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వచనాన్ని గమనిస్తే ‘రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు’ అనే మాట యేసుప్రభువు పుట్టిన తర్వాత జ్ఞానులు ఆయనను దర్శిస్తారు అనడానికి నిదర్శనంగా కనబడుతుంది. యేసు పుట్టిన తర్వాత గొఱ్టెల కాపరులు, జ్ఞానులు ఆయనను దర్శించడానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు సర్వలోకాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు గనుక ఆయన అందరికీ కావలసినవాడు అనే విషయాన్ని ఈ సంఘటన ద్వారా మనము గ్రహించగలము. జ్ఞానులు యేసుప్రభువును వెదుక్కుంటూ వచ్చి బంగారమును, బోళమును, సాంబ్రాణిని అర్పించారు. వారు బాలుడైన యేసుక్రీస్తు ప్రభువుముందు మోకరిల్లి, సాగిలపడి పూజించారు. జ్ఞానులు వివిధ దేశాల నుంచి, వివిధ సంప్రదాయాలను అనుసరిస్తున్న వారిలో నుంచి యేసుప్రభువును వెతుక్కుంటూ మొదటిగా యెరూషలేముకు వచ్చారు. ఆ తర్వాత బేత్లెహేముకు వెళ్ళి యేసుప్రభువును దర్శించారు. జ్ఞానులు నక్షత్రం ద్వారా నడిపంచబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించారని, రక్షకుడు ఉదయించాడు అనే సత్యం వారు ఆకాశంలో వెలసిన నక్షత్రం ద్వారా తెలుసుకోగలిగారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ‘రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేమునందు యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పుదేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదులరాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి’– (మత్తయి 2:12). తూర్పుదిక్కున నక్షత్రపు దిశను చూసి, నక్షత్ర పయనాన్ని చూసి వారు సుదూర ప్రాంతాలు ప్రయాణం చేసుకుంటూ యెరూషలేము వచ్చారంటే వారికి ఖగోళశాస్త్రం మీద పట్టువుంది అని ఇట్టే మనకు అర్థమవుతుంది. అయితే జ్ఞానులను నడిపించిన ఈ నక్షత్ర మర్మమేమిటి? శాస్త్రవేత్తలలో కొన్ని అభిప్రాయాలు వెల్లడించబడ్డాయి. యేసు పుట్టిన మొదటి శతాబ్దం నుంచి ఈ బేత్లెహేము తారను గూర్చి జ్ఞానులకు అగుపడిన నక్షత్రమును గురించి పండిత వర్గాలలో విపరీతమైన చర్చ జరిగింది. అయితే కొందరు కొన్ని రకాలైన అభిప్రాయాలను వెల్లడిచేశారు. మొదటిగా సూపర్నోవా. ఈ నక్షత్రం తెల్లటి కాంతితో మిరుమిట్లు గొలుపుతూ పేలిపోతూ ఉంటుంది. నక్షత్రాలు అప్పుడప్పుడు విస్ఫోటం చెందుతూ ఉంటాయి. ఈ విస్ఫోటం వలన ఆ నక్షత్రం కాంతి నేల నుంచి లక్షల రెట్లు పెరుగుతూ ఉంటుంది. అకస్మాత్తుగా ఆకాశంలో నక్షత్రం కనబడుతుంది. గొప్ప వెలుగు ఆకాశంలో కనబడుతుంది. అయితే వాస్తవాన్ని పరిశీలన చేస్తే ఈ సూపర్నోవా విస్ఫోటం చెందినప్పుడు ఎక్కువకాలం కనిపించే అవకాశాలు ఉండవు. దీన్నిబట్టి యేసుప్రభువు పుట్టినప్పుడు నక్షత్ర విస్ఫోటం జరగలేదు. రెండవ అభిప్రాయం– హేలీ తోకచుక్క కనబడిందని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. క్రీస్తు పూర్వము 5వ సంవత్సరంలో మార్చి, ఏప్రిల్ నెలలో కొత్త నక్షత్రం ఒకటి కనబడినట్లుగా చైనా దేశం వారు తమ చరిత్రలో రాసుకున్నారు. అయితే ఆ నక్షత్రం తోకచుక్కా లేదా సూపర్నోవా అనే విషయాన్ని వారు గుర్తించలేకపోయారు. వాస్తవానికి తోకచుక్కల గురించి మనకందరికీ విదితమే! తోకచుక్కలు ప్రతి నిర్ణీత కాలానికోసారి ఆకాశంలో కనబడుతుంటాయి. ఉదాహరణకు హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి కనబడుతూ ఉంటుంది. అయితే శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం హేలీ తోకచుక్క క్రీస్తు పూర్వము 12 సంవత్సరంలో కనబడింది గనుక హేలీ తోకచుక్క కనబడిందనేది గూడా ఒక అవాస్తవంగా మనం గ్రహించాలి. మూడవది శాస్త్రవిజ్ఞాన రంగంలో యేసుప్రభువు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం పుట్టింది అని బైబిల్ చెప్పినప్పుడు దానికి చాలా దగ్గరగా ఉన్న వ్యాఖ్యానం– గ్రహకూటమి. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త జోహనెస్ కెప్లెర్ 1607వ సంవత్సరంలో యేసుప్రభువు ఈ లోకంలో పుట్టినప్పుడు ఉదయించిన నక్షత్రం గురించి పరిశోధన చేశాడు. ‘యేసుప్రభువు ఈ లోకంలో పుట్టినప్పుడు ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది. బృహస్పతి, శని మరియు అంగారకుడు– ఈ మూడు గ్రహాలు కూడా ఒకే కక్ష్యలోనికి వచ్చి ఒక బ్రహ్మాండమైన వెలుగును విడుదల చేశాయి. ఈ మూడు గ్రహాలు కూడా ఒక కక్ష్యలోనికి రావడం ద్వారా గొప్ప వెలుగు పుట్టి అది జ్ఞానులను నడిపించింది’ అని జోహనెస్ కెప్లెర్ వివరణనిచ్చాడు. ఆకాశంలో నక్షత్రం పుట్టినదానికి శాస్త్రయుక్తమైన వివరణ కావాలంటే జోహనెస్ కెప్లెర్ ఇచ్చిన వివరణ అత్యంత దగ్గరగా ఉంది. అయితే ఆకాశంలో నక్షత్రం పుట్టడమనేది అసాధారణ కార్యమే. అయితే దేవునికి అసాధ్యమైనదేదీ లేదు గనుక ఆయన ఒక అద్భుతాన్ని ఆకాశంలో జరిగించి జ్ఞానులను నడిపించాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి. అయితే ఈ రోజుల్లో శాస్త్రం దేనికైనా ఋజువులడుగుతుంది, వివరణలడుగుతుంది గనుక జోహనెస్ కెప్లెర్ ఇచ్చిన వివరణ శాస్త్రయుక్తంగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో పుట్టినప్పుడు వెలసిన నక్షత్రానికి దగ్గరగా ఉంది.అయితే విచిత్రమేమిటి అంటే నక్షత్రం జ్ఞానులను యేసుప్రభు వున్నచోటికి నడిపించింది. వారు చదువుకున్న చదువు వారు సంపాదించిన జ్ఞానం వారిని ప్రభువు దగ్గరికి నడిపించడానికి ఉపయోగపడింది. వారు నక్షత్రం ద్వారా నడిపించబడి యెరూషలేముకు వచ్చి ఆకాలంలో యూదులను పరిపాలిస్తున్న హేరోదు రాజు వద్దకు వచ్చి తామెందుకు వచ్చారో వివరించారు. వారి రాకకు గల కారణాన్ని విని హేరోదు, అతనితో పాటు యెరూషలేము నివాసులు కలవరపడ్డారు. ‘హేరోదు జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారిచేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే నేనునూ వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండి అని చెప్పి వారిని బేత్లెహేముకు పంపెను’– (మత్తయి 2:68). ఇక్కడ హేరోదు రాజులో ఉన్న దుర్భుద్ధి కనబడుతుంది. హేరోదు దేవుని ఆరాధించాలి అనే ఉద్దేశంతో లేడు. అయితే పైకి కనిపించడం మాత్రం ప్రజలందరికీ నేను కూడా పూజిస్తాను, నేను కూడా ఆరాధిస్తాను అని చెబుతున్నాడు కానీ అతని మనసులో భయంకరమైన స్వభావం దాగియుంది. కలవరపడినవాడు దేవుడిని చంపాలనే చూశాడు తప్ప ఆయనను రక్షించాలని, పూజించాలనే ఉద్దేశం అతనిలో లేదు. హేరోదు భయంకరమైన వేషధారిగా కనబడుతున్నాడు. పైకి ఒకలా మాట్లాడటం, లోపల మరొక తత్వాన్ని కలిగియుండటం. పైకి మనుషులను ఒప్పించేలా మాట్లాడటం, లోపల ఆ దేవుడిని సమూల నాశనం చేయాలనే తలంపును కలిగి ఉన్నాడు. ఇది భయంకరమైన వేషధారణ. అందునుబట్టే వేషధారులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. జ్ఞానులు తమ పెట్టెలు విప్పి యేసుకు కానుకలు అర్పించారు. బంగారము, సాంబ్రాణి, బోళమును సమర్పించారు. వారు అర్పించిన కానుకలలో గొప్ప ఆధ్యాత్మిక విషయాలు దాగి ఉన్నాయి. బంగారము దైవత్వానికి, సాంబ్రాణి ఆరాధనకు, బోళము స్వస్థతకు సంకేతాలు. ఆ తదుపరి వారు దేవుని చేత బోధించబడినవారై వారి దేశమునకు ఒక నూతన మార్గములో తిరిగి వెళ్ళారు. దేవుని చేత బోధించబడటం మానవ జీవితానికి చాలా ఆశీర్వాదకరం. మాకన్నీ తెలుసులే, మేము కూడా జ్ఞానం కలిగినవారం, నక్షత్ర పయనాన్ని చూసే మేము దేవుడిని కనుగొనటానికి వచ్చాము గనుక ఇకపై మా జ్ఞానం, మా తెలివి, మా వివేచన ద్వారా నడుస్తాము; మా అంతటి జ్ఞానవంతులు మరొకరు లేరు, మేము ఎవరి మాట వినక్కర్లేదు అని జ్ఞానులు అనుకోలేదు గాని దేవునిచేత బోధించబడినవారై ఆ బోధకు అనుకూలంగా వారు స్పందించారు. ఆ బోధనను అనుసరించి వారు మరొక మార్గానికి తిరిగి వెళ్ళారు. మాకన్నీ తెలుసులే మాకు తెలిసిందే మేం చేస్తాం, దేవుని స్వరాన్ని మేము వినాల్సిన అవసరం మాకు లేదు అని గనుక వారు హేరోదు దగ్గరకు వెళ్ళి ఉంటే పరిస్థితులు వేరేగా ఉండేవేమో గాని, దేవుని మాటకు వారు లోబడటం ద్వారా మనకందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. ఆనాటి ఖగోళ శాస్త్రజ్ఞులు యేసుక్రీస్తు ప్రభువును ఏవిధంగా ఆరాధించారో, అటువంటి ఓ అద్బుత ఘటన మానవ చరిత్రలో 20వ శతాబ్దంలో చోటు చేసుకుంది. సువిశాల ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో అపూర్వ సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాటిలో ఓ అరుదైన ఘట్టం ఇది. 1969 జూలై 20న అపోలో– 11 అనే రాకెట్ మీద అక్షరాల 2లక్షల 20వేల మైళ్ళు ప్రయాణం చేసి అమెరికా దేశపు శాస్త్రవేత్తలు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకేల్ కొలిన్స్ మొట్టమొదటిగా చంద్రునిపై కాలుమోపారు. ఖగోళ శాస్త్రంలో ఓ నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించారు. ఈ శాస్త్రవేత్తలు చంద్రుని మీద అడుగుపెట్టి దేవుని అద్భుత సృష్టి గొప్పతనాన్ని చూసి మనసారా మహనీయుడైన దేవుని స్తుతించారు. అక్కడకు వెళ్ళి బైబిల్లోని 121వ కీర్తనను జ్ఞాపకం చేసుకున్నారని చెబుతారు. దానిలో ‘నిన్ను కాపాడువాడు’ అనే మాట ఆరుసార్లు వ్రాయబడింది. ఒక మైక్రో బైబిల్ను చంద్రునిపై ఉంచి తిరిగి వచ్చారు. చంద్రుని నుంచి తిరుగు ప్రయాణం చేసి భూమి మీదకు వచ్చిన తరువాత నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే శాస్త్రవేత్త తన ఉద్యోగానికి రాజీనామా చేసి, తన మరణ పర్యంతం దేవుని సేవలో కొనసాగి ప్రభువు రాజ్యానికి వెళ్ళిపోయాడు. దేవుని సృష్టి ఇంత అద్భుతంగా ఉంటే దేవాదిదేవుడు ఇంకెంత అద్భుతమైనవాడో కదా! నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తర్వాత చాలామంది చంద్రుని మీదకు వెళ్ళివచ్చారు. అదే ప్రక్రియలో 1971వ సంవత్సరంలో జేమ్స్ బి. ఇర్విన్ అనే శాస్త్రవేత్త కూడా చంద్రుని మీదకు వెళ్ళి కొన్ని పరిశోధనలు చేసివచ్చారు. వచ్చేటప్పుడు అక్కడి నుంచి మట్టి, కొన్ని రాళ్ళు తీసుకు వచ్చారు. జేమ్స్ బి ఇర్విన్ కూడా తన జీవితాన్ని ప్రభువు సేవకు అంకితమిచ్చి ప్రపంచమంతా తిరిగి దేవుని సువార్తను ప్రకటించాడు. ఈ లోకంలో దేవుని సేవను మించిన పని మరొక్కటి లేదని నిరూపించాడు. అతను ఎక్కడికి వెళ్ళినా గొప్ప సన్మానాలు లభిస్తున్నాయి. ప్రజలందరూ పోటీలు పడి కరచాలనం చేస్తున్నారు. రెడ్ కార్పెట్లు పరుస్తున్నారు. అటువంటి గొప్ప శాస్త్రవేత్త భారతదేశాన్ని సందర్శించి చాలా ప్రాంతాలు పర్యటించారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో అనేక ప్రాంతాలు సందర్శించి సువార్త ప్రకటించి దేవుని నామమును మహిమపరచాడు. ప్రతి సభలో ఆయన ప్రకటించిన సత్యం... ‘నేను చంద్రునిపై కాలుపెట్టి వచ్చానని నన్ను ఇంతగా మీరు అభిమానిస్తున్నారే, వాస్తవానికి మానవుడు చంద్రునిపై అడుగుపెట్టడం గొప్పకాదు. సృష్టికర్తయైన దేవుడు మానవుడిగా ఈ భూమిపై అడుగుపెట్టాడు. అదీ గొప్ప విషయం’. క్రిస్మస్ లోకానికి రక్షణ వర్తమానాన్ని తెచ్చింది. ‘దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు’ అని దూత రాత్రివేళ పొలములో గొర్రెలను కాచుకుంటున్న కాపరులకు ఉన్నతమైన శుభవార్తను తెలియచేసింది. ఈ రక్షకుడు లోకరక్షణార్థమై జన్మించాడు. యేసు అను మాటకు రక్షకుడు అని అర్థం. ‘తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు’ అని దూత మరియకు ప్రధానం చేయబడిన యోసేపు అనే వ్యక్తికి తెలిపింది. ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ అనే పదాన్ని నిత్యజీవితంలో అనేకసార్లు వింటుంటాం. నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తికి కావలసినది రక్షణ. ఆ సమయంలో తాను కాపాడబడడం గాక మరిదేని గురించి అతడు ఆలోచించడు. కాలిపోతున్న ఇంటిలో చిక్కుకున్న వ్యక్తికి రక్షణ కావాలి. ఆపదలలో ఉన్నవారికి సహాయ సహకారాలు అందించి వారిని ప్రమాదాల నుంచి, అపాయముల నుంచి రక్షిస్తారు కాబట్టే పోలీసు వారిని రక్షకభటులు అని పిలుస్తారు. అయితే దేవుడు అనుగ్రహించే రక్షణ ఎటువంటిది? మనిషి పాపముల నుండి అపరాధముల నుండి నిత్యశిక్ష నుంచి రక్షణ పొందడానికి ప్రయాసపడుతున్నాడు. అయితే సర్వశక్తుడైన దేవుని మాటకు అవిధేయత చూపించుట ద్వారా పాపం లోకంలోనికి ప్రవేశించింది. ‘ఏ భేదము లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు అనేది లేఖన సత్యం’– (రోమా 2:23). పాపము దేవున్ని మనిషిని దూరం చేసింది. అత్యున్నతుడైన దేవుని సమీపించకుండా మనిషి పాప క్రియలు అడ్డుకున్నాయి. పాపములో నశించిపోతున్న మానవాళిని తన దివ్య ఆగమనం ద్వారా రక్షించాలనే యేసు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చానన్న ఆయన మాటలు మనిషి విజయానికి బాటలు వేశాయి. పాప బానిసత్వంలో నలిగిపోతున్న మానవునికి విముక్తి ప్రసాదించి తన ఔన్నత్యాన్ని వెల్లడి చేశాడు. గతి తప్పిన మనిషి జీవితాన్ని తన ప్రేమ ద్వారా ఉద్ధరించాలని దేవుడు సంకల్పించాడు. ఒక చర్చిలో పాత వస్తువులను వేలం పాటలో అమ్మేస్తున్నారు. వాటి ద్వారా వచ్చే ధనంతో చర్చిని మరింత కొత్తగా తీర్చిదిద్దాలని నాయకుల ఆలోచన. పాత బల్లలు, తివాచీలు, వస్తువులన్నీ వేలానికి సిద్ధపరచారు. ఏవో సంపాదించుకుందామన్న ఆలోచనతో కొందరు వేలం పాటలో పాల్గొనడానికి చర్చి ప్రాంగణానికి చేరుకున్నారు. అన్ని వస్తువులను వేలం వేయగా కొద్దో గొప్పో వెలను చెల్లించి వాటిని సొంతం చేసుకున్నారు. చివరకు ఒక పాత పగిలిన వయోలిన్ ఉండిపోయింది. ఎంతసేపు గడిచినా దానిని కొనుక్కోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కాసేపటికి ఒక ముసలాయన ముందుకు వచ్చి సంఘ సేవకుణ్ణి ఆ వయోలిన్ తనకిమ్మని అడుగుతాడు. ఎంతోకాలంగా ఒక పక్కకు నెట్టివేయబడిన వయోలిన్ను అతడు అత్యద్భుతంగా ట్యూన్ చేసి దానిమీద ఒక క్రిస్మస్ పాటను ఇంపుగా వాయిస్తాడు. శ్రావ్యమైన స్వరాలను ఆ వయోలిన్ పలికించినప్పుడు దానిని కొనుక్కోవడానికి చాలామంది ముందుకు వచ్చారు. శ్రుతిలేని జీవితాలను శ్రుతి చేయడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. పాడైపోయిన మనిషిని బాగుచేసి సమసమాజ నిర్మాణంలో వాడుకోవాలన్న ఆకాంక్ష దేవుడు కలిగియున్నాడు. క్రిస్మస్ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. యేసును హృదయాల్లో ప్రతిష్ఠించుకున్న జనులందరికీ అవగతమయిన సత్యమది! క్రిస్మస్ తెచ్చిన ఆనందం, క్రీస్తులోని ఆనందం వర్ణనాతీతం, అది అనుభూతికి అందని అనుభవైకవేద్యం. అనుభవించే కొద్ది అది ద్విగుణీకృతం. ఆస్వాదించే వారికి అమోఘం, అద్వితీయం. లోకంలో ఎన్నో ఆకర్షణలు ఆనందాలు, కానీ క్రిస్మస్ అందించిన ఆనందం శాశ్వతమైనది. మొదలేకానీ ముగింపులేనిది. లోక రక్షకుడు పుట్టాడన్న వార్తను నక్షత్ర కదలిక ద్వారా తెలుసుకున్న ముగ్గురు జ్ఞానులు క్రీస్తును దర్శించాలన్న ఆశతో ప్రయాణం ప్రారంభించారు. ఓపికతో శ్రమపడితే కచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటామని నిరూపించారు. ‘ఆకాశంలో కనువిందు చేసిన నక్షత్రం వారిని సృష్టికర్తయైన దేవుని దగ్గరకు నడిపించింది. ఆ సందర్భంలో వారు అమితానందభరితులయ్యారు’ అని మత్తయి తన సువార్తలో వ్రాశాడు. దైవజ్ఞానపు తీరు అవగతమయిన సమయాన మనిషికి కలిగే ఆనందం వర్ణనాతీతం.ప్రపంచం ఎన్నడు మరువలేని హాస్యకళాకారుడు చార్లీ చాప్లిన్. డైలాగులు కూడా లేకుండా అతడు నటించిన ఎన్నో సినిమాలు అతనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. చాప్లిన్ లెక్కపెట్టలేనంత ధనాన్ని కూడా ఆర్జించాడు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య సాగిపోయిన అతని జీవిత చరమాంకంలో ఎవరో అడిగారు ‘నీ జీవితాన్ని ఒక్క ముక్కలో చెప్పగలవా?’ అని. ఆ ప్రశ్నకు అతడిచ్చిన సమాధానం ‘నా జీవితం ఓ ప్రయోగాత్మకమైన జోక్’. ఆ సమాధానాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. వాస్తవాన్ని పరిశీలిస్తే నిజమైన ఆనందం డబ్బులో లేదు. పేరు ప్రఖ్యాతులు సంపాదించండంలో ఉండదు. భౌతిక సంబంధమైన భోగభాగ్యాలలో ఆనందం ఆనవాళ్ళు లభించవు కాని పరమాత్మునికి మనసులో చోటివ్వడం ద్వారా స్వచ్ఛమైన ఆనందాన్ని అనుభవించగలము. కనులు తెరిచి నిజమైన కాంతి కోసం అన్వేషిస్తే హృదయాన్ని నిజమైన దేవునికి అర్పించి విలువైన ఆనందాన్ని సొంతం చేసుకుంటే అంతకన్నా పరమార్థం వేరే వుండదు. ‘నాకు వద్దు అనుకుంటే వస్తుంది డబ్బు, కావాలనుకుంటే రావట్లేదు శాంతి సంతోషాలు’ అని ఒక కుబేరుడు మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపరచింది. భౌతిక అవసరాలు తీరితే చాలు ఎంతో సంతోషంతో ఆనందంతో జీవించవచ్చు అని చాలా అనుకుంటారు. అది వాస్తవం కాదు. ఆనంద సంతోషాలు అనేవి భౌతిక విషయాలపై ఆధారపడి ఉండవు. అవి దేవుని సహవాసంలో మాత్రమే లభించే అమూల్య బహుమానాలు. తమ అంతరంగాలపై, వదనాలపై ప్రభువులోని దీనత్వాన్ని, పవిత్రతను కలిగియుండే వారిలో అనిర్వచనీయమైన ఆనందం కదలాడుతూ ఉంటుంది. ఒకప్పుడు వారిలో రాజ్యమేలిన అహంకారం, అసూయ, స్వార్థం, సంకుచిత స్వభావం నశించిపోయి వారిలో నూతనత్వం విరాజిల్లుతుంది. సమూయేలు అనే భక్తుడు రాసిన పాటను క్రైస్తవ ప్రపంచం ఎన్నడూ మరచిపోదు. క్రీస్తు జన్మ విశిçష్ఠతను, ఆయన జీవితాన్ని, మరణ పునరుత్థానములను అద్భుతంగా వివరించే పాట అది. ‘పాపికాశ్రయుడవు నీవే. ఉన్నతలోకము విడిచిన నీవే... కన్నియ గర్భమున బుట్టిన నీవే, యేసు నీవే. చెదరిన పాపుల వెదకెడు నీవే... చెదరిన గొర్రెల కాపరివి నీవే. రోగులకు స్వస్థప్రదుడవు నీవే... మ్రోగునార్తుల యొక్క మొఱ విను నీవే. శాత్రవాంతరమున మృతుడవు నీవే... మైత్రిజూపగ మృత్యుద్ధతుడవు నీవే!’ సాక్షి పాఠకులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. -డా. జాన్ వెస్లీ, ఆధ్యాత్మిక రచయిత, వక్త, క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
వికటించిన క్రిస్మస్ డిన్నర్.. 700 మందికి అస్వస్థత
క్రిస్మస్ సందర్భంగా ఓ విమానయాన సంస్థ తమ ఉద్యోగులను ఖుషీ చేయాలని నిర్ణయించింది. ఫ్రాన్స్కు చెందిన ఎయిర్బస్ అట్లాంటిక్ కంపెనీ తవ వద్ద పనిచేసే వారికి పసందైన విందు ఇవ్వాలని ప్లాన్ చేసింది. అనుకున్నట్లుగానే గ్రాండ్గా డిన్నర్ పార్టీ ఇచ్చింది. అయితే క్రిస్మిస్ డిన్నర్ ప్లాన్ బెడిసి కొట్టింది. భోజనం చేసిన ఉద్యోగుల్లో దాదాపు 700 మందికి అస్వస్థతకు గురయ్యారు. డిన్నర్ చేసిన తర్వాత ఉద్యోగులు.. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. అయితే డిన్నర్కు ఇచ్చిన మెనూలో ఏయే వంటకాలు ఉన్నాయన్న విషయం తెలియరాలేదు. అంతేగాక భారీ సంఖ్యలో ఉద్యోగుల అనారోగ్యానికి గురవడం వెనక ఉన్న నిర్ధిష్ట కారణం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఎయిర్బస్ సంస్థ కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా ప్రపంచంలోని అతిపెద్ద విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్కు చెందిన అనుబంధ సంస్థే ఎయిర్బస్ అట్లాంటిక్. ఆ సంస్థ కింద అయిదు దేశాల్లో సుమారు 15,000 మంది పనిచేస్తున్నారు. ఫుడ్ పాయిజనింగ్కు సంబంధించిన దర్యాప్తు జరుగుతున్నట్లు ఏఆర్తెఎస్లి ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎయిర్బస్ సంస్థలో సుమారు లక్షా 34 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఎయిర్క్రాఫ్ట్, హెలికాప్టర్, డిఫెన్స్, స్పేస్, సెక్యూరిటీ పరిశ్రమలు ఆ కంపెనీ పరిధిలో ఉన్నాయి. చదవండి: విమానం కంటే స్పీడ్గా వెళ్లే రైలు.. కథ కంచికే.. -
హైదరాబాద్ : ఎల్బీ స్టేడియం క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్రెడ్డి (ఫొటోలు)
-
దలాల్ స్ట్రీట్లో శాంటాక్లాజ్ లాభాలు
ముంబై: క్రిస్మస్కు ముందు దలాల్ స్ట్రీట్లో శాంటా క్లాజ్ ర్యాలీ కనిపించింది. పతనమైన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు రెండో రోజూ లాభపడ్డాయి. ఐటీ, మెటల్, టెక్, ఆటో, ఫార్మా, రియల్టీ షేర్లు రాణించాయి. ఫలితంగా సెన్సెక్స్ 242 పాయింట్లు పెరిగి 71,107 వద్ద నిలిచింది. నిఫ్టీ 94 పాయింట్లు బలపడి 21,349 వద్ద స్థిరపడింది. ఉదయం స్వల్పలాభాలతో మొదలైన స్టాక్ సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర లాభ, నష్టాల మధ్య కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 395 పాయింట్లు లాభపడి 71,260 వద్ద, నిఫ్టీ 135 పాయింట్లు పెరిగి 21,390 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. బ్యాంకులు, ఫైనాన్షియల్ సరీ్వసెస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ లభించడంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు 1.04%, 0.75% చొప్పున పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,829 కోట్ల షేర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,167 కోట్ల షేర్లు కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా(ఎంపీఎస్) కలి్పంచే అంశంలో పదేళ్ల గడువు లభించడంతో ఎల్ఐసీ షేరు 4% పెరిగి రూ.793 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో 7% పెరిగి రూ.820 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. షేరు నాలుగు లాభపడంతో కంపెనీ మార్కెట్ విలువ ఒక్క రోజులో రూ.18,057 కోట్లు పెరిగి రూ.5.01 లక్షల కోట్లకు చేరింది. ► ఒడిదుడుకుల ట్రేడింగ్లో ఐటీ షేర్లు రాణించాయి. విప్రో 6.55%, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ 4%, ఎంఫసీస్, హెచ్సీఎల్ టెక్ 3%, కోఫోర్జ్ 2.50%, ఎల్అండ్టీఎం, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ ఒకటిన్నర శాతం, ఎల్టీటీఎస్, టీసీఎస్ షేర్లు ఒకశాతం చొప్పున లాభపడ్డాయి. ► స్టాక్ మార్కెట్ వరుస 3 రోజులు పనిచేయదు. శని, ఆదివారాలు సాధారణ సెలవులు కాగా, సోమవారం(డిసెంబర్ 25న) క్రిస్మస్ సందర్భంగా ఎక్చే్చంజీలు పనిచేయవు. ట్రేడింగ్ తిరిగి మంగళవారం యథావిధిగా ప్రారంభం అవుతుంది. ► అజాద్ ఇంజనీరింగ్ ఐపీఓకు 80.60 రెట్ల అధిక స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.01 కోట్ల ఈక్విటీలు జారీ చేయగా మొత్తం 81.58 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. ఐబీ కోటా 179.66 రెట్లు, సంస్థాగతేర ఇన్వెస్టర్లు విభాగం 87.55 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 23.71 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. ► కెనిడియన్ బిలియనీర్ ప్రేమ్ వాట్సా గ్రూప్ ఫెయిర్ఫాక్స్ గ్రూప్.., ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ సంస్థలో 5.7% వాటాను దక్కించుకుంది. ఓపెన్ మార్కెట్ ద్వారా ఎఫ్ఐహెచ్ మారిషన్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ నుంచి ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్కు చెందిన 2.16 కోట్ల ఈక్విటీల(5.7% వాటా)ను రూ.1,198 కోట్లకు కొనుగోలు చేసినట్లు బల్క్డీల్ డేటా తెలిపింది. ఈ లావాదేవీ తర్వాత ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేరు 4% నష్టపోయి రూ.573 వద్ద స్థిరపడింది. -
Christmas 2023: క్రిస్మస్ ట్రీ థీమ్ ఏంటి?
క్రిస్మస్ కాంతులు సమీపించాయి. బెంగళూరులో 100 అడుగుల నిటారుగా ఇండియాలోనే ఎత్తయిన క్రిస్మస్ ట్రీ వెలిసింది. క్రిస్మస్ వచ్చిందంటే ఇంటింటా స్త్రీలు, పిల్లలు క్రిస్మస్ ట్రీని అలంకరించేందుకు ఉత్సాహపడతారు. క్రిస్మస్ ట్రీని అనేక థీమ్లతోఅలంకరించవచ్చు. క్రిస్మస్ ట్రీ కథనూ ఈ సారి అనువైన థీమ్లను తెలుసుకుందాం. క్రిస్మస్ అంటే ప్రపంచమంతా నక్షత్రాలు పూసే వేళ. కేకులు సువాసనలు వెదజల్లే వేళ. కానుకలు రిబ్బన్ ముక్కల్లో అందంగా ప్యాక్ అయ్యే వేళ, శాంటా కోసం పిల్లలు ఎదురు చూసే వేళ, ప్రతి ఇంట్లో క్రిస్మస్ చెట్టు చిగురించే వేళ. ఏసుక్రీస్తు జన్మదినాన జగతి అంతా రంగులను హత్తుకుంటుంది. కురిసే మంచును కేరింతలతో కోస్తుంది. చర్చ్ గంటలు గణగణమోగుతాయి. స్తోత్రగీతాలు హోరెత్తుతాయి. కొవ్వొత్తులు రెపరెపలాడతాయి. ప్రేమ, త్యాగం, కరుణ... మనిషిని కాపాడేవి ఇవే కదా. ఇలాంటి పర్వదినంలో అలంకరణ ఎలా మిస్ అవుతాము? క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ వేళ ప్రతి ఇంటిపై క్రిస్మస్ స్టార్ వెలుగుతుంది. అలాగే క్రిస్మస్ చెట్టు కూడా కొలువుదీరుతుంది. జన సంస్కృతి నుంచి మెల్లగా పండుగలోకి వచ్చిన చిహ్నం ఇది. శీతల దేశాలలో శీతాకాలం కడు దుర్భరంగా ఉంటుంది. జీవేచ్ఛ అడుగంటుతుంది. అందుకని అప్పటి ప్రజలు పచ్చటి పైన్ లేదా ఫర్ చెట్టు కొమ్మలను తెచ్చి ఇంటి బయట వాటిని అలంకరించేవారు. ఇది పాజిటివ్ వైబ్రేషన్స్ను తెస్తుందని భావించేవారు. క్రీస్తు జన్మదినం కూడా శీతాకాలంలో వస్తుంది కాబట్టి ఈ అలంకరణ మెల్లగా ఒక దేశం నుంచి మరో దేశానికి పాకి క్రిస్మస్తో జత కలిసింది. క్రిస్మస్ ట్రీని సతత హరిత జీవనానికీ, జీవితేచ్ఛకూ చిహ్నంగా భావిస్తారు. పచ్చగా వర్థిల్లమనే కామన క్రిస్మస్ ట్రీ. క్రిస్మస్ పండగనాడు ఒక చర్చిలో ఏసు ప్రభువు విగ్రహం ఎదుట అందరూ ఖరీదైన కానుకలు పెడుతుంటే ఒక పేద బాలుడు ఒక పచ్చటి మొక్కను పెట్టాడట. ఆ మొక్క వెంటనే బంగారు కాంతులీనిందట. అప్పటి నుంచి నిరాడంబరమైన ఆరాధనకు గుర్తుగా క్రిస్మస్ ట్రీ వచ్చిందని ఒక కథ. ముఖ్యమైన రంగులు నాలుగు క్రిస్మస్ ట్రీ అలంకరణలో నాలుగు రంగులు కనపడతాయి. తెలుపు రంగు– ఇది స్వచ్ఛతకు గుర్తు. కురిసే మంచుకు కూడా. అందుకే క్రిస్మస్ ట్రీలో పత్తిని తెల్లదనానికి ఉపయోగిస్తారు. ఎరుపు రంగు– ఇది క్రీస్తు రక్తానికి, త్యాగానికి చిహ్నం. శాంటా కూడా ఈ రంగు దుస్తులనే ధరిస్తాడు. ఆకుపచ్చ రంగు– ఇది క్రీస్తు సజీవతను గుర్తు చేస్తుంది. బంగారు రంగు– ఇది సంపదకు, మానవాళికి బహుమతిగా దక్కిన ఏసు మార్గానికి గుర్తు. ఒకప్పుడు ఫర్, పైన్ చెట్ల కొమ్మలను తెచ్చే క్రిస్మస్ ట్రీని తయారు చేసేవారు. ఆ తర్వాత చైనా నుంచి కృత్రిమ చెట్లు వచ్చాయి. కేవలం క్రిస్మస్ ట్రీల కోసమే అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా దేశాలలో 25 రకాల పైన్, ఫర్ చెట్లను సాగు చేస్తున్నారు. ఇవి ఆరడుగుల ఎత్తు పెరగడానికి ఎనిమిది నుంచి పన్నెండేళ్లు పడతాయి. ఎన్నో థీమ్లు సంప్రదాయ క్రిస్మస్ చెట్టును అలంకరించడంలో కొత్తదనం కోసం రకరకాల థీమ్లు కూడా వచ్చాయి. మన వీలును బట్టి ఆ థీమ్ను ఎంచుకోవచ్చు. ఇంటికి వచ్చిన వారిని ఆశ్చర్యపరచవచ్చు. ► అండర్ ద సీ: అంటే గవ్వలు, జలకన్యలో, సొరచేపలు, తాబేళ్లు... ఇలాంటి రకరకాల బొమ్మలతో అలంకరించవచ్చు ► రెయిన్ బో: అంటే ఇంద్రధనుస్సులోని ఏడు రంగులు ఒక్కో దొంతరగా కిందనుంచి పై వరకూ వచ్చేలా ఆయా రంగు కాగితాలను, రిబ్బన్లను, లేదా క్రిస్మస్ బాల్స్ లేదా బెల్స్ను కట్టొచ్చు ► ట్రావెల్: విహారం థీమ్తో మీనియేచర్ బ్యాగులు, వాహనాలు, ఏరోప్లేన్లు, టికెట్లు, మైలు రాళ్ల బొమ్మలు.. ఇవి ఉపయోగించాలి ► జలపాతం: క్రిస్మస్ ట్రీ నుంచి జలపాతాలు జారుతున్నట్టు బ్లూ రిబ్బను పాయలు పాయలుగా వేలాడగట్టాలి ఏ బెలూన్: ఇది ఈజీ థీమ్. కొమ్మ కొమ్మకు మంచి మంచి బెలూన్లు రకరకాల సైజులవి కట్టడమే. ► చాక్లెట్లు: పిల్లలను ఆకర్షించేలా క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేయాలంటే క్యాండీలు, చాకెట్లు, పిప్పరమెంట్లు, జెమ్స్ ప్యాకెట్లు... కొమ్మ కొమ్మలో దూర్చడమే. ► ఎర్ర పూలు: మన దగ్గర దొరికే ఎర్రరంగు పూలు గులాబీలు కావచ్చు, చామంతులు కావచ్చు, మందారాలు కావచ్చు... వీటితో క్రిస్మస్ ట్రీని అలంకరిస్తే ఆ లుక్కే వేరు. ఇవి కొన్ని సూచనలు. వీటిని అందుకొని మీ సొంత థీమ్తో ఈ క్రిస్మస్ను కళకళలాడించండి. హ్యాపీ క్రిస్మస్. -
సెమీ క్రిస్మస్ వేడుకలకు భారీ ఏర్పాట్లు
-
ఎల్లుండి సీఎం జగన్ విజయవాడ పర్యటన
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎల్లుండి (బుధవారం) విజయవాడ పర్యటనకు వెళ్లనున్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకల్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు సీఎం జగన్ హాజరుకానున్నారు. -
ప్రపంచంలోని 10 అత్యంత ప్రసిద్ధ చర్చిలు (ఫొటోలు)
-
హోటల్ అద్దెలు పైపైకి
న్యూఢిల్లీ: నూతన సంవత్సరం, క్రిస్మస్, పెద్ద సంఖ్యలో వివాహాలు ఇవన్నీ కలసి హోటళ్ల ధరలను పెంచేస్తున్నాయి. వేడుకలు చేసుకునే వారు మరింత ఖర్చు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో హోటళ్లలో గదుల ధరలు గణనీయంగా పెరిగినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు, సదస్సులు హోటళ్ల ధరలు పెరగడానికి దారితీశాయని చెప్పుకోవాలి. కార్పొరేట్ బుకింగ్లు ఒకవైపు, మరోవైపు జీ20 దేశాల సద స్సు, ఐసీసీ ప్రపంచకప్ వంటివి కొన్ని పట్టణాల్లో హోటళ్లకు డిమాండ్ను అమాంతం పెంచేశాయి. అవే రేట్లు కొనసాగేందుకు లేదా మరింత పెరిగేందుకు పెద్ద సంఖ్యలో వివాహ వేడుకలు, ఏడాది ముగింపులో వేడుకలు తోడయ్యాయని చెప్పుకోవాలి. హోటళ్లలో వందల సంఖ్యలో పెళ్లి నిశ్చితార్థ కార్యక్రమాలకు ఇప్పటికే బుకింగ్లు నమోదైనట్టు యజమానులు చెబుతున్నారు. దేశీ యంగా పర్యాటకుల సంఖ్య పెరగడం కూడా క్రిస్మస్–న్యూ ఇయర్ సందర్భంగా రేట్ల పెరుగుదలకు కారణంగా పేర్కొంటున్నారు. కొన్ని హోటళ్లలో ఇప్పటికే బుకింగ్లు అన్నీ పూర్తయిపోయాయి. ఉదయ్పూర్లోని హోటల్ లీలా ప్యాలెస్లో క్రిస్మస్ సందర్భంగా ఒక రాత్రి విడిదికి రూ.1,06,200గా (బుకింగ్ డాట్కామ్) ఉంది. సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో ఒక రాత్రి విడిదికి రూ.1,64,919 వసూలు చేస్తున్నారు. డిమాండ్ అనూహ్యం రాజస్థాన్లో ఫోర్ట్ బర్వారా ప్రాపర్టీని నిర్వహించే ఎస్సైర్ హాస్పిటాలిటీ గ్రూప్ సీఈవో అఖిల్ అరోరా సైతం డిమాండ్ గణనీయంగా పెరిగినట్టు చెప్పారు. ‘‘ఈ ఏడాది పండుగల సీజన్లో డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఇది రేట్లు పెరిగేందుకు దారితీసింది. గతేడాదితో పోలిస్తే రేట్లు 10–15 శాతం మేర పెరిగాయి. సిక్స్సెన్స్ ఫోర్ట్ బర్వారా, జానా, కంట్రీ ఇన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ తదితర మా హోటళ్లలో అతిథుల కోసం అద్భుతమైన వేడుకలకు ఏర్పాట్లు చేశాం. కనుక వీలైనంత ముందుగా బుక్ చేసుకోవడం ద్వారా ప్రశాంతంగా ఉండొచ్చు’’అని అరోరా తెలిపారు. ఉదయ్పూర్లోని ఎట్ అకార్ అగ్జరీ హోటల్ ర్యాఫెల్స్ లో రోజువారీ ధరలు సగటున 24 శాతం మేర పెరిగాయి. గడిచిన ఆరు నెలల కాలంలో రేట్లు పెరిగినట్టు 49 శాతం మేర హోటల్ యాజమాన్యాలు తెలిపాయి. గోవా, పుదుచ్చేరి, ఊటీ క్రిస్మస్ వేడుకలకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. -
సంక్రాంతి రేసులోకి 11వ సినిమా.. కాకపోతే!
చిన్నచిన్న పాత్రల చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. విలక్షణ నటుడిగా ఎవరూ ఊహించని స్థాయికి చేరుకున్నాడు. ప్రస్తుతం అర్థ సెంచరీ సినిమాల మార్క్ దాటేసిన విజయ్.. అన్ని భాషల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా తన కొత్త మూవీని సంక్రాంతి బరిలో పెట్టాడు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు) విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన మూవీ 'మేరీ క్రిస్మస్'. రాధికా శరత్కుమార్, సంజయ్కపూర్, టీనూ ఆనంద్, రాధిక ఆప్టే తదితరులు కీలకపాత్రలు పోషించారు. 'అంధాదున్' ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఇప్పుడీ చిత్రాన్ని 2024 జనవరి 12న అంటే సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పొంగల్ బరిలో రజనీకాంత్ లాల్సలామ్, ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివకార్తికేయన్ అయలాన్, సుందర్.సి 'అరణ్మణై 4' రెడీగా ఉన్నాయి. అలానే తెలుగులో గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, ఫ్యామిలీస్టార్, నా సామిరంగ, రవితేజ 'ఈగల్' కూడా సంక్రాంతి బరిలోనే ఉండటం విశేషం. అయితే విజయ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన సినిమాలు హిట్, బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి గానీ హీరోగా చేసిన మూవీస్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఢమాల్ అవుతున్నాయి. మరి 'మేరీ క్రిస్మస్' ఏం చేస్తుందో చూడాలి. (ఇదీ చదవండి: ఫౌల్ గేమ్ ఆడి దొరికిపోయిన శివాజీ.. మళ్లీ శోభాశెట్టితో పనికిరాని గొడవ!) View this post on Instagram A post shared by Tips Films (@tipsfilmsofficial) -
సినిమాలు చూడండి.. రూ. 1.6 లక్షలు అందుకోండి!
సినిమాలు చూడండి.. 2000 డాలర్లు (రూ. 1.6 లక్షలు) అందుకోండి.. అంటోంది ఓ అమెరికన్ కంపెనీ. మీరు చేయాల్సిందల్లా వాళ్లు చెప్పిన సినిమాలు చూసి మీ అభిప్రాయాలను తెలియజేయడమే. యూఎస్కు చెందిన బ్లూమ్సీబాక్స్ (BloomsyBox) అనే సంస్థ వివిధ సంవత్సరాల్లో విడుదలైన పేరొందిన 12 క్రిస్మస్ సినిమాలను చూసి అభిప్రాయాలు పంచుకోవాలని సినీ ఔత్సాహికులను కోరుతోంది. ఎంపికైనవారు వాళ్లు చెప్పిన క్రిస్మస్ సినిమాలను చూసి ప్రతి సినిమా గురించి వారి అభిప్రాయాలను ఇన్స్టాగ్రామ్లో పంచుకోవాల్సి ఉంటుంది. ఎంపికైనవారికి డబ్బుతో పాటు హాట్ కోకా, రెండు జతల యూజీజీ సాక్స్లు, పీకాక్కి ఒక సంవత్సరం సబ్స్క్రిప్షన్, 12 నెలల ఫ్లవర్ సబ్స్క్రిప్షన్ను కంపెనీ అందజేస్తుంది చూడాల్సిన 12 సినిమాలు ఇవే.. ది మోస్ట్ వండర్ఫుల్ టైమ్ ఆఫ్ ది ఇయర్ (2008) క్రౌన్ ఫర్ క్రిస్మస్ (2015) ది నైన్ లైవ్స్ ఆఫ్ క్రిస్మస్ (2014) క్రిస్మస్ గెటవే (2017) జర్నీ బ్యాక్ టు క్రిస్మస్ (2016) గోస్ట్స్ ఆఫ్ క్రిస్మస్ ఆల్వేస్ (2022) ఫ్యామిలీ ఫర్ క్రిస్మస్ (2015) క్రిస్మస్ అండర్ రాప్స్ (2014) త్రీ వైస్ మెన్ అండ్ ఏ బేబీ (2022) ఎ రాయల్ క్రిస్మస్ (2014) నార్త్పోల్ (2014) ది క్రిస్మస్ ట్రైన్ (2017) -
ఉద్యోగాలు పోతున్నాయి.నాకు మాత్రం సూపర్: క్రేజీ ‘బారీ’ ప్రకటన ఏంటంటే!
బ్రిటీష్ మల్టీ-మిలియనీర్, పారిశ్రామికవేత్త బారీ డ్రివిట్-బార్లో (53) గుర్తున్నాడా. గే కపుల్గా క్రేజీ రికార్డు క్రియేట్ చేసిన బారీ ఇపుడు మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. రానున్న క్రిస్మస్ సందర్భంగా తన ఖర్చును తగ్గించుకుంటున్నట్టు తాజాగా ప్రకటించాడు. ఎందుకంటే దేశం కష్టాల్లో ఉంది. అలాగే ప్రపంచంలో చాలా మంది ఉద్యోగాలు, ఇళ్లను కోల్పోతున్న బాధలో ఉన్నారు. అందుకే ఈ ఏడాది క్రిస్మస్ ఖర్చును కేవలం 28 కోట్ల రూపాయలకు పరిమితం చేయబోతున్నానని తెలిపాడు. అలాగే తన హాలిడే షాపింగ్ను తగ్గించాలని ప్లాన్ చేసుకున్నానని కూడా పేర్కొన్నాడు. కానీ తనకు, తన వ్యాపారాలకు మాత్రం 2023 సూపర్ రికార్డ్ సంవత్సరం అని ప్రకటించాడు. అయితే ఇప్పటికే క్రిస్మస్ బడ్జెట్లో తన ఫియాన్సీ స్కాట్ కోసం 1.9కోట్ల రూపాయల విలువైన బ్రాండ్ న్యూ ఆడి ఆర్8ని కొనుగోలు చేశాడు. అలాగే కొడుకు ఆస్పెన్ కోసం లగ్జరీ అపార్ట్మెంట్లు, ఇళ్లను నిర్మించడానికి భూమిని కొనుగోలు చేశాడు. వ్యాపారంలో విజయం,క్రిస్మస్ సందర్భంగా ఆస్పెస్కి ప్రత్యేకంగా ఏదైనా ఇవ్వాలని నిర్ణయించు కున్నాడట. అందుకే ఖరీదైన కొత్త రోలెక్స్ G-వ్యాగన్ రడీ చేశాడు. అతని భార్య పిమ్ కోసం, ఆమె ఫ్యామిలీకి దగ్గరగా ఉండేలా ఆమె సొంత ఊరు బ్యాంకాక్లోని కోట్ల విలువచేసే కొత్త అపార్ట్మెంట్, కొత్త రోజ్ గోల్డ్ రోలెక్స్ వాచ్ కొనుగోలు చేశాడు. ఇంకా అయిపోలేదు అతని కుమార్తె సఫ్రాన్ కోసం, ప్లాటినం రోలెక్స్ వాచ్, లెక్కలేనన్ని దుస్తులు, లేటెస్ట్ లూయిస్ విట్టన్ బ్యాగ్లు ఇలా బోలెడు విలువైన వస్తువులు ఆమె కోసం సిద్ధం చేశాడు. దీంతో పాటు మిగిలిన పిల్లలకి కూడా క్రిస్మస్ కానుకలుగా లగ్జరీ వాచీలు, కార్లు, ఆస్తులను పొందబోతున్నారని స్వయంగా బారీ మీడియాకు వెల్లడించాడు. బారీ డ్రూవిట్-బార్లో టోనీ రికార్డులు, పిల్లలు బ్రిటన్లో బారీ డ్రివిట్-బార్లో భాగస్వామి టోనీతో కలిసి తొలి గే కపుల్గా రికార్డు సృష్టించారు. దాదాపు 11 సంవత్సరాలు కలిసి వున్న తరువాత పిల్లల్ని దత్తత తీసుకోవాలని భావించారు. కానీ 1999లో కాలిఫోర్నియాలో సరోగేట్ ద్వారా కవలలు సాఫ్రాన్, ఆస్పెన్ జన్మనిచ్చి మరో హిస్టరీ క్రియేట్ చేశారు. అంతేకాదు జనన ధృవీకరణ పత్రాలపై తల్లి, తండ్రికి బదులుగా పేరేంట్ -1, పేరెంట్-2 అని నమోదు చేసేలా స్వలింగ తల్లిదండ్రులను అనుమతించాలని ఈ జంట కోర్టును ఆశ్రయించి విజయం సాధించింది. LGBTQ కమ్యూనిటీకి సంబంధించి ఇదొక చారిత్రాత్మక సందర్బంగా నిలిచింది. ఇపుడు ముగ్గురు తల్లిదండ్రులుగా నమోదయ్యేందుకు ప్రయత్నస్తున్నాడు ఈ క్రేజీ గే బారీ. అంతేకాదు అంతర్జాతీయ స్పెర్మ్ డోనర్గా ఇప్పటికే 17మంది పిల్లలకు జీవసంబంధమైన తండ్రిని అని ఇటీవల ప్రకటించాడు బారీ. ఆ తరువాత ఈ జంట సరోగసీ ద్వారా ఓర్లాండో, జాస్పర్ , డల్లాస్ అనే కవల పిల్లలు సహాఎనిమిది మంది పిల్లలున్నారు. కూతురు సాఫ్రాన్ మాజీ ప్రియుడు స్కాట్ హచిసన్తో ప్రేమ కారణంగా 2019లో టోనీతో 32 ఏళ్ల సంబంధాన్ని తెంచుకున్నాడు బారీ. 2020లో, బారీ స్కాట్ తొలిబిడ్డ వాలెంటినా పుట్టింది. ఇక బారీ- టోనీ వ్యాపారానికి విషయానికి వస్తే రియల్ ఎస్టేట్, ట్రాన్స్-అట్లాంటిక్ సరోగసీ వ్యాపారం, గ్లోబల్ మెడికల్ రీసెర్చ్ కంపెనీతో సహా అనేక వ్యాపారాలతో కోట్లకు పడగలెత్తారు. ముఖ్యంగా తన సంతానానికి ప్రతీ ఏడాది క్రిస్మస్ సందర్భంగా ఖరీదైన బహుమతులిచ్చి ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటాడు బారీ . గత ఏడాది క్రిస్మస్ కోసం సుమారు 4 మిలియన్ యూరోలు ఖర్చు చేశాడట. కొడుకు కోసం ఏకంగా రూ.25 కోట్ల విలువైన బోటును గిఫ్ట్గా ఇచ్చాడు పుట్టిన రెండు రోజులకే మిలియనీర్ క్లబ్లో మనవరాలు అంతేకాదు తన మనవరాలికి భారీ ఎత్తున ఆస్తులను పంచి ఇచ్చి పుట్టిన 2 రోజులకే మిలియనీర్గా అవతరించిన రికార్డును అందించాడు. విలాసవంతమైన ఇల్లు, 10 కోట్ల ఆస్తి, 52 కోట్ల ట్రస్ట్ను ఆమెకు రాసిచ్చానని బార్లో ఇన్స్టాగ్రామ్లో వెల్లడించాడం అప్పట్లో వైరల్ అయింది.ఈ భవనంలో పాపాయికి సేవలు చేసేందుకు సకల ఏర్పాట్లు చేసినట్లు పేర్కొనడం విశేషంగా నిలిచింది. -
మెర్క్యూర్ హోటల్ లో కేక్ మిక్సింగ్ సందడి
-
క్రిస్మస్ కానుక
హీరో వెంకటేశ్ సినీ అభిమానులకు, ప్రేక్షకులకు క్రిస్మస్ కానుక ఇవ్వనున్నారు. ఆయన నటిస్తున్న ‘సైంధవ్’ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా ప్రేక్షకులముందుకు తీసుకొస్తున్నారు. ‘హిట్’ మూవీ ఫ్రాంచైజీ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ నటిస్తున్న చిత్రం ‘సైంధవ్’. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. కాగా ‘సైంధవ్’ ని క్రిస్మస్ సందర్భంగా డిసెంబరు 22న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, వెంకటేశ్ కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ఇటీవల మొదలైన ఈ లాంగ్ షెడ్యూల్లో వెంకటేశ్తో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. నవాజుద్దీన్ సిద్ధిఖి కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాకు సంగీతం: సంతోష్ నారాయణ్, సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు, కెమెరా:ఎస్. మణికందన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం. -
విజయ్ దేవరకొండ క్రిస్మస్ గిఫ్ట్.. వందమందికి పూర్తి ఉచితంగా..!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా 100 మందికి ఉచితంగా హాలిడే ట్రిప్ను స్పాన్సర్ చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి డెస్టినేషన్ ఎంపిక చేసేందుకు సాయం చేయాలంటూ ట్విటర్ వేదికగా అభిమానులను కోరాడు. స్టార్ హీరో తన అభిమానులు గమ్యాన్ని ఎంచుకోవడంలో సహాయ పడటానికి సోషల్ మీడియాలో దీనిపై పోల్ నిర్వహించారు. ట్విటర్లో విజయ్ రాస్తూ..- 'దేవరశాంత అనే సంప్రదాయాన్ని నేను 5 సంవత్సరాల క్రితం ప్రారంభించా. ఈ సంవత్సరం నాకు మంచి ఆలోచన ఉంది. నేను మీలో 100 మందిని అన్ని ఖర్చులు భరించి హాలిడే ట్రిప్కు పంపుతున్నా. డెస్టినేషన్ ఎంపికలో నాకు సహాయం చేయండి.' అంటూ ప్రకటించారు. విజయ్ తన ఫ్యాన్స్ డెస్టినేషన్ ఎంపిక చేసేందుకు భారతదేశంలోని పర్వతాలు, బీచ్లు, ఇండియా సాంస్కృతిక పర్యటన, ఇండియాలోని ఎడారి అంటూ నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. అయితే విజయ్ ఈ సంప్రదాయాన్ని ఐదేళ్ల క్రితమే ప్రారంభించినట్లు తెలిపారు. మొదటి ఏడాదిలో మాసబ్ ట్యాంక్లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీని సందర్శించాడు. ఆ తర్వాత సోషల్ మీడియా 50 మంది ఫాలోవర్స్ను ఎంపిక చేసి వారికి ప్రత్యేక బహుమతులు అందించారు. గతేడాది 100 మంది విజేతలకు క్రిస్మస్ కానుకగా ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున బహుమతులు అందజేసినట్లు ఆయన ప్రకటించారు. కాగా.. విజయ్ చివరిసారిగా పాన్-ఇండియా చిత్రం 'లైగర్'లో కనిపించాడు. ఇది అతని బాలీవుడ్ అరంగేట్రం చేసినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ప్రస్తుతం సమంత రూత్ ప్రభుతో కలిసి 'ఖుషి' చిత్రంలో నటిస్తున్నారు. #Deverasanta, a tradition I started 5 years ago. This year I have the nicest idea so far :) I am going to send 100 of you on an all-expense paid holiday. Help me in choosing the destination. #Deverasanta2022https://t.co/iFl7mj6J6v — Vijay Deverakonda (@TheDeverakonda) December 25, 2022 -
పండుగకు ఫ్యామిలీతో షాపింగ్ చేస్తుండగా కాల్పులు.. టిక్ టాక్ స్టార్ మృతి
వాషింగ్టన్: ప్రముఖ అమెరికా టిక్ టాక్ స్టార్ బ్రండన్ బూగీ మాంట్రెల్ తుపాకీ కాల్పుల్లో చనిపోయారు. క్రిస్మస్ పండుగకు షాపింగ్ చేసేందుకు కుటుంబసభ్యులతో వెళ్లిన అతనికి బుల్లెట్లు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. న్యూఓర్లీన్స్లో డెసెంబర్ 23న ఈ ఘటన జరిగింది. బూగీ బీ షాపింగ్కు వెళ్లినప్పుడు కారు పార్కింగ్ ఏరియాలో ఇద్దరు వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరుపుకొన్నారు. అయితే కారులో కూర్చున్న బూగీకి వారి కాల్చిన తూటాలు గురితప్పి తగిలాయి. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 43 ఏళ్ల బూగీ బీ.. టిక్ టాక్, ఇన్స్టాగ్రాంలో తన వీడియోలతో నవ్వులు పూయిస్తూ అనతికాలంలోనే పాపులర్ అయ్యారు. మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్నారు. న్యూయార్క్లో నివసిస్తున్న ఆయన క్రిస్మస్ సందర్భంగా సొంత నగరం న్యూ ఓర్లీన్కు వెళ్లారు. దురదృష్టవశాత్తు తుపాకి తూటాలు తగిలి కన్నుమూశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే బూగీ బీ మృతి అనంతరం పోలీసుల తీరుపై ఆమె తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల్లో తన కుమారుడే గాక చాలా మంది అమాయకులు మరణించారని, పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. న్యూ ఓర్లీన్స్ నగరంలో తరచూ తుపాకీ కాల్పుల ఘటనలు జరగుతున్నాయి. ఇక్కడి యువత దారితప్పి గన్ ఫైటింగ్కు దిగుతున్నారు. ఏ మాత్రం ప్రాణభయం లేకుండా రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం మాత్రం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఇక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఫ్రెండ్స్తో అడవిలో మందు తాగుతుండగా ఈడ్చుకెళ్లిన పులి.. సగం తిని.. -
Ind VS Ban: ‘సై అంటే సై’ అనేలా ఆట.. టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డు
Bangladesh vs India, 2nd Test: భారత్ లక్ష్యం 145... ఓవర్నైట్ స్కోరు 45/4... ఇంకా 100 పరుగుల గెలుపు దారిలో చేతిలో 6 వికెట్లున్న జట్టుకు లక్ష్యఛేదన ఏమంత కష్టం కాదు... కానీ అదే జట్టు 74/7 స్కోరు వద్ద కష్టాల్లో పడితే మాత్రం గెలుపు అసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ బంగ్లాదేశ్దే అవుతుంది. సిరీస్ 1–1తో సమం అవుతుంది. కానీ శ్రేయస్ అయ్యర్, అశ్విన్ అసాధారణ పోరాటంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఓడిపోవాల్సిన మ్యాచ్ను, పంచుకోవాల్సిన సిరీస్ను అబేధ్యమైన భాగస్వామ్యంతో భారత్ వశం చేశారు. మిర్పూర్: ఇది కదా ఆటంటే! ఇదే కదా టెస్టులకు కావాల్సింది. సంప్రదాయ ఫార్మాట్కు ఊపిరిపోసేలా ‘సై అంటే సై’ అన్నట్లు సాగింది. బంగ్లాదేశ్ స్పిన్నర్ మెహిదీ హసన్ మిరాజ్ (5/63) వికెట్ల వేటలో ముందున్నాడు. చిన్నదే అయినా లక్ష్యఛేదనలో భారత్ వెనుకబడింది. ఇంకా చెప్పాలంటే ఓ దశలో ఓటమికి టీమిండియా దగ్గరైంది. మిరాజ్ వన్డే సిరీస్లో ఎలా చెలరేగాడో (బ్యాటింగ్లో) కళ్లముందు మెదులుతోంది. ఈసారి బంతితో టెస్టు రాతను మార్చేపనిలో పడ్డాడు. కానీ ఇద్దరు కలిసి ఆ ఒక్కడి వేటను అడ్డుకున్నారు. శ్రేయస్ అయ్యర్ (46 బంతుల్లో 29 నాటౌట్; 4 ఫోర్లు), అశ్విన్ (62 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్)ల పోరాటం... ఇరు జట్లను దోబూచులాడిన విజయాన్ని చివరకు భారత్వైపు మళ్లించింది. ఇద్దరు కలిసికట్టుగా... గెలిచేదాకా మెహిదీ హసన్ స్పిన్కు ఎదురొడ్డారు. దీంతో చివరిదైన రెండో టెస్టులో భారత్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్ను 2–0తో క్లీన్స్వీప్ చేసింది. అశ్విన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, పుజారాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. మిరాజ్ స్పిన్ ఉచ్చులో... నాలుగో రోజు ఓవర్నైట్ స్కోరు 45/4 వద్ద మొదలైన భారత్ రెండో ఇన్నింగ్స్ను బంగ్లా శిబిరం అష్టకష్టాల పాలుజేసింది. తొలి అర్ధగంటలో అయితే పదేపదే అప్పీళ్లతో మన బ్యాటర్లను బెంబేలెత్తించిన ఆతిథ్య జట్టు రెండు రివ్యూలు తీసుకొని ఆ డోస్ పెంచింది. ఆపై స్పిన్ ఉచ్చులో పడేసి 3 వికెట్లను కూడా పడేసింది. ఓవర్నైట్ బ్యాటర్లు అక్షర్ పటేల్ (88 బంతుల్లో 34; 4 ఫోర్లు), జైదేవ్ ఉనాద్కట్ (13; 1 సిక్స్)లతో పాటు ఆదుకుంటాడనుకొని గంపెడాశలు పెట్టుకున్న రిషభ్ పంత్ (9; 1 ఫోర్)ను ఆరంభంలోనే అవుట్ చేశారు. ఈ ముగ్గురిలో ఉనాద్కట్ను షకీబ్ పెవిలియన్ చేర్చగా, మిగతా రెండు వికెట్లు మెహిదీ హసన్ మిరాజ్ ఖాతాలోకే వెళ్లాయి. అప్పుడు భారత్ స్కోరు 74/7. ఆట మొదలైన 6.3 ఓవర్లలోనే ఇదంతా జరిగింది. ఇక మిగిలిన వికెట్లు 3 అయితే... స్పెషలిస్ట్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఒక్కడే! మిగతా వారు టెయిలెండర్లు! ఇలాంటి దశలో ఇంకా 71 పరుగులు భారత్ను ఓటమి ముంగిట నిలబెట్టాయి. బంగ్లా విజయం ఖాయం అనుకోగా... అశ్విన్, అయ్యర్ ఏకంగా 17.3 ఓవర్లు అసాధారణ పోరాటం చేశారు. అబేధ్యమైన ఎనిమిదో వికెట్కు 71 పరుగులు జోడించి బంగ్లా చేతుల దాకా వచ్చిన విజయాన్ని తమ చేతలతో లాక్కున్నారు. ఆదివారం ఉదయం స్పిన్కు దాసోహమైన పిచ్పై అయ్యర్–అశ్విన్ బ్యాటింగ్ అద్భుతంగా సాగింది. వికెట్లకు నేరుగా టర్న్ అవుతున్న బంతుల్ని అశ్విన్ చక్కగా కాచుకొని బ్యాటింగ్ చేశాడు. మెహిదీ వేసిన 47వ ఓవర్లో సిక్స్, రెండు బౌండరీలతో అశ్విన్ మ్యాచ్ ముగించిన తీరు కూడా చూడ ముచ్చటగా ఉంది. ఈ క్రమంలో రెండో టెస్టు గెలవడం ద్వారా సిరీస్ క్లీన్స్వీప్ చేసిన టీమిండియా మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకుంది. మూడో జట్టుగా... హోరాహోరీ పోరులో నాలుగు రోజుల్లోనే టెస్టు ముగించి.. క్రిస్మస్ పర్వదినాన టెస్టులో విజయం సాధించిన మూడో జట్టుగా భారత్ నిలిచింది. గతంలో వెస్టిండీస్ (అడిలైడ్లో ఆస్ట్రేలియాపై 1971లో), ఇంగ్లండ్ (ఢిల్లీలో భారత్పై 1972లో) ఈ ఘనత సాధించాయి. ►ఇక విజయవంతమైన ఛేజింగ్లో తొమ్మిది లేదా పదో నంబర్ స్థానంలో వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్గా అశ్విన్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు పదో స్థానంలో వచ్చిన విన్స్టన్ బెంజమిన్ (వెస్టిండీస్; 40 నాటౌట్; 1988లో పాకిస్తాన్పై) పేరిట ఉంది. ►కాగా అశ్విన్, అయ్యర్ నమోదు చేసిన 71 పరుగుల భాగస్వామ్యం టెస్టు క్రికెట్లో ఛేజింగ్లో ఎనిమిదో వికెట్కు అత్యుత్తమం. గతంలో ఈ రికార్డు ఇంజమామ్ ఉల్ హఖ్–రషీద్ లతీఫ్ (పాకిస్తాన్; 52 పరుగులు–1994లో ఆస్ట్రేలియా) జోడీ పేరిట ఉంది స్కోరు వివరాలు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 227; భారత్ తొలి ఇన్నింగ్స్: 314;బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: 231; భారత్ రెండో ఇన్నింగ్స్: గిల్ (స్టంప్డ్) నూరుల్ (బి) మెహిదీ హసన్ 7; కేఎల్ రాహుల్ (సి) నూరుల్ (బి) షకీబ్ 2; పుజారా (స్టంప్డ్) నూరుల్ (బి) మెహిదీ హసన్ 6; అక్షర్ పటేల్ (బి) మెహిదీ హసన్ 34; కోహ్లి (సి) మోమీనుల్ (బి) మెహిదీ హసన్ 1; ఉనాద్కట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షకీబ్ 13; పంత్ (ఎల్బీడబ్ల్యూ) మెహిదీ హసన్ 9; అయ్యర్ (నాటౌట్) 29; అశ్విన్ (నాటౌట్) 42; ఎక్స్ట్రాలు 2; మొత్తం (47 ఓవర్లలో 7 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1–3, 2–12, 3–29, 4–37, 5–56, 6–71, 7–74. బౌలింగ్: షకీబ్ 14–0–50–2, తైజుల్ ఇస్లాం 11–4–14–0, మెహిదీ హసన్ 19–4–63–5, తస్కిన్ అహ్మద్ 1–0–4–0, ఖాలిద్ అహ్మద్ 2–0–12–0. చదవండి: IND vs SL: శ్రీలంకతో టీ20 సిరీస్.. భారత కెప్టెన్గా హార్దిక్ పాండ్యా! విధ్వంసకర ఓపెనర్ రీ ఎంట్రీ WTC 2021-23: చిన్న టార్గెట్కే కిందా మీదా .. ఇలాగైతే డబ్ల్యూటీసీ గెలిచేదెలా? -
దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు (ఫొటోలు)
-
వైట్హౌస్లో క్రిస్మస్ వేడుకలు..డెకరేషన్లో బిజీగా ఉన్న బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జిల్ బైడెన్ దంపతులు వైట్హౌస్లో క్రిస్మస్ చెట్టును చక్కగా అలంకరించారు. అందుకు సంబంధించిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసి నెటిజన్లతో పంచుకున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో తాము కిస్మస్ చెట్టుకు కొన్ని తుది మెరుగులు దిద్దుతున్నాం. అందరూ ఈ క్రిస్మస్ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారని ఆశిస్తున్నా అని ట్వీట్ చేశారు. బైడెన్ ఈ వారం ప్రారంభంలోనే వైట్హౌస్ నుంచి క్రిస్మస్ ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో పెరుగుతున్న విభజిత అమెరికాను, రాజకీయాలను కలుషితం చేస్తున్న వాటిని పరస్పరం వ్యతిరేకించే ప్రక్షాళనతో తాజాగా ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. డెమొక్రాటిక్ నాయకుడు బైడెన్ ఇటీవల ప్రతిపక్ష రిపబ్లికన్లకు వ్యతిరేకంగా మరింత దూకుడు వైఖరిని అవలంభించారు. ఈ క్రిస్మస్ సీజన్లో కొన్ని క్షణాలు నిశబ్దంగా ఆలోచించి మన హృదయంలో ఒకరినోకరు స్వచ్ఛంగా చూసుకోవాలనేదే ఆశ. అంతేగాదు క్రిస్మస్ చెట్లను పూలతో, దీపాలతో చక్కగా అలంకరించి చేసుకునే ఈ పండుగ నాడు డెమొక్రాటిక్ లేదా రిపబ్లికన్లుగా కాదు తోటి అమెరికన్లు లేదా తోటి మానవులు అన్న భావంతో సహృదయంతో ఈ పండుగను ఆనందంగా చేసుకోవాలన్నారు. Just a few finishing touches! Hope you and your loved ones are having a great Christmas Eve. pic.twitter.com/zdCjjRrI9o — President Biden (@POTUS) December 25, 2022 (చదవండి: అమెరికాలో భారత సంతతి వ్యక్తి ఘనత.. తొలి సిక్కు మేయర్గా రికార్డ్) -
విజయనగరంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
మెతుకు సీమలో ప్రధాన పర్యాటకుల ఆకర్షణగా మెదక్ చర్చి
మెదక్ ఒకప్పటి మెతుకు సీమలో అడుగు పెట్టగానే అల్లంత దూరం నుంచి మనకు స్వాగతం చెప్పేది. అక్కడి కొండ పై నున్న కాకతీయుల కాలం నాటి మెదక్ కోట. అంతే ప్రాధాన్యత గలది, మెదక్ పట్టణానికే ఒక మైలురాయి లాంటిది, ఎంతో మంది పర్యాటకులను ఆకర్షించేది. ఆసియాలోనే అతిపెద్ద చర్చులలో ఒక్కటైనది 'మెదక్ చర్చి'. బ్రిటిష్ వారి పాలనా కాలంలో తిరుమలగిరి లోనున్న వారి సైనికుల కోసం 1895 లో వచ్చిన రెవరెండ్ చార్లెస్ పోస్నెట్ అనే క్రైస్తవ మత గురువు, హైదరాబాద్కు వంద కి.మీ దూరంలోనున్న మెతుకు సీమ కరువు కాటకాలతో అల్లాడుతుందని తెలుసుకొని అక్కడికి గుర్రం మీద ఒక రోజు ప్రయాణం చేసి వెళ్ళాడట. కరువు పీడితులను ఆదుకోడానికి 'ఫ్రీ కిచెన్' అన్నదానాల కన్నా వారికి ఉపాధి నిచ్చే పని కల్పించడం ఉత్తమమని ఆలోచించాడు. అందుకోసం 1914 లో ఘుస్నాబాద్ ప్రాంతంలోని విశాల స్థలంలో ప్రస్తుత చర్చి నిర్మాణాన్ని ప్రారంభించగా అది పది సంవత్సరాలు కొనసాగిందట. దీని వాస్తు శిల్పి థామస్ ఎడ్వార్డ్ హార్దింగ్ క్యాతెడ్రాల్. ముప్పై మీటర్లు వెడల్పు, అరవై మీటర్లు పొడువు ఈ నిర్మాణం దాదాపు ఐదు వేల మందికి సరిపడే ప్రార్థనాలయం. దీనికి కావలసిన మొజాయక్ టైల్స్ను ఆ రోజుల్లోనే బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకున్నారట. వాటిని పరిచే ఇటాలియన్ మేస్త్రీలను బొంబాయి నుంచి పిలిపించారట. బోలు స్పాంజ్తో పై కప్పువేసి సౌండ్ ప్రూఫ్గా మార్చారట. క్రీస్తు జీవితంలోని క్రీస్తు జననం, శిలువ వేయడం, ఆరోహణ వంటి విభిన్న దృశ్యాలున్న స్టాయిన్ గ్లాస్ కిటికీలు ఇందులో ప్రత్యేకమైనవి. ఈ చర్చి 'బెల్ టవర్' మరీ ప్రత్యేకమైంది. దీని ఎత్తు 53 మీటర్లు అంటే చార్మినార్ కన్నా కూడా ఎత్తయిందన్న మాట. హైదరాబాద్ నగరానికే మకుటాయమానమైన చార్మినార్ కన్నా కూడా మించిన ఎత్తులో ఈ బెల్ టవర్ను నిర్మించడం ఆనాటి నిజాంగారికి నచ్చలేదంటారు. ఏదేమైనా 1924 నాటికీ అన్ని హంగులతో సిద్దమైన ఈ చర్చి క్రైస్తవ భక్తులనే కాదు దేశ విదేశ పర్యాటకులను కూడా ఆకర్శించడం సంతోషకరం. వేముల ప్రభాకర్, అమెరికా డల్లాస్ -
పులివెందుల సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు
సాక్షి, వైఎస్సార్ కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మూడో రోజున పులివెందుల సీఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. అనంతరం చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. సీఎం జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ప్రజలందరూ క్రిస్మస్ పండుగను జరుపుకోనున్నారు. కాగా, క్రిస్మస్ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు. మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రజలకు కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు లభించాలని ఆకాంక్షించారు సీఎం వైఎస్ జగన్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Christmas 2022: క్రీస్తు జననం.. విశ్వానికి పర్వదినం
క్రైస్తవ ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన దైవజనులలో ఇంగ్లాండు దేశానికి చెందిన చార్లెస్ వెస్లీ ఒకరు. తన అన్న జాన్వెస్లీ అద్భుత ప్రసంగీకుడైతే చార్లెస్ వెస్లీ అద్భుతమైన పాటల రచయిత. తన జీవిత కాలంలో దాదాపుగా తొమ్మిదివేల పాటలను రచించి దేవుని నామమును మహిమపరచాడు. అతడు రాసిన పాటల్లో చాలా ప్రాచుర్యం పొందిన పాట ‘దూత పాట పాడుడీ’. ఆ పాటలోని ప్రతి అక్షరంలో అనిర్వచనీయమైన భక్తి పారవశ్యం కనిపిస్తుంది. ఈ పాట అనేకమందికి క్రిస్మస్ గొప్పతనాన్ని చాటుతుంది. ప్రపంచంలోని క్రైస్తవులంతా అత్యంత భక్తిశ్రద్ధలతో పారవశ్యంతో జరుపుకొనే పండుగ క్రిస్మస్. సత్య వాక్యమైయున్న దేవుడు రక్తమాంసాలతో జన్మించి పుడమిని పులకింపచేసిన సమయం. ‘దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు’ అని దూతలు ప్రకటించిన సువార్త నేడు కూడా అనేక హృదయాలలో మారుమ్రోగుతుంది. ‘యేసుక్రీస్తు ప్రభువు సమస్త మానవాళిని రక్షించుటకు మానవ ఆకారంలో ఈ లోకానికి ఏతెంచారు’– కేంబ్రిడ్జ్లో విద్యనభ్యసించి ఆ తదుపరి దేవుని సేవకు తన జీవితాన్ని అంకితం చేసుకొని శ్రేష్ఠమైన గ్రంథాలెన్నింటినో రచించిన థామస్ వాట్సన్ కలం నుంచి జాలువారిన మాటలివి. క్రిస్మస్ అనే మాటకు క్రీస్తును ఆరాధించుట అని అర్థం. ఆ ఆరాధన హృదయాంతరాళాల నుంచి పెల్లుబకాలి. జగతి పరమార్థాన్ని గ్రహించి బతకాలన్నా, నిజమైన ఆనందాన్ని మదిలో నింపుకోవాలన్నా ఘనుడైన దేవుని ఆరాధించాలి. సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, ఆదిసంభూతుడు, అత్యున్నతుడు, ఆరాధనకు యోగ్యుడూ క్రీస్తే! ‘కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీయందు పుట్టి మనము స్వీకృత పుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను’ అని అపొస్తలుడైన పౌలు ధన్యసత్యాన్ని గలతీ సంఘానికి తన పత్రిక రాస్తూ తెలియచేశాడు. పాపపంకిలమైన లోకంలో బతుకుచున్న మనలందరిని తన బిడ్డలుగా చేసుకోవాలన్నదే దేవుని నిత్య సంకల్పం. ఆ సంకల్పం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఆయన జన్మించినప్పుడు ఓ అద్భుత సంఘటన జరిగింది. తూర్పు దేశపు జ్ఞానులు సుదూర ప్రయాణం చేసుకొంటూ మొదల యెరూషలేముకు ఆ తదుపరి దానికి దగ్గరలోనే ఉన్న బేత్లేహేముకు వెళ్ళారు. వాళ్ళు నక్షత్ర పయనాన్ని అంచనా వేయగల సామర్థ్యం గలవారు. ఆధ్యాత్మిక చింతన పరిపుష్టిగా ఉంది. ఎన్నో ఏండ్ల నుంచి రక్షకుని ఆగమనం కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తున్న వారిలో వీరు కూడా ఉన్నారు. వారి ప్రాంతాలను, కుటుంబాలను, పనిపాటలను కొంతకాలం పక్కనపెట్టి దేవుణ్ణి చూడడానికి ప్రయాణం కట్టారు. అది అంత సులువైన ప్రయాణం కాకపోయినా మొక్కవోని దీక్షతో, పట్టుదలతో ప్రయాణం చేసి ఆఖరుకు చేరాల్సిన స్థానానికి చేరారు. మనసులు పులకించిపోయాయి. దైవదర్శనాన్ని పొందిన ఆ నేత్రాలు పావనమయ్యాయి. ధారలుగా కారుతున్న ఆనందబాష్పాలు అందుకు నిలువెత్తు నిదర్శనం. పాలబుగ్గల పసివాడు తల్లిఒడిలో పరవశించినట్లు ఆ జ్ఞానులు పరవశించిపోయారు. పసిబాలుడైన క్రీస్తును తదేకంగా చూస్తూ ఆయన పాదాలమీద పడి మనస్ఫూర్తిగా ఆరాధించారు. ఆ దివ్యమైన అనుభూతులను కళ్ళకు కట్టినట్లు వర్ణించిన సువార్తికుడైన మత్తయి ఇలా అంటాడు. ‘వారు ఇంటిలోనికి వచ్చి తల్లియైన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి’ (మత్తయి 2:10, 11). యేసుక్రీస్తు ఇశ్రాయేలు దేశంలోని బేత్లెహేములోనే ఎందుకు జన్మించాడు అని కొందరు అడుగుతుంటారు. ఆ ప్రశ్నకు అద్భుతమైన సమాధానాలున్నాయి. ఈనాటి ప్రపంచంలో సుమారుగా 4400 పట్టణాలున్నాయి. ఎంతో చరిత్ర కలిగిన పట్టణాలు కొన్నయితే, మనస్సును ఆహ్లాదపరచే ప్రకృతి రమణీయతను కలిగిన పట్టణాలు మరికొన్ని. అయితే వీటిలో దేనికీలేని ప్రాధాన్యం, ప్రాచుర్యం బేత్లెహేము అనే పట్టణానికి ఎందుకుంది? వాస్తవానికి బైబిల్ గ్రంథం రెండు భాగాలుగా విభజించబడింది. ఒకటి పాత నిబంధన, రెండవది కొత్తనిబంధన. పాతనిబంధన చరిత్ర క్రీస్తుకు ముందు జరిగిన చరిత్ర. కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన చరిత్ర, ఆయన తరువాత సంఘం ద్వారా దేవుడు చేసిన కార్యాలు రాయబడ్డాయి. అయితే పాత నిబంధన గ్రంథంలో రక్షకుని గురించిన ప్రవచనాలు చాలా స్పష్టంగా వివరించబడినవి. రక్షకుని ఆగమనం ఆకస్మికంగా జరిగినది కాదు. ప్రవక్తలు సామాన్య ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూశారు. యేసుక్రీస్తు జీవితంలో జరిగిన ప్రతి విషయానికి పాతనిబంధన గ్రంథంలో ప్రవచనాలున్నాయి. యేసుక్రీస్తు బేత్లెహేములో జన్మిస్తాడనేది వాటిలో ఒక ప్రముఖమైన ప్రవచనం. మొదటిగా యేసుక్రీస్తు బేత్లెహేములో జన్మించుట అనేది ప్రవచన నెరవేర్పు. మోరెషెత్గతు అను కుగ్రామానికి చెందిన మీకా అనే ప్రవక్త దేవుని ఉద్దేశాలను బయలు పరచడానికి దేవుని ద్వారా ప్రేరేపించబడ్డాడు. ఇతడు ప్రవక్తయైన యెషయా సమకాలీకుడు. యెషయా యెరూషలేములో ప్రవక్తగా ఉండి అక్కడ పరిపాలించుచున్న రాజులను గురించి పరిస్థితులను గురించి తన గ్రంథంలో రాశాడు. అయితే మీకా గ్రామీణ ప్రాంతానికి చెందినవాడు కావడంతో యూదయ ప్రాంతంలో ఉన్న అబద్ధ ప్రవక్తలను భక్తిహీనులైన యాజకులను, లంచగొండులైన నాయకులను ఖండించాడు. అన్నిటికన్న ప్రాముఖ్యంగా రాబోయే మెస్సీయను గురించి ఆయన యొక్క నీతి పాలన గురించి ప్రవచించాడు. యేసుక్రీస్తు శరీరధారిగా రాకముందు 700 సంవత్సరాల క్రితమే ఆయన బేత్లెహేములో జన్మిస్తాడని మీకా ప్రవచించాడు. ‘బేత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును. పురాతన కాలం మొదలుకుని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండును’ (మీకా 5:2). ఏడు వందల సంవత్సరాల తరువాత రక్షకుడు భూమి మీద ఉద్భవించిన తరువాత యూదయను పాలిస్తున్న హేరోదు రాజు మెస్సీయ పుట్టుక స్థలమును గురించి యాజకులను, శాస్త్రులను ప్రశ్నించినప్పుడు వారు మీకా గ్రంథమునందలి ఈ ప్రవచనమును జవాబుగా తెలిపారు. ‘దేవుడు తన ప్రవక్తల ద్వారా వెల్లడిచేసిన ఏ ప్రవచనమును నిరర్థకం చేయలేదు. ఎందుకంటే ప్రవచనము మనష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు. కానీ మనుష్యులు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి వాటిని పలికిరి’ (2పేతురు 1:21). ప్రవక్తయైన మీకా ద్వారా బేత్లెహేమును గురించిన ప్రవచనం మాత్రమే గాక ఆయన గురించి మరికొన్ని ప్రవచనాలు కూడా పలికిరి. మెస్సీయ స్థాపించే రాజ్యము సమాధాన ముతో ఉంటుందని ప్రవచించారు. ‘ఆయన సమాధానమునకు కారకుడగును’ (మీకా 5:5). యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి తనయందు విశ్వాసముంచిన వారిని దేవునితో సమాధానపరుస్తారు అనే విషయాన్ని ఆత్మ నడిపింపు ద్వారా మీకా ప్రవక్త తెలిపాడు. మొదటి శతాబ్దంలో అపొ. పౌలు ఎఫెసీ సంçఘానికి రాసిన పత్రికలో ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ‘ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్ట మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తనయందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఈలాగు చేసెను. గనుక ఆయనయే మనకు సమాధానకారకుడైయున్నాడు’ (ఎఫెసీ2:14, 16). దేవుడు అనుగ్రహించే సమాధానము విశిష్ఠమైనది. ‘ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్తజనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని అనుగ్రహింతును’ అని ప్రభువు సెలవిచ్చారు. ఆయన పాదాల చెంతకు వచ్చిన అనేకులను తన దివ్యశక్తితో, శాంతితో నింపి వారిని బలపరిచాడు. ప్రస్తుతకాలంలో మానవుడు శాంతి సంతోషాలను అనుభవించాలన్న ఆశతో అశాశ్వతమైన ఆనందాలకోసం వెంపర్లాడుతూ, మనుషులు లోకంలోని బురదను, మురికిని అంటించుకొంటున్నారు దానిని వదిలించుకోలేక, విడిపించుకోలేక, కడుక్కోలేక సతమతమౌతున్నారు. రక్షించే నాథుడు ఎవరా? కాపాడే కరుణామయుడు ఉన్నారా? అని అలమటిస్తూ నిజమైన ఆనందం కోసం, సమాధానం కోసం వెదుకుతున్నారు. నేటి కాలంలో యువత మత్తు పదార్థాలకు, వింత పోకడలకు బానిసలౌతున్నారు. వాటి వెనుకనున్న కారణాలు విశ్లేషిస్తే, ‘ఒత్తిడి అధిగమించాలని కొందరు, కిక్ కోసం కొందరు, ఫ్రెండ్సు కోసం కొందరు, మానసిక ఉల్లాసం కోసం మరికొందరు చెడు అలవాట్లకు చేరువౌతున్నారు. ప్రభుత్వాలకు, పోలీసులకు పెనుసవాళ్ళను మిగుల్చుతున్న డ్రగ్స్ మహమ్మారి సృష్టిస్తున్న బీభత్సం అంతాఇంతా కాదు. ఏదో సొంతం చేసుకోవాలన్న తపనతో ఉన్నవికూడా కోల్పోతూ ఆఖరుకు తీవ్ర నిరుత్సాహానికి గురై ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. చాలా సంవత్సరాల క్రితం రస్సెల్ అనే సంగీత కళాకారుడు ఒక ప్రాంతంలో కచేరీ నిర్వహించాడు. వందల డాలర్లు వెచ్చించి అతడు వాయించే సంగీత సమ్మేళనాన్ని ఆస్వాదించడానికి సంగీత ప్రియులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆ రాత్రి అతడు వాయించిన సంగీతం అనేకమందిని ఉర్రూతలూగించింది. ఆ సంగీత విభావరిలో అతడు ఒక పాటను ఆలపించాడు. ‘విచారం వలన ఒరిగేదేమిటి? దుఃఖం వలన వచ్చే ప్రయోజనమేమిటి? విచారాన్ని దుఃఖాన్ని సమాధి చేసి ఆనందంగా బతికేయి’ అనేది ఆ పాట సారాంశం. అర్ధరాత్రివరకూ కొనసాగిన ఆ సంగీత విభావరి ముగిశాక అందరూ ఇళ్ళకు చేరుకున్నారు. మరుసటి ఉదయం వార్తాపత్రికలలో మొదటి పేజీలో ముద్రితమైన ఓ చేదువార్త అనేకులను ఆశ్చర్యపరచింది. గతరాత్రంతా తన సంగీతంతో ప్రజలను ఉర్రూతలూగించిన రస్సెల్ ఆత్మహత్మ చేసుకున్నారు. దుఃఖాన్ని సమాధి చేయండి అని పిలుపిచ్చిన వ్యక్తి తానెందుకు ఆ పని చేయలేకపోయాడు అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలోనూ మెదిలింది. నిజమైన ఆనందం డబ్బులో లేదు. పేరు ప్రఖ్యాతులు సంపాదించండంలో ఉండదు. భౌతిక సంబంధమైన భోగభాగ్యాలలో ఆనందం ఆనవాళ్ళు లభించవు కాని పరమాత్మునికి మనసులో చోటివ్వడం ద్వారా స్వచ్ఛమైన ఆనందాన్ని అనుభవించగలము. కనులు తెరిచి నిజమైన కాంతి కోసం అన్వేషిస్తే, హృదయాన్ని నిజమైన దేవునికి అర్పించి విలువై ఆనందాన్ని స్వంతం చేసుకుంటే అంతకన్నా పరమార్థం వేరే వుండదు. ఆ జన్మ ధన్యం, పుట్టుక సఫలం. క్రిస్మస్ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. నిత్యనూతనమైన జీవాన్ని అందులో నింపింది. సర్వకాల సర్వావస్థలలోనూ తొణికిసలాడే సంతోషాన్ని నిండుగా నింపింది. ఓ మంచి ఉద్యోగం, చుట్టూ ఇరవై మంది స్నేహితులు, రోజుకు రెండు సినిమాలు షికార్లతో బిజీబిజీగా ఉంటూ జీవితాన్నంతా ఆనందమయం చేసుకోవాలనుకున్న ఓ యువకుడు విజయవాడలో ఉండేవాడు. జీవితాన్నంతా పరిపూర్ణంగా ఆస్వాదించాలన్న లక్ష్యంతో ఏది చేయాడానికైనా సిద్ధపడ్డాడు. ప్రతి రాత్రి రెండు దాటాకా ఇంటికి వెళ్ళడం, మానసిక ప్రశాంతత కోసం తనకు తోచినవన్నీ చేసెయ్యడం. ఎందులో వెదకినా ఏదో వెలితి, ఇంకా ఏదో కావాలన్న తపన, నేనేదో మిస్సవుతున్నానన్న భావన తనను కృంగదీయడం ప్రారంభించాయి. మానసిక ఉల్లాసం కోసం తప్పుడు మార్గాల్లో తిరిగి జీవితం మీద నిరాసక్తిని పెంచుకొని ఒకరోజు ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి నదిలోనికి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఇదే చివరిరోజు అని నిర్ణయించుకొని ఒక సాయంకాలం చావును ఎదుర్కోవడానికి వడివడిగా వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తుకు సంబంధించిన శుభవార్త ఆయనకు అందింది. ‘ప్రయాసపడి భారం మోసుకొనుచున్న జనులారా! నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగచేతును’ అని క్రీస్తు ప్రభువు చెప్పిన మాటను కలిగియున్న పత్రిక అందింది. ఆ ఒక్కమాట తన జీవితాన్ని మార్చింది. ఇంతవరకూ ఎవ్వరూ ఇవ్వలేని ఆనందం, ఎక్కడా దొరకని సంతృప్తి దేవునిలో దొరికింది. అదే అఖరిరోజుగా చేసుకోవాలనుకున్న ఆయన గతించిన నాలుగు దశాబ్దాలుగా దేవుని సేవలో కొనసాగుతున్నారు. ఆయనే మా తండ్రిగారైన విజయకుమార్గారు. ప్రపంచఖ్యాతిని ఆర్జించిన వర్జీనియా ఊల్ఫ్ గురించి తెలియని వారు లేరు. ఆమె రచనలు ఇప్పటికీ అనేకులను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. బాల్యదినాల్లోనే అనేక సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి. వర్జీనియా ఊల్ఫ్ ఒక ధనిక కుటుంబంలో జన్మించింది. ఆరేళ్ళ వయస్సులో ఉన్న ఆమెను సవతి సోదరుడు అత్యాచారం చేశాడు. యవ్వనంలోనికి వచ్చేంతవరకు అది కొనసాగుతూనే ఉంది. పదమూడేళ్ళ వయస్సులో తల్లిని కోల్పోయింది. సమస్యల వలయంలో చిక్కుకొని ఏడుస్తూ ఉండేది. కొంతకాలానికి తండ్రిని కూడా కోల్పోయింది. మనుషులంటే విపరీతమైన భయం పుట్టుకొచ్చింది. తన మదిలో ఉన్న భయాలను పోగొట్టుకోవడానికి, మానసిక సంక్షోభం నుండి బయటపడడానికి రాయడం ప్రారంభించింది. ఆమె రచనలు విప్లవాత్మకంగా ఉండేవి. కొందరు వాటిని అంగీకరించకపోయినా తాను రాసే అలవాటును మానుకోలేదు. మానసిక వ్యధను తగ్గించుకొనేందుకు 1917వ సంవత్సరములో హోగార్త్ ప్రెస్ను ప్రారంభించింది. ‘ది వోయేజ్ ఔట్, నైట్ అండ్ డే, మండే ఆర్ ట్యూస్డే, మిసెస్ డాలోవె’లాంటి రచనలు చేసింది. అయితే ఇవేవీ ఆమెకు సాయపడలేదు. తన మనోవ్యధను తగ్గించలేదు. విజయవంతమైన ఆమె రచనలు, వాటి ద్వారా ఆమె సంపాదించిన కీర్తి ఏమీ ఆమెకు ఇసుమంతైనా సహాయం చేయలేదు. నిరంతరం తనను వెంటాడుతున్న తన వ్యథను, అశాంతిని జయించలేక తనను ప్రేమించి తన కష్టసుఖాలను పంచుకున్న భర్తకు ఓ చిన్న లేఖ రాసి తన ఇంటి సమీపంలో ఉన్న నదివద్దకు వెళ్ళి తన జేబుల నిండా రాళ్ళు నింపుకొని ఆ నదిలోనికి మెల్లగా నడిచివెళ్ళి మునిగిపోయి తన జీవితాన్ని ముగించుకుంది. ఇలాంటి విషాదాలు ఎన్ని లేవు చరిత్రలో! ఎందుకు మనిషి తన మరణాన్ని తానే శాసించుకుంటున్నాడు? బలవన్మరణానికి పాల్పడుతున్నాడు? కారణం శాంతి సమాధానాలు లేక. దేవుడు శాంతికర్త. తన శరణుజొచ్చినవారికి శాంతి సమాధానాలను ఉచితంగా అనుగ్రహించగలిగే సమర్థుడు. ‘హాయి లోకమా! ప్రభువచ్చెన్ అంగీకరించుమీ. పాపాత్ములెల్ల యేసునున్ కీర్తించి పాడుడీ. హాయి రక్షకుండు ఏలును. సాతాను రాజ్యమున్ నశింపచేసి మా యేసే జయంబు నొందును’ అంటూ ఓ అద్భుతమైన పాటను రచించాడు ఐజక్ వాట్స్ అనే దేవుని సేవకుడు. యేసుక్రీస్తు ప్రభువు తన చెంతకు చేరినవారికి అనుగ్రహించే ఆశీర్వాదాలను చాలా చక్కగా పాటలో వర్ణించాడు. ‘పాప దుఃఖంబులెల్లను నివృత్తిచేయును. రక్షణ సుఖ క్షేమముల్ సదా వ్యాపించును’. అవును మనిషి చేస్తున్న పాపమే మనిషిని దుఃఖసాగరంలో ముంచుతుంది. ఆజ్ఞాతిక్రమణమే పాపమని బైబిల్ సెలవిస్తుంది. సర్వశక్తుడైన దేవుడు సకల చరాచర సృష్టిని తన సంకల్పంతో కలుగచేశాడు గనుక ప్రతి మానవుడు ఎలా జీవించాలన్నది కూడా దేవుడే సంకల్పించాడు. ఆ చిత్తానికి, ఆ సంకల్పానికి ఎదురొడ్డి నిలబడడమే పాపమంటే. పాపానికి బానిసైన మానవుడు దేవున్ని చూడలేకపోతున్నాడు, చేరలేకపోతున్నాడు. దేవుడు పరమ పవిత్రుడు. పరిశుద్ధమైన తన రాజ్యంలోనికి పాపముతో నింపబడిన మానవుడు ప్రవేశించడం అసాధ్యం. పాపం మనిషిని దేవునికి దూరం చేయుటయే గాక అశాంతి కూపంలోనికి నెట్టివేసింది. భయంకరమైన పాప జీవితం నుంచి మానవుడు విడుదల పొందినప్పుడే దేవుని ప్రసన్నతను అనుభవించగలడు, అనిర్వచనీయమైన శాంతి సమాధానాలను పొందుకొనగలడు. పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడైన దేవుడు మనుష్యాకారంలో ఈ లోకానికి దిగివచ్చి తన పవిత్రమైన రక్తాన్ని చిందించుట ద్వారా సర్వలోకానికి రక్షణ ప్రసాదించాడు. ఎవరైతే విశ్వాసంతో ఈ సత్యాన్ని హృదయంలో విశ్వసించి యేసు రక్షకుడని ఒప్పుకుంటారో వారందరూ రక్షింపబడతారు. పాపక్షమాపణ ఉచితంగా పొందుకుంటారు. పాపం ఎప్పుడైతే క్షమించబడిందో అప్పుడు శాంతి సమాధానాలు మనిషి వశమౌతాయి. యేసుక్రీస్తు కాపరిగా వ్యవహరిస్తాడని మీకా ప్రవచించాడు. ‘ఆయన నిలిచి, తన మందను మేపును’ (మీకా 5:4). యేసుక్రీస్తు ఒక కాపరి తన గొర్రెలను ఎలా సంరక్షిస్తాడో అలాగో తన ప్రజలను సంరక్షిస్తాడని తన ప్రవచనాలలో తెలిపాడు. యేసుక్రీస్తు ప్రభువు తాను ఎందుకీ లోకానికి వచ్చారో యోహాను సువార్త 10వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వివరించాడు. ‘నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. తప్పిపోయి నశించిన వారిని వెదకి రక్షించడానికి ప్రభువు ఈ లోకానికి ఏతెంచాడు. ప్రవక్తయైన మీకా ద్వారా ఆత్మ పలికిన మాటలన్నీ చరిత్రలో నెరవేర్చబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువు బేత్లెహేములో జన్మించినది ప్రవచన నెరువేర్పు కొరకు.’ రెండవదిగా క్రీస్తు బేత్లెహేములో జన్మించింది వాగ్దాన నెరవేర్పు కొరకు. ప్రభువు దావీదునకు గొప్ప వాగ్దానం అనుగ్రహించాడు. ‘నేను ఏర్పరచుకునిన వానితో నిబంధన చేసియున్నాను. నిత్యము నీ సంతానము స్థిరపరచెదను. తరతరములకు నీ సింహాసనము స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసియున్నాను’ (కీర్త 89:3,4). దావీదుకు చేయబడిన వాగ్దానమిది. దావీదు ఇశ్రాయేలు దేశాన్ని పాలించిన తరువాత సొలొమోను అతని బదులుగా రాజైనాడు. నలభై సంవత్సరాలు సొలొమోను పాలన తర్వాత రాజ్యము రెండుగా విడిపోయింది. యూదా రాజ్యమును రెహబాము, ఇశ్రాయేలు రాజ్యమునకు యరొబాడు రాజులైనారు. కొంతకాలానికి ఇశ్రాయేలు రాజ్యము అష్షూరు చెరలోకి వెళ్ళిపోయింది. మరికొంతకాలానికి యూదా రాజ్యము బబులోను చెరలోకి వెళ్ళిపోయింది. దావీదుకు చేయబడిన వాగ్దానం సంగతి ఏది? వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని మరచిపోతాడా? వాగ్దానాన్ని నిరర్థకం చేశాడా? అని కొందరు అనుకొని ఉండవచ్చు. కాని తగిన సమయంలో దేవుడు దావీదుకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు వాగ్దానాలను నెరవేర్చువాడు. దేవుని వాగ్దానాలన్నీ యేసుక్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నాయి. దావీదు సింహాసనమును స్థిరపరుస్తానని దేవుడు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చడానికి యేసుక్రీస్తు దావీదు వంశములో దావీదు పట్టణంలో జన్మించాడు. ఎంత గొప్ప ప్రేమ! ఆకాశం, భూమి గతించినను దేవుని మాటలు ఎన్నడూ గతించవు. యోసేపు దావీదు వంశములోను, గోత్రములోను పుట్టినవాడు గనుక ‘తనకు భార్యగా ప్రధానం చేయబడి, గర్భవతై యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదాలోని బేత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను’ (లూకా2:4,5). ‘దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టియున్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు’ (లూకా 2:11). ‘యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున దేవుని కుమారునిగాను ప్రభావంతో నిరూపించబడెను’ (రోమా 1:27). మనుష్యులు చాలామంది చాలా రకాలైన వాగ్దానాలు చేస్తారు. కాని వాటిని నిలబెట్టుకొనే సమయానికి తప్పించుకొని తిరుగుతుంటారు. కొందరు రాజకీయవేత్తలు అధికారం కోసం వాగ్దానాలు చేస్తారు. తర్వాతి కాలంలో వాటిని నెరవేర్చకుండానే గతించిపోతారు. దేవుడు అలాంటివాడు కాడు. తన ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడు. కల్దీయ దేశాన్ని విడచి నేను చూపించు దేశానికి వెళ్తే అబ్రహామును దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ‘నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు’ అని ప్రభువు పలికాడు. ఏ లోటు లేకుండా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. నూరేళ్ళ ప్రాయంలో వాగ్దాన పుత్రుని అనుగ్రహించి తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. మూడవదిగా మనుష్యులందరికి అందుబాటులో ఉండులాగున యేసుక్రీస్తు బేత్లెహేములో జన్మించారు. భూ ఉపరితల రూపాలు, లక్షణాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని టోపోగ్రఫీ అంటారు. టోపోగ్రఫీ ప్రకారం ఈ భూమ్మీద మానవుడు నివసిస్తున్న దేశాలు, స్థలాకృతిని అధ్యయనం చేసినప్పుడు యేసుక్రీస్తు జన్మించి, సంచరించి, మరణించి మరియు పునరుత్థానుడై లేచిన ఇశ్రాయేలు దేశం భూమికి మధ్య ప్రాంతంగా గుర్తించారు. ఆయన భారతదేశంలోనో లేక మరే ఇతర పెద్ద దేశంలోనో జన్మిస్తే బాగుంటుందని అనేకులకు అనిపించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన స్థలం ఈ ప్రపంచానికి మధ్య ప్రాంతం. ఆయన అందరివాడు గనుక భూమికి మధ్య ప్రాంతంలో పుట్టాడనడంలో అతిశయోక్తి లేదు. ఒక దీపం అందరికీ వెలుగునిచ్చేలా పెట్టాలంటే అది అందరికీ మధ్యలో ఉంచాలి. అప్పుడే ఆ వెలుగు అన్నివైపులా సమానంగా ప్రసరిస్తుంది. ‘వెలుగైయున్న దేవుడు ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండులాగున ఆయన ఈ భూమికి మధ్యస్థానంలో జన్మించారు’. ఈ విషయాన్ని యెషయా గ్రంథంలో కూడా రాయబడడం గమనార్హం. ‘ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును’ (యెషయా 11:10). ‘జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలువబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగుచేయుము. భూమి నాలుగు దిగంతముల నుండి చెదరిపోయిన యూదావారిని సమకూర్చుము’ (యెషయా 11:12). ప్రవచనాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే యెష్షయి వేరు చిగురు అనగా యేసుక్రీస్తు. ఆయననే ధ్వజముగా వర్ణించాడు. ఆ ధ్వజము నలుదిక్కుల నుండి ప్రజలను ఆకర్షిస్తుంది. ప్రపంచంలోని ప్రతి జాతి, ప్రతి ప్రాంతం యేసుక్రీస్తుకు పాదాక్రాంతమై విరాజిల్లుతుంది. బేత్లెహేము అనగా రొట్టెల గృహమని అర్థం. జీవపు రొట్టె అయిన ప్రభువు ఆ ప్రాంతమును ఎన్నుకోవడం అర్థరహితం కాదుకదా? ప్రభువు జన్మించినప్పుడు ఆయన్ను మొదటిగా దర్శించుకున్నది ఎవరు? దానికి సమాధానం గొర్రెల కాపరులు. అతి సామాన్యమైన ప్రజలు. అటువంటివారికి రక్షకుని ఆగమన వార్త మొదట తెలిసింది. దేవుని ప్రేమ అభాగ్యుల పట్ల, దీన దరిద్రుల పట్ల ఎంత అధికంగా ఉంటుందో తెలుసుకోవడానికి ఆ సంఘటన ఓ నిదర్శనం. బేత్లెహేము పొలాల్లో వారు రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు భయపడ్డారు. అయితే ఆ దూత ‘భయపడకుడి. ఇదిగో ప్రజలందరికి కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నా’నని చెప్పి రక్షకుని ఆగమనాన్ని గూర్చి ప్రకటించింది. సువార్తికుడును వైద్యుడైన లూకా తెలిపిన ప్రకారం గొర్రెల కాపరులు చీకటిలో ఉన్నారు. భయంతో జీవిస్తున్నారు. అటువంటి దుర్భర పరిస్థితులలో ఉన్నవారిని లోకంలో ఉన్నవారెవరూ పట్టించుకోరు. కాని సృష్టికర్తయైన దేవుడు వారికి తన సందేశాన్ని పంపాడు. ఇకపై వారు దేనికి భయపడనక్కరలేదని చెప్పాడు. వారి కోసం రక్షకుడొచ్చాడు గనుక వారు ధైర్యంగా బ్రతకొచ్చు. వారికొక ఆనవాలు ఇయ్యబడింది. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొనియుండుట మీరు చూచెదరు. లోకరక్షకుడు పశువుల తొట్టెలో పుట్టడం ఆశ్చర్యమే. అవును అది నిజంగా అబ్బురమే. పశుల తొట్టెలో పరుండియున్న క్రీస్తు ప్రభువును గొర్రెల కాపరులే మొదట దర్శించుకున్నారు. హేరోదు అంతఃపురంలోనో మరో సంపన్న స్థలంలోనే క్రీస్తు ప్రభువు జన్మించియుంటే వారికి ఆ దర్శన భాగ్యం దొరికేది కాదు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దీనులను ఆయన రక్షణతో అలంకరిస్తాడు. ఆయన్ను చూడాలనే ఆశ ఉంటే చాలు తన్ను తాను ప్రత్యక్షపరచుకొనుటకు దేవుడు ఎప్పుడూ సంసిద్ధుడే! ప్రస్తుతకాలంలో బేత్లెహేము వెళ్తే యేసు పుట్టిన ప్రాంతంలో ఒక దేవాలయం ఉంది. దానిని చర్చ్ ఆఫ్ నేటివిటీ అంటారు. ప్రతి యేటా కోట్లాదిమంది ఆ దేవాలయాన్ని దర్శించి దానిలోపల క్రీస్తు పుట్టిన స్థలాన్ని చూసి ఆనంద పరవశంతో నిండిపోతారు. కాన్స్టాంటైన్ ద గ్రేట్ తల్లియైన సెయింట్ హెలెనా క్రీస్తు శకం 325లో యెరూషలేమును, బేత్లెహేమును దర్శించింది. ఆమె వెళ్లిన తరువాత బేత్లెహేములో చర్చి నిర్మాణ పనులు ప్రారంభించబడ్డాయి. ఆ తదుపరి 339వ సంవత్సరం మే 31న దేవాలయం ప్రజల సందర్శనార్థం అందుబాటులోనికి వచ్చింది. ఆ తర్వాత సమరయుల తిరుగుబాటు సమయంలో చర్చి అగ్నిప్రమాదంలో పాక్షికంగా ధ్వంసమైంది. బహుశా క్రీస్తు శకం 529లో బైజాంటైన్ చక్రవర్తి జస్టినియన్ ద్వారా మరలా నిర్మించబడింది. ఈ దేవాలయానికి గొప్ప చరిత్ర ఉంది. విశాలమైన స్థలంలో నిర్మించబడిన ఈ గొప్ప దేవాలయానికి ఒకే ఒక ప్రవేశ ద్వారం ఉంటుంది. సుమారుగా ఇరవైఐదు అడుగుల పొడవున్న ఈ చర్చికి కేవలం నాలుగు అడుగుల ఎత్తు ఉన్న ప్రవేశ ద్వారం ఉంది. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే ‘ఎవ్వరైనా క్రీస్తు ప్రభువు పుట్టిన స్థలాన్ని దర్శించాలనుకుంటే తలవంచి అహంకారాన్ని విడిచి నమస్కరించుకొంటూ లోపలికి ప్రవేశించాలి. దేవునిముందు నిలబడడానికి అహంకారం ఉపయోగపడదు దీనత్వం మాత్రమే ఉపకరిస్తుంది. నాలుగవదిగా బేత్లెహేములో రిక్తునిగా యేసుక్రీస్తు జన్మించుట ద్వారా తన ప్రేమను వ్యక్తీకరించాడు. దేవుని ప్రేమ వర్ణనకు అందనిది. ‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను’ (యోహాను 3:16). నిత్యజీవితంలో ప్రతి మనిషిలోనూ కొన్నివందల రకాల భావోద్వేగాలు ఉంటాయి. వాటిని సంతోషం, ప్రేమ, ఆశ్చర్యం, ఆవేశం, దుఃఖం, భయం, అసహ్యం మొదలైనవిగా విభజించవచ్చు. చిరాకు, కోపం, నిరాకరణ ఇవన్నీ ఆవేశాన్ని ప్రతిబింబించే చర్యలైతే విశ్రాంతి, సంతృప్తి, ఆనందం అనేవి సంతోషానికి సంబంధించినవి. అయితే వీటన్నింటిలో మనకు ఎక్కువగా వినిపించేది, అనిపించేది ప్రేమ. పవిత్రమైన ఈ పదం ఈ రోజులలో చాలా ప్రమాదకరంగా మారిపోయింది. నేటి యువతకు ప్రేమ అనే మాటకు సరైన అర్థం తెలియడం లేదు. సినిమాలలో, సీరియల్స్లలో చూపిస్తున్న కొన్ని కథలను ప్రేమ అనుకోవడం సహజం అయిపోయింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఆకర్షణను, వ్యామోహాన్నే ప్రేమగా చిత్రీకరిస్తున్నారు. ప్రేమ పేరిట అనేక మోసాలు, వంచనలు, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ప్రేమకు నిర్వచనం ఏమిటి? ఎవరు దానిని నిర్వచించారు? అని మానవుడు ఆలోచించగలిగితే పరమార్థాన్ని చేరుకుంటాడు. ప్రేమకు నిర్వచనాలు ఎవరెన్ని విధాలుగా చెప్పినా ఒకటి మాత్రం ఆలోచించదగినది. ఆచరణీయమైనది కూడా. ప్రేమ అంటే ఇతరులను బలి తీసుకోవడం కాదు, ఇతరుల కోసం బలైపోవడం అని నిరూపించాడు యేసుక్రీస్తు. ఈ అద్భుత సత్యాన్ని ఎవరైతే తమ జీవితంలో హృదయపూర్వకంగా గ్రహిస్తారో వారి జీవితం ఆనందమయం అవుతుంది. ఆదర్శప్రాయమవుతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రేమను గూర్చి అనేక మాటలు రాయబడ్డాయి. ‘దేవుడు ప్రేమాస్వరూపి! దేవుడు తన ప్రేమను వెల్లడిపరచాడు. తానే మొదట మనలను ప్రేమించాడు’లాంటి మాటలన్నీ దేవుని ప్రేమ ఔన్నత్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించేవే. ప్రేమిస్తున్నానని చెప్పుట మాత్రమే గాక ప్రేమను ఋజువు చేసిన ప్రేమమూర్తి ప్రభువైన యేసుక్రీస్తు. క్రిస్మస్ ఆచరించడమంటే ఎవరికి వారు ఆనందించడం కాదు. అనేకులకు ఆనందం పంచడం. కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆపన్న హస్తాన్ని అందించి, వారికి మనస్ఫూర్తిగా సహాయపడడం. త్యాగాన్ని ప్రేమను వేరువేరుగా మనం చూడలేము. నిరాశ, నిస్పృహలో ఉన్నవారిని భుజంతట్టి ప్రోత్సహించడం చేయగలిగితే క్రిస్మస్కు నిజమైన అర్థం ఉంటుంది. సుప్రసిద్ధ క్రైస్తవ పాటల రచయిత చెట్టి భానుమూర్తి రాసిన అద్భుతమైన క్రిస్మస్ పాట దేవుని ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ‘రారే చూతము రాజసుతుడీ రేయి జననమాయెను. రాజులకు రారాజు మెస్సీయా రాజితంబగు తేజమదిగో. దూత గణములన్ దేరి చూడరే దైవవాక్కులన్ దెల్పగా. దేవుడే మన దీనరూపున ధరణి కరిగెనీ దినమున’ ‘సాక్షి’ పాఠకులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. -డా.జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త, క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
మెదక్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
Christmas 2022: రక్షణోదయం క్రిస్మస్
యేసు అంటే రక్షణ. యేసు జననమే రక్షణోదయం. అదే క్రిస్మస్. రక్షణకు పుట్టిన రోజు. ఆ రక్షణా కార్యానికి దేవునిచే నియుక్తుడై, అభిషిక్తుడైన ఆ క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్. లోకాన్ని బాధించి వేధించే చీకటి కుట్రల సమస్యల నుండీ, మానసిక సమస్యల నుండీ తప్పించి శాంతిని ప్రసాదించేదే ఈ క్రిస్మస్! మానవుల్ని రక్షించడం కోసం నియమితుడైన క్రీస్తును ఆస్వాదించడం, ఆ రక్షణలో ఆనందించడం, అందు మమేకం కావడం, అదే ఆరాధించడం అంటే! ఇంతకూ ఆ రక్షణలో ఏముంది? ఆ రక్షణలో వెలుగుంది. పెడ దారిన పడనీయకుండా నడిపే ఆ వెలుగు, ఒక మంచి మార్గం చూపిస్తుంది. ఎక్కడో కొండల్లో, కోనల్లో లోయల్లో గొర్రెల కాపరుల్ని అర్ధ రాత్రి తోక చుక్క రూపంలో నడిపించింది, బెత్లెహేం పురానికి చేర్చింది. పశుల శాలలో శిశువు రూపాన ఉన్న చిన్ని దేవుడ్ని చూపించింది. ఆ మహాప్రకాశాన్ని ఆరాధించేట్టు చేసింది. క్రిస్మస్ అంటే వెలుగును ఆరాధించడం. దేవ శబ్దానికి కాంతి అనీ, కాంతితో పాటు అన్నీ ఇచ్చు వాడనేది మన భారతీయ ఆధ్యాత్మిక తాత్త్విక నైఘంటి కార్థం. ఆ యేసు రక్షణ కాంతితో పాటు ఇంకేమేమి ఇస్తున్నట్టు? లోకం నేడు కల్ల బొల్లి మాటల గారడీల్లో చిక్కుకు పోయింది. కుట్రలకు మోసాలకూ లోనైంది. మూఢ ఆచారాలకు, సాంఘిక దురాచారాలకు బానిసయై పోయింది. వీటినుండి రక్షింప బడడానికై అసలైన సిసలైన సత్య కాంతి అవసరం. అది ఈ బాల దేవుని దగ్గర వాక్య రూపేణా పుష్కళంగా లభిస్తుంది. మన శ్శాంతి దొరుకుతుంది. అందుకే దాన్ని అందుకోవాలనే అందరూ ఆరాధించారు. లోకాన్ని ఎంతగానో ప్రేమించిన దేవాది దేవుడు తన ఏకైక ప్రియ కుమారుడ్ని తన ప్రేమ చిహ్నంగా భూమండలానికి పంపించాడు. ప్రాణానికి ప్రాణమైన ఆ తీపిప్రాణం మన మానవ కోటి రక్షణార్థంగా బలై పోయింది. ఆ ప్రభుని ప్రేమనూ, త్యాగాలనూ తమలోకి ఆహ్వానించుకోవడం, ఆయన చూపిన ప్రేమను సాటి వ్యక్తులక్కూడా అందించడమే క్రిస్మస్! – డాక్టర్ దేవదాసు బెర్నార్డ్ రాజు (క్రిస్మస్ సందర్భంగా) -
Fashion: క్రిస్మస్ వేడుకలో మరింత వెలిగిపోయేలా..
కొన్ని రంగులు కొన్ని సందర్భాలలో ప్రత్యేకత నింపుకుంటాయి. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ కాంబినేషన్లో చేసే హంగామా క్రిస్మస్ వేడుకలో మరింతగా వెలిగిపోయేలా చేస్తుంది. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగు కాంబినేషన్ల డ్రెస్లు మాత్రమే కాదు ఇతర అలంకార వస్తువుల్లోనూ ప్రత్యేకత చూపవచ్చు. వాటిలో చేతికి ధరించే బ్రేస్లెట్స్, మెడలో ధరించే నెక్పీస్, క్రోచెట్ హ్యాండ్ బ్యాగ్స్, హెయిర్ క్లిప్స్ అండ్ బ్యాండ్స్, చెవులకు హ్యాంగింగ్స్ వేడుక ప్రతిఫలించేలా ఎంపిక చేసుకోవచ్చు. నెయిల్ ఆర్ట్లో భాగంగా క్రిస్మస్ ట్రీ, శాంటాక్లాజ్, స్టార్స్ డిజైన్స్తో మరింతగా మెరిసిపోవచ్చు. క్రిస్మస్ ట్రీలా నిండైన పచ్చదనాన్ని, ఆత్మీయ ఆప్యాయతలను పంచుకునే కానుకలా, స్వచ్ఛతకు ప్రతిరూపంగా నిలుస్తూ భూమిపైన నక్షత్రాల్లా మెరవాలని ఈ రంగులు సూచిస్తుంటాయి. అందుకే ఈ పండగ పూట అలంకరణలో ఈ రంగులు ప్రధాన భూమికను పోషిస్తుంటాయి. ఆధునికంగానూ ఉంటూనే అంతే హంగునూ పరిచయం చేసే ఈ కలెక్షన్ పండగ వేళ ఎంచుకుంటే మరింత ప్రత్యేకంగా కనిపిస్తారు. చదవండి: Malavika Sharma: అందమైన అల్లికల శారీలో మెస్మరైజ్ చేస్తున్న మాళవిక! చీర ధర 68 వేలకు పైమాటే -
ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం జగన్
-
కోవిడ్ భయాలు.. పండుగ వేళ జాగ్రత్త.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: క్రిస్మస్, న్యూ ఇయర్ , సంక్రాంతి పండుగల వేళ కోవిడ్–19 నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలని కేంద్రం సూచించింది. రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించాలని, సమూహాలకు దూరంగా ఉండాలని, నాలుగ్గోడల మధ్య వేడుకలు నిర్వహించేటప్పుడు గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. జిల్లా స్థాయిలో వస్తున్న ఫీవర్ కేసుల్ని కూడా పర్యవేక్షించాలని, శ్వాసకోశ ఇబ్బందులు, దగ్గు , జలుబు , జ్వరంతో ఎవరు వచ్చినా తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయాలని పేర్కొన్నారు. పాజిటివ్ కేసుల్లో ఎక్కువ నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ జరపాలని సూచించారు. మరోవైపు శనివారం నుంచి విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో 2 శాతం మందికి కరోనా పరీక్షలకు సన్నాహాలు పూర్తిచేశారు. ఎంపిక చేసిన ప్రయాణికులు, కరోనా లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించాలని విమానాశ్రయాల్లో సిబ్బందికి కేంద్ర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. -
క్రిస్మస్ వేడుకల్లో సీఎం కేసీఆర్ (ఫొటోలు)
-
CM Jagan: ఏపీ ప్రభుత్వ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ (ఫొటోలు)
-
CM Jagan: ఒదిగితేనే ఎదుగుదల
దేవుడు మన నుంచి కోరుకునేది ఒక్కటే.. అధికారంలో ఉన్న వారు అధికార దర్పంతో వ్యవహరించకూడదని, వారు ప్రజలకు సేవకులుగా ఉండాలని కోరుకుంటాడు. నేను అదే నమ్ముతాను. దేవుడి ఆశీస్సులతో మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా గొప్ప సేవకుడిగా ఉండాలని కోరుకుంటున్నాను. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్న వారు ప్రజలకు సేవకులుగా ఒదిగి ఉండటం నేర్చుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. విజయవాడలోని ఎ–ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం సెమీక్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించి తేనీటి విందు ఏర్పాటుచేసింది. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ కేక్ కట్చేసి క్రైస్తవ ప్రముఖులకు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉండి ఇంకా ఒదిగి ఉండేలా నేర్చుకోవాలన్నారు. ప్రజలకు ఇంకా మంచిచేసే అవకాశం.. గొప్ప సేవకుడిగా ఉండేలా దేవుడు అవకాశం ఇవ్వాలని సీఎం ఈ సందర్భంగా ప్రార్థించారు. ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే.. ఈ రోజు నాతో పాటు వేదికపై ఉన్న పెద్దలు మోస్ట్ రెవరెండ్ జోసెఫ్, డాక్టర్ జార్జ్, పాస్టర్ జాన్వెస్లీ, బాలస్వామి, ఇక్కడ ఉన్న ఫాదర్లు, పాస్టర్లే కాకుండా ఇక్కడికి వచ్చినా, రాలేకపోయినా నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములందరికీ కూడా ఈ క్రిస్మస్ మాసంలో ఈ వేడుక జరుపుకుంటున్న శుభసందర్భంలో అందరికీ మెర్రీ క్రిస్మస్ తెలియజేస్తున్నాను. కాసేపటి క్రితం ఇక్కడికి వచ్చాక ఏం మాట్లాడాలని అడిగాను. దేవుడి గురించి చెప్పాలంటే నా కంటే ఇక్కడ ఉన్న వారు చాలా చక్కగా చెబుతారు. మనం నేర్చుకోదగ్గ పాఠం ఒకటి ఉంది. మన నుంచి దేవుడు కోరుకునేది ఒక్కటే. అధికారం అన్నది అధికారం కాదు. అధికారంలో ఉన్నవాళ్లు ప్రజలకు ఇంకా ఒదిగి ఉండాలి. ఇంకా సేవలకులమని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను మీ బిడ్డగా ఉన్నానంటే అందుకు దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలే కారణం. దేవుడి దయతో ఇంకా మంచిచేసే అవకాశం.. ఇంకా ఒదిగి ఉండే అవకాశం దేవుడు ఇవ్వాలని, ఇంకా గొప్ప సేవకుడిగా మీ అందరికీ సేవచేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఇంట్లో ఉన్న వారికి మరొక్కసారి మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ సీఎం జగన్ తన సందేశాన్ని అందించారు. క్రీస్తు జననం లోకానికి పండుగ ఇక ఏపీ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బొల్లవరపు జాన్వెస్లీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ.. క్రీస్తు జననం లోకానికి పండుగ అన్నారు. సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలోని అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి సువర్ణాధ్యాయం మొదలైందన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ముస్లిం మైనార్టీల కోసం కేవలం రూ.2,655 కోట్లు ఖర్చుచేస్తే వైఎస్సార్సీపీ మూడున్నరేళ్లలో రూ.20,330.63 కోట్లు ఖర్చుచేయడం గొప్ప విషయమన్నారు. ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకర్, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, బిషప్ రాజారావు, హోసన్న మినిస్ట్రీస్ జాన్వెస్లీ, బందెల రాజు మాట్లాడారు. ఉత్తమ సేవలకు అవార్డులు అందించిన సీఎం ఇక పలు రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన ఏడుగురికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవార్డులు అందజేశారు. సామాజిక సేవలో ఉన్నం మేరీ సుజాత, వల్లూర్ అశవ్కుమార్.. వైద్య రంగంలో డాక్టర్ కోలా విజయ కిసింజెర్.. విద్యా రంగంలో కంచి డొమినిక్రెడ్డి, డాక్టర్ ఎం. సండ్ర కార్మెల్ సోఫియా.. సాహిత్యంలో తేర జాన్జర్షన్ శ్రీనివాస్, పెద్దేటి యోహాన్లకు అవార్డులను అందించి సత్కరించారు. తేనిటి విందులో సీఎం వైఎస్ జగన్ అనంతరం ఇచ్చిన తేనీటి విందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మంత్రులు అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, విడదల రజిని, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, శాసన మండలి వైస్ చైర్మన్ జకియాఖానం, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, కృష్ణాజిల్లా జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారికా రాము, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏపీ పైబర్నెట్ చైర్మన్ పి.గౌతంరెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి దేవినేని అవినాష్, పలువురు క్రైస్తవ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
క్రిస్మస్ కేక్ కట్ చేసిన సీఎం జగన్
-
అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు : సీఎం వైఎస్ జగన్
-
Viral: చూస్తుండగానే తలపై క్రిస్మస్ చెట్టు రెడీ..! గిన్నిస్ రికార్డు హెయిర్ స్టైల్
వైరల్: పొడవైన జుట్టంటే ఇష్టపడని అమ్మాయిలే ఉండరనడంలో అతిశయోక్తే లేదు. రోజుకో కొత్త హెయిర్ స్టైల్ చేసుకోవడం అమ్మాయిలకు తెగ అలవాటు. తాజాగా ఓ ప్రఖ్యాత హెయిర్ స్టైలిస్ట్ సరికొత్త హెయిర్ స్టైల్ డిజైన్తో ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. సిరియన్ హెయిర్ స్టైలిస్ట్ అయినటువంటి డానీ హిస్వానీ 2.90 మీటర్ల (9 అడుగుల 6.5 అంగుళాలు) ఎత్తులో క్రిస్మస్ చెట్టు ఆకారంలో ఓ మహిళ జుట్టును అందంగా అలంకరించి రికార్డ్ సృష్టించారు. సెప్టెంబర్ 16న దుబాయ్లో ప్రపంచలోనే పొడవైన హెయిర్ స్టైల్గా హిస్వాని ఈ ఘనత సాధించారు. కాగా హిస్వాని ప్రపంచ ఫ్యాషన్ మ్యగజైన్లు, పెనెలోప్ క్రజ్, దీపిక పదుకొనె, ప్యారిస్ హిల్టన్ వంటి గొప్ప సెలబ్రిటీలకు హెయిర్ స్టైలిస్ట్గా పనిచేశారు. ఈ కేశాలంకరణ చేసిన విధానాన్ని తెలుపుతూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్టు చేసింది. ఇందులో హిస్వాని ముందుగా మోడల్ తలకు సపోర్ట్గా ఓ హెల్మెట్ను పెట్టింది. దానిపై మూడు మెటల్ రాడ్లు అమర్చి జుట్టును క్రిస్మస్ చెట్టు ఆకారంలో వచ్చేందుకు విగ్లు, హెయిర్ ఎక్స్టన్షన్స్ను ఉపయోగించించారు. చివరికి హెయిర్ స్టైల్ అనుకున్న సైజ్లో వచ్చేందుకు పై అంతస్తుకు వెళ్లీ మరీ డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ డిఫరెంట్ హెయిర్ స్టైల్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు. చదవండి: యూనిఫామ్ ఉందని మరిచారా సార్! మహిళతో ఎస్సై డ్యాన్స్ వీడియో వైరల్ View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) -
అదిరేటి హెయిర్స్టైల్.. గిన్నిస్ రికార్డు
-
అధికారంలో ఉన్నవాళ్లు ప్రజలకు సేవకులు: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: అధికారంలో ఉన్నవాళ్లు ప్రజలకు సేవకులని ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేనీటి విందు కార్యక్రమం ఏర్పాటు చేసింది. మంగళవారం సాయంత్రం విజయవాడ ఏప్లస్ కన్వెన్షన్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి హాజరై మాట్లాడారు. ‘‘దేవుడు మన నుంచి ఆశించేది ఒక్కటే. అధికారం అనేది అధికారం కాదు. అధికారంలో ఉన్నవాళ్లు ప్రజలకు సేవకులు. ఇంకా ప్రజలకు ఒదిగి ఉండాలి అని గుర్తు పెట్టుకోవాలి’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో తాను ఈ స్థానంలో ఉన్నానని, ఇంకా గొప్ప సేవ చేసే అవకాశం తనకు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నట్లు ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం జగన్. ఇంకా ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
విజయవాడ: క్రిస్మస్ తేనీటి విందుకు హాజరుకానున్న సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: క్రిస్మస్ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తేనేటి విందు ఏర్పాటు చేసింది. మంగళవారం సాయంత్రం జరగనున్న ఈ కార్యక్రమం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(మంగళవారం) విజయవాడకు వెళ్లనున్నారు. ఏప్లస్ కన్వెన్షన్లో జరగబోయే ఈ కార్యక్రమానికి సీఎం జగన్తో పాటు పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. -
ఫ్లిప్కార్ట్ లో బంపర్ ఆఫర్లు..!
-
సమాధుల తోట.. జ్ఞాపకాల మూట
కడప కల్చరల్: మన దేశాన్ని పాలించేందుకు వచ్చిన బ్రిటీషు వారు ఈ ప్రాంతాలపై ఎనలేని మక్కువ పెంచుకున్నారు. పరిపాలనలో తమదైన ముద్ర వేయడమే కాకుండా వారి నివాస గృహాలు, ఇతర నిర్మాణాల్లో కూడా వారి శైలిని కనబరిచారు. వారు నిర్మించిన ప్రార్థన మందిరాలు, కార్యాలయాలు, ఇతర భవనాలు నేటికీ పటిష్టంగా ఉండి ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి చారిత్రక నిర్మాణాలలో కడప నగరంలోని క్రై స్తవుల సమాధుల తోట (దొరల గోరీలు) ఒకటి. క్రిస్మస్ పండుగ రానున్న సందర్భంగా ఆ వివరాలు.. కడప నగరం మాసాపేట చివరన నిర్మల కాన్వెంట్ వద్ద క్రైస్తవుల సమాధులు ఉన్నాయి. దొరల గోరీలుగా పేరున్న ఇందులో 25కు పైగా బ్రిటీషు పాలనలో మరణించిన తెల్లదొరల సమాధులు ఉన్నాయి. దివంగతులైన తమ బంధుమిత్రుల సమాధుల వద్దకు తరచూ వెళ్లే సంప్రదాయం ఉండడంతో నాటి తెల్లదొరల బంధుమిత్రులు ఈ సమాధుల ప్రాంతాన్ని ఉద్యాన వనంగా తీర్చిదిద్దారు. పూలమొక్కలతోపాటు చెట్ల పెంపకం చేపట్టారు. ప్రత్యేకంగా తోట మాలీలను నియమించి ఆ ప్రాంతాన్ని పచ్చదనంతో, ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. విశిష్టంగా.. దొరల గోరీలలో మన ప్రాంతంలో కనిపించే సమా«ధులకు భిన్నమైన సమాధుల నిర్మాణాలు కనిపిస్తాయి. ఒక్కో సమాధి చారిత్రక నిర్మాణ శైలితో భారీగా పలు ఆకర్శణీయమైన రూపాలలో కనిపిస్తుంది. నాటి నిర్మాణశైలికి ప్రతీకలుగా ఆ సమాధులు నేటికీ మనం చూడవచ్చు. ఇప్పుడు కూడా కడప నగరంలో క్రైస్తవ ప్రముఖులు ఎవరైనా మరణిస్తే సమాధుల తోటలోనే ఖననం చేస్తారు. ప్రముఖుల సమాధులు: క్రైస్తవుల సమాధుల తోటలో పలువురు బ్రిటీషు అధికారుల సమాధులున్నాయి. వాటి వివరాలను కడప గెజిటీర్లో ప్రచురించారు. అప్పట్లో జరిగిన ఓ ఘర్షణను నివారించేందుకు వెళ్లిన ఆంగ్ల యువ అధికారి మెక్డొనాల్డ్ మరణించాడు. భర్త మరణ వార్త విన్న ఆయన భార్య వెంటనే స్పృహ కోల్పోయి కొద్దిరోజుల్లోనే మరణించింది. మెక్డొనాల్డ్తోపాటు ఆయన భార్య సమాధిని కూడా పక్కపక్కనే నిర్మించి ఆ రెంటిని కలిపి ఒకే సమాధిగా తీర్చిదిద్దారు. ఈ విశిష్టమైన ప్రేమ చిహ్నాన్ని నేటికీ మనం క్రైస్తవుల సమాధుల తోటలో చూడవచ్చు. క్రెస్తవుల సమా«ధుల తోటను 1800వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. రాజంపేట సమీపంలోని గుండ్లూరు వద్ద 1807లో మరణించిన నాటి సివిల్ సర్వీసెస్ అధికారి వెబ్ థాకరె సమాధి కూడా ఈ ప్రాంగణంలో ఉంది. థాకరె ప్రసిద్ధ ఆంగ్ల రచయిత విలియం మెక్ పీస్కు మేనల్లుడు. అప్పట్లో జిల్లా పబ్లిక్ వర్క్స్శాఖలో అసిస్టెంట్ ఇంజినీరుగా పనిచేసిన చార్లెస్ (కాటన్ దొరకు మేనల్లుడు) సమాధి కూడా ఈ ప్రాంగణంలో ఉంది. ప్రతి సంవత్సరం పెద్దల సమాధుల దినోత్సవం (డూమ్స్ డే) నాడు నగరానికి చెందిన క్రైస్తవులు తమ బంధువుల సమాధులపై కొవ్వొత్తులు వెలిగించి వారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేస్తారు. ఇక్కడి బ్రిటీషు దొరల సమాధులు 200 సంవత్సరాల క్రితం నాటివి. వంద సంవత్సరాలు దాటిన నిర్మాణాలను వారసత్వ సంపదగా పరిగణిస్తారు.సమాధుల తోటను కూడా వారసత్వ ప్రాంతంగా ప్రకటించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో తీర్చిదిద్దాలని నగరానికి చెందిన క్రైస్తవ ప్రముఖులు పేర్కొంటున్నారు. -
‘పాపికొండల’ ప్రత్యేక ప్యాకేజీలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): పర్యాటకుల మనస్సుదోచే తూర్పు గోదావరి జిల్లా పాపికొండల విహార యాత్రకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి శాఖ (ఏపీటీడీసీ) ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. క్రిస్మస్, సంక్రాంతి పండుగల వేళ కుటుంబ సభ్యులతో కలిసి బోటులో విహరించేందుకు ఒకటి, రెండు రోజుల టూర్లను రాజమండ్రి, పోచవరం, గండి పోచమ్మ ప్రాంతాల నుంచి సిద్ధం చేసింది. ఆ ప్యాకేజీ వివరాలను ఏపీటీడీసీ కాకినాడ డివిజనల్ మేనేజర్ సీహెచ్ శ్రీనివాస్ శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. రాజమండ్రి, గండి పోచమ్మ నుంచి పాపికొండలు వెళ్లే వారు సెల్ : 98486 29341, 98488 83091 నంబర్లలో, పోచవరం నుంచి పాపికొండలు వెళ్లే వారు సెల్ : 63037 69675 నంబర్లో సంప్రదించాలని కోరారు. రాజమండ్రి నుంచి ఒక రోజు పర్యటన రాజమండ్రి నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు పెద్దలు ఒక్కొక్కరికి రూ.1,250, చిన్నారులు ఒక్కొక్కరికి రూ.1,050 చార్జీగా నిర్ణయించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇస్తారు. రాజమండ్రి నుంచి 2 రోజుల పర్యటన రాజమండ్రి నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటలకు తిరిగి వస్తారు. పెద్దలకు రూ.3,000, పిల్లలకు రూ.2,500 చార్జీ. మొదటి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి 2 నాన్వెజ్ కూరలతో భోజనం, 2వ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం 2 నాన్వెజ్ కూరలతో భోజనం, సాయంత్రం స్నాక్స్. పోచవరం నుంచి ఒక రోజు పర్యటన పోచవరం నుంచి పాపికొండలకు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750 చార్జీ. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్. పోచవరం నుంచి 2 రోజుల పర్యటన పోచవరం నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటలకు బయలుదేరి తిరిగి మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటల వరకు. పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.2,000 చార్జీ. మొదటి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి 2 నాన్వెజ్ కూరలతో భోజనం, 2వ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రెండు నాన్వెజ్ కూరలతో భోజనం, సాయంత్రం అల్పాహారం. గండి పోచమ్మ నుంచి ఒక రోజు పర్యటన గండి పోచమ్మ నుంచి పాపికొండలకు ఉదయం 9.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటల వరకు. పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ.800 చార్జీ. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్. గండి పోచమ్మ నుంచి 2 రోజుల పర్యటన గండి పోచమ్మ నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటల వరకు. పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.2,000 చార్జీ. మొదటి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి రెండు నాన్వెజ్ కూరలతో భోజనం. 2వ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రెండు నాన్వెజ్ కూరలతో భోజనం, సాయంత్రం అల్పాహారం. -
రవితేజ, నిఖిల్తో బాక్సాఫీస్ వార్కి సై అంటున్న నయన్!
క్రిస్మస్ పండక్కి సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి. వచ్చే సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉండటంతో..ఈ క్రిస్మస్ ను బెస్ట్ అప్సన్ గా ఎంచుకున్నాయి.మాస్ మహారాజా రవితేజ ధమాకా సినిమాతో రంగంలో దిగుతున్నాడు. రవితేజకు జోడిగా శ్రీలీలా నటించింది. ఇప్పటికే మూవీ టీజర్,పాటలు రిలీజ్ చేశారు. డిసెంబర్ 23న ఈ చిత్రం విడుదల కానుంది. మరో వైపు క్రిస్మస్ కు నిఖిల్ కూడా 18 పేజేస్ తో వస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అలాగే ఓ పాటతో కూడా ఆకట్టుకున్నారు. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. పలనాటి సూర్య ప్రతాప్ మూవీ దర్శకుడు. నిఖిల్ ,అనుపమా పరమేశ్వరన్ నటించిన కార్తికేయా 2 పాన్ ఇండియా హిట్ కొట్టింది. దాంతో ఈ సినిమా మీద బజ్ బాగా పెరిగింది. రొమాంటిక్ కామెడీ జోనర్ తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ,నిఖిల్ తమ సినిమాతో పండక్కి రాబోతుంటే...నయన తార కూడా కనెక్ట్ మూవీతో రంగంలోకి దిగుతుంది. హర్రర్ జోనర్ లో ఈ మూవీ రూపొందింది. ఇప్పటికే ఈ మూవీ నుండి టీజర్ విడుదల చేశారు.యూవీ క్రియేషన్స్ బ్యానర్ తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేస్తుంది. ఇక 99 నిమిషాల నిడివి కల ఈ మూవీలో ఇంటర్వెల్ అనేది ఉండదట..అంటే..ఆడియన్స్ కు సినిమా మొదలయినప్పటి నుండి ..క్లైమాక్స్ వరకు..విశ్రాంతి ఇవ్వరన్న మాట. మరి క్రిస్మస్ పండక్కి..ఏ సినిమా ఎక్కువ ఆకట్టుకుందో చూడాలి. -
క్రిస్మస్ కేక్ మిక్సింగ్ ఈవెంట్ (ఫొటోలు)
-
AP: నేతన్నకు ఊతం.. ఆఫర్లతో ఆప్కోకు అందలం
సాక్షి, అమరావతి: క్రిస్మస్, సంక్రాంతి పండుగ సీజన్లలో ప్రకటించిన ఆఫర్ల కారణంగా ఆప్కో వస్త్ర వ్యాపారం ఊపందుకుంది. పండుగ సీజన్లలో అమ్మకాలు పెరగడమే ఇందుకు నిదర్శనం. పండుగ సీజన్లలో 30 శాతం డిస్కౌంట్పై ఆప్కో అమ్మకాలు సాగించడంతో ఆప్కో షోరూమ్ల ద్వారా గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఏకంగా రూ.9 కోట్లకుపైగా వస్త్ర విక్రయాలు జరిగాయి. చదవండి: గుడివాడలో టీడీపీకి భంగపాటు రాష్ట్రంలోని పలు సొసైటీల వద్ద పేరుకుపోయిన చేనేత వస్త్రాల నిల్వలను కరోనా కష్టకాలంలోనూ కొనుగోలు చేస్తున్న ఆప్కో లాభాపేక్ష లేకుండా వినియోగదారులకు అందిస్తోంది. ఒక్క తూర్పుగోదావరి జిల్లా చేనేత సహకార సొసైటీల్లో పేరుకుపోయిన రూ.కోటి 60 లక్షల విలువైన బెడ్షీట్లను ఆప్కో కొనుగోలు చేసి విక్రయాలు జరిపింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 108 ఆప్కో షోరూమ్లున్నాయి. వాటిలో నామ మాత్రపు విక్రయాలు జరిగే వాటిని తొలగించి వ్యయప్రయాసలు తగ్గించేందుకు ఆప్కో సిద్ధమైంది. అయితే ఇటీవల ప్రారంభించిన గుంటూరు, ఒంగోలు, కడపలో రోజుకు రూ.లక్షకుపైగా అమ్మకాలు జరగడంతో రాష్ట్రంలో మరో పది మెగా షోరూమ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. -
సైకోలా మారిన ఉడత.. 18 మందిపై దాడి!
ఉడతలు మనుషులను చూస్తే భయపడుతూ! చెట్లపై తిరగటం చూస్తూ ఉంటాం. కానీ ఓ ఉడత మనుషులపై దాడులకు తెగపడి సుమారు 18మంది గాయపరిచింది. ఈ ఘటన యూకేలోని బక్లీ టౌన్లో చోటుచేసుకుంది. గత వారంలో ఆ ఉడత సైకోలా ప్రవర్తిస్తూ రెండు రోజులు పాటు మనుషులపై దాడికి చేసిందని ఆ దేశ మీడియా పేర్కొంది. డిసెంబర్ 26న బక్లీ రెసిడెంట్స్ ఫేస్బుక్ గ్రూప్లో ఉడతకు దాడి విషయాన్ని షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ‘నా వేలు పైన దంతాల గుర్తులు ఉన్నాయని, నాపై దాడికి చేసిన ఉడతను వదిలించుకోవడానకి ఇబ్బందిపడ్డాను.దాని దంతాలు పిన్నుల వలే ఉన్నాయి’ అని షెరీ డేవిడ్సన్ అనే స్థానికుడు చెప్పారు. క్రిస్మస్ సమయంలో రెండు రోజుల వ్యవధిలోనే ఈ ఉడుత 21సార్లు దాడి చేసి 18 మందిని గాయపరిచిందని స్థానికులు పేర్కొన్నారు. అనంతరం ఆ ఉడతను పట్టుకున్నామని, అది ప్రస్తుతం సురక్షితంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఉడతలు కూడా సైకోగా మారుతాయా?’ అని కామెంట్లు చేస్తున్నారు. -
దేవుడా ఎందుకీ కడుపుకోత.. నేనేం పాపం చేశా..
సాక్షి, రంగారెడ్డి(మొయినాబాద్): ‘దేవుడా ఎందుకీ కడుపుకోత.. ఒకేసారి ఇద్దరు బిడ్డల్ని తీసుకెళ్తావా..? నేనేం పాపం చేశా..’ అని ఓ మాృతమూర్తి గర్భశోకంతో తల్లడిల్లింది. వరుసగా రెండు రోజులు వారి అంత్యక్రియలు నిర్వహించడం హృదయాలను కలచివేసింది. అక్కాచెల్లెళ్లు తమ చిన్నాన్న కూతురితో కలసి క్రిస్మస్ వేడుకలకు శనివారం రాత్రి స్కూటీపై వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు సోమవారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. చిన్నాన్న కూతురు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల కడుపుకోతను చూసి బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. చదవండి: (పెళ్లి బాజా మోగాల్సిన ఇంట విషాదం.. ఓ ప్రబుద్ధుడు పెళ్లి చెడగొట్టడంతో) వివరాలు.. మొయినాబాద్ మండల పరిధిలోని రెడ్డిపల్లికి చెందిన మోర వెంకటేశ్, విజయలక్ష్మి దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నాడు. వెంకటేశ్ మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. క్రిస్మస్ సందర్భంగా స్నేహితులతో కలసి వేడుక చేసుకునేందుకు శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో వెంకటేశ్ కూతుళ్లు ప్రేమిక (16), సౌమ్య (20), వారి చిన్నాన్న కూతురు అక్షయ స్కూటీపై వెళ్తున్నారు. అదే సమయంలో మద్యం మత్తులో అతివేగంతో చేవెళ్ల వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు వీరి స్కూటీని ఢీకొట్టింది. దీంతో ప్రేమిక అక్కడికక్కడే మృతి చెందగా, సౌమ్య, అక్షయ తీవ్రంగా గాయపడ్డారు. సౌమ్య చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందగా.. అక్షయ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. సౌమ్య మృతదేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పిస్తున్న మంత్రి సబితారెడ్డి చదవండి: (దేవుడా ఎంతపని చేశావయ్యా.. పెళ్లై నెలైనా కాలేదు.. ఇంతలోనే..) వరుసగా రెండు రోజులు అంత్యక్రియలు ఒకే కుటుంబంలో వరుసగా రెండు రోజులు చెల్లి, అక్కా అంత్యక్రియలు జరిగాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ‘దేవుడా ఎందుకు కడుపుకోత మిగిల్చావ్.. ఇద్దరు బిడ్డలను ఒకేసారి తీసుకెళ్లావా..?’ అంటూ ఆ తల్లి రోదనలు అక్కడున్న వారి హృదయాలను కలచివేసింది. కాగా, నిందితుడు, అత్తాపూర్కు చెందిన సంపత్రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చదవండి: (భర్త, కుమార్తెను వదిలి ప్రియుడితో వెళ్లిపోయి.. ఆది పరాశక్తి అవతారంలో..) మంత్రి సబిత, ఎమ్మెల్యే యాదయ్య పరామర్శ సౌమ్య అంత్యక్రియలకు సోమవారం మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరయ్యారు. సౌమ్య మృతదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఇద్దరు కూతుళ్లను కోల్పోయిన తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
ప్రభువా దీవించు!
-
15–18 ఏళ్ల వారికీ కోవిడ్ టీకా: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశంలో 15–18 సంవత్సరాల వయసున్నవారికి జనవరి 3 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. దీంతోపాటు జనవరి 10 నుంచి హెల్త్కేర్ మరియు ఫ్రంట్లైన్ వర్కర్లకు ముందుజాగ్రత్త కోసం మరో డోసు(ప్రికాషన్ డోస్– రెండు డోసులు తీసుకున్నవారికి ఇచ్చే మూడో డోసు) ఇస్తామని తెలిపారు. శనివారం ఈ మేరకు ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, క్రిస్మస్, వాజ్పేయ్ జన్మదినం సందర్భంగా ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. కళాశాలలు, పాఠశాలలకు పిల్లలను పంపే తల్లిదండ్రులకు ఈ నిర్ణయం భరోసానిస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని, అంతా అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. డాక్టర్ల సలహా మేరకు ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్న 60ఏళ్లు పైబడినవారికి కూడా అదనపు డోసు ఇస్తారన్నారు. ఈ సందర్భంగా ఆయన బూస్టర్ డోస్ అని వ్యాఖ్యానించకుండా ప్రికాషనరీ డోస్ అని మాత్రమే చెప్పారు. వ్యక్తిగత స్థాయిలో సంరక్షణా విధానాలు పాటించడమే కోవిడ్పై పోరాటంలో అతిపెద్ద ఆయుధమని, అందువల్ల ప్రజలంతా తప్పక కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. అనవసరంగా భయపడాల్సిన పనిలేదని ఆయన భరోసా ఇచ్చారు. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ అత్యంత కీలకంగా ఆయన అభివర్ణించారు. త్వరలో ముక్కు ద్వారా ఇచ్చే టీకా, ప్రపంచ తొలి డీఎన్ఏ ఆధారిత టీకాలు భారత్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. లోతైన అధ్యయనం తర్వాతే.. కరోనాపై పోరులో దేశీయ శాస్త్రవేత్తల కృషిని మోదీ కొనియాడారు. టీకాలు, డోసులపై వీరు లోతైన అధ్యయనం చేసిన అనంతరమే అదనపు డోసు, పిల్లలకు టీకా వంటి నిర్ణయాలను సూచించారని చెప్పారు. సైంటిస్టులు ఒమిక్రాన్ వేరియంట్ విసిరే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. భారత్లో 18 లక్షల ఐసోలేషన్ పడకలు, 5 లక్షల ఆక్సిజన్ సపోర్ట్ బెడ్స్, 1.4 లక్షల ఐసీయూ పడకలు సిద్దమని, దేశవ్యాప్తంగా 3వేల ఆక్సిజన్ ప్లాంట్లు పనిచేస్తున్నాయని, 4 లక్షల ఆక్సిజన్ సిలెండర్లు దేశమంతా సరఫరా చేశామని తెలిపారు. భారత్లో ఇంతవరకు 141 కోట్ల డోసులను ప్రజలకు అందించినట్లు మోదీ చెప్పారు. దేశంలో ఒకవేళ ఒమిక్రాన్ కేసులు పెరిగినా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. భారత్లో 18 లక్షల ఐసోలేషన్ పడకలు, 5 లక్షల ఆక్సిజన్ ఆధారిత పడకలు, 1.4 లక్షల ఐసీయూ పడకలు ఉన్నాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా దాదాపు 90 వేల పడకలు కేటాయించాం. దేశవ్యాప్తంగా 3 వేల ఆక్సిజన్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. దేశమంతా 4 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశాం. – మోదీ -
వైభవంగా క్రిస్మస్ వేడుకలు
గుణదల (విజయవాడ తూర్పు)/అనంతపురం కల్చరల్: లోక రక్షకుడైన యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగానున్న క్రైస్తవులు శనివారం ఘనంగా జరుపుకున్నారు. చర్చి ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన శాంతాక్లాజ్, క్రిస్మస్ ట్రీ విశేషంగా ఆకట్టుకోగా.. పశువుల పాకలో కొలువైన బాలయేసును భక్తి శ్రద్ధలతో పూజించారు. కాగా క్రైస్తవ విశ్వాసులు, యాత్రికులు పెద్ద సంఖ్యలో గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి చేరుకోవడంతో గుణదల కొండ భక్తులతో కిక్కిరిసిపోయింది. అనంతపురంలో క్రిస్మస్ ప్రార్థనలకు హాజరైన భక్తులు రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు మాట్లాడుతూ.. యేసుక్రీస్తు ఆచరించి చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు. సమష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు సత్ప్రసాదాన్ని అందజేశారు. అలాగే అనంతపురం ఎస్ఐయూ చర్చిలో జరిగిన వేడుకల్లో శాసనమండలి విప్ వెన్నపూస గోపాల్రెడ్డి, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు. గుణదల మేరీమాత ఆలయం వద్ద భక్తుల సందడి -
క్రిస్మస్ తాత గురించి ఈ విశేషాలు తెలుసా?
క్రిస్మస్.. ఈ పేరు వినగానే సంబరాలు గుర్తొస్తాయి. యేసుక్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా పాటలు పాడుకుంటూ, సంతోషాన్ని పంచుకుంటూ, బహుమతులు ఇచ్చిపుచ్చుకునే సన్నివేశాలూ కనిపిస్తాయి. వీటన్నింటితో పాటు మరో వ్యక్తి కూడా తప్పక గుర్తొస్తారు. ప్రత్యేకించి చిన్నపిల్లలైతే ఆయన్ను గుర్తుతెచ్చుకోకుండా క్రిస్మస్ పండుగను జరుపుకోరని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆయనే శాంటా క్లాస్.. ముద్దుగా క్రిస్మస్ తాత అని పిలుచుకుంటారు. తెల్ల జుట్టు, పొడవాటి తెల్ల గడ్డం, ఎరుపు, తెలుపు కలిగిన టోపీని, దుస్తులను ధరించి వచ్చే క్రిస్మస్ తాతను మనం చూసే ఉంటాం. పిల్లలకు బహుమతులు ఇస్తూ, వారిని ఉత్సాహపరుస్తూ క్రిస్మస్ తాత (వేషం వేసిన వ్యక్తి) సందడి వాతావరణం సృష్టిస్తాడు. క్రిస్మస్ సందర్భంగా జరిగే కరోల్స్ లో పిన్నలూ, పెద్దలు సైతం శాంటా క్లాజ్ వేషంలో ఉన్న వ్యక్తి వెంట తిరుగుతూ ఉండటం చూస్తుంటాం. అయితే ఈ క్రిస్మస్ తాత ఎక్కడ నుంచి వచ్చాడో ఎప్పుడైనా ఆలోచించారా! పండుగ నుంచి ఆయన్ను వేరు చేయలేనంతగా ఆయన ఎందుకు మారారో తెలుసా ! ఆయనో బిషప్.. స్థానికంగా క్రైస్తవుల మతపెద్దగా వ్యవహరించే వ్యక్తిని బిషప్ అని పిలుస్తారు. క్రిస్మస్ తాతగా పేరొందిన వ్యక్తి కూడా ఓ బిషప్. ఆయన పేరు నికోలస్. ఆయన ప్రస్తుత టర్కీ లోని మైరా ప్రాంతానికి బిషప్ గా పని చేశారు. ఆయన క్రీ. శ. 280వ సంవత్సరానికి చెందినవారు. తండ్రి నుంచి తనకు వచ్చిన ఆస్తులను అవసరాల్లో ఉన్న వారికి దానం చేసిన గొప్ప వ్యక్తి నికోలస్. ప్రత్యేకించి క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు ఆయన పేదవారి ఇళ్లకు మారు వేషంలో వెళ్లేవారు. వెళ్తూ వెళ్తూ తనతో పాటు బహుమతులను, కొంత డబ్బును తీసుకొని వెళ్లి ఆ పేదలకు అందించేవారు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా అక్కడి నుంచి మాయం అయ్యేవారు. దీంతో ఆయన గురించి అనేక కథలు ప్రచారంలోకి వచ్చాయి. అమెరికాలో, యూరప్ దేశాల్లో ఆయన మంచి ప్రాచుర్యం పొందాడు. సాయమే లక్ష్యం.. పండుగ అంటే మన దగ్గర ఉన్నదాంతో మనమే సుఖంగా బతకడం కాదు.. మన చుట్టూ ఉన్న నలుగురి ముఖాల్లో చిరునవ్వు కలిగించడం అని మనసా వాచా కర్మణా నమ్మిన వ్యక్తి సెయింట్ నికోలస్. పేదవారికి సాయం చేయడం కోసం ఆస్తి మొత్తాన్ని ధారాదత్తం చేసేవారు ఎవరుంటారు ? కానీ ఆయన ఆ పని చేశారు. అందుకే ప్రతి క్రిస్మస్ నాడు.. క్రిస్మస్ తాత వచ్చి బహుమతులు ఇస్తాడని పిల్లలంతా నమ్మేంతగా అతడు ఈ పండుగలో చొచ్చుకుపోయాడు. శాంటా క్లాస్ – క్రిస్మస్ ఫ్యాక్ట్స్.. క్రిస్మస్ తాత నిజానికి నీలి రంగు దుస్తులు ధరించేవారు. అయితే 1930లలో కోకాకోలా కంపెనీ వారు తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడానికి ఎరుపు రంగు వాడారు. అవి బాగా ప్రాచుర్యం పొందటంతో క్రిస్మస్ తాత కాస్ట్యూమ్స్ ఎరుపు, తెలుపు రంగులు సంతరించుకున్నాయి. బరువైన క్రిస్మస్ గిఫ్ట్: సుప్రసిద్ధ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహాన్ని 1886లో ఫ్రాన్స్ దేశం అమెరికాకు బహుమతిగా ఇచ్చింది. దాని బరువు 225 టన్నులు. దీంతో ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత బరువైన క్రిస్మస్ బహుమతిగా పేరొందింది. – సృజన్ సెగెవ్ -
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రయోగం విజయవంతం..!
నాసా సైంటిస్ట్ల 25 ఏళ్ల శ్రమ.. 20 దేశాల సహకారంతో రూపకల్పన. సుమారు 76 వేల కోట్ల రూపాయలు వ్యయం. వెరసీ అంతర్జాతీయ పరిశోదనా కేంద్రం నాసా 25 ఏళ్ల పాటు నిర్విరామంగా తయారు చేసిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్(జేడబ్ల్యూఎస్టీ) ప్రయోగం విజయవంతమైంది. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 5.50 గంటలకు ఫ్రెంచ్ గయానా నుంచి యూరోపియన్ అరియాన్ రాకెట్ ద్వారా ఈ జేడబ్యూఎస్టీని నింగిలోకి ఎగిసింది. ఈ టెలిస్కోప్ భూమి నుంచి సుమారు 1.5 మైళ్ల దూరంలో ఉండనుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా టెలిస్కోప్ గ్రౌండ్ కంట్రోలర్స్తో కమ్యూనికేట్ చేస్తోందని నాసా వెల్లడించింది. ✅ Milestone achieved. @NASAWebb is safely in space, powered on, and communicating with ground controllers. The space telescope is now on its way to #UnfoldTheUniverse at its final destination one million miles (1.5 million km) away from Earth. pic.twitter.com/gqICd0Xojz — NASA (@NASA) December 25, 2021 జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్తో పాటు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్తో పాటు నాలుగు రకాలైన నియర్ ఇన్ ఫ్రా రెడ్ కెమెరా, నియర్ ఇన్ ఫ్రా రెడ్ స్పెక్ట్రోగ్రాఫ్, మిడ్ - ఇన్ ఫ్రా రెడ్ ఇన్స్ట్రుమెంట్, నియర్ ఇన్ ఫ్రా రెడ్ ఇమేజర్ అండ్ శాటిలైట్ స్పెక్ట్రో గ్రాఫ్ వంటి అత్యాధునికి సైన్స్ పరికరాల్ని పంపిస్తున్నారు. నాసా తెలిపిన వివరాల ప్రకారం..ఈ నాలుగు అత్యాధునిక ఇన్స్ట్రుమెంట్స్ గెలాక్సీల పుట్టుపూర్వత్రాలు వాటి నిర్మాణం, గ్రహ వ్యవస్థలు, నక్షత్రాల గురించి తెలుసుకుంటాయని తెలిపింది. కెమెరాల్ని ఎందుకు పంపిస్తున్నారు? 1380 కోట్ల సంవత్సరాల కిందట దట్టమైన కణాలతో బిగ్ బ్యాంగ్ అనే విస్పోటనం ఏర్పడిందని సైంటిస్ట్లు నమ్ముతారు. ఆ బిగ్ బ్యాంగ్ ఏర్పడిన తర్వాత 150-200 మిలియన్ సంవత్సరాల తర్వాత మొదటి నక్షత్రాలు ఏర్పడ్డాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి విశ్వం యొక్క మొదటి కాంతి లేదా నక్షత్రాలు ఎలా ఉన్నాయనే' అంశాలతో పాటు గెలాక్సీల పుట్టుక, విశ్వ ఆవిర్భవ అంశాలను లోతుగా పరిశీలించేందుకు, అనేక అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు ఈ ఇన్ఫ్రారెడ్ కెమెరాలను జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్తో పంపిస్తున్నారు. ఇక ఈ ప్రయోగంలో జేడబ్ల్యూఎస్టీ టెలిస్కోప్ మన సౌర వ్యవస్థ యొక్క గ్రహాలైన మార్స్, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్, వాటి ఉపగ్రహాలను అధ్యయనం చేయడానికి కూడా రూపొందించబడింది. ఇది తోకచుక్కలు, గ్రహశకలాలు, అంగారక కక్ష్యలో లేదా వెలుపల ఉన్న చిన్న గ్రహాలను కూడా అధ్యయనం చేస్తుందని నాసా సైంటిస్ట్లు చెబుతున్నారు. డేటా సేకరించడం ఎలా? గెలాక్సీ, నక్షత్రాలు గుట్టు తెలుసుకునేందుకు నాసా పంపిస్తున్న ఈ టెలిస్కోప్ సాయంతో అంతరిక్షం నుంచి హై ఫ్రీక్వెన్సీ రేడియో ట్రాన్స్ మీటర్ ద్వారా భూమి మీద ఉన్న నాసా డీప్ స్పేస్ నెట్ వర్క్కు పంపనుంది. తద్వారా అక్కడి వింతలు, విశేషాలు తెలుసుకోవడం మరింత ఈజీ అవుతుంది. చదవండి: అంతరిక్షంలో పెట్రోల్ బంకులు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాసా -
జీవన విలువల్ని ప్రతిఫలించే మహోన్నత సంబరం క్రిస్మస్
-
100 ఎకరాల్లో ఆంగ్లేయులు నిర్మించిన చర్చీ.. తెలంగాణలో రెండో అతి పెద్దది
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చర్చీలు క్రిస్మస్ వేడుకల కోసం ముస్తాబయ్యాయి. సంబరాలు అంగరంగ వైభవంగా జరిపేందుకు నిర్వాహకులు విద్యుత్ దీపాలతో అలంకరించారు. యేసు జన్మస్థలంగా భావించే పశువుల పాకలను ఆకట్టుకు నే విధంగా తీర్చిదిద్దారు. ప్రార్థనలు చేసేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని ప్రాచీన లక్సెట్టిపేట సీఎస్ఐ చర్చికి భక్తుల తాకిడి అధికంగా ఉండనుంది. సాక్షి, లక్సెట్టిపేట(ఆదిలాబాద్): రాష్ట్రంలో మెదక్ తర్వాత అతిపెద్ద చర్చిగా చెప్పుకునే లక్సెట్టిపేట సీఎస్ఐ చర్చి 86 వసంతాలు పూర్తి చేసుకున్నా నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ చర్చికి క్రిస్మస్కు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రార్థనలు చేస్తుంటారు. ఆదిలాబాద్లోని చర్చిలో.. బ్రిటీష్ కాలంలో నిర్మాణం.. లక్సెట్టిపేట పట్టణానికి సమీపంలో వందెకరాలకు పైగా పచ్చటి పొలాలు, టేకు వనంలో మిషన్ కాంపౌండ్ ప్రాంతంలో ఆంగ్లేయులు ఈ చర్చిని నిర్మించారు. 1920లో ఇంగ్లాండ్కు చెందిన రేవ ఈడబ్ల్యూ లాంట్ లక్సెట్టిపేట పట్టణానికి వచ్చి, ఇక్కడే పదేళ్లపాటు మిషనరీ సంస్థలో పనిచేశాడు. 1930లో చర్చి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 95 ఫీట్ల వైశాల్యంతో చర్చి నిర్మాణం, 70 ఫీట్ల వైశాల్యంతో ప్రాంగణం, 46 గొలుసులతో ఉన్న దిమ్మెలు, సుమారు 500 మందికి వసతి కల్పించేవిధంగా ఏర్పాట్లు చేశారు. దీని కోసం ఇంగ్లాండ్ నుంచి ప్లాన్ తెప్పించాడు. నిర్మాణ పనులు చూసే బాధ్యతను రెవ సీజీ అర్లికి అప్పగించారు. ఇంగ్లాండ్ నుంచి రంగురంగుల అద్దాలు, స్థానికంగా ఉన్న గూడెం గుట్ట, గువ్వల గుట్ట, చిన్నయ్య గుట్ల నుంచి రాళ్లు తెప్పించి, బొట్లకుంటలోని నీటిని చర్చి నిర్మాణానికి ఉపయోగించారు. ప్రత్యేకంగా మహారాష్ట్ర నుంచి శిల్పకళాకారులను రప్పించారు. 1935లో రెవ హెచ్ బర్డ్ చర్చి నిర్మాణం పూర్తి చేయించారు. అనంతరం మిషనరీగా వచ్చిన రేవ ఫాస్పూట్ సీఎస్ఐ చర్చిగా నామకరణం చేసి క్రిస్మస్ రోజున ప్రారంభించారు. అప్పటి నుంచి 1954 వరకు ఆంగ్లేయులే చర్చి ఫాదర్లుగా పనిచేశారు. ఫాదర్ నివాసం ఉండేందుకు రెండస్తుల విశాలమైన భవంతిని నిర్మించారు. ప్రస్తుతం పనిచేస్తున్న చర్చి ఫాదర్లు కూడా అందులోనే ఉంటారు. విద్యుత్కాంతుల్లో విజయనగరం చర్చి విజయనగరం చర్చికి 55 ఏళ్లు కౌటాల(సిర్పూర్): మండలంలోని విజయనగరం గ్రామంలోని కథోలిక చర్చికి ఘన చరిత్ర ఉంది. విజయనగరంలో 1966లో దీనిని స్థాపించారు. విశాలమైన ప్రాంతంలో చర్చితోపాటు ఎయిడైడ్ పాఠశాల, వసతి గృహం ఉన్నాయి. చర్చికి ప్రతి ఆదివారం 250 వరకు భక్తులు వచ్చి, ప్రార్థనలు నిర్వహిస్తారని ఫాదర్ మనోజ్ తెలిపారు. 30 ఏళ్ల క్రితం పాత భవనాన్ని తొలగించి, అదేస్థలంలో భారీ మందిరాన్ని నిర్మించారు. క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకంగా విద్యుత్కాంతులతో చర్చిని ముస్తాబు చేశారు. ఏర్పాట్లు చేస్తున్నాం క్రిస్మస్ రోజు లక్సెట్టిపేట సీఎస్ఐ చర్చికి భక్తులు అధికంగా వస్తుంటారు. పండుగ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ వేడుకలు సంతోషంగా జరుపుకోవాలి. – కరుణాకర్రావు, సీఎస్ఐ చర్చి ఫాదర్, లక్సెట్టిపేట కలెక్టర్ చౌక్లో ఏర్పాటు చేసిన భారీ క్రిస్మస్ ట్రీ ముస్తాబైన యేసు మందిరాలు కైలాస్నగర్(ఆదిలాబాద్): జిల్లాకేంద్రంలోని కలెక్టర్ చౌక్ వద్ద గల హోలీ ఫ్యామిలీ కాథరల్ చర్చిలో యేసు జన్మస్థలం పశువుల పాకను అందంగా తీర్చిదిద్దారు. రాత్రి 12 గంటలకు యేసు జన్మను స్వాగతిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఖానపూర్లో గల ఇండియా మిషన్ చర్చి, రవీందర్నగర్లోని సీఎస్ఐ చర్చి, విద్యానగర్లోని బేస్ సేబా చర్చిలో వేడుకలకు ఏర్పాట్లు చేశారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా అలంకరణ వస్తువులు సాంటా క్లోస్ దుస్తులు, నక్షత్రాలు, రంగురంగుల వస్తువులు కొనుగోళ్లతో షాపింగ్ మాల్లు, జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు రద్దీగా మారాయి. ఆనందంగా గడుపుతాం క్రిస్మస్ రోజు తప్పకుండా అమ్మనాన్నతో కలిసి అందరం చర్చికి వెళ్తాం. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, ఆనందంగా గడుపుతాం. కొత్త బట్టలు వేసుకుని, ఇంటిని కూడా అందంగా ముస్తాబు చేస్తాం. – డి.ప్రేక్ష, టీచర్స్కాలనీ -
Merry Christmas 2021: హ్యాపీ క్రిస్మస్.. చిన్నారులు
-
క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం జగన్
Live Updates: 11.20 AM ► ప్రత్యేక క్యాలెండర్ను ఆవిష్కరించిన సీఎం జగన్ ► చర్చి కాంపౌండ్లో షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం ► క్రిస్మస్ సందర్భంగా చర్చ్లో కేక్ కట్ చేసిన సీఎం జగన్ 9.45 AM ► పులివెందుల భాకరాపురం సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ► క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ అవినాష్రెడ్డి పాల్గొన్నారు. సాక్షి, వైఎస్సార్ కడప: ఉదయం 9.05 గంటలకు సీఎం వైఎస్ జగన్ ఇడుపుల పాయ హెలిప్యాడ్ నుంచి బయలుదేరి 9.25 గంటలకు పులివెందులకు చేరుకుంటారు. 9.45 నుంచి 11.05 గంటల వరకు సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు. 11.15 గంటల వరకు సీఎస్ఐ చర్చి కాంపౌండ్లో ఏర్పా టు చేసిన షాపింగ్ కాంప్లెక్స్ను ప్రారంభిస్తారు. 11.25 గంటలకు విజయా గార్డెన్స్కు చేరుకుని సారెడ్డి వరప్రసాద్రెడ్డి కుటుంబ సభ్యుల వివాహ రిసెప్షన్కు హాజరవుతారు. 11.50 నుంచి 12.50 గంటల వరకు భాకరాపురంలోని నివాసంలో గడుపుతారు.1.35 గంటలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకుని విజయవాడకు వెళతారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) –పులివెందుల -
సీఎం జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు
సాక్షి,అమరావతి: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దైవ కుమారుడు జీసస్ మానవుడిగా జన్మించిన రోజును ప్రపంచమంతా క్రిస్మస్గా జరుపుకుంటున్నామని, క్రిస్మస్ అనేది ఒక పండుగ మాత్రమే కాదని, అది మనిషిని నిరంతరం సన్మార్గంలో నడిపించే దైవికమైన ఒక భావన అని ఆయన అన్నారు. The preachings of Lord Christ resonate in the hearts of countless people in the world, leading them on the path of righteousness. His life is a message of compassion, harmony and forgiveness. On this blessed day, wishing a joyous and Merry Christmas to one and all! — YS Jagan Mohan Reddy (@ysjagan) December 25, 2021 దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం, త్యాగాలకు జీసస్ తన జీవితం ద్వారా బాటలు వేశారని తెలిపారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంత సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం, ఇవీ జీసస్ తన జీవితం ద్వారా మనకు ఇచ్చిన సందేశాలని ఆయన పేర్కొన్నారు. చదవండి: (AP: బిర్లాతో ఉపాధికి ఊతం) -
నకిలీ వ్యాపార ప్రకటనలను నమ్మొద్దు: రామ్రాజ్ కాటన్
హైదరాబాద్: తమ సంస్థ పేరుకు కళంకం తెచ్చే కళంకం దురుద్దేశంతో కొందరు గతవారం నుంచి ఆన్లైన్ ద్వారా నకిలీ వ్యాపార ప్రకటనలను చేస్తున్నారని రామ్రాజ్ కాటన్ సంస్థ ఆరోపించింది. అలాంటి మోసపూరిత నకిలీ వార్తలను నమ్మొద్దని కస్టమర్లను కంపెనీ కోరింది. ‘‘కొంతమంది రామ్రాజ్ కాటన్ బ్రాండ్ పేరుతో వాట్సప్ యాప్ ద్వారా కొన్ని లింకులను అందిస్తూ క్రిస్మస్, కొత్త ఏడాది ఆఫర్ బహుమతిగా రూ.20,000 లభిస్తాయనే అనే వదంతులను వ్యాప్తి చేస్తున్నారు. కస్టమర్లు ఈ మోసపూరిత లింకులను నమ్మి ఓపెన్ చేస్తే వ్యక్తిగత సమాచారాన్ని కోల్పోవడంతో పాటు ఆర్థిక పరమైన నష్టాలు జరిగే ప్రమాదం ఉంది. కావున ఇటువంటి సమాచారాన్ని పంచుకోవద్దు. వ్యాప్తి చేయవద్దు’’ అని కంపెనీ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఈ మోసగాళ్లను వెదికి పట్టుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. -
సీఎం కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మానవ త్వాన్ని చాటే ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్షమాగుణం, శాంతి, కరుణ, సహనం, ప్రేమతో జీవించిన క్రీస్తు జీవనగమనం నేటికీ ఆచరణీయమని తెలిపారు. -
క్రిస్మస్ 2021: ఇవెంతో ప్రత్యేకం
క్రిస్మస్ పండుగ వచ్చేసింది. సర్వాంగసుందరంగా చర్చిలు ముస్తాబు అయ్యాయి. డచ్, పోర్చుగీసు, ఫ్రెంచ్, బ్రిటీష్.. ఇలా ఎన్నో కమ్యూనిటీలు మన దేశాన్ని పాలించాయి. కాలనీ కల్చర్ కారణంగా ఎన్నో అద్భుతమైన కట్టడాల్ని చూడగలుగుతున్నాం ఇప్పుడు. ఇందులో కొన్ని చర్చిలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. వీటిలో కొన్నింటిని ప్రభుత్వాలే నిర్వహిస్తున్నాయి కూడా. బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్ గోవాలో ఉంది ఈ చర్చి. 1594లో నిర్మాణం మొదలై.. దశాబ్దాలకు పూర్తి చేసుకుంది. యూరప్ బారోక్యూ ఆర్కిటెక్చర్ నిర్మాణం ఇది. యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు కూడా!. ఆల్ సెయింట్స్ చర్చ్ తమిళనాడు కున్నూర్లో ఉంది. 1854లో నిర్మించారు. అందమైన చెక్క ఇంటీరియర్తో ఆకట్టుకునేలా ఉంటుంది. అద్దాల కిటికీలు, పైన్ చెట్ల నడుమ.. ప్రశాంత వాతావరణం గల ప్రాంతంగా పేరు దక్కించుకుంది ఇది. శాంటా క్రూజ్ బాసిలికా కొచ్చి(కేరళ)లో ప్రధాన ఆకర్షణ ఈ చర్చి. నిర్మాణ కాలంపై స్పష్టత లేకున్నా.. పోర్చుగీస్ హయాంలో నిర్మించినట్లు తెలుస్తోంది. అందమైన చిత్రాలు ఈ చర్చికి ప్రధాన ఆకర్షణ. పరిమితమైన సమయాల్లో మాత్రమే ఈ చర్చిని సందర్శించేందుకు వీలుంటుంది. ఇమ్మాక్యూలేట్ కాన్సెప్షనల్ క్యాథెడ్రల్ పాండిచ్చేరి (పుదుచ్చేరి)లో ఉంది. 1686లో నిర్మించబడిన ఈ చర్చి.. పర్యాటకులను ప్రధానంగా ఆకర్షిస్తుంటోంది కూడా. సెయింట్ పీటర్స్కు అంకితమైన ఈ చర్చ్.. తొలినాళ్లలో ఛాపెల్(తక్కువ స్పేస్లో ప్రార్థనా స్థలం)గా ఉండేది. బ్రిటిష్ ఆక్రమణలో మిగిలింది ఈ చర్చి ఒక్కటే. వేలంకణ్ణి తమిళనాడులో ఉన్న సుందరమైన చర్చి ఇది. వేలంకణ్ణిలో ఉంది. బంగాళాఖాతం తీరంలో ఉన్న ఈ చర్చికి.. పోప్ ప్రకటన కూడా ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి ఈ సుందర స్థలాన్ని చూడడానికి పర్యాటకులు తరలి వస్తుంటారు. -
ఢిల్లీలో క్రిస్మస్, న్యూఇయర్ వేడుకులపై ఆంక్షలు
-
Flight Charges: విమాన చార్జీల మోత
సాక్షి, చెన్నై : క్రిస్మస్ రద్దీ దృష్ట్యా, చెన్నై నుంచి రాష్ట్రంలోని తూత్తుకుడి, మదురై, తిరుచ్చి వైపుగా సాగే విమానాల్లో చార్జీలు భారీగా పెరిగాయి. ఆయా విమాన సంస్థల వెబ్సైట్లో ఇది వరకు ఉన్న చార్జీ కన్నా రెట్టింపు చార్జీలు ఉండడంతో ప్రయాణికులకు షాక్ తప్పలేదు. క్రిస్మస్ దృష్ట్యా, చెన్నై నుంచి తూత్తుకుడి, మదురై, తిరునవంతపురం, కొచ్చి వైపుగా వెళ్లే విమానాల టికెట్లు ముందుగానే రిజర్వ్ అయ్యాయి. చెన్నై నుంచి తూత్తుకుడికి ›రోజూ 4 విమానాలు, మదురైకు 6, కొచ్చికి, తిరువనంతపురానికి తలా రెండు విమానాలు నడుపుతున్నారు. తూత్తుకుడి చెన్నై నుంచి సాధారణంగా రూ. 3,500 టికెట్ చార్జీ కాగా, ప్రస్తుతం రూ. 10,500, రూ.12 వేలుగా చార్జీలు ఉండటం ప్రయాణికుల్ని విస్మయానికి గురి చేశాయి. అలాగే, మదురైకు రూ. 3,500 ఉన్న చార్జీ తాజాగా రూ. 9,800, తిరువనంతపురానికి రూ. 4 వేలు ఉన్న చార్జీ తాజాగా రూ. 9 వేలుగా, కొచ్చికి రూ. 3,500 ఉన్న చార్జీ రూ. 9,500గా పేర్కొనడం గమనార్హం. ఈ పెంపు గురించి ఆయా విమాన సంస్థల ప్రతినిధుల్ని ప్రశ్నించగా, తాము చార్జీలు పెంచలేద, మీడియం, తక్కువ చార్జీ టికెట్లు పూర్తిగా రిజర్వ్ కావడంతో, కొన్ని తరగతుల టికెట్ల ధర పైన పేర్కొన్నట్టుగానే కొంత ఎక్కువగా ఉంటాయని వివరించారు. ఇక, చెన్నై నుంచి శుక్ర, శనివారాల్లో గోవా వైపుగాసాగే విమానాలు ఫుల్ అయ్యాయి. -
ఒమిక్రాన్ ముప్పు: క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు..
Restrictions In India Due To Omicron: డెల్టా కంటే ఒమిక్రాన్ కరోనా వేరియెంట్ సంక్రమణ శక్తి మూడురెట్లు ఎక్కువని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించడంతో... కొత్త వేరియెంట్ను కట్టడి చేయడానికి పలు రాష్ట్రాలు ఆంక్షల బాట పట్టాయి. భారత్లో 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బుధవారం నాటికి దాదాపు 250 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం దేశంలో కోవిడ్–19 తాజా స్థితిపై సమీక్ష నిర్వహించనున్నారు. ►దేశ రాజధాని పరిధిలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు ప్రజలు గుమిగూడ కుండా చూడాలని కలెక్టర్లకు ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) ఆదేశాలు జారీచేసింది. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలకు, పండుగలకు జనం గుమిగూడటాన్ని నిషేధించింది. 200 మందికి పరిమితమై వివాహ సంబంధ వేడుకలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రతి పాజిటివ్ కేసు శాంపిల్ను జినోమ్ సీక్వెన్సింగ్కు పంపుతోంది. ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 50 దాటింది చదవండి: ఒమిక్రాన్ ముప్పు: క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలొద్దు.. ►రెండు డోసులు తీసుకొని వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ను చూపితేనే జనవరి 1 నుంచి షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, రెస్టారెంట్లలోకి అనుమతిస్తామని హరియాణా ఆరోగ్యమంత్రి అనిల్ విజ్ ప్రకటించారు. వ్యాక్సినేషన్ పూర్తయితేనే అధికారులతో సహా ఎవరినైనా ప్రభుత్వ కార్యాలయాల్లోకి ప్రవేశం ఉంటుందని ఆదేశాలు జారీ అయ్యాయి. ►కేరళలలో ఒమిక్రాన్ కేసులు 24కు పెరిగాయి. రాజస్తాన్లో మొత్తం 22 మందికి ఒమిక్రాన్ సోకింది. ►ప్రజలు కోవిడ్ జాగ్రత్తలను అలక్ష్యం చేస్తున్నారని.. ఇది సరికాదని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు. అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. -
క్రిస్మస్ తర్వాత టిడ్కో ఇళ్ల పంపిణీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గృహాలను లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన, తక్కువ ఆదాయ వర్గాల వారి కోసం ఉద్దేశించిన ఈ గృహాలను ఈ నెలాఖరు నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. క్రిస్మస్ సెలవులు పూర్తయిన వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలని, సాధ్యమైనంత వేగంగా వాటిని లబ్ధిదారులకు అందించాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నట్టు ఆయన చెప్పారు. నెల్లూరు నుంచి శ్రీకారం రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్న తక్కువ ఆదాయ వర్గాల వారికి ఈసారి 1.18 లక్షల ఇళ్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కోవిడ్, లాక్డౌన్ కారణంగా నిర్మాణ పనులు కాస్త ఆలస్యమయ్యాయి. ఆ తర్వాత పనులు చేపట్టి 75,784 యూనిట్లను పూర్తి చేశారు. వీటిని వీలైనంత త్వరగా లబ్ధిదారులకు అందిస్తారు. క్రిస్మస్ సెలవుల తర్వాత నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలో పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఆ ఇళ్లకు డిసెంబర్ నెలాఖరు నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని టిడ్కో ఎండీ తెలిపారు. కాగా, నిర్మాణం పూర్తయిన ఇళ్లను వెనువెంటనే లబ్ధిదారులకు అందించాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాలని అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు పూర్తయిన నిర్మాణాలకు బ్యాంకు లింకేజీ పూర్తిచేసి వెనువెంటనే రిజిస్ట్రేషన్లు కూడా చేయాలని ఆదేశించారు. -
సీఎం కేసీఆర్ క్రిస్మస్ విందు.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లు బంద్
సాక్షి, హైదరాబాద్: క్రిస్మస్ను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో మంగళవారం విందును ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎల్బీ నగర్ వైపుకు వెళ్లే ట్రాఫిక్పై ఆంక్షలు విధించారు. దీని ప్రకారం, బీజేఆర్ విగ్రహం వైపు వాహనాలను అనుమతించరు, వాటిని నాంపల్లి, చాపెల్ రోడ్ వైపు మళ్లించబడుతుందని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా, అబిడ్స్ రోడ్ నుంచి ట్రాఫిక్ను బీజేఆర్ విగ్రహం వైపు అనుమతించరు. ఆ వైపు వచ్చే వాహనాలను ఎస్బీఐ గన్ఫౌండ్రీ వద్ద చాపెల్ రోడ్డు వైపు మళ్లించనున్నారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ట్రాఫిక్ బషీర్బాగ్ జంక్షన్ వద్ద లిబర్టీ వైపు మళ్లిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అతిథులకు ఎంట్రీ , వారి వాహనాల పార్కింగ్: ► గోల్డ్ కార్డ్ పాస్లను (ఏ-1 బ్లాక్) కలిగి ఉన్న అతిథులు ‘ఏ’ గేట్ వద్ద అంటే కేఎల్కే (ఖాన్ లతీఫ్ ఖాన్) భవనం ఎదురుగా దిగి, లోపలి గేట్ నంబర్ 17 ద్వారా ప్రవేశించి, ఆలియా మోడల్ స్కూల్, ఎస్సీఈఆర్టీ, అలియా కాలేజీలో తమ వాహనాలను పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ► గ్రీన్ కార్డ్ పాస్లు (ఏ-2 బ్లాక్) కలిగి ఉన్న అతిథులు ‘డీ’ గేట్ వద్ద దిగాలి అంటే ఎదురుగా. అలియా మోడల్ స్కూల్, బీజేఆర్ విగ్రహం దగ్గర, ఎస్ఏటీఎస్ గేట్ ద్వారా ప్రవేశించి వారి వాహనాలను అలియా కళాశాల, మహబూబ్ కళాశాల, అలియా మోడల్ స్కూల్, ఎస్సీఈఆర్టీ వద్ద పార్క్ చేయాలి. ► బ్లూ కార్డ్ పాస్లు (బి-బ్లాక్) కలిగి ఉన్న అతిథులు ఆయాకార్ భవన్కు ఎదురుగా ఉన్న ‘జి’ గేట్ వద్ద దిగి, లోపలి గేట్ నంబర్ 15 ద్వారా ప్రవేశించి, పబ్లిక్ గార్డెన్లో తమ వాహనాలను పార్క్ చేయాలి. ► పింక్ కార్డ్ పాస్లు (సి-బ్లాక్) కలిగి ఉన్న అతిథులు బిజెఆర్ విగ్రహం సమీపంలోని ‘ఎఫ్, ఎఫ్1’ గేట్ల వద్ద దిగి, లోపలి గేట్ నెం. 6 & 8 ద్వారా ప్రవేశించి, నిజాం కళాశాల మైదానంలో తమ వాహనాలను పార్క్ చేయాలి. చదవండి: Hyderabad: ఆ ప్రయాణికులకు షాకిచ్చిన ఓలా, ఉబర్ డ్రైవర్లు -
Medak CSI Church: మెతుకు పంచిన కోవెల.. ప్రత్యేకతలకు నిలయం..
మెదక్ జోన్: శాంతి, ప్రేమ, అహింస, పరోపకారం, సోదరభావాలను సందేశంగా అందించే పవిత్ర స్థలం. కరువు కాలంలో అన్నార్థులను ఆదుకున్న అమృతహస్తం. రోజ్వుడ్ కలప, స్పెయిన్ గ్లాస్పై కరుణా మయుడి జీవన వృత్తాంతంతో కనువిందు చేసే అత్యద్భుత కట్టడం. ఎల్లలు దాటి సందర్శకులను ఆకర్షిస్తున్న చర్చి మెతుకుసీమకు తలమానికంగా భాసిల్లుతోంది. ఆకలి తీర్చిన ఆలయం.. ►అది మొదటి ప్రపంచయుద్ధం జరుగుతున్న సమయం. అగ్రరాజ్యాల ఆధిపత్యపోరులో సమిధలైన జనం అనేకం. దీనికి భారతదేశం కూడా మినహాయింపు కాలేదు. ►పనిలేక.. బతుకుదెరువు కరువై.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు. ►భయంకరమైన కరువు ఏర్పడి గుక్కెడు మెతుకుల కోసం మెతుకు సీమ ప్రజలు అల్లాడుతున్న సమయంలో చార్లెస్ వాకర్ పాస్నెట్ కరుణామయుని కోవెల నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ►ఆలయ నిర్మాణంతో కరువుతో అల్లాడుతున్న ప్రజలకు పట్టెడన్నం దొరికింది. మరోవైపు అద్భుతమైన ఏసయ్య మందిరం నిర్మాణం జరిగింది. దీంతో ఆకలితీర్చిన ఆలయంగా మెదక్ సీఎస్ఐ చర్చి పేరొందింది. అపురూపం.. సుందర కట్టడం ►చారిత్రక కట్టడానికి సంబంధించిన చర్చి గోపురం ఎత్తు 175 అడుగులు. పొడవు 200 అడుగులు, వెడల్పు 100 అడుగులు. ఈ కట్టడానికి మూడు గవాక్షములు, పలు రంగుటద్దములతో ప్రతిష్టింపజేశారు. ►తూర్పున క్రీస్తు జన్మవృత్తాంతం. పడమర శిలువేసి చంపిన దృశ్యం. ఉత్తరాన క్రీస్తు చనిపోయి మూడో రోజు సజీవుడై ఆరోహనమై పోతున్న దృశ్యాలు కనిపిస్తాయి. ►ఇంగ్లాండ్కు చెందిన ఫ్రాంకోఓ, సాలిస్బరి అనే చిత్రకారులు కేవలం సూర్యకాంతితోనే ఈ మూడు దృశ్యాలు కనిపించేలా తీర్చిదిద్దారు. ►వీటికోసం ప్రత్యేకంగా ప్రతి అద్దానికి మధ్యలో తగరాన్ని ఘనస్థితి నుంచి ద్రవస్థితిలోకి తీసుకొచ్చి, గ్లాస్కు మధ్యలో అమర్చి ఉంచారు. దేవాలయ పైకప్పు లోపలి భాగం ప్రతిష్టించిన మూడేళ్ల వరకు ప్రతిధ్వనించేదని చెబుతుంటారు. ►1927లో ఇంగ్లాండ్కు చెందిన బాడ్షా, గ్యాస్హోప్ అనే ఇంజనీర్లు గోళాకారంలో ఉన్న లోపలి భాగాన్ని రబ్బరు, కాటన్, మరికొన్ని రసాయనాలను ఉపయోగించి ప్రతి ధ్వనించకుండా చేశారు. ►ఈ చారిత్రాత్మక కట్టడం ఆసియాలోనే విస్తీర్ణంలో పెద్దది. ఈ మొత్తం దేవాలయ నిర్మాత ఇంగ్లాండ్కు చెందిన రన్కోన్ పట్టణ వాసి రెవరెండ్ చార్లెస్ వాకర్ పాస్నెట్. చారిత్రక కట్టడాల్లో సుందర కట్టడంగా పేరొందిన మెదక్ కెథడ్రల్ చర్చి ఎందరో మహానుభావుల అర్కెటిక్ పనితనంతో విరాజిల్లుతోంది. ప్రత్యేకంగా క్రిస్మస్ సందర్భంగా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. చారిత్రాత్మక మందిరానికి పునాది.. ►1914 సంవత్సరం.. అప్పటికే ప్రపంచాన్ని పాలిస్తున్న ఆంగ్లేయులు మత ప్రచారంలో భాగంగా మద్రాస్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో నిర్మించిన చర్చిల్లో విస్తృత ప్రచారం కొనసాగిస్తున్నారు. ►ఇదే క్రమంలో చార్లెస్ వాకర్ పాస్నెట్ ఇంగ్లాండ్ నుంచి ఆరు నెలల పాటు ఓడలో ప్రయాణించి.. హైదరాబాద్ ప్రాంతంలోని సనత్నగర్ చర్చికి.. అక్కడి నుంచి మత ప్రచారంలో భాగంగా బదిలీపై మెదక్కు వచ్చారు. ►ఈ క్రమంలో బిషప్ బంగ్లాలో ఒకరాత్రి బస చేశాడు. చర్చి ఎత్తు తక్కువ.. బిషప్ బంగ్లా ఎత్తు ఎక్కువగా ఉండటంతో చర్చిని అందంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో 1914లో పనికి ఆహార పథకం పేరుతో ఈ మహా దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ►అప్పటికే మెతుకు సీమలో ఆకలి చావులతో అల్లాడుతున్న ప్రజలకు ఉపాధి దొరకడంతో తండోపతండాలుగా తరలివచ్చి చర్చి నిర్మాణంలో పాలు పంచుకున్నారు. ►పదేళ్ల పాటు కొనసాగిన చర్చి నిర్మాణం 1924లో పూర్తికాగా అదే సంవత్సరం డిసెంబర్ 25న ప్రతిష్ఠించారు. అప్పట్లో ఈ నిర్మాణానికి రూ. 14 లక్షలు ఖర్చు అయినట్లు అంచనా. పరలోక దేవుడి పవిత్ర ఆలయం మానవుల పాపాలను తొలగించేందుకు పరలోక దేవుడైన ఏసయ్య కన్య గర్భమందు జని్మంచి.. పాపుల రక్షణకోసం సిలువ వేయబడ్డాడు. ఆయన ప్రతిరూపం కోసమే మెదక్లో పవిత్ర ఆలయాన్ని నిర్మించారు. ఈ చర్చి ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందింది. పవిత్రతో ప్రార్థన చేస్తే ప్రత్యక్షమయ్యే ఏసయ్య ఆలయం అద్భుతం. – అండ్రూస్ ప్రేమ్కుమార్, చర్చి ప్రెస్బిటరి ఇన్చార్జి, మెదక్ -
జగమంత వెలుగులో క్రిస్మస్
ధైర్యం ముందుకు నడిపిస్తుంది.. నింగిలోని నక్షత్రం ఆ దారికి వెలుగు పడుతుంది.. నమ్మకం ఆ నక్షత్రానికి వెలుగును అద్దుతుంది.. ఆ నమ్మకమే ఓ విశ్వాసమైంది ‘క్రీస్తు’గా! ఆ సందర్భమే వేడుకైంది ‘క్రిస్మస్’గా!! ఇటలీలోని జెనొవా నగరంలో 1451వ సంవత్సరంలో ఒక బిడ్డ జన్మించాడు. పుట్టినప్పుడు బహుశా ఎవ్వరూ ఊహించి ఉండకపోవచ్చు ఆ బాలుడు ప్రపంచానికే దీవెనకరంగా మారతాడని. అతని పేరు క్రిస్టఫర్ కొలంబస్. ప్రపంచం మరువలేని సముద్ర అన్వేషకుడు. తన అన్వేషణలో భాగంగా తన బృందంతో కలసి ఆజోర్సా ద్వీపాలు దాటాడు. కనుచూపు మేరలో ఎక్కడా భూభాగం కనిపించడం లేదు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నీలిసముద్రంలో కష్టమని తోచిన నావికుడు అడిగాడు ఏం చేద్దాం అని. దానికి కొలంబస్ ఇచ్చిన సమాధానం ‘ముందుకే వెళ్దాం’. కొలంబస్ మాట ప్రకారం నావికుడు నావను ముందుకు పోనిచ్చాడు. కాసేపటికి తిరిగి వచ్చి ఇలా అన్నాడు. ఈ రాత్రి సముద్రం మనలను కబళించజూస్తుంది. ఒక్కమాట చెప్పు, ఆశలన్నీ అడుగంటాక చేసేదేమీ ఉండదు. కొలంబస్ నోట నుంచి వచ్చిన ఒకేఒక్క మాట ‘ముందుకే సాగుదాం’. సముద్రపు నీళ్ళను చీల్చుకుంటూ ముందుకు సాగుతున్న నావలో కొన్ని గంటల తర్వాత పనివాళ్ల తిరుగుబాటు ధోరణుల మధ్య వినిపించిన కేకలు ‘రేపు ఉదయం కూడా భూమి కనబడకపోతే ఏం చేద్దాం?’ ధీర కొలంబస్ది ఒకటే జవాబు అప్పుడు కూడా ముందుకు సాగిపోవడమే. వెనుతిరగని దృఢ సంకల్పంతో ముందుకు సాగిపోయిన కొలంబస్కు విజయం లభించింది. ఓ అద్భుతమైన భూభాగాన్ని కనుగొని ప్రపంచాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించాడు. ఎన్ని అవరోధాలు ఎదురొచ్చినా ‘ముందుకే సాగిపో’ అనే నినాదం కచ్చితంగా విజయతీరాలకు నడిపిస్తుంది. సరిగ్గా రెండువేల సంవత్సరాల కిందట... ఇలాంటి సంఘటనే ప్రభువైన యేసుక్రీస్తు జన్మించినప్పుడు జరిగింది. ఇజ్రాయేలు దేశంలోని ఓ కుగ్రామమైన బేత్లెహేములో పశువుల తొట్టెలో యేసుక్రీస్తు జన్మించారు. వాస్తవానికి నజరేతు నుంచి యోసేపు, మరియలు జనసంఖ్యలో తమ పేర్లను నమోదు చేసుకొనుటకు బేత్లెహేమునకు వచ్చారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం మీకా అనే ప్రవక్త క్రీస్తు జన్మించే స్థలాన్ని గూర్చి ప్రవచించాడు. బేత్లెహేము ఎఫ్రతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను (మీకా 5:2). ప్రజలను పాలించే నిజమైన పరిపాలకుడు బేత్లెహేములో జన్మిస్తాడని చెప్పబడిన ప్రవచనం నెరవేర్చబడునట్లు యోసేపు, మరియలు కష్ట పరిస్థితిలో ప్రయాణం చేసుకుంటూ బేత్లెహేము చేరుకున్నారు. పరిశుద్ధ గ్రంథంలోని లూకా సువార్త రెండవ అధ్యాయం చదివితే ఎన్నో చారిత్రక అంశాలు వెలుగులోనికి వస్తాయి. ఆ అధ్యాయంలో ప్రస్తావించిన సీజర్ అగస్టస్, కురేనియు చరిత్రలో కనిపిస్తారు. ఈ మధ్యకాలంలో రస్సెల్ అనే పురాతత్వ శాస్త్రవేత్తకు లభించిన కొన్ని చర్మపు కాగితాలలో ఆ కాలంలో జరిగిన జనసంఖ్య వివరాలు బయటపడ్డాయి. పశువులతొట్టెలో యేసుక్రీస్తు జన్మించుట ద్వారా ఆయన అందరికీ అందుబాటులో ఉండే దేవుడు అని రుజువు చేయబడింది. ఆయన జన్మించిన తరువాత మొట్టమొదటగా ఆయన్ను దర్శించినవారు సామాన్యులైన గొర్రెల కాపరులు. క్రీస్తు ఎక్కడో అంతఃపురంలో పుట్టి ఉన్నట్లయితే సామాన్యులు ఆయన్ను చూడగలిగేవారు కాదు. ఎన్ని అవాంతరాలు వచ్చినా యోసేపు, మరియలు బేత్లెహేమునకు రావడంలో ‘ముందుకే సాగిపో’ అనే ఆలోచన కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. ప్రయాణ కష్టం, ఒంటరితనం వారిని ఆపలేకపోయాయి. దేవుని చిత్తమును నెరవేర్చడంలో వారికున్న సంసిద్ధత నేటి తరంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమే. దివిలో దివ్యనక్షత్రం ఎప్పటి నుండో నక్షత్రాలపై పరిశోధన చేస్తున్న కొందరు వ్యక్తులకు ఆకాశంలో ఓ విచిత్ర నక్షత్రం తారసపడింది. అది ఒక ప్రత్యేక నక్షత్రం అని వారు గుర్తించి దానిని వెంబడించడం ప్రారంభించారు. యాకోబులో నక్షత్రం ఉదయించును అనే ప్రవచనం ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చెప్పబడింది. దేవుడు సృష్టించిన విశాల వినీలాకాశంలో వింతగొలిపే అద్భుతాలు కోకొల్లలు. రాత్రివేళ ఆకాశంలో చక్కని చుక్కలు కనువిందు చేస్తాయి. మానవుని కన్ను ఆకాశంలో మూడువేల నక్షత్రాలను లెక్కపెట్టగలదట. అంతమాత్రాన ఆకాశంలో మూడు వేల నక్షత్రాలే ఉన్నాయనుకుంటే పొరపాటే. ఇటలీ శాస్త్రవేత్త గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టిన తర్వాత అంతరిక్ష పరిశోధన కొత్త పుంతలు తొక్కింది. నక్షత్ర సముదాయాన్ని పాలపుంత అని పిలిస్తే ఒకొక్కొ పాలపుంతలో సుమారుగా పదివేల కోట్ల నక్షత్రాలు ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అలాంటి విస్తుగొలిపే పాలపుంతలు కోట్లకొలది విశ్వంలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అవన్నీ సర్వోన్నతుడైన దేవుని మహిమను చాటిచెబుతున్నాయి. నక్షత్ర పరిశోధకులైన ముగ్గురు జ్ఞానులు యేసుక్రీస్తును ఆరాధించుటకు బయలుదేరారు. సుదూర ప్రయాణానికి వారి కుటుంబాలను, ప్రాంతాలను విడిచి బయలుదేరినప్పుడు వారు చాలా సమస్యలు ఎదుర్కొని ఉండవచ్చు. ఇక్కడ కూడా ‘ముందుకే సాగిపో’ అనే నినాదం చాలా బాగా పనిచేసింది. బాలుడైన యేసును చూడాలని పట్టుదలతో వారు బయలుదేరారు. దేవుని ఆరాధించడమే మన లక్ష్యం, మన గమ్యం అంటూ వారు ప్రారంభించిన ప్రయాణం అభినందనీయం. ఆకాశంలో కనిపించిన వింత తార వారికి దారిచూపడం ప్రారంభించింది. పరిశుద్ధ గ్రంథంలో ఆ నక్షత్రానికి ‘ఆయన నక్షత్రం’ అని పేరు పెట్టబడింది. గగనంలో పుట్టిన ఆ తార గురించి ఎన్నో విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. సూపర్ నోవా, హేలీ తోకచుక్క, గ్రహాల కలయిక లాంటి వాదాలు చలామణిలో ఉన్నాయి. అన్నిటికన్నా ప్రాముఖ్య విషయం ఏమిటంటే ‘దేవుడు సృష్టికర్త, ఆయనకు అసాధ్యమైనదేదీ ఉండదు’ అని నమ్మే దేవుని బిడ్డలు ఇది కచ్చితంగా ఓ అద్భుతమే అని విశ్వసిస్తారు. గగన వీధుల్లో మెరిసిన ఆ దివ్య నక్షత్రం జ్ఞానులకు దారి చూపింది. ఆ తారను అనుసరిస్తూ వెళ్ళిన జ్ఞానులలో ఒకరు భారతదేశానికి చెందిన వారని చరిత్ర చెబుతుంది. ఆ వ్యక్తి బంగారాన్ని కానుకగా యేసుక్రీస్తుకు ఇచ్చాడు. మిగతా ఇద్దరు జ్ఞానులు సాంబ్రాణిని, బోళమును కానుకలుగా సమర్పించారు. వారు కానుకలుగా ఇచ్చిన ఆ మూడు యేసుక్రీస్తు మూడు ప్రాముఖ్యమైన లక్షణాలను వివరిస్తున్నాయి. సువర్ణం ఆయన దైవత్వానికి, సాంబ్రాణి ఆయన ఆరాధనీయుడు అని బోళము ఆయన మనుషుల కొరకు అనుభవించే శ్రమలకు సాదృశ్యంగా ఉన్నాయి. ‘వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి తల్లియైన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి’– (మత్తయి 2:1011). ఒకసారి ఒక తల్లి తన కుమారుని చేతిని పట్టుకొని సంధ్యవేళలో గ్రామంలో నడుస్తున్నారు. చల్లని పిల్లగాలులు చుట్టునున్న చెట్లనుండి వీస్తుండగా మట్టిరోడ్డుపై అడుగులు వేస్తున్నాడు ఆ కుమారుడు. ఆ గ్రామంలో చాలామంది ఇంటి మీద ఒక నక్షత్రం ఉండడం ఆ కుమారుడు గమనించి తల్లిని ప్రతి ఇంటి మీద ఒక నక్షత్రం ఎందుకు ఉంది? దాని ప్రత్యేకత ఏమిటి? అని అడిగాడు. దానికి తల్లి ఈ గ్రామంలో అనేకమంది దేశ రక్షణ కొరకు యుద్ధానికి వెళ్ళి ప్రాణాలు కోల్పోయినారు. అలా దేశరక్షణలో తమ ప్రాణాలు కోల్పోయిన వీరుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఇంటి మీద నక్షత్రం పెట్టడం ఈ గ్రామంలోని వారికి అలవాటు. కొంత దూరం వెళ్ళాక ఒక చర్చి మీద కూడా కాంతిమంతమైన ఒక నక్షత్రం కనబడింది. అమ్మా! చర్చిమీద డిసెంబరు నెలలో నక్షత్రం ఎందుకు పెడతారు అని ప్రశ్నించాడు. దానికి అ తల్లి ‘‘దేవుడు మనలను ప్రేమించి రెండువేల సంవత్సరాల క్రితం మనిషిగా ఈ లోకానికి ఏతెంచారు. మనుషులందరినీ రక్షించడానికి ఏమీ లేనివానిగా పుడమిపై జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు ఆకాశంలో ఒక దివ్య నక్షత్రం వెలసింది. దేవదేవుని దివ్య ప్రేమకు, త్యాగమునకు, ఆయన ఈ లోకానికి వచ్చారనుటకు గుర్తుగా ఆ నక్షత్రాన్ని పెట్టారు’ అని తల్లి సమాధానమిచ్చింది. క్రీస్తు ఆరాధనే క్రిస్మస్ ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి తన ప్రాణం పెట్టి సర్వమానవాళిని రక్షించుటకు వచ్చారు. ఆయన సశరీరునిగా ఈ లోకానికి దిగివచ్చిన సంతస సందర్భాన్ని క్రిస్మస్గా జరుపుకుంటాము. క్రిస్మస్ అనే మాటకు క్రీస్తును ఆరాధించుట అని అర్థం. క్రిస్మస్ పండుగ ఆచారాలకు సంబంధించిన పండుగ కాదు. ఇది ఆత్మీయతను పెంచే అనిర్వచనీయమైన అనుభవం. క్రీస్తును హృదయంలో కలిగియున్న ప్రతి ఒక్కరూ పరవశమొందే సమయం. ప్రపంచంలో అనేక పండుగలు కొన్ని ప్రాంతాలకు, కులాలకు, మతాలకు, సంస్కృతులకు మాత్రమే పరిమితమై ఉంటాయి. క్రిస్మస్ విశ్వవ్యాప్తంగా సంతోషంగా జరుపుకునే పండుగ. క్రిస్మస్ ఒక మతానికి లేదా ఒక సమాజానికి సంబంధించినది కాదు. మానవులందరికీ శుభాన్ని కలుగజేసే పండుగ. ఎందుకంటే సర్వసృష్టిని తన నోటి మాటద్వారా కలుగజేసిన సర్వవ్యాపి, సర్వజ్ఞాని అయిన దేవదేవుడు శరీరధారిగా ఈలోకానికి అరుదెంచిన శుభఘడియ. క్రిస్మస్ సంతోషాల పండుగ, సమాధానమునిచ్చే పండుగ. కుమారుడిగా అవతరించిన యేసు ఈ లోకములో ప్రతి మనిషి జన్మించిన తరువాత అతని వివరాలు, లక్షణాలు, ప్రవర్తన మొదలగు విషయాలు చెప్పగలరు. ఆ వ్యక్తి ఎదుగుతున్న కొలది అతని జీవినవిధానమును వివరించవచ్చును. యేసుక్రీస్తు ప్రభువు జన్మించడానికి ముందు కొన్ని వందల సంవత్సరాల ముందు అనేకమంది ప్రవక్తలు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ప్రవచించారు. యేసుక్రీస్తు ప్రవక్తల ప్రవచన సారం. ఆయన జన్మించే స్థలం, ఎవరికి జన్మిస్తారు, ఆయన పరిచర్య విధానం ఎలా ఉండబోతోంది, ఆయన మరణించే విధానం, మహత్తరమైన ఆయన పునరుత్థానం గురించి ముందే ఉల్లేఖనాల్లో ప్రవచించబడ్డాయి. ఆయన జన్మించడానికి ఏడు వందల సంవత్సరాలకు ముందు ఝెషయా అనే దైవప్రవక్త ఇలా ప్రవచించాడు ‘ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను’–(ఝెషయా 9:6). పరిశుద్ధుడైన దేవుడు సర్వలోకానికి కుమారుడుగా దిగివచ్చి నిత్యనరకాన్ని తప్పించుటకు తన్నుతాను రిక్తునిగా చేసుకుని రక్తమాంసాలు ధరించుకుని వచ్చాడు. ‘ఆయన భుజమున రాజ్యభారముండును’ అని ప్రవక్త ప్రవచించినట్లుగా తన ప్రజల భారం ఆయనే భరిస్తాడు. వారిని ప్రయాసల నుండి విడిపిస్తాడు. ఆ ప్రవచన నెరవేర్పుగా యేసు ‘ప్రయాసపడి భారం మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి! నేను మీకు విశ్రాంతిని కలుగచేతును’ అని సమస్త మానవాళినీ ఆహ్వానించారు. ఒక నక్షత్రానికి అయిదు కోణాలు ఎలా ఉంటాయో ఝెషయా ప్రవచించినట్లుగా అయిదు గొప్ప విషయాలు ప్రభవైన యేసును గురించి చెప్పబడ్డాయి. యేసు ప్రభువును గురించి చెప్పబడిన ప్రతి మాట ఆయన జీవితంలో నెరవేర్చబడ్డాయి. ఆయన ఆశ్చర్యకరుడు– ఆశ్చర్యకరుడు అంటే ఆశ్చర్యకరమైన కార్యాలను నెరవేర్చువాడని అర్థం. దేవుని ద్వారా చేయబడేవన్నీ ఆశ్చర్యమే. ఆయన కలుగచేసిన సృష్టి ఆశ్చర్యము. పరిశీలించి చూస్తే దేవుని మహత్తయిన సృష్టి, దాని నిర్వహణ మనుషులకు నేటికీ అంతబట్టని రహస్యమే. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఇలా అంటాడు. ‘ఇన్ని విస్తృత పరిశోధనల తరువాత మనిషి విశ్వం గురించి తెలుసుకొన్నది ఒక్క శాతం మాత్రమే’. మానవ జన్మ ఆశ్చర్యకరమైనది. ‘నేను పుట్టిన విధమును చూస్తే నాకు భయమును, ఆశ్చర్యమును కలుగుచున్నవ’ని దావీదు తన కీర్తనలో మానవ జన్మ విశిష్ఠతను వివరించాడు. నీటిని ద్రాక్షారసంగా మార్చిన మహిమ యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా జీవించిన కాలంలో అనేక ప్రాంతాలు సంచరిస్తూ ప్రజలకు అనిర్వచనీయమైన మేలు చేశారు. అనేకుల ఎదుట ఆశ్చర్యకార్యాలు జరిపించి ఆశ్చర్యకరుడు అని రుజువు చేయబడ్డారు. క్రీస్తు పరిచర్య ప్రారంభంలో గలిలయలోని కానా అనే ప్రాంతంలో జరుగుచున్న వివాహానికి యేసు ప్రభువు, ఆయన శిష్యులు, తల్లియైన మరియ ఆహ్వానించబడ్డారు. ఆ సమయంలో వివాహానికి వచ్చినవారందరికీ గౌరవప్రదముగాను, మర్యాదపూర్వకముగాను ద్రాక్షారసం ఇవ్వడం యూదుల ఆచారం. కొంతసేపటికి వారు సిద్ధపరచుకున్న ద్రాక్షారసం అడుగంటిపోయింది. వివాహం జరుగుతున్న ఇంటివారి పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వారు ఎదుర్కొంటున్న కలవరం, ఆందోళన, అవమానం తాండవమాడుతున్న వేళ ఆశ్చర్యకరుడైన యేసు అద్భుతాన్ని జరిపించారు. అక్కడున్న పరిచారకులను పిలిచి ఆరుబానలను నీటితో అంచుటమట్టుకు నింపమని చెప్పారు. వారు ఆ విధంగా చేయగానే ఆ సాధారణ నీరు మధురమైన ద్రాక్షారసంగా మారిపోయింది. గలిలయలోని కానాలో యేసు ఈ సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి అని యోహాను తన సువార్తలో తెలియచేశాడు. ఆ కానా విందులో యేసుప్రభువు చూపిన మహిమను ఆ యింటి వారి జీవితంలో ఎన్నడు మరచిపోలేరు. ఆరోజు ఆ యింటి వారి మీదకు వచ్చే అవమానం ఆయన వలన తొలగిపోయింది. ఆయన ఆ ప్రాంతంలో ఉన్నాడు కాబట్టే ఆ యింటివారు ధైర్యంగా ఉండగలిగారు. దేవున్ని మన జీవితంలోనికి ఆహ్వానిస్తే అవమానం తొలగిపోతుంది. ఊహించలేని గొప్ప ధైర్యం కలుగుతుంది. యేసుప్రభువు సాధారణమైన నీటిని విలువైన ద్రాక్షారసంగా మార్చాడు. విలువలేని వాటికి విలువనిచ్చేవాడు ప్రేమమయుడైన దేవుడు. మనుషులు లోకరీత్యా విలువైన వాటిని మాత్రమే పట్టించుకుంటారు. అటువంటి వారితో మాత్రమే స్నేహం చేస్తారు. యేసుప్రభువు దీనులను లక్ష్యపెడతాడు. ఆయన ఎదుట దీనులుగా సాగిలపడితే వారిని ఉన్నతమైన స్థానములో నిలవబెడతాడు. రుచి లేని నీటికి రుచిని కలుగజేశాడు. మధురమైన అనుభవాన్ని అందించాడు. హృదయాలను వెలిగించే దైవం చాలా సంవత్సరాల క్రితం ఒక పార్కులో ఒక అక్క తమ్ముడు కూర్చుని పరిశుద్ధగ్రంథాన్ని చదువుకుంటున్నారు. అటుగా పోతున్న ఒక నాస్తికుడు వారిని చూచి దగ్గరగా వచ్చి వారిని ‘మీరెందుకు బైబిల్ చదువుతున్నారో నాకు అర్థం కావట్లేదు. బైబిల్ దైవగ్రంథం కాదు. అసలు దేవుడనే వాడే లేడు. ఈ సృష్టంతా దానికదే వచ్చింది. దేవున్ని మానవుడే తనకున్న భయాలలో సృష్టించుకున్నాడు. ఈ చెడ్డ పుస్తకం మీకు ఎన్నడు ప్రయోజనాన్ని చేకూర్చదు’ అని వ్యంగ్యంగా అన్నాడు. అతని మాటలు విన్న తర్వాత అక్క లేచి ఇలా అంది. ‘ఒకప్పుడు నా తమ్ముడు తాగుబోతుగా, తిరుగుబోతుగా జీవించేవాడు. జూదశాలలో తన సమయమంతా గడిపేవాడు. తల్లితండ్రులను లెక్కచేసేవాడు కాదు. ప్రేమ ఆప్యాయతలకు అతని జీవితంలో చోటు లేదు. క్రూరంగా ప్రవర్తించేవాడు. అలాంటి వ్యక్తిలో మార్పు వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. ఒకరోజు బైబిల్ చదవడం ద్వారా దేవుని గురించిన సత్యాన్ని అంగీకరించి యేసుక్రీస్తును తన హృదయంలోనికి ఆహ్వానించాడు. వెలుగైన దేవుడు తన హృదయంలోనికి ఆహ్వానించినందు వలన చీకటంతా తొలగిపోయింది. జీవితం పావనమయింది. వినూత్నమైన మార్పులను అతని జీవితంలో మేం గమనించగలిగాము. ఒకప్పుడు ఎందుకూ పనికిరాకుండా తిరిగిన వ్యక్తి ఇప్పుడు కష్టించి పనిచేసి తన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇంటికి తీసుకొస్తున్నాడు. తల్లితండ్రులను ఆప్యాయంగా పలకరిస్తున్నాడు. శాంతి సమాధానాలతో బ్రతుకుతున్నాడు. ప్రతి ఒక్కరిని ప్రేమతో చూసుకుంటున్నాడు. నీవనుకుంటున్నట్టు ఈ గ్రంథం చెడ్డదైతే, భయంకరంగా చెడిపోయిన వ్యక్తిలో ఇంత మంచి మార్పును ఎలా తీసుకురాగలదు?’ హృదయాంతరంగంలో నుండి వచ్చిన వాస్తవమైన జీవితానుభవాలకు నిశ్చేష్టుడై తల దించుకొని వెళ్ళిపోయాడు ఆ నాస్తికుడు. మనుషుల హృదయాల్లో దేవుడు కలిగించు మార్పు చాలా ఉన్నతమైనది. టి.యస్ ఇలియట్ అనే కవి ఇలా రాశారు.. ‘నిరాశాపూరితమైన, శూన్యమైన ఈ భూమిలో నీళ్లు లేవు కేవలం బండరాయి తప్ప. మన ఆత్మ బీడుభూములలో తిరుగుతుంటుంది. యేసు అనే జీవజలపు ఊట ఆ హృదయాన్ని తాకేదాకా!’ ఉన్నత శిఖరాలకు నడిపేది దేవుని ఆలోచనే ఆలోచన కర్త: ప్రతిదేశానికీ ఆలోచనకర్తలు ఉంటారు. ప్రభుత్వాలు సరిగా ప్రజలకు మేలు చేసే పరిపాలన అందించాలంటే వారికి ఎలాంటి సహాయం చేయాలి, బాగా ఎలా పరిపాలించాలి, విపత్తులు కలిగినపుడు ప్రజలకు ఎలాంటి సహాయం అందించాలి లాంటి ఆలోచనలు చెప్పే వ్యక్తులు ప్రత్యేకంగా ఉంటారు. నిజజీవితంలో కూడా అలోచన చెప్పే వ్యక్తులుండడం చాలా అవసరం. కొంతమంది ఎవరి ఆలోచన వినకుండా అన్నీ తమకే తెలుసు అనుకుంటారు. అలాంటివారు మొదట కష్టాలలో పడిపోయి తీరని నష్టాన్ని పొందుతారు. మంచివారి అలోచనలు చాలా అవసరం. పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయ పెట్టుకోవాలన్న సామెత మనకందరికీ విదితమే. లోకంలో మనుషుల ఆలోచనలు కొంతమట్టుకు మేలు చేయవచ్చును. అయితే దేవుని ఆలోచన మరింత శ్రేష్ఠమైనది. క్షేమకరమైనది. దేవుని ఆలోచన ప్రకారం నడిస్తే ఎప్పుడు తొట్రిల్లరు, ఓడిపోరు. ‘నీకు ఆలోచన చెప్పెదను నీవు నడువవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తాను’ అని ప్రభువు మాట్లాడుతున్నారు. పవిత్రమైన ఆలోచన పవిత్రకార్యాలు చేయడానికి దోహదపడుతుంది. కొంతమంది చెడిపోయిన వారి ఆలోచనలు విని వారి మాటల ప్రకారం నడిచి జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. దేవుడు తన మాట ద్వారా నిత్యం మనలను నడిపించాలని కోరుతున్నాడు. ఆయన ఆలోచన ప్రకారం నడిస్తే మన జీవితాలు ధన్యకరమవుతాయి. జీవితంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవలసిన సమయంలో అనేకులు తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. సరియైన వ్యక్తుల నిర్ణయాలు కాకుండా పరిపక్వత లేనివారి నిర్ణయాలు తీసుకుంటారు. నీవు ఎటువెళ్ళాలో తెలియని సందిగ్ధంలో ఉన్నపుడు అందరి దగ్గరకు పరుగెడుతున్నావా? నీకు సరిగా ఆలోచన చెప్పి ఉన్నత స్థానమునకు ప్రభువు నడిపిస్తారు. యేసు ప్రభువు జన్మించినపుడు జ్ఞానులు రాజైన హేరోదు దగ్గరకు వచ్చారు. ప్రవచనానుసారం యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడిగారు. హేరోదు రాజు శాస్త్రులను పిలిపించి క్రీస్తు పుట్టే స్థలాన్ని గురించి అడిగాడు. బేత్లెహేములో పుడతాడన్న కచ్చితమైన ప్రవచనాన్ని వారు చూపించారు. అప్పుడు హేరోదు జ్ఞానులను రహస్యంగా పిలిపించి నక్షత్రం కనబడిన కాలాన్ని వారిచేత పరిష్కారంగా తెలిసికొని మీరు వెళ్ళి ఈ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే నేనును వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానం తెమ్మని వారిని బేత్లెహేముకు పంపాడు. ఇందులో హేరోదు దురుద్దేశాలు ఎన్నో కనబడుతున్నాయి. వాస్తవానికి హేరోదు భయంకరమైన క్రూరుడు. తన సింహాసనానికి అడ్డు వచ్చే ప్రతి ఒక్కరినీ హతమార్చాలనే దుర్బుద్ధి కలిగినవాడు. అలాంటి వాడు క్రీస్తును ఎందుకు ఆరాధిస్తాడు? ఆయన ఆధిపత్యానికి ఎందుకు ఒప్పుకుంటాడు? అయితే జ్ఞానులు రాజు మాటను బట్టి పోతుంటే, మళ్లీ దేవుని నక్షత్రం దారి చూపించింది. వారు క్రీస్తును కనుగొని ఆయన్ను ఆరాధించిన తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని దేవుని చేత బోధింపబడినవారై వారు మరొక మార్గంలో తమ దేశానికి తిరిగి వెళ్లారు. వారు హేరోదు మాట, ఆలోచన అనుసరించి నడిచినట్లయితే వారు చాలా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేవారేమో! దేవుని ఆలోచన వారిని క్షేమంగా తమ దేశానికి నడిపించింది. దేవుని నడిపింపు ఎప్పుడూ జీవన రాగాన్ని శ్రుతి తప్పనీయదు. ఆత్మలోని పాటను ఆగిపోనియదు. భ్రాంతులెన్నో చెలరేగి దారికానక కప్పేసినప్పుడు దేవుని ఆలోచన కాంతిపుంజమై ఉన్నత శిఖారాలకు నడిపిస్తుంది. బలహీనులను బలపరచే దేవుడు బలవంతుడైన దేవుడు: సకలాశీర్వాదములకు కర్తయైన దేవుడు బలహీనులకు బలాన్నిచ్చువాడు. ఈ బలం శారీరక బలం కాదు. దేవుడు అనగా పాపాన్ని జయించటానికి, పాపంలో ఉన్నవారిని విడిపించి వారిని పరిశుద్ధులుగా చేయడానికి బలవంతుడై ఉండాలి. ఈనాడు అనేకమంది పైకి చూడడానికి బలవంతులుగా ఉన్నారు కాని, వారి మనసు ఎంతో బలహీనంగా ఉంది. చాలా సంవత్సరాల క్రితం సింహబలునిగా పేరుగాంచిన మైక్ టైసన్ బాక్సింగ్ రంగంలో ఎంతోమందిని ఓడించాడు. ఆయనతో పోరాడాలంటే భయపడుతుండేవారు. అనేక సంవత్సరాల పాటు బాక్సింగ్ రంగంలో తిరుగులేని విజేతగా నిలిచాడు. ఇంత బలవంతుడైన మైక్ టైసన్ మానసికంగా ఎంతో బలహీనుడు. శరీరవాంఛలను జయించలేక అనేక నేరాలకు పాల్పడి శిక్షలకు గురై తాను సంపాదించుకున్న డబ్బును, పేరును కోల్పోయిన బలహీనుడు. ప్రతి ఒక్కరూ బలవంతులుగా ఉండాలనేది దేవుని కోరిక. బలవంతుడైన దేవుడు బలహీనులను బలపరుస్తాడు. బలహీనతలు మూడు రకాలు: ఒకటి శారీరక బలహీనత. తమ దేహాలను పట్టిపీడిస్తున్న రోగాలు, వ్యాధులు, బలహీనతలు వారిలోని సంతోషాన్ని హరించేస్తున్నాయి. ఎన్నో మందులు వాడి, వైద్యుల చుట్టూ తిరిగి తమకున్నదంతా ఖర్చు పెడుతున్నారు. బైబిలు గ్రంథంలో ఒక స్త్రీ పన్నెండు సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడుతుంది. ఆమె యేసును గురించి విని ఆయన వస్త్రపు చెంగును ముట్టినా చాలు, బాగుపడతానని అనుకుని ఆయన వద్దకు వచ్చి ఆయనను ముట్టగానే ఆమె వ్యాధి నయం అయింది. అన్ని సంవత్సరాల నుండి ఉన్న రోగం బాగుచేయబడింది. ‘నీవు విశ్వాసంతో ప్రభువు దగ్గరకు వస్తే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు.’ రెండవది మానసిక బలహీనత. కొంతమంది శారీరకంగా బలంగా ఉన్నట్లు కనబడినా వారి మనసు మాత్రం చాలా బలహీనంగా ఉంటుంది. వారి జీవితంలో ఎదురయ్యే ప్రతి చిన్న సమస్యకు కృంగిపోయి వారి జీవితంలో నలిగిపోతుంటారు. పైకి కనబడినంత బలంగా వారు మానసికంగా ఉండలేరు. మానసికంగా కృంగిపోయినవారు మాటిమాటికీ మరణాన్ని గురించి తలచుకుంటారు. బైబిలు గ్రంథంలో ఏలీయా అనే ప్రవక్తను భక్తిహీనురాలైన యెజెబెలు అను రాణి బెదిరించినపుడు బదరీ వృక్షం కిందకు వెళ్ళి కృంగుదలతో తన ప్రాణాన్ని తీసుకోమని దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన వినలేదు కానీ ఏలీయాను బలపరచి మరింత దూరం ప్రయాణం చేసేందుకు శక్తిని అనుగ్రహించాడు. నీవు కూడా మానసికంగా బలహీనంగా ఉండి మరణాన్ని కోరుకుంటున్నావా? ‘దేవుని శక్తిని కోరుకో. దేవుడు మిమ్ములను బలపరచి మరింత ముందుకు నడిపిస్తాడు.’ మూడవది ఆత్మీయ బలహీనత. ఆత్మలో బలహీనత కలిగినవారు తరచుగా పాపంలో పడిపోతుంటారు. ఏదైతే చేయకూడదని అనుకుంటారో, నిర్ణయించుకుంటారో అదే పాపం మరలా మరలా చేస్తూ అపరాధభావంతో నింపబడుతుంటారు. పాపం మనిషికి ఎన్నడూ మనశ్శాంతినివ్వదు. పాపం ఎప్పుడూ ఆకర్షణీయంగాను, పాపం చేస్తున్నప్పుడు ఆనందంగాను, పాపం చేశాక అవేదనగాను ఉంటుంది. నీవు ఆత్మలో దేవుని శక్తిని కలిగియండకపోతే నీవు తీసుకునే నిర్ణయమును నీవే కొనసాగించలేవు. దయామయుడైన దేవుని వద్దకు వచ్చి ఎటువంటి బలహీనత నుండి విడుదల పొందాలనుకుంటున్నామో తెలియచేస్తే దేవుడు కచ్చితంగా ప్రార్థన ఆలకిస్తాడు. ఆపత్కాలంలో దేవుడే సహాయకుడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. సర్వశక్తిమంతుడైన దేవుడు బలపరిస్తే ఎటువంటి బలహీనత అయినా దూరమవుతుంది. ‘ఆయన కొరకు ఎదురుచూచువారు నూతన బలమును పొందుకుంటారు. నిన్ను నీవు చూసుకున్నంత కాలము నీలోని బలహీనతలు మరింతగా నిన్ను బలహీనులుగా మారుస్తాయి. బలవంతుడైన దేవుని కొరకు, ఆయన కృప కొరకు నీవు సాగిలపడితే నీవు దేవునిలో బలవంతునిగా ఉంటావు.’ రక్షకుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సృష్టికర్తయైన దేవున్ని తండ్రి అని పిలవచ్చా? అనే సందేహం చాలామందిలో ఉంది. అలా పిలవడానికి మనం అర్హులమేనా? క్రీస్తు మార్గంలో దేవున్ని తండ్రి అని పిలిచేందుకు అర్హత ఇవ్వబడింది. ఆయన సర్వసృష్టిని కలుగజేసిన ఆదిసంభూతుడయిన తనయందు విశ్వాసముంచుట వలన ఉచితంగా దేవుని పిల్లలమయ్యే అధికారం ఇవ్వబడింది. ప్రార్థన నేర్పిస్తూ ‘పరలోకమందున్న మా తండ్రి’ అని సంబోధించమని క్రీస్తు తన శిష్యులకు తెలియచేశారు. రక్షకుడైన దేవుడు నిత్యుడగు తండ్రి. ఆయన ఎన్నడూ నిన్ను విడువడు. ఎడబాయడు. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా దేవుని కృప మనలను విడిచిపోదు. కొంతమంది ఈ లోకములో శారీరక తండ్రిని కోల్పోయి నిరాశలో జీవిస్తుంటారు. లోక తండ్రులు మనలను పట్టించుకోకపోయినా పరలోకపు తండ్రి నిత్యం మనలను పట్టించుకుంటాడు. ఆయన నిత్యం మనతో నిలిచియుండు దేవుడు. ఎవరైనా పిల్లలు తమ తండ్రిని ఏదైనా అడిగితే కచ్చితంగా ఇస్తారు. వారి స్థోమతకు, సామర్థ్యానికి మించి పిల్లలకు ఇవ్వాలని చాలా ప్రయాసపడుతుంటారు. పరలోకపు తండ్రికి తన పిల్లలంటే ఎంతో ప్రేమ కదా. అడిగిన వాటికంటే, ఊహించుకునే వాటికంటే అత్యధికంగా అనుగ్రహిస్తాడు. క్రైస్తవ మార్గంలో దేవుడు ప్రజలతో కేవలం భక్తునితో ఉండే సంబంధం కాదు కానీ ఆయన తండ్రిగా ఉండాలని కోరుకుంటున్నాడు. తండ్రి కౌగిలిలో ఒదిగిపోయి దివ్యానుభవాలను మూటకట్టుకున్న ఓ వ్యక్తి ఇలా అంటాడు. ‘తుఫాను మబ్బులు చూట్టురా కమ్మితే గంభీర స్వరం మూగబోతే నమ్మండాయన్ని. ఆయన మీ తండ్రి గనుక మీ ప్రార్థనలన్నీ వింటున్నాడు. దు:ఖం శ్రమలు బాధ దగ్గరైనా అతి చేరువైన ఆత్మీయులు దూరమైనా స్తుతించండి ఆయనున్నాడు మనకి. దారి కష్టమైన బ్రతుకు నిష్ఠూరమైనా భయంతో మన కళ్లకి మసకలు కమ్మినా మన తండ్రి మన చెంతనున్నాడు గనుక చేతిలో చెయ్యి వెయ్యండి. దారులన్నీ మూసుకుపోయినా అందమంతా అణగారినా మనతో ఉంటాడు నమ్మి విశ్రమించండాయనలో.’ బైబిలు గ్రంథ చరిత్రలో సమాజంలో వెలివేయబడినవారు, అంటరానివారుగా పరిగణించబడినవారు ప్రభువు దగ్గరకు వచ్చి ఆదరణ పొందారు. కొందరైతే సమాజంలో సరైన గుర్తింపు లేక, కనీసం మనుషులుగా కూడా గుర్తించేవారు లేకుండా జీవిస్తుండేవారు. అలాంటి వారు క్రీస్తు వద్ద తండ్రి ప్రేమను, ఆప్యాయతను అనుభవించారు. కృంగుదలతో ప్రభువు దగ్గరకు వచ్చినపుడు వారిని ఎంతో కనికరంతో చూసి, వారి మీద జాలి పడి, వారిని ‘కుమారుడా, కుమారి’ అని పిలిచాడు క్రీస్తు. ఆయన ఎవరినీ తక్కువగా చూసేవాడు కాదు. భేదాలు మనుషులు కల్పిస్తారు కానీ దేవునిలో ఏ భేదం లేదు. ఆయన వద్దకు విశ్వాసంతో వచ్చేవారందరినీ తన బిడ్డలుగా చేసుకుని, వారిని ఆదరించి తండ్రి వలె వారి యెడల బాధ్యతాయుతంగా ఉంటాడు. నేటి సమాజంలో అంటరానితనం, కుల వివక్ష, మత వివక్ష, జాతి వివక్షలు కనబడుతూనే ఉన్నాయి. పరువు హత్యలు కలతపెడుతూనే ఉన్నాయి. సమసమాజ నిర్మాణం జరగాలంటే మనుషులంతా దేవుని సృష్టే అని గమనించాలి. ‘నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుము’ అను దైవ వాక్కును మనుషులంతా గుండెలకు హత్తుకోవాలి. మదర్ థెరిస్సా కలకత్తాలో ఆశ్రమాన్ని స్థాపించినప్పుడు అభాగ్యుల పట్ల, అణగారిన ప్రజానీకం పట్ల దేవుని ప్రేమను చూపించింది. దుర్భర స్థితిగతుల్లో, దయనీయమైన పరిస్థితుల్లో బతుకునీడుస్తున్న వారికి తల్లిగా ప్రేమను పంచింది. తన ప్రశ్నలతో మదర్ థెరిస్సాను ఉక్కిరిబిక్కిరి చేద్దామనుకున్న విలేఖరి కిటికీలో నుండి లోపల ఏం జరుగుతుందోనని తొంగి చూశాడు. లోపల జరుగుతున్న పరిస్థితిని చూసిన వెంటనే అతని కళ్లు చెమర్చాయి. ఒళ్లంతా కురుపులతో నిండిపోయి దుర్వాసన కొడుతున్న ఒక కుష్ఠురోగి చేసుకుంటున్న వాంతిని పాత్రలో పడుతోంది. అలాంటి వ్యక్తిని చేరదీయడం ఎవరివల్లా కాదని గుర్తించిన ఆ వ్యక్తి మదర్ను అడుగుతాడు.. ‘అలాంటి పనులు నీవెలా చేయగల్గుతున్నావు? నీకెప్పుడూ వారిమీద అసహ్యం వెయ్యదా?’ అని. చేతులు తుడుచుకుంటూ మదర్ థెరిస్సా ‘అభాగ్యులలో నేను నా దేవుని చూస్తాను. వారికి సేవ చేయడం నా దేవునికి సేవ చేయడంగానే భావిస్తా. నేను చేసేదల్లా దేవుని ప్రేమను ఆచరణలో చూపించగలగడమే’ అని సమాధానమిస్తుంది. ‘తండ్రి కుమారుల యెడల జాలిపడునట్లు ప్రభువు తన బిడ్డల యెడల జాలిపడతాడు’ అని కీర్తనకారుడు తన కీర్తనలో వ్రాశాడు. ఎవరి ప్రేమనూ నోచుకోక, జీవితంలో అయినవారందరినీ కోల్పోయి, ఒంటరిగా ఉన్నాను నన్నెవరు ఆదుకుంటారు, నా గురించి ఎవరూ పట్టించుకుంటారు అని అనుకుంటున్నవారిని ఆదరించి తండ్రి ప్రేమను చూపడానికి నిత్యుడగు తండ్రియైన దేవుడు శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. ఆయన నీ గురించి విచారించేవాడు. నీ గురించి నీవు కలిగియున్న ఆలోచనల కంటే మరింత శ్రేష్ఠమైన ఆలోచనలు ప్రభువుకున్నాయి. నిన్ను నిన్నుగా అంగీకరించి నీ స్థితిగతులను మార్చి తన నిత్య ప్రేమతో నిన్ను నడిపిస్తాడు. అడవి ప్రాంతంలో నివసిస్తున్న ఓ తండ్రి కొడుకుల కథ అనేకులను కంటతడి పెట్టిస్తుంది. జీలుగకల్లుకు అలవాటు పడిన కొడుకు అన్ని విధాలుగా దారి తప్పిపోతాడు. అనేకసార్లు తండ్రి మందలించినా కొడుకులో ఇసుమంతైనా మార్పు రాలేదు. రానురాను జీవితం మరింత దారుణంగా మారిపోయింది. కల్లు తాగి మత్తులో ఆనందించాలనుకున్న కొడుకు చెట్టుమీద నుండి పడిపోతాడు. బలమైన గాయాల పాలై ఒంటరిగా అడవిలో విలవిల్లాడుతూన్న ఆ కొడుకును వెదుక్కుంటూ వెళ్తాడు అతని వృద్ధ తండ్రి . తీవ్ర గాయాలతో పడి ఉన్న కుమారుడిని అతి కష్టంమీద ఓ చిన్న హాస్పటల్కు తీసుకెళ్తాడు. ఉన్నపాటున రక్తం ఎక్కించకపోతే ప్రాణాలు దక్కకపోవచ్చు అని డాక్టర్ చెప్పిన మాటను తన పెద్ద కుమారునికి చెప్తాడు. నాకు భార్యా పిల్లల బాధ్యతలు చాలా ఉన్నాయి. రక్తం ఇవ్వడం నా వల్లకాదని ముఖం చాటేస్తాడు అన్న. కొడుకు ప్రాణాలు నిలబెట్టడం కోసం తండ్రి తన రక్తాన్నే ఇచ్చి తన ప్రేమను, కొడుకు పట్ల తనకున్న బాధ్యతను నెరవేర్చుతాడు. నీరసించిపోయిన తండ్రి కొద్దిరోజుల తర్వాత ప్రాణాలు కోల్పోతాడు. క్రీస్తు సమాధానకర్త అతడు బతికున్న రోజుల్లో అతన్ని మించిన ధనికుడు మరొకడు లేడు. ఎన్నో కంపెనీలు, చేతినిండా డబ్బు, పేరు ప్రఖ్యాతులు, పనివాళ్లు ఎందరో అతని చుట్టూ ఉన్నారు. న్యూయార్క్ నగరంలో అతని పేరు మీద ఒక వీధి ఉంది. సుప్రసిద్ధుడైన ఆ కుబేరుడు ఒకరోజు ఇలా అన్నాడు.. ‘నేను విపరీతంగా ధనాన్ని ఆర్జించాను. అవి నాకు నిజమైన సంతోషాన్ని ఇవ్వలేదు’ అని. ఆ వ్యక్తి పేరు రాక్ఫెల్లర్. జీవితం మీద ఎన్నో విశిçష్ఠ పుస్తకాలు రచించిన ఎర్నెస్ట్ హెమింగ్వే ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. కారణం జీవితంలో శాంతి సమాధానాలు లేక. ఈనాడు అనేకులు ధనం, పలుకుబడి, హోదా, ఖ్యాతిని సంపాదిస్తున్నారు. సమాజంలో వారికంటూ గుర్తింపు పొందుతున్నారు. వారికేంటి.. అదీ జీవితమంటే... అలా బ్రతకాలి... అని అనిపించుకున్నవారే నేడు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అర్ధాంతరంగా జీవితాన్ని ముగించేసుకుని తిరిగిరాని లోకాలకు వెళిపోతున్నారు. వారు ఆ విధంగా చనిపోవడానికి కారణం వారి హృదయంలో శాంతి సమాధానం లేకపోవడమే. లోకంలో మానవునికి ఎన్ని ఉన్నా హృదయం భారంతో ఉంటే ఏదో తెలియని వెలితి జీవితాన్ని వేధిస్తుంది. కుటుంబంలో, భార్యాభర్తలకు సమాధానం లేక అనేక కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలనుకొని నెత్తుటి ఏరులు పారించిన హిట్లర్ చివర్లో ఎలా మరణించాడో అందరికీ విదితమే. లోకంలో చాలమంది రాజులు, చక్రవర్తులు వచ్చారు. యుద్ధాలు చేసి, రక్తపుటేరులు పారించి, రాజ్యాలను కొల్లగొట్టి తమ స్థానాలను సుస్థిరం చేసుకోవాలనుకున్నారు. శత్రువును హతమార్చడమే ఈ లోక రాజుల ప్రథమ ఉద్దేశంగా ఉండేది. ప్రభువైన యేసు మాత్రం ఈ లోకానికి యుద్ధాలు చేయడానికి లేదా రక్తపుటేరులు పారించి తన రాజ్యాన్ని ఈ భూమి మీద నెలకొల్పడానికి రాలేదు. వాస్తవాన్ని పరిశీలిస్తే మనుషుల హృదయాలలో శాంతి, సమాధానమును ఇవ్వడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ‘నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి’ అని క్రీస్తు ప్రభువు సెలవిచ్చారు (యోహాను 14:27). సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద చితుక తొక్కించును అని లేఖనాలు తెలియచేస్తున్నాయి. ప్రభువు కలువరి సిలువలో చనిపోయి తిరిగిలేవడం ద్వారా అపవాదిని ఓడించాడు. సాతాను తలను ఆయన చితుక తొక్కినందున దేవుని ప్రజలకు క్రీస్తు ద్వారా విజయం లభిస్తుంది. ఐగుప్తు రాజులు తమకు శత్రువులుగా ఉన్నవారందరి చిత్రాలను పాదపీఠాల మీద చెక్కించుకుని వారి మంచాల కింద ఉంచేవారు. వారు నిద్రలేవగానే ఆ పాదపీఠం మీద ఉన్న తమ శత్రువుల రూపాలను కాళ్ళతో తొక్కుతూ విజయానందం పొందేవారు. అయితే సమాధానకర్తయగు దేవుడు కూడా మన శత్రువులను మన కాళ్ళ కింద చితక తొక్కిస్తాడు. శత్రువు అంటే మనకు నచ్చనివారు, పక్కింటివారు కాదు. నీవెదుర్కొంటున్న సంఘర్షణలు, ఆందోళనలు, దైవ విరుద్ధ ప్రేరేపణలు మొదలగు వాటిపై నీవు విజయం సాధించాలన్నది దేవుని ఉద్దేశం. ‘కడపట నశింపచేయు శత్రువు మరణం’ అని బైబిల్ సెలవిస్తుంది. మనిషి దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం వలన మరణం మానవునికి సంప్రాప్తించింది. పాపం మానవుడిని దేవునికి దూరం చేస్తుంది. దేవుని మహిమను పొందలేనంత దూరస్థులుగా చేసింది. దేవునికి అసహ్యమైనది పాపం. అటువంటి పాపం మానవునిలో ప్రవేశించినపుడే మరణం మానవునికి శత్రువుగా మారింది. ఈ మరణాన్ని జయించి మన కాళ్ల కింద చితక తొక్కించుటకు ఆయన సిలువపై మరణించి తిరిగి లేచి మరణపు కోరలను విరిచివేశాడు. మరణమా! నీ ముల్లెక్కడ? మరణమా! నీ విజయమెక్కడా? అని విజయఢంకా మోగించాడు. ఎవరైతే యేసునందు విశ్వాసముంచుతారో వారు పాపం వలన వచ్చే మరణాన్ని దాటుకుని దేవుని సమాధానాన్ని పొంది దేవుని రాజ్యనివాసులుగా చేయబడుతున్నారు. విశ్వాసం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా చేయబడుతున్నారు. దేని కొరకు చింతించక అన్నింటి కొరకు ప్రార్థించినపుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం హృదయానికి కావలి ఉంటుంది. హృదయాంతరంగం నుండి నీవు చేసే ప్రార్థన ఆయన విని నీకు తగిన సమయంలో సమాధానం అనుగ్రహిస్తారు. భర్త మరణశయ్యమీద ఉన్నప్పుడు అందరూ దూరమై పరిస్థితులు దుర్భరమైనప్పుడు క్రీస్తు సమాధానాన్ని గుండెల నిండా అనుభవించిన చార్లెస్ కౌమన్ కలం నుండి జాలువారిన మధురాక్షరాలు.. ‘నా ప్రియుడు శ్వేత సింహాసనంపై కాంతిపుంజమై మహిమ మస్తక విలసన్నవ తేజుడై ఆశీనుడై విరాజిల్లే నిత్య పరలోకం, అక్కడే నా వైభవం అక్కడే నా జీవం... లౌకిక జీవనాన్ని మధురం చేస్తూ జీవిస్తే మేలు మరణిస్తే లాభమనిపిస్తూ క్షమా రక్షణలకు ఆయత్తమవుతూ తన రాచఠీవితో స్వర్గాన్ని సౌందర్యపరచి శక్తి శౌర్యాల వాత్సల్యమూర్తి సమాధానకర్తయైన నా దేవునికే చేరాలి నా వింత విన్నపాలు... అక్కడే నా మనస్సు... అక్కడే నా సిరిసంపదలు.’ కారుణ్యాది సకలసమన్వితుడైన దేవుడు మీకందరికీ శాంతి సంతోషాలు, ఆరోగ్యాయుష్షులు, సకల సంపదలు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాక్షి పాఠకులందరికీ క్రిస్మస్/నూతన సంవత్సర శుభాకాంక్షలు. -డా. జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
Christmas-Sankranti Holidays: క్రిస్మస్, సంక్రాంతి సెలవులివే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలకు ఈనెల 23 నుంచి క్రిస్మస్, జనవరి 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్సీఈఆఈర్టీ) అకడమిక్ క్యాలెండర్లో పొందుపరిచింది. క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 23 నుంచి 30వ తేదీ వరకు ఉంటాయి. క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి. చదవండి: Srisailam temple: దుకాణాల వేలంలో అందరూ పాల్గొనవచ్చు: సుప్రీం కోర్టు డిసెంబర్ 31న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. ఇక సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 15వ తేదీ వరకు ఉంటాయని ఎస్సీఈఆర్టీ వివరించింది. మిషనరీ పాఠశాలలకు మినహా తక్కిన పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయి. 17వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. జనవరి 8వ తేదీ రెండో శనివారం, 9వ తేదీ ఆదివారం కావడంతో ఆ రెండు రోజులూ సెలవే. -
Christmas 2021: ఆర్నమెంట్ స్పాంజ్ బాల్స్, క్యాండీబాల్స్తో అందంగా..
క్రిస్మస్ రోజుల్లో పచ్చని జీవితానికి ప్రతీకగా పచ్చని చెట్టును ఇళ్లల్లో అలంకరించుకుంటారు. ఆ చెట్టుకు మనలోని ఆశలకు ప్రతిరూపాలుగా అందమైన బాల్స్, చిరుగంటలు, లైట్లతో అలంకరించడం చూస్తుంటాం. క్రిస్మస్ చెట్టుతో పాటు ఇంటి బాల్కనీలో, డైనింగ్–లివింగ్ రూమ్లలో అలంకరణకు ఉపయోగించే అందమైన బాల్స్ తయారీలో ఎన్నో డిజైన్లు కనువిందు చేస్తున్నాయి. ఆర్నమెంట్ స్పాంజ్ బాల్స్ ఎన్ని బాల్స్ కావాలో ముందే ఎంపిక చేసుకోవచ్చు. రకరకాల సైజుల్లో ఇవి మార్కెట్లో లభిస్తుంటాయి. ఈ బాల్స్ని పెయింట్ చేసి అలంకరించవచ్చు. మగ్గం వర్క్కి ఉపయోగించే బీడ్స్, లేస్, స్వరోస్కి వంటి పూసలను గమ్ సాయంతో అతికించి అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. గట్టి దారంతో లేదా రంగు రిబ్బన్తో వేలాడదీయచ్చు. క్యాండీబాల్స్ పలు పరిమాణాల్లో ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ బాల్స్ దొరుకుతాయి. వీటిలో చిన్న చిన్న చాక్లెట్లు, క్యాండీలను నింపి వేలాడదీయొచ్చు. ఇవి పిల్లలను మరింతగా ఆకర్షిస్తాయి. పండగ సంబరాన్ని వారిలో రెట్టింపు చేస్తాయి. హెన్నా డిజైన్ బాల్స్ చేతులపై కోన్స్తో వేసే హెన్నా డిజైన్స్ గురించి మనందరికీ తెలిసిందే. ఆ డిజైన్స్ను పెయింట్తో ఈ బాల్స్పై వేసి మరింత అందంగా తయారుచేసుకోవచ్చు. నచ్చే డిజైన్ ఎవరికి వారు ఎంపిక చేసుకోవచ్చు. వీటి కాంబినేషన్కి కొన్ని పూసలు, దారాలు, రంగు రంగు రిబ్బన్లను కూడా జత చేసుకోవచ్చు. కుందన్–మిర్రర్ బాల్స్ రాత్రివేళ మరింతగా మెరుపులీనుతూ వేలాడదీసిన బాల్స్ కనువిందు చేస్తుంటే మనసు మరింత ఉల్లాసభరితంగా ఉంటుంది. అందుకని అందమైన బాల్స్ తయారీలో కుందన్స్, మిర్రర్ గ్లూ సాయంతో అతికించి తయారుచేసుకోవచ్చు. క్రిస్మస్ వచ్చేటప్పుడు ప్రేమాభిమానాలను, సుఖసంతోషాలను తీసుకురావాలని ఆహ్వానం పలికే ఈ ప్రక్రియ ఇంటిని కళాభరితంగా మార్చేస్తుంది. చదవండి: స్ఫూర్తి మినియేచర్ సృష్టి... మది దోచే మట్టి రూపాలు -
స్వెటర్ను లాంచ్ చేసిన మైక్రోసాఫ్ట్..! ధర ఏంతంటే..!
Microsoft Launches A Minesweeper Inspired Christmas Special Sweater: మైక్రోసాఫ్ట్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు అనుకుంటా బహుశా..! టెక్ దిగ్గజం ఐటీ ఆధారిత సేవలకు పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ బేస్డ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ సర్వీసులను మైక్రోసాఫ్ట్ అందిస్తోంది. వీటితో పాటుగా ప్రతి క్రిస్మస్కు మైక్రోసాఫ్ట్ వెరైటీ స్వెటర్ను లాంచ్ చేస్తోంది. ఈ ఏడాది కూడా క్రిస్మస్కు ‘ మైన్స్వీపర్ ఆగ్లీ’ అనే పేరుతో స్వెటర్ను విడుదల చేసింది. ఈ స్వెటర్ ప్రత్యేకత ఏమిటంటే..! మైక్రోసాఫ్ట్ 1990 నుంచి ప్రతి ఏడాది క్రిస్టమస్కు ఓ వినూత్న స్వెటర్ను లాంచ్ చేస్తుంది. వీటి సేల్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని స్వచ్ఛంద సంస్థలకు అందజేస్తుంది. గత ఏడాది ఎంఎస్ పెయింట్- ఆధారిత ‘అగ్లీ క్రిస్మస్ స్వెటర్ను లాంచ్ చేయగా...వాటి నుంచి వచ్చిన ఆదాయాన్ని మైక్రోసాఫ్ట్ గర్ల్స్ హూ కోడ్ ఫౌండేషన్కు విరాళంగా ఇచ్చింది. కంప్యూటర్ సైన్స్ విద్యను అభ్యసిస్తున్న యువతులకు గర్ట్స్ హూ కోడ్ ఫౌండేషన్ సహాయం చేసింది. ధర ఎంతంటే..! మైన్స్స్వీపర్ గేమ్ స్ఫూర్తిలో ఈ స్వెటర్ను మైక్రోసాఫ్ట్ రూపొందించింది. అమెరికన్ మార్కెట్లలో ఈ మైన్స్స్వీపర్ అగ్లీ స్వెటర్ ధర 74.99 డాలర్లు (సుమారు రూ. 5,600)గా ఉంది. ఈ స్వెటర్ను ప్రపంచవ్యాప్తంగా షిప్పింగ్ చేయనుంది. అన్ని దేశాలవారు ఈ స్వెటర్ను కొనుగోలుచేయవచ్చును. స్మాల్, లార్జ్, మీడియమ్, ఎక్స్ఎల్, డబుల్ఎక్స్ఎల్, త్రిబుల్ ఎక్సెఎల్ సైజులో లభించనుంది. చదవండి: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త..! -
అమెరికాలో దారుణం.. జనంపైకి దూసుకెళ్లిన కారు
వాకేషా(అమెరికా): బ్యాండ్ వాయిస్తూ స్థానికుల ర్యాలీ, శాంటాక్లాజ్ టోపీలతో చిన్నారుల కేరింతలతో సందడిగా ఉన్న క్రిస్మస్ పరేడ్ ఒక్క క్షణంలో భీతావహంగా మారింది. పరేడ్లో పాల్గొన్న స్థానికులను తొక్కేస్తూ వారిపై నుంచి ఎస్యూవీ వాహనం ఒకటి దూసుకెళ్లింది. ఈ దారుణ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 40 మందికిపైగా గాయాలపాలయ్యారు. అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీ పట్టణం సమీపంలోని వాకేషా అనే ప్రాంతంలో ఆదివారం ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఎస్యూవీ నడిపిన వ్యక్తిగా భావిస్తున్న ఒకతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనలో ఉగ్రకోణం ఉందా? లేదా? అనేది పోలీసులు ఇంకా వెల్లడించలేదు. త్వరలో జరగబోయే క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరిచుకుని ఇక్కడి స్థానికులు 59వ క్రిస్మస్ వార్షిక పరేడ్ను చేసుకుంటున్నారు. అదే సమయంలో ఒక వ్యక్తి ఎస్యూవీ వాహనంలో వచ్చి అడ్డుగా ఉన్న బారీకేడ్లను అత్యంత వేగంతో కారుతో ధ్వంసం చేసి ర్యాలీగా వెళ్తున్న జనం మీదుగా పోనిచ్చాడు. దీంతో జనం హాహాకారాలతో పరుగులు తీశారు. ఐదుగురు మరణించారు. 40 మందికిపైగా గాయపడ్డారు. వెంటనే తేరుకున్న అక్కడి పోలీసులు ఆ వాహనంపైకి పలుమార్లు కాల్పులు జరిపారు. ఆగంతకుడు ఆ కారులో వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. క్రిస్మస్ పరేడ్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాల్లో, స్థానికుల సెల్ఫోన్లలో ఈ దారుణ ఘటన అంతా రికార్డయింది. చదవండి: (‘వేడుకున్నా కనికరించలేదు’.. అందుకే ఆ ఎస్ఐని చంపేశాం..) -
కరోనా... కరీనా... బోలెడన్ని జాగ్రత్తలు!
కంటికి కనిపించని కరోనాతో ప్రపంచం పోరాడుతోంది. ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూనే కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నాం. ముఖ్యంగా సినిమా షూటింగ్ అంటే చాలామంది ఉంటారు కాబట్టి జాగ్రత్తలు కూడా భారీగానే ఉంటాయి. ఇదే విషయం గురించి ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ –‘‘కరోనా లాక్డౌన్ తర్వాత మా ‘లాల్సింగ్ చద్దా’ షూటింగ్ ఆరంభించాం. కరోనా నిబంధనలు పాటిస్తూ, జాగ్రత్తగా షూటింగ్ చేశాం. అదే సమయంలో చిత్రకథానాయిక కరీనా కపూర్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ప్రపంచం మొత్తం కరోనాను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే మేం కరోనాతో పాటు కరీనా కోసం కూడా బోలెడన్ని జాగ్రత్తలు తీసుకున్నాం (నవ్వుతూ)’’ అన్నారు. ఇదిలా ఉంటే గత ఏడాది డిసెంబర్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా లాక్డౌన్ వల్ల చిత్రీకరణ పూర్తి చేసుకోలేకపోయింది. ఇప్పుడు ఈ ఏడాది క్రిస్మస్కి విడుదల చేయాలనుకుంటున్నారు. హాలీవుడ్ సినిమా ‘ఫారెస్ట్ గంప్’కి రీమేక్ ‘లాల్సింగ్ చద్దా’. -
ఫేమస్ అవ్వాలని బాంబు పెట్టాడు!
వాషింగ్టన్: క్రిస్టమస్ పర్వదినం నాడు అమెరికా టెన్నెసీ రాష్ట్రం నాష్విల్లే నగరంలో ఓ వాహనంలో అమర్చిన బాంబు పేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాడికి పాల్పడిన వ్యక్తి మరణించగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇక దాడికి పాల్పడిన వ్యక్తిని ఆంథోనీ క్విన్ వార్నర్గా గుర్తించారు. అయితే ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతోనే క్విన్ వార్నర్ ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. బాంబ్ బ్లాస్ట్ జరగడానికి వారం ముందు క్విన్ వార్నర్ ‘ప్రపంచం తనను ఎన్నటికి మర్చిపోదని’ ఇరుగుపొరుగు వారితో అన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా క్విన్ వార్నర్ ఇంటి పక్క నివసించే రిక్ లాడ్ అనే వ్యక్తి బాంబ్ బ్లాస్ట్కు వారం ముందు నిందితుడికి, తనకు మధ్య జరిగిన సంభాషణను వెల్లడించాడు. ‘క్రిస్టమస్కు వారం రోజుల ముందు నేను, క్విన్ వార్నర్ కాసేపు పండగ గురించి ముచ్చటించుకున్నాం. మాటలో మధ్యలో క్విన్ వార్నర్ క్రిస్టమస్ సందర్భంగా శాంటా తన కోసం ఏదైనా మంచిది తీసుకురాబోతన్నాడు అని అన్నాడు. అంతేకాక ప్రపంచం తనను ఎన్నటికి మర్చిపోదని వ్యాఖ్యానించాడు. అయితే అతడి మాటల వెనక ఇంత దారుణమైన ఆలోచన దాగుందని నాకు ఆనాడు తెలియలేదు. అసలు అతడి మీద ఎలాంటి అనుమానం కలగలేదు’ అన్నాడు లాడ్. ప్రస్తుతం అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. బాంబ్ బ్లాస్ట్ వెనక గల ప్రధాన ఉద్దేశాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇప్పటికే క్విన్ వార్నర్ కంప్యూటర్, హార్డ్డ్రైవ్ని స్వాధీనం చేసుకున్నారు. (15 మంది చిన్నారులను బలిగొన్న రిక్షా బాంబు) గత శుక్రవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో టెన్నెసీ రాష్ట్రం నాష్విల్లే నగరంలోని ఓ ప్రాంతంలో నిలిపి ఉంచిన వాహనంలో దుండగులు అమర్చిన బాంబు పేలింది. అయితే పేలుడు జరగడానికి ముందు ఆ ప్రాంతంలో కాల్పులు జరుగుతున్నట్లు గుర్తు తెలియని దుండగుల నుంచి సమాచారం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అప్రమత్తమవుతున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతుండగా.. అక్కడే నిలిపి ఉంచిన ఓ రిక్రియేషనల్ వ్యాన్ నుంచి బాంబు పేలుడుకు సంబంధించిన ప్రకటన తమకు వచ్చినట్లు తెలిపారు. మరో 15 నిమిషాల్లో ఈ ప్రాంతంలో బాంబు పేలే ప్రమాదం ఉంది అంటూ రికార్డు చేసి ఉంచిన సందేశం తమకు వినపడిందని తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దగ్గర్లోని భవనాలు, ఇళ్ల నుంచి అందరినీ ఖాళీ చేయించామని, దీంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు వెల్లడించారు. -
క్రిస్మస్ రోజు నేను చనిపోయాననుకుంది
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, నటి మసాబా చేసిన పనికి ఆమె తల్లి, సీనియర్ నటి నీనా గుప్తాకు ఒక్క క్షణం గుండాగినంత పనైందట. ఇంతకీ ఆమె ఏం చేసిందనుకుంటున్నారు.. మరేం లేదు. పండగ పూట త్వరగా నిద్ర లేవాల్సింది పోయి బారెడు పొద్దెక్కినా ఆదమరిచి నిద్రపోయారట. దీంతో మసాబా చనిపోయిందా? ఏంటని ఆమె తల్లికి చెమటలు పట్టాయట. ఈ విషయాన్ని మసాబా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా వెల్లడించారు. "శుభోదయం నీనాజీ. నాకసలు ఆలస్యంగా నిద్ర లేచే అలవాటే లేదు. కానీ క్రిస్మస్ రోజు ఆలస్యంగా తొమ్మిదిన్నర వరకు నిద్ర లేవలేదు. దీంతో భయపడిపోయిన అమ్మ నేను బతికున్నానా? లేదా? అని నా దగ్గరకు వచ్చి చెక్ చేసింది" అని చెప్పుకొచ్చారు. ఈ మేరకు నీనా తన ఫోన్ను పట్టుకున్న ఫొటోను షేర్ చేశారు. అమ్మ కంగారును పోగొట్టేందుకు మసాబా త్వరగా రెడీ అయి పండగ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సైతం అభిమానులతో పంచుకున్నారు. అయితే సత్యదీప్ మిశ్రాను మిస్ అవుతున్నానని బాధ పడ్డారు. కాగా వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్, నీనా గుప్తాల కూతురైన మసాబా నెట్ఫ్లిక్స్ సిరీస్ 'మసాబా మసాబా'తో నటనా రంగంలోకి అడుగు పెట్టారు. ఇందులో తల్లి నీనాతో కలిసి నటించారు. (చదవండి: ఈసారి ఫుల్ మీల్స్) మసాబా వ్యక్తిగత విషయానికి వస్తే.. 2015లో ప్రముఖ ఫిల్మ్ మేకర్ మధు మంతెనను ఆమె పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహ బంధం ఎక్కువకాలం నిలవలేదు. ఈ నేపథ్యంలో తామిద్దరం విడిపోతున్నామంటూ మధు, మసాబా 2018లో ప్రకటన విడుదల చేశారు. బాంద్రా ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆమె నటుడు సత్యదీప్ మిశ్రాతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. సత్యదీప్, మసాబా ఆ మధ్య ఇన్స్టాలో షేర్ చేసిన ఫొటోలు ఈ వదంతులకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఇక సత్యదీప్ సైతం తన భార్య, ప్రముఖ హీరోయిన్ అదితీ రావ్ హైదరీ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. 2009లో ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట 2013లో తమ బంధానికి స్వస్తి పలికారు. (చదవండి: విడాకులు: మళ్లీ ప్రేమలో పడిన నటుడు!) -
ఒక్క చోట చేరిన అక్కినేని కుటుంబం!
హైదరాబాద్: క్రిస్మస్ సందర్భంగా అక్కినేని కుటుంబమంతా ఒక్కచోట చేరింది. ఇందుకు సంబంధించిన మధుర జ్ఞాపకాలను కెమెరాలో బంధించింది. ఈ ఫొటోలను నటి, అక్కినేని వారి కోడలు సమంత తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. అంతా కలిసి క్రిస్మస్ పర్వదినాన్ని సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు 2020కి వీడ్కోలు పలికినట్లు వెల్లడించారు. అమల- నాగార్జున, సమంత- నాగచైతన్య దంపతులతో పాటు అఖిల్, సుమంత్, సుశాంత్, సుప్రియ సహా ఇతర కుటుంబ సభ్యులు ఒకే ఫ్రేములో ఉన్న ఈ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో.. ‘‘సూపర్.. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు’’ అంటూ కామెంట్లతో పాటు లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఫ్యాషన్ క్వీన్ సమంత ఈ పార్టీలో మెటాలిక్ గోల్డ్ డ్రెస్తో అదరగొట్టారు. కాగా పెళ్లి తర్వాత కెరీర్ను విజయవంతగా కొనసాగిస్తున్న సమంత.. ఫ్యామిలీ మ్యాన్ 2తో ఓటీటీలో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. అదే విధంగా సామ్ జామ్ కార్యక్రమానికి ఆమె హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఇక నాగ చైతన్య విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘థాంక్యూ చిత్రంలో నటిస్తున్నాడు.(చదవండి: సమంతతో ఆఫర్ కొట్టేసిన అభిజిత్) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) -
క్రిస్మస్ వేడుకల్లో సెలబ్రిటీలు ఫొటోలు
-
మెగా ఫ్యామిలీ నుంచి క్రిస్మస్ శుభాకాంక్షలు..
దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముందు రోజు అర్ధరాత్రి నుంచే ఈ వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఇందుకు చర్చిలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. కొత్త సంవత్సరానికి ఆరు రోజుల ముందు వచ్చే ఈ పండుగ కోసం ప్రపంచంలోని క్రైస్తవులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. క్రైస్తవులు మాత్రమే కాకుండా హిందువులు కూడా ఈ పండుగను జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలు అభిమనులకు, ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా స్పందించారు. ‘క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. క్రిస్మస్ మ్యాజిక్ మన జీవితాల్లో ఆనందాన్ని, చిరునవ్వును నింపుతుందని ఆశిద్దాం. ఈ పండుగ హాలీడే సీజన్ మీలో నూతన ఉత్తేజాన్ని నింపుతుందని కోరుకుంటున్నా’. అని ట్వీట్ చేశారు. చదవండి: మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు.. #MerryChristmas🎄to all! Hope the magic of Christmas fills joy and laughter in our lives.May the holiday season recharge us for a great year ahead! pic.twitter.com/BC10I1b3rf — Chiranjeevi Konidela (@KChiruTweets) December 25, 2020 టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి ఉల్లాసాన్ని పంచండి. ఇవ్వడానికి, పంచుకునేందుకు ఇది అందమైన రోజు. అందరికి ప్రశాంతత, ప్రేమ, ఆనందాన్ని అందజేయాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. క్రిస్మస్ ట్రీ వద్ద కొడుకు గౌతమ్, కూతురు సితార దిగిన ఫోటోలను ట్విటర్లో షేర్ చేశారు. ఇక మెగా ఫ్యామిలీ అందరి తరపున నుంచి అల్లు శీరిష్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కజిన్స్తో ఇలా సీక్రెట్ శాంటా ఆడినట్లు తెలిపారు. అటువంటి అద్భుతమైన ఆతిథ్యమిచ్చినందుకు చరణ్ & ఉపాసనకు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభువైన క్రీస్తు జీవితం, సూత్రాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి బలాన్ని ఇచ్చాయని, న్యాయమైన, సమగ్ర సమాజాన్ని నిర్మించటానికి అతని మార్గం చూపిస్తుందన్నారు. అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. Merry Christmas from all of us! Played Secret Santa with cousins like every year. Thank you Charan & Upsi for being such amazing hosts. 🌲🎅🎄🎁 pic.twitter.com/6AqoUDbB20 — Allu Sirish (@AlluSirish) December 25, 2020 Merry Christmas to all of you! Spread some cheer... Let this be a beautiful day of giving and sharing. Wishing you all peace, love, and joy! ✨ pic.twitter.com/Z92nF6hC35 — Mahesh Babu (@urstrulyMahesh) December 25, 2020 Wishing everyone a very #MerryChristmas🎄 — Jr NTR (@tarak9999) December 25, 2020 Merry Christmas! The life and principles of Lord Christ gives strength to millions across the world. May his path keep showing the way in building a just and inclusive society. May everybody be happy and healthy. — Narendra Modi (@narendramodi) December 25, 2020 -
మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు..
క్రిస్మస్ వేడుకల సందర్భంగా మెదక్ పట్టణంలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్ఐ చర్చి ముస్తాబైంది. గురువారం రాత్రి విద్యుత్ దీప కాంతుల్లో మెరిసిపోయింది. చర్చి ప్రాంగణంలో శాంతాక్లాజ్, క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేశారు. అలాగే మహాదేవాలయంలో జరిగే ప్రత్యేక ఆరాధనలకు తరలివచ్చే భక్తులకోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. శుక్రవారం తెల్లవారు జామున జరిగే మొదటి ఆరాధనను బిషప్ సాల్మాన్రాజ్ ప్రారంభించనున్నారు. రెండో ఆరాధన ఉదయం 9గంటలకు ప్రారంభమవుతుంది. పోలీసుల నిఘా కోసం ప్రత్యేకంగా ఔట్పోస్టు ఏర్పాటు చేసి అక్కడే బస చేస్తున్నారు. బందోబస్తును ఎస్పీ చందనాదీప్తి పర్యవేక్షిస్తున్నారు సాక్షి, మెదక్ : కరుణామయుడు, లోకరక్షకుడు ఏసుక్రీస్తు జననం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో క్రిస్మస్ సందడి నెలకొంది. చర్చిలను విద్యుత్ కాంతులతో అత్యంత సుందరంగా అలంకరించారు. క్రిస్మస్ పండుగకు ముందు రోజైన గురువారం అర్థరాత్రి నుంచే ఆధ్యాత్మికత వైభవం వెల్లివిరిసింది. ప్రత్యేక ట్రీలు, క్రీస్తు జననాన్ని తెలిపే పూరిపాక ఘట్టాలు, దైవదూత విగ్రహాలు తీరొక్క విద్యుత్ దీపాలు శోభాయమానంగా వెలిగిపోయాయి. అంతటా కోలాహలం నెలకొంది. క్రిస్మస్ వేడుకలు అంగ రంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆసియా ఖండంలో అతి పెద్ద మెదక్ చర్చిలో యేసు పుట్టిన రోజు వేడుకలు అర్ధరాత్రి నుంచి మొదలయ్యాయి. చర్చి పాస్టర్ సాల్ మాన్ రాజు ఆరాధన యేసు సందేశాలు అందిస్తున్నారు. దివ్యతార దిగి వచ్చిన వేళ.. గజ్వేల్రూరల్: ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. అతి పవిత్రమైన ఈ చర్చిని సందర్శించేందుకు గజ్వేల్ పట్టణ ప్రజలతో పాటు సమీప గ్రామాలే కాకుండా ఇతర జిల్లాల నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. గురువారం అర్థరాత్రి నుంచి బాలయేసు పుణ్యక్షేత్రంలో ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు మొదలై శుక్రవారం రాత్రి వరకు కొనసాగుతాయి. చర్చి ఆవరణలో పశువుల పాక, స్టార్, ఏసు జననం వంటి కళాకృతులను అందంగా అలంకరించారు. క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు చర్చి ఆవరణను అందంగా తీర్చిదిద్దారు. మెథడిస్ట్ చర్చి.. మైమరపించెన్ జహీరాబాద్: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని చర్చీలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. జహీరాబాద్లోని పలు చర్చీలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. సంగారెడ్డి జిల్లాలోనే అతిపెద్ద చర్చి అయిన ఎంఆర్హెస్ఎస్ ఆవరణలో నిర్మించిన మెథడిస్ట్ చర్చి విద్యుత్ కాంతులతో విరాజిల్లుతోంది. ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని టౌన్ చర్చితో పాటు పలు కాలనీల్లో ఉన్న చర్చీలను సైతం అందంగా అలంకరించారు. ముస్తాబైన చర్చిలు చిలప్చెడ్(నర్సాపూర్): క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి చిలప్చెడ్ మండలంలోని పలు చర్చిలు ముస్తాబయ్యియి. గురువారం మండల కేంద్రమైన చిలప్చెడ్ గ్రామంలోని చర్చిని అందంగా అలంకరించారు. నర్సాపూర్ రూరల్: నేటి క్రిస్మస్ పండుగ వేడుకల కోసం నర్సాపూర్ పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో ఉన్న చర్చిలను రంగులు, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. నర్సాపూర్ సీఎస్ఐ చర్చితో పాటు నాగులపల్లి, అవంచ, ఎల్లాపూర్, ఖాజీపేట, పెద్దచింతకుంట చర్చిలకు పెద్ద ఎత్తున్న భక్తులు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. వీరిని దష్టిలో పెట్టుకొని అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దివ్య సందేశం దుబ్బాకటౌన్: పెద్దగుండవెల్లి సీఏస్ఐ చర్చిలో ప్రతి ఏటా క్రిస్మస్ సంబురాలు ఘనంగా జరుపుతారు. క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ తాతయ్య (శాంతక్లాజ్) వేషధారణతో గ్రామంలో తిరుగుతూ పిల్లలకు చాక్లెట్లు పంచుతారు. చర్చిలో 100 కుటుంబాలు ఒకేచోట ఉండి సంబురాలు ఆనందంగా జరుపుకొంటారు. క్రిస్మస్ శుభాకాంక్షలు సిద్దిపేటకమాన్: నేడు జరుపుకోనున్న పవిత్ర క్రిస్మస్ పండగను పురస్కరించుకుని క్రిస్టియన్ సోదరి, సోదరులకు సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సీపీ ఆకాంక్షించారు. విద్యుత్ కాంతుల్లో మెదక్ సీఎస్ఐ చర్చి -
ఇలకు దిగిన ప్రేమ
క్రిస్మస్ సమయంలో చర్చిలపై, ఇండ్లపై, వీధులలో, క్రిస్మస్ ట్రీలపై ప్రజలు ఆనందోత్సాహాలతో స్టార్స్ అలంకరిస్తారు. దీనికి కారణం యేసు ప్రభువు 2020 సంవత్సరాల క్రితం బెత్లెహేములో జన్మించి, స్థలం లేక పశువుల తొట్టిలో పరుండబెట్టిన రాత్రి ఆకాశంలో ఒక దేదీప్య తార వెలిసింది. దేవుడే మానవావతారుడై భూమిపై వెలశాడు. క్రిస్మస్లో వెలిగించే రంగురంగుల విద్యుత్ దీపాల ప్రకాశం, నక్షత్రం, పెద్ద చిన్న తారలతో చాలా ఆత్మీయ భావాలు ఇమిడి ఉన్నాయి. కోట్లాది లెక్కించలేని నక్షత్రాలు గగనంలో ఉన్నప్పటికీ ఈ నక్షత్రం ప్రత్యేకం. దేవుని నమ్మిన అబ్రహాం సంతానం ఆకాశంలో నక్షత్రాల వలె విస్తరిస్తారని, ఆయన సంతతి నుండి లోక రక్షకుడు ఉదయిస్తాడని నిర్ధారణ అయింది. ఈ తార మిగిలిన వాటి నుండి తగ్గించుకుని కిందకి దిగి వచ్చాడు. మనం కూడా పాపం నుండి, చెడు నుండి వేరు కావాలి. యేసు సాత్వికుడై దాసుని రూపం ధరించాడు. మనుష్యులు పరలోకానికి దారి చూడాలంటే తగ్గింపు కలిగి ఉండాలి. మోసగాడైన యాకోబులో ఉదయించిన నక్షత్రం రాజును పోలిన ఇశ్రాయేలీయులనుగా మనుష్యులను మార్చడానికి క్రీస్తు వచ్చాడు. దేవుని దూతలు వేరు, మోసం చేసే తేజోనక్షత్రం సాతాను వేరు. నేను దావీదు వేరు చిగురును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను’ అని యేసు చెప్పాడు (ప్రకట:22:16). దారి చూపు వెలుగును వెంబడించు వారు గుంటలో పడరు. పాపమున్న చోటను నడువరు. అందువలన యేసు శిశువు నుండి సిలువ వరకు అక్కడి నుండి పునరుత్థానుడై వెళ్లువరకు ‘నేను లోకానికి వెలుగునై ఉన్నాను‘ అని తెలిపాడు. యేసు నుండి రక్షించబడిన వారు నక్షత్రాలు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారై ప్రకాశిస్తారు. నీతి మార్గాన్ని అననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారు’ (దానియేలు 12:3) మరణించినా జీవించునట్లు దారి చూపు వారు వీరే. మోషే, దానియేలు, బాప్తిస్మమిచ్చు యోహాను, పౌలు, ఎస్తేరు లాంటి బైబిలు వ్యక్తులు అట్టివారే. ఏ నక్షత్రాన పుట్టామనేది ప్రాముఖ్యం కాదు. కాని క్రిస్మస్ నక్షత్రాన్ని వెంబడిస్తే ప్రేమ, నీతి, పరిశుద్ధత, మంచి తండ్రిగా, తల్లిగా, నాయకుడి మాదిరిగా, మదర్ థెరిస్సావలె ప్రకాశిస్తారు. ‘కాంతి గల నక్షత్రాల్లారా, మీరందరూ ఆయనను స్తుతించండి (కీర్తనలు 148:3) అని కీర్తనకారులు పాడినారు. మార్గము తప్పి తిరుగు చుక్కలుగా మారరాదని బైబిలు హెచ్చరిస్తుంది. బైబిల్ ఎవరి చేతిలో ఎవరి హృదయంలో ఉండునో వారు ప్రకాశించే దివిటీలు. జాలరి నుండి శిష్యునిగా మారిన పేతురు ‘తెల్లవారి వేకువ చుక్క మీ హృదయాలలో ఉదయించే వరకు ఆ వాక్యం చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచితే మీకు మేలు’ (2 పేతురు 1:19) అని రాశారు. లోకం హత్యలతో, అత్యాచారాలతో, ధనాశతో, దుర్వ్యసనాలతో, అసమాధానంతో చీకటిలో ఉన్నప్పుడు, అట్టి జనం మధ్యకు మీరు జీవవాక్యాన్ని చేతపట్టుకొని, లోకమందు జ్యోతులవలె కనబడుతున్నారు (ఫిలిప్పీ 2:16) అని పరిశుద్ధ పౌలు తెలిపాడు. విద్యలో, నీతిలో, మాదిరిలో, ప్రావీణ్యతలో గొప్ప తారలుగా మనుషుల్ని మార్చాలి. అమెరికా అంతర్యుద్ధంలోనికి తమ పిల్లలను పంపేవారు, వారు చనిపోయినప్పుడు ఒక ఎర్రటి నక్షత్రం కట్టుకొనేవారట. అయితే ఒక తండ్రి, కుమారుని నడిపిస్తూ, రెండు ఎత్తైన కట్టడాల మధ్య ఆకాశంలో బంగారు వర్ణ నక్షత్రం చూచి కుమారుడు, ‘నాన్న! దేవుడు తన కుమారుని యుద్ధానికి పంపాడు’ అన్నాడు.‘ఈ స్టార్ వార్లో సిలువలో సాతాను ఓడిపోయాడు. యేసు మృత్యుంజయుుడై గెలిచాడు గనుక నేటికీ వెలుగుల క్రిస్మస్. ‘దేవుడు తానే మనలను ప్రేమించి మన పాపాలకు ప్రాయశ్చిత్తమై ఉండటానికి తన కుమారుని పంపాడు’. (1 యోహాను 4:10). ఇది సజీవ క్రిస్మస్ తార, నేటికీ ప్రకాశించి అనేకులకు దారి చూపుతోంది. ఈ లోకం శాశ్వతం కాదు. ధనం, గౌరవం, సంపద, ప్రఖ్యాతి ఎంత ఉన్నా, రెండవ రాకడ ఆసన్నమయే సమయంలో ఏవీ ఎన్నతగినవి కావు. యేసు మొదటి రాక క్రిస్మస్ పాపులను రక్షించడానికి ప్రభువు రెండవ రాకడ తను నమ్మిన పరిశుద్ధులను నిత్య రాజ్యంలోనికి తీసుకొని వెళ్లడానికి ఆకాశం నుండి నక్షత్రాలు రాలతాయి (మత్తయి 24: 29) అని ప్రభువే తెలిపాడు. ఎంత గొప్పవాడైనా బెత్లహేం నక్షత్రం వలె పని అయిన తరువాత కనుమరుగవుతుంది. ఇది సత్యం. క్రిస్మస్ నక్షత్రాలు, పండుగ సందడి, వ్యాపార సమయం అయిన తరువాత పాతబడి పనికి రాకపోవచ్చు గాని, కుటుంబం, కుమారులు, కుమార్తెలు, సత్ప్రవర్తన, పరిశుద్ధత, ఇతరులకు దారి చూపుతూ బతికితే... నిరంతరం నిలుచు నక్షత్రాలుగా ఉంటారు. ‘నీతిమంతులైతే తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు’ అదే నిత్య క్రిస్మస్ ఆనందం. – తంటిపూడి ప్రభాకరరావు -
నేడు ఆకాశంలో క్రిస్మస్ స్టార్
వాషింగ్టన్: నేటి రాత్రి ఆకాశంలో గొప్ప ఘటన సంభవించబోతోంది. దాదాపు 800 సంవత్సరాల తర్వాత మన సౌరకుటుంబంలోని శని, బృహస్పతి గ్రహాలు పక్కపక్కనే కనిపించబోతున్నాయి. సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో నైరుతి వైపు ఈ గ్రహాలు కనిపిస్తాయి. ఇలా రెండు గ్రహాలు చలికాలంలో ఓ చోట చేరితే దాన్ని ‘క్రిస్మస్ స్టార్’ అని పిలుస్తారు. ప్రస్తుతం దీనికి నాసా శాస్త్రవేత్తలు ‘క్రిస్మస్ స్టార్ ఆఫ్ 2020’ అని పేరు పెట్టారు. ఇలాంటి ఘటనను మళ్లీ చూడాలంటే మరో 60 సంవత్సరాలు ఆగాలని, 2080లో మళ్లీ కనిపిస్తుందని అంతరిక్ష శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గెలీలియో టెలిస్కోప్ కనుగొన్న 13 సంవత్సరాల తర్వాత, 1623లో జూపిటర్ చుట్టూ నాలుగు నక్షత్రాలను గుర్తించారు. వాటిని అప్పట్లో జూపిటర్ చందమామలుగానూ, శాటర్న్ వృత్తంగానూ గుర్తించారు. నాసా పేర్కొంది. ఇలాంటి ఓ ఘటన జరగడం గత 400 ఏళ్లలో ఇదే మొదటి సారి అని తెలిపారు. డిసెంబర్ 21కి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ రోజున ఉత్తరార్థగోళంలో పగలు అత్యంత తక్కువగానూ, దక్షిణార్థగోళంలో పగలు అత్యంత ఎక్కువ సమయం పాటు ఉండనుంది. -
400 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ అద్భుతం..
న్యూయార్క్ : సోమవారం(రేపు) ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రెండు పెద్ద గ్రహాలైన శని, బృహస్పతిలు చాలా దగ్గరగా, ఒకే వరుసలోనికి రానున్నాయి. దీన్నే ‘క్రిస్మస్ స్టార్’ అని పిలుస్తారు. ఇది అత్యంత అరుదుగా జరిగే సంఘటన. ఇక మళ్లీ 60 ఏళ్ల తర్వాతే ఇది జరుగుంది. అంటే 2080లో శని, బృహస్పతిలు చాలా దగ్గరగా, ఒకే వరుసలోకి వస్తారన్న మాట. ఇలాంటి ఘట్టం దాదాపు 400 ఏళ్ల తర్వాత చోటుచేసుకోబోతోందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శని, బృహస్పతి దగ్గరగా, ఒకే వరుసలోకి వచ్చే సంఘటన రాత్రి పూట జరిగి దాదాపు 800 ఏళ్లు అయిందని పేర్కొన్నారు. గెలీలియో టెలీస్కోప్ను కనిపెట్టిన 13 ఏళ్ల తర్వాత 1623లో ‘క్రిస్మస్ స్టార్’ ఆవిష్కృతం అయిందని అంటున్నారు. -
క్రిస్పీ కుకీస్.. ఆనందంగా తింటే బావుంటుందేమో
క్రిస్మస్ పండుగ వస్తోందంటే... స్టార్ వెలుగులు.. ప్రార్థనలు... బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం.. క్రిస్మస్ ట్రీని అలంకరించడం. శాంతాక్లాజ్ పిల్లలను ఆడించడం... ఎంత హడావుడో... పండగంటే పిల్లలకు ఏదో ఒకటి చేయాలిగా...అందుకే ఈ పండుగకి సరదాగా కుకీస్ చేసి...అందరూ ఆనందంగా తింటే బావుంటుందేమో కదా.. ప్రయత్నించి చూడండి... గోధుమ బిస్కెట్స్ కావలసినవి: గోధుమ పిండి – అర కప్పు; కరిగించిన నెయ్యి/ వెన్న – 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు – చిటికెడు; పంచదార/ బెల్లం పొడి – 2 టేబుల్ స్పూన్లు; వెనిలా ఎసెన్స్ – అర టీ స్పూను. తయారీ: ప్రెజర్ కుకర్ లేదా మందపాటి అడుగు ఉన్న పాత్ర తీసుకోవాలి ఒక పొరలాగ ఉప్పు లేదా ఇసుక వేసి, దాని మీద స్టాండు అమర్చాలి ముందుగా కుకర్ను పెద్ద మంట మీద పది నిమిషాలు వేడి చేయాలి ఒక పాత్రలోకి కరిగించిన నెయ్యి, పంచదార లేదా బెల్లం పొడి, వెనిలా ఎసెన్స్, ఉప్పు తీసుకుని బాగా కలపాలి టగోధుమ పిండి జత చేసి మరోమారు కలిపి, మూత పెట్టి, పది నిమిషాలు ఫ్రిజ్లో ఉంచాలి మిశ్రమాన్ని బయటకు తీసి, సమాన పరిమాణంలో ఉండలు చేసి చేతితో గుండ్రంగా అదమాలి (కావాలనుకుంటే ఫోర్క్ సహాయంతో డిజైన్ గీసుకోవచ్చు) అల్యూమినియం పాత్రకు నెయ్యి లేదా వెన్న పూయాలి తయారుచేసి ఉంచుకున్న కుకీలను ఇందులో దూరం దూరంగా ఉంచాలి మంట బాగా తగ్గించి, పదిహేను నిమిషాల తరవాత స్టౌ మీద నుంచి దించేయాలి పది నిమిషాల తరవాత కుకర్ మూత తీయాలి కుకీలను జాగ్రత్తగా బయటకు తీసి, గ్రిల్ వంటి దాని మీద జాగ్రత్తగా ఆరబెట్టాలి పూర్తిగా చల్లారిన తరవాత కుకీలను గాలిచొరని డబ్బాలో భద్రపరచాలి. క్యారట్ ఆపిల్ కుకీస్ కావలసినవి: మైదా పిండి – 2 కప్పులు; బేకింగ్ పౌడర్ – టీ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; అల్లం ముద్ద – టీ స్పూను; జాజి కాయ పొడి – చిటికెడు; బటర్ (ఉప్పు లేనిది) – ముప్పావు కప్పు; పంచదార – అర కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; బ్రౌన్ సుగర్ – పావు కప్పు; కోడి గుడ్డు – 1; వెనిలా ఎసెన్స్ – అర టీ స్పూను; క్యారట్ తురుము – కప్పు; ఆపిల్ తురుము – అర కప్పు. తయారీ: ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, అల్లం ముద్ద, దాల్చినచెక్క పొడి, జాజి కాయ పొడి వేసి బాగా కలపాలి మరో పాత్రలో బటర్ వేసి మెత్తగా అయ్యేలా గిలకొట్టాలి టపంచదార, బ్రౌన్ సుగర్ జత చేసి మరో రెండు నిమిసాల సేపు గిలకొట్టాలి కోడి గుడ్డు సొన జత చేసి మరో మారు గిలకొట్టాక, వెనిలా ఎసెన్స్ జత చేసి బాగా కలపాలి చివరగా మైదా పిండి మిశ్రమం జత చేసి నెమ్మదిగా గిలకొడుతూ మిశ్రమం మెత్తగా గట్టిగా వచ్చేలా చేయాలి రబ్బర్ స్పూన్తో కలుపుతూ క్యారట్ తురుము, ఆపిల్ తురుము కూడా జత చేసి మిశ్రమం అంతా బాగా కలిసేలా చేయాలి గుండ్రంగా కట్ చేసి, వేడి చేసి ఉంచుకున్న కుకర్లో ఉంచి సుమారు ఇరవై నిమిషాలు సన్నని మంట మీద ఉంచి, దించేయాలి చల్లారిన తరవాత ప్లేట్లోకి తీసుకుని, మరింత చల్లారాక గాలిచొరని డబ్బాలోకి తీసుకోవాలి. ఆపిల్ కొబ్బరి దాల్చిన చెక్క కుకీస్ కావలసినవి: ఆపిల్స్ – 3 (తొక్క తీసి సన్నగా తురమాలి); బాదం మీల్ – 2 కప్పులు (బాదం పప్పుల తొక్క తీయకుండా మిక్సీలో వేసి రవ్వలా వచ్చేలా చేయాలి); ఎండు కొబ్బరి తురుము – ఒక కప్పు; కోడి గుడ్లు – 3 (గిన్నెలో వేసి గిలకొట్టాలి); కొబ్బరి నూనె – 2 టీ స్పూన్లు; వెనిలా ఎసెన్స్ – 2 టీ స్పూన్లు; దాల్చిన చెక్క పొడి – టీ స్పూను. తయారీ: కుకర్ను ముందుగా వేడి చేసి ఉంచుకోవాలి టఆపిల్ తురుమును బ్లెండర్లో వేసి మెత్తగా చేయాలి ఒక పాత్రలో ఆల్మండ్ మీల్, దాల్చిన చెక్క పొడి, కొబ్బరి నూనె, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలపాలి ఆపిల్ గుజ్జు, ఎండు కొబ్బరి తురుము, ఉప్పు వేసి బాగా కలపాలి టకోడి గుడ్డు సొన కూడా జత చేయాలి కుకీ తయారు చేసుకునే పాత్ర మీద ఈ మిశ్రమాన్ని పోసి సమానంగా పరచాలి కుకర్లో ఉంచి సన్నని మంట మీద ఇరవై నిమిషాలు ఉంచి దించేయాలి బాగా చల్లారాక బయటకు తీసి ప్లేట్లో ఉంచి ఆరనివ్వాలి టగాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. పీనట్ బటర్ ఓట్మీల్ కుకీస్ కావలసినవి: పీనట్ బటర్ – అర కప్పు; బ్రౌన్ సుగర్ – అర కప్పు; ఓట్స్ – ఒకటిన్నర కప్పులకు కొద్దిగా తక్కువ; కోడి గుడ్డు – 1; బేకింగ్ సోడా – అర టీ స్పూను. తయారీ: చిన్న పాత్రలో పీనట్ బటర్, బ్రౌన్ సుగర్ వేసి బాగా కలపాలి కోడిగుడ్డు సొన జత చేయాలి టఓట్స్, బేకింగ్ సోడా జత చేసి క్రీమీగా అయ్యేవరకు బాగా కలపాలి కుకీస్ తయారు చేసుకునే పాత్రకు కొద్దిగా వెన్న పూయాలి టతయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని సమానంగా సద్దాలి వేడి చేసుకున్న కుకర్లో ఉంచి, సన్న మంట మీద పావు గంట తరవాత దించేయాలి చల్లారాక బయటకు తీసి, ప్లేట్లోకి తీసి, బాగా చల్లారాక గాలిచొరని పాత్రలోకి తీసుకుని నిల్వ చేయాలి. తేనె పెరుగు బిస్కెట్స్ కావలసినవి: తేనె – పావు కప్పు; మైదా – ఒకటిన్నర కప్పులు; ఉప్పు – టీ స్పూను; సాదా పెరుగు – ఒకటిన్నర కప్పులకు కొద్దిగా తక్కువ. తయారీ: ఒకపాత్రలో మైదా పిండి, ఉప్పు, తేనె వేసి బాగా కలపాలి పెరుగు జత చేసి ఫోర్క్తో ముద్దలా అయ్యేవరకు కలపాలి వెడల్పాటి గిన్నెలో పిండిని పొడిపొడిగా చల్లాలి టతయారుచేసి ఉంచుకున్న పిండి మిశ్రమాన్ని అర అంగుళం మందంగా వేసి మధ్యకు మడవాలి మరోసారి పొడి పిండి చల్లి మళ్లీ మధ్యకు మడవాలి బిస్కెట్ కటర్తో గుండ్రంగా కట్ చేయాలి టవీటిని పాత్రలో ఉంచి ముందుగా వేడి చేసిన కుకర్లో ఉంచి మూత పెట్టాలి మంట బాగా తగ్గించాలి టసుమారు పావు గంట తరవాత స్టౌ ఆపేయాలి అర గంట తరవాత కుకర్ మూత తీసి తయారైన బిస్కెట్లను మరో ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారిన తరవాత, గాలిచొరని డబ్బాలోకి తీసుకోవాలి. -
మానవుడై అవతరించిన రోజు
అత్యంత భక్తిశ్రద్ధలతో పారవశ్యంతో జరుపుకొనే పండుగ క్రిస్మస్. ప్రపంచంలోని క్రైస్తవులంతా మనస్ఫూర్తిగా సంతోషంతో జరుపుకునే సంబరం. వాక్యమైయున్న దేవుడు రక్తమాంసాలతో జన్మించి పుడమిని పులకింపచేసిన సమయం. కరోనా విలయతాండవం సృష్టించిన ఈ సంవత్సరంలో జరుపుకుంటున్న క్రిస్మస్ మరింత ధైర్యాన్ని, ఉత్సాహాన్ని అనుగ్రహిస్తుంది. క్రిస్మస్ మనకేం తెచ్చింది అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉత్పన్నం కావచ్చు. యేసు జననం జగతికి ఏమిచ్చింది అని ఒకసారి పరిశీలిస్తే నిస్సందేహంగా మనకు అపురూపమైన కానుకలను అందించింది. కానుకలు అందరూ నగదు రూపంలోనో, వస్తు రూపంలోనో ఇచ్చి పుచ్చుకుంటుంటారు. కానీ దేవాధిదేవుడు జగతిని, జనులను రక్షించుటకై పాపమెరుగని పరమపావన మూర్తియైన తానే బహుమతిగా ఈ లోకానికి వచ్చాడు. ఆదియందు వాక్యముండెను. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అనేది క్రీస్తును గూర్చిన నిర్వచనం. వాక్కు అంటే పలుకు. వాక్కు అనేది శక్తిగల మాటల సముదాయం. పెల్లుబికే ఆ మాటల సముదాయం భావాన్ని మోసుకొస్తుంది. వాక్కు శాశ్వతం, అనంతం, జీవదాయకం, సృష్టి కారకం. వాక్కులో అపారమైన జ్ఞానముంది. అదే వెలుగు, అదే వికాసం, విజ్ఞానం మరియు సమస్తం. బ్రహ్మాండమైన ఆ వాక్కే శరీరంతో లోకానికి వచ్చాడు. ఆయనే లోకరక్షకుడు క్రీస్తు. ఒక దైవజనుడు ఇలా అంటాడు. ఓ మనిషీ! ఏమి భాగ్యం నీది? ఉన్నతుడైన దేవుడు నీ ఎముకలో ఎముకగా, మాంసంలో మాంసంగా, మానవుడుగా, నీలా జన్మించాడు. యేసుక్రీస్తు అంటే ప్రేమ మరియు శాంతి. ఆ ప్రేమే ప్రాణం పోసుకుని ఆ పరలోకం నుండి మన కోసం ఇలకు దిగివచ్చింది. మనిషిగా జన్మించి మానవతకు క్రొత్త మార్గాన్ని చూపింది. అవధులు లేని ప్రేమగా, అంతములేని కరుణగా, అపురూపమైన వాత్సల్యముగా రూపుదాల్చి మనకోసం మన విమోచన కోసం పాప బంధకములనుండి విడిపించుట కోసం శ్రమలననుభవించింది. అమ్మలాలనను, తండ్రి బాధ్యతను, స్నేహితుని తోడును మనకు అందించింది. నిజమైన నిస్వార్థమైన ప్రేమను మనకు రూచి చూపించింది. ఈ లోకంలోని అగమ్య గోచరమైన బ్రతుకులకు కాంతిని పంచే వెలుగే క్రిస్మస్. బాధలలో వేదనతో నలిగిపోయిన జీవితాలకు, కష్టాలతో కన్నీళ్ళతో కృంగిపోయిన హృదయాలకు ఓదార్పునిచ్చేదే క్రిస్మస్. ఇబ్బందుల నుండి ఇరుకుల నుండి విడిపించి శాంతి నిచ్చేదే క్రిస్మస్. సమస్త మానవాళికీ శ్రావ్యమైన గళంతో శాంతి సందేశాన్నిచ్చేదే క్రిస్మస్. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి కంటికి వెలుగును, కాళ్ళకు మంచి మార్గాన్ని, నోటికి మంచి మాటను, హృదయానికి శాంతిని, మనిషికి మానవత్వాన్ని జగతికి రక్షణను తెచ్చింది క్రిస్మస్. క్రిస్మస్ అనే మాటకు క్రీస్తును ఆరాధించుట అని అర్థం. ఆ ఆరాధన హృదయాంతరంగాల నుండి పెల్లుబకాలి. జగతి పరమార్థాన్ని గ్రహించి బతకాలన్నా, నిజమైన ఆనందాన్ని మదిలోకి ఒంపుకోవాలన్నా ఘనుడైన క్రీస్తును ఆరాధించాలి. యోగ్యుడైన వానికి, అర్హత గలిగిన వ్యక్తికి ఆరాధనను అర్పించాలి. సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, ఆదిసంభూతుడు, అత్యున్నతుడు, ఆరాధనకు యోగ్యుడూ మన క్రీస్తే. యేసు జన్మించినప్పుడు ఓ అద్భుత సంఘటన జరిగింది. తూర్పు దేశపు జ్ఞానులు సుదూర ప్రయాణం చేసుకొంటూ మొదట ఝెరూషలేముకు ఆ తదుపరి దానికి దగ్గరలోనే ఉన్న బేత్లేహేముకు వెళ్ళారు. వాళ్ళు నక్షత్ర పయనాన్ని అంచనా వేయగల సామర్థ్యం గలవారు. ఆధ్యాత్మిక చింతన పరిపుష్టిగా ఉంది. ఎన్నో ఏండ్ల నుండి రక్షకుని ఆగమనం కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తున్న వారిలో వీరు కూడా ఉన్నారు. వారి ప్రాంతాలను, కుటుంబాలను, పనిపాటలకు కాసేపు ప్రక్కనపెట్టి దేవుణ్ణి చూడడానికి ప్రయాణం కట్టారు. అది అంత సులువైన ప్రయాణం కాకపోయినా మొక్కవోని దీక్షతో, పట్టుదలతో ప్రయాణం చేసి ఆఖరుకు చేరాల్సిన స్థానానికి చేరారు. మనసులు పులకించిపోయాయి. దైవదర్శనాన్ని పొందిన ఆ నేత్రాలు పావనమయ్యాయి. ధారలుగా కారుతున్న ఆనందబాష్పాలు అందుకు నిలువెత్తు నిదర్శనం. పాలబుగ్గల పసివాడు తల్లిఒడిలో పరవశించినట్టు ఆ జ్ఞానులు పరవశించిపోయారు. పసిబాలుడైన క్రీస్తును తదేకంగా చూస్తూ ఆయన పాదాలమీద పడి మనస్ఫూర్తిగా ఆరాధించారు. మనిషికి అంతకన్నా ఇంకేం కావాలి. విశాల విశ్వంలో అంతకన్నా మధురానుభూతి ఇంకేముంటుంది. రక్షకునికివ్వాలనుకున్న బహుమానాలను వారి పెట్టెలు తెరిచి ఆయన ముందు పరిచారు. ఒకాయన శుద్ధ సువర్ణాన్ని ఇచ్చాడు. మరొకడు అద్భుత సువాసన వెదజల్లే సాంబ్రాణిని, మరొక జ్ఞాని బోళమును ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయారు. క్రీస్తు పాదాల దగ్గర పెట్టబడిన ఆ కానుకలు క్రీస్తులోని మూడు ప్రాముఖ్య లక్షణాలను తెలుపుతున్నాయి. బంగారం పరిశుద్ధతకు, సాంబ్రాణి ఆరాధనకు, బోళము స్వస్థపరిచే గుణానికి సాదృశ్యం. మనిషి దేవుని ఆరాధించుటకు ప్రధాన కారణం ఆయనలో ఉన్న పరిశుద్ధతే. సమస్తమును నిర్వహించే దేవుడే అపవిత్రుడైతే పరిశుద్ధంగా బ్రతకడానికి మనిషికి ఆధారం ఎక్కడుంటుంది? మనిషి పూజలందుకొనే దేవుడు కచ్చితంగా పవిత్రుడే. నాలో పాపమున్నదని మీలో ఎవ్వరైనా స్ధాపించగలరా అని క్రీస్తు ప్రశ్నించాడు. జ్ఞానులు తెచ్చిన రెండవ కానుక సాంబ్రాణి. సువాసనను వెదజల్లుతూ చుట్టూ ఉన్న వాతావరణాన్ని సువాసనభరితం చేయగల సాంబ్రాణి క్రీస్తు ఆరాధనీయుడని తెలుపుతుంది. బోళములో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. క్రీస్తు మనలను స్వస్థపరచువాడు అనే సందేశాన్ని మూడవ కానుక తెలుపుతుంది. ప్రతియేటా క్రిస్మస్ను క్రైస్తవులంతా ఒకరోజు ప్రపంచవ్యాప్తంగా పండుగగా జరుపుకొంటునప్పటికీ క్రీస్తు ప్రేమతత్త్వంలో తేలియాడే నిజక్రైస్తవునికి ప్రతిరోజూ పండుగే. ప్రతిరోజూ క్రిస్మస్సే. తేజస్సులో అమరుడైనప్పటికీ మనుజాళిని ప్రేమించి ప్రతి ఒక్కరికీ దగ్గరగా వచ్చిన క్రీస్తును ఆరాధించడానికి ఏ ఒక్కరోజు చాలదు. ఆదిమ«ధ్యాంత రహితుడైన ఆ దివ్యమూర్తిని ఆరాధించడానికి జీవితకాలం సరిపోదు. దేవుడు చేసిన సృష్టి వైభవాన్ని తెలుసుకొనే ప్రక్రియలో ఎన్నో పరిశోధనలు కొన్ని శతాబ్దాల క్రిందటే ప్రారంభించబడ్డాయి. అయితే 1969లో ఓ అపూర్వ సంఘటన చోటుచేసుకుంది. ‘నాసా’కు చెందిన ముగ్గురు వ్యోమగాములు ఎంతో శ్రమించి ఎట్టకేలకు ‘అపోలో–11’ అనే రాకెట్ మీద ప్రయాణం చేసి చంద్రుని మీద కాలుమోపారు. మానవుడు సాధించిన ఓ గొప్ప కార్యంగా అది అభివర్ణించబడింది. అప్పటినుండి ఇప్పటి వరకు మరికొంతమంది చంద్రగ్రహంపై కాలుమోపి తమ పరిశోధనలను కొనసాగిస్తున్నారు. వారిలో జేమ్స్ ఇర్విన్ ఒకరు. చంద్రునిపై కాలు మోపిన తరువాత తనకు లభించిన విశిష్టమైన గౌరవాన్ని స్వీకరిస్తూ ప్రపంచం నివ్వెరపోయే విషయాన్ని ఇర్విన్ తెలియచేశాడు. ‘‘అశాశ్వతుడైన మానవుడు చంద్రుని మీద కాలుమోపడం కన్నా శాశ్వతుడైన దేవుడు మనిషిని ప్రేమించి ఈ భూమ్మీద కాలుమోపడం గొప్ప’’. అపుడు సృష్టికర్తయైన దేవుడు సృష్టిగా మారడం అన్ని అద్భుతాల కన్నా ఎంతో గొప్పది. పరమాత్ముడైన ప్రభువును ఆరాధించడానికి బలులు, అర్పణలు అవసరం లేదు. మంచి సమయాల కోసం వేచిచూడాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా మనస్సు తెరిచి ఆయన నామాన్ని స్మరించుకొంటూ భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే చాలు. జీవితం ధన్యమౌతుంది. ఒకసారి ఆధ్యాత్మిక చింతనతో నిండిన ఒక్క వ్యక్తి దేవుణ్ణి ‘నీవు ఎక్కడుంటావు’ అని అడిగాడట. దానికి దేవుడిచ్చిన జవాబు ‘నేను కట్టుకున్న ఆలయంలో ఉంటాను’. అదెక్కడుంది? ‘నీ హృదయమే నేను కట్టిన ఆలయం’. అపుడు దేవుడు మనిషి హృదయంలో నివసించాలనుకుంటున్నాడు. ఆయనకు హృదయంలో చోటివ్వడమే మానవ జీవిత పరమార్థం. నిండైన నీ హృదయంతో, మెండైన విశ్వాసంతో ఆయనను ఆరాధిస్తే చాలు. క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా మనుష్యులకు గుండెలనిండా ధైర్యాన్నిచ్చింది. కరోనా రక్కసి సమయంలో ప్రతి ఒక్కరమూ వ్యాక్సిన్ గూర్చిన శుభవార్త కోసం ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్నాం. ఒక ప్రమాదం నుండి బయటపడడం ఎలా అనే వార్త మనిషికి ధైర్యానిస్తుంది. భయపడకుడి ప్రజలందరికీ కలుగబోవు సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను అని దూత భయంతో వణికిపోతున్న గొర్రెల కాపరులకు తెలిపింది. వారు కేవలం భౌతిక సంబంధమైన చీకటిలో మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగానూ, మానసికంగానూ చీకటిలో ఉన్నారు. వారికి శుభవార్త అందింది. దేవుడు ఎప్పుడూ మనిషికి మేలు చేయువాడు. ఆయన స్వాభావికంగా మంచివాడు. మనుషులు మంచివారుగా నటిస్తారు. దేవునికి ఆ అవసరం ఉండదు. ఆయన ప్రతి ఒక్కరికీ మంచి చెయ్యాలనే ఆశిస్తున్నాడు. క్రీస్తు అంటే ధైర్యం. ఆయన ఆపదలో అండగా నిలిచే కొండ. అన్ని వేళల్లో ఆదుకునే రక్షణ దుర్గం. చెక్కుచెదరని ధీరత్వం. క్రీస్తు నీతో వుంటే నిశ్చింత, క్రీస్తు నీతో వుంటే దిగ్విజయం. క్రిస్మస్ జగతిలో జనులకందరికీ ధైర్యాన్నిచ్చింది. ఏ ఆటంకాన్నైనా.. అడ్డంకులనైనా అధిగమించే శక్తి నిచ్చింది. అడ్డుగోడలను పగలగొట్టే గుండెబలాన్నిచ్చింది. ముఖ్యంగా ఈ లోకంలో శత్రువు పన్నే కుయుక్తులను, కుతంత్రాలను ఛేదించే దుర్భేద్యమైన కోట గోడలను మన చుట్టూ నిర్మించింది. ఏ దుష్టశక్తులూ మనలను చుట్టుముట్టి అధైర్యపెట్టకుండా రక్షణ వలయాన్ని కవచాన్ని మనకు ఏర్పరిచింది. బైబిల్లో ఒక వాగ్దానం ఉంది. నీ ఎడమపక్కన వేయిమంది పడినను నీ కుడిపక్కన పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. అశేష ప్రజావాహినికి ఊతమందించే అద్భుత వాగ్దానమది. క్రీస్తు, క్రిస్మస్ గుండెకు కలిగించే ధైర్యం ఇంత గొప్పగానూ. శ్రేష్ఠముగానూ వుంటుంది అనేది నిర్వివాదంశము. క్రీస్తును మనస్ఫూర్తిగా ఆరాధించగలిగితే ప్రతి ప్రతికూల పరిస్థితినీ జయించగలిగే శక్తిని, గుండెధైర్యాన్ని, బలాన్ని మనలో నింపుతాడు. నమ్ముట నీ వశమైతే సమస్తమునూ సాధ్యమే అని సెలవిచ్చిన ఆ దేవాధిదేవుడు స్వయంగా తానే గుండెచెదరిన వారిని బాగు చేయుటకు, దీనులను విడిపించుటకు, ఈ లోకానికి దిగివచ్చాడు, ధైర్యాన్ని మనకు ఇచ్చాడు. కొంతమంది జీవితాలను పరిశీలిస్తే వారు చేయగలిగినవాటిని సైతం చేయలేకపోవడానికున్న కారణాలలో భయం ఒకటి. స్వేఛ్చా స్వాతంత్యాల్రతో జీవించాల్సిన మానవుడు భయం గుప్పిట్లో బతుకుతున్నాడు. ప్రపంచ ప్రఖ్యాత టీవీ వ్యాఖ్యాత ల్యారీ కింగ్ను ఒకామె ఇంటర్వ్యూ చేస్తుంది. అప్పటికే ఆయన అనేకమందిని తన వాగ్ధాటితో ఆకర్షించుకున్నాడు. సమాజాన్ని ప్రభావితం చేస్తున్న వారిని ఇంటర్వ్యూ చేశాడు. తాను అడగాలనుకున్న ఏ ప్రశ్ననైనా ధైర్యంతో అడిగేవాడు. సాహసోపేతమైన తన వృత్తిలో పాతిక సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఒక ప్రశ్న తన ముంగిట నిలువబడింది. ‘నీవు దేనికైనా భయపడతావా?’– ‘అవును. భయపడతాను!’– ‘దేనికి? మరణానికి!! నేను చచ్చిపోయాక ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు. ప్రతి రాత్రి ఇదే భయంతో గడుపుతాను’ అని అతడిచ్చిన జవాబుకు అందరూ ఆశ్చర్యపోయారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయానికి భయపడుతూనే ఉంటారు. వెంటాడుతున్న గతానికి, ఎదుర్కొనబోయే భవిష్యత్తును గూర్చి, వర్తమానంలో జరుగుచున్న ప్రతికూల పరిస్థితులను బట్టి, జీవితంలో చెలరేగే తుఫానులను బట్టి భయపడుచున్న మనిషికి చెక్కుచెదరని ధైర్యానివ్వడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ధైర్యంగా ఉంటే ప్రతి విషయంలోనూ ధైర్యంగా ఉండగలడనేది బైబిల్ సుబోధ. క్రిస్మస్ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. ఇది అక్షరాలా నిజం! జనులందరికీ అవగతమయిన సత్యం! క్రిస్మస్ తెచ్చిన ఆనందం, క్రీస్తులోని ఆనందం వర్ణనాతీతం. అనుభవించే కొలది అది ద్విగుణీకృతం. ఆస్వాదించే వారికి అమోఘం. అద్వితీయం. లోకంలో ఎన్నో ఆకర్షణలు ఆనందాలు, కానీ క్రిస్మస్ అందించిన ఆనందం శాశ్వతమైనది. మొదలేకాని, ముగింపులేనిది. ఎన్నటికీ ముగియనిదీ, నిన్ను వీడనిది. ప్రస్తుతకాలంలో అశాశ్వతమైన ఆనందాలకోసం వెంపర్లాడుతూ, మనుషులు లోకంలోని బురదను, మురికిని అంటించుకొంటున్నారు దానిని వదిలించుకోలేక, విడిపించుకోలేక, కడుక్కోలేక సతమతమవుతున్నారు. రక్షించే నాథుడు ఎవరా? కాపాడే కరుణామయుడు ఉన్నారా? అని అలమటిస్తూ నిజమైన ఆనందం కోసం వెదకుచున్నారు. నేటి కాలంలో ప్రాముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు, వింతైన పోకడలకు బానిసలవుతున్నారు. వాటి వెనుకనున్న కారణాలు విశ్లేషిస్తే.. ‘ఒత్తిడి అధిగమించాలని కొందరు, కిక్ కోసం కొందరు, ఫ్రెండ్సు కోసం కొందరు, మానసిక ఉల్లాసం కోసం మరికొందరు చెడు అలవాట్లకు చేరువవుతున్నారు. ప్రభుత్వాలకు, పోలీసులకు పెనుసవాళ్ళను మిగుల్చుతున్న డ్రగ్స్ మహమ్మారి సృష్టిస్తున్న బీభత్సం అంతాఇంతా కాదు. ఏదో సొంతం చేసుకోవాలన్న తపనతో ఉన్నవి కూడా కోల్పోతూ ఆఖరకు తీవ్ర నిరుత్సాహానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సెలబ్రెటీలు అని గుర్తింపు పొందినవారు కూడా ఈ విషయంలో అతీతులేమీకాదు. చాలా సంవత్సరాల క్రితం రస్సెల్ అనే ఒక సంగీత కళాకారుడు ఒక ప్రాంతంలో కచేరీ నిర్వహించాడు. వందల డాలర్లు వెచ్చించి అతడు వాయించే సంగీత సమ్మేళనాన్ని ఆస్వాదించడానికి సంగీత ప్రియులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆ రాత్రి అతడు వాయించిన సంగీతం అనేకమందిని ఉర్రూతలూగించింది. ఆ సంగీత విభావరిలో అతడు ఒక పాటను ఆలపించాడు. ‘విచారం వలన ఒరిగేదేమిటి? దుఃఖం వలన వచ్చే ప్రయోజనమేమిటి? విచారాన్ని దుఃఖాన్ని సమాధి చేసి ఆనందంగా బతికేయి’ అనేది ఆ పాట సారాంశం. అర్ధరాత్రివరకూ కొనసాగిన ఆ సంగీత విభావరి ముగిశాక అందరూ తమ ఇళ్ళకు చేరుకున్నారు. మరుసటి ఉదయం వార్తాపత్రికలలో మొదటి పేజీలో ముద్రితమైన ఓ చేదువార్త అనేకులను ఆశ్చర్యపరిచింది. గతరాత్రంతా తన సంగీతంతో ప్రజలను ఉర్రూతలూగించిన రస్సెల్ ఆత్మహత్మ చేసుకున్నాడు. దుఃఖాన్ని సమాధి చేయండి అని పిలుపిచ్చిన వ్యక్తి తానెందుకు ఆ పని చేయలేకపోయాడు అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలోనూ మెదిలింది. నిజమైన ఆనందం డబ్బులో లేదు. పేరు ప్రఖ్యాతులు సంపాదించండంలో ఉండదు. భౌతిక సంబంధమైన భోగభాగ్యాలలో ఆనందం ఆనవాళ్ళు లభించవు. కాని పరమాత్మునికి మనసులో చోటివ్వడం ద్వారా స్వచ్ఛమైన ఆనందాన్ని అనుభవించగలము. కనులు తెరిచి నిజమైన కాంతి కోసం అన్వేషిస్తే హృదయాన్ని నిజమైన దేవునికి అర్పించి విలువైన ఆనందాన్ని సొంతం చేసుకుంటే అంతకన్నా పరమార్థం వేరే వుండదు. ఆ జన్మ ధన్యం, ఆ పుట్టుక సఫలం. క్రిస్మస్ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. నిత్యనూతనమైన జీవాన్ని అందులో నింపింది. సర్వకాల సర్వావస్థలయందునూ తొణికిసలాడే సంతోషాన్ని నిండుగా నింపింది. ఓ మంచి ఉద్యోగం, చుట్టూ ఇరవై మంది స్నేహితులు, రోజుకు రెండు సినిమాలు షికార్లతో బిజీబిజీగా ఉంటూ జీవితాన్నంతా ఆనందమయం చేసుకోవాలనుకున్న ఓ యువకుడు విజయవాడలో ఉండేవాడు. జీవితాన్నంతా పరిపూర్ణంగా ఆస్వాదించాలన్న లక్ష్యంతో ఏది చేయడానికైనా సిద్ధపడ్డాడు. ప్రతి రాత్రి రెండు దాటాకా ఇంటికి వెళ్ళడం, మానసిక ప్రశాంతత కోసం తనకు తోచినవన్నీ చేసేయడం. ఎందులో వెదకినా ఏదో వెలితి, ఇంకా ఏదో కావాలన్న తపన, నేనేదో మిస్సవుతున్నానన్న భావన తనను కృంగదీయడం ప్రారంభించాయి. మానసిక ఉల్లాసం కోసం తప్పుడు మార్గాల్లో తిరిగి జీవితం మీద నిరాసక్తతను పెంచుకొని ఒకరోజు ప్రకాశం బ్యారేజ్ మీద నుండి నదిలోనికి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆ రోజుల్లో విజయవాడలో అక్కడే ఆత్మహత్యలు ఎక్కువగా జరిగేవి. ఇదే చివరిరోజు అని నిర్ణయించుకొని ఒక సాయంకాలం చావును ఎదుర్కోవడానికి వడివడిగా వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తుకు సంబంధించిన శుభవార్త ఆయనకు అందింది. ‘ప్రయాసపడి భారం మోసుకొనుచున్న జనులారా! నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును’ అని క్రీస్తు ప్రభువు చెప్పిన మాటను కలిగియున్న పత్రిక అందింది. ఆ ఒక్కమాట తన జీవితాన్ని మార్చింది. ఇంతవరకూ ఎవ్వరూ ఇవ్వలేని ఆనందం, ఎక్కడా దొరకని సంతృప్తి దేవునిలో దొరికింది. అదే అఖరిరోజుగా చేసుకోవాలనుకున్న ఆయన గతించిన నాలుగు దశాబ్దాల నుండి దేవుని సేవలో కొనసాగుతున్నారు. ఆయనే మా తండ్రిగారైన విజయకుమార్గారు. ప్రపంచ కుబేరుడైన రాక్ఫెల్లర్ ఒక సందర్భంలో ఇలా అంటాడు. ‘నేను కోట్లు కూడబెట్టాను. అవి నాకు సంతోషాన్ని ఇవ్వట్లేదు’. ప్రపంచ వ్యాపారవేత్తలో అగ్రగణ్యుడుగా, జీవితంలో ఇతనికంటూ లోటు ఏమీ లేదనిపించుకున్న ఓ కుబేరుడు ఇలాంటి వ్యాఖ్య చేయడం ఆశ్చర్యమైనప్పటికీ, అది వాస్తవం. ‘నువ్వు వర్షంలో ఎందుకు ఏడుస్తున్నావు’ అని అడిగితే ‘ప్రపంచం నా నవ్వునే చూడాలి గాని నేను కూడా అందరి వలే ఏడుస్తున్నాని తెలియకూడదు’ అని జవాబిచ్చిన హాస్యనటుడు చార్లీ చాప్లిన్ గూర్చి తెలియనివారెవరు. ‘నా కళ్ళలోనుండి కారే కన్నీళ్ళు నేను చేసే కామెడీని నిర్వీర్యం చేస్తాయ’ని చెప్పి ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. నిజమైన ఆనందం బయటనుండి రాదు. భౌతిక వనరులు ఆనందాన్ని మోసుకురాలేవు. అది స్వచ్ఛమైన హృదయంలో నుండే రావాలి. అటువంటి ఆనందం అందరికీ ప్రయోజనాన్ని చేకూర్చుతుంది. క్రిస్మస్ జీవితానికి పరమార్థాన్ని ఇచ్చింది. జీవితానికి అర్థాన్ని, పరమారాధనను అన్వేషించాల్సిన బాధ్యత మనకు వుంది. ఏదో పుట్టాము. కాలాన్ని ఇష్టం వచ్చినట్లు గడిపేసి చనిపోదాం అనుకోవడం కాదు, జీవితమంటే. జీవితానికి వున్న అర్థాన్ని మొదట మనం కనుగోనాలి. పరమార్థాన్ని గ్రహించాలి. జీవితం ఎంత విలువైనదో దాని ఆవశ్యకత ఎమిటో తెలుసుకొని మెలగాలి. నువ్వెందుకు బతుకుతున్నావు? అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఉండాలి. ఒక తత్త్వవేత్త తనకు తెలిసిన వ్యక్తులందరికీ ఒక ప్రశ్నతో కూడిన ఉత్తరం వ్రాశాడు. తన స్నేహితులలో చాలామంది ఆస్తిపరులు, మరికొందరు విస్తారమైన జ్ఞానాన్ని ఆర్జించినవారు, మరికొందరు సమాజంలో అధికారాన్ని, పలుకుబడిని కలిగియున్నవారు. ఉత్తరాలను అందుకొన్నవారు తిరిగి ప్రత్యుత్తరం ఇచ్చారు. వారిలో ఎక్కువ శాతం మంది ‘మేం ఎందుకు ఈ భూమ్మీద బతుకుచున్నామో మాకు ఇంకా అర్థం కాలేదు’ అని, ‘దాని గురించిన ఆలోచన చేయాల్సిన తీరిక మాకు లేదు’ అని, ‘నీకు తెలిస్తే మాకు కూడా చెప్పొచ్చుగా’ అని రకరకాలుగా జవాబులు పంపించారు. విచారించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో చాలామందికి తామెందుకు బతుకుతున్నాం అనే ప్రశ్నకు జవాబు తెలియకుండా బతికేస్తున్నారు. మనిషి ఎందుకు జీవిస్తున్నాడు? మానవ జీవిత పరమార్థం తెలుసుకోవాలంటే మనిషిని కలుగచేసిన దేవుని దగ్గరకు రావాలి. ఒక వస్తువును తయారు చేసిన వ్యక్తి మాత్రమే దానిని తయారు చేయడంలో అతని ఉద్దేశాన్ని కచ్చితంగా చెప్పగలడు. ఈ విశ్వంలో మానవ జన్మ చాలా ప్రత్యేకమైనది. సృష్టికర్త మనలను సృజించినపుడు ఆయన స్వరూపములో మనలను సృజించాడు అని బైబిల్ తెలియచేస్తుంది. ఆయన రూపంలో ఉన్న మనం ఆయన లోకానికి వారధులం. దేవుని సంకల్పాలను నెరవేర్చుటకై నియమించబడిన దేవుని ప్రతినిధులం. యేసుక్రీస్తు మానవునిగా ఈ లోకానికి ఏతెంచి ఓ అద్భుతమైన జీవితాన్ని జీవించి ప్రతి ఒక్కరికీ అన్ని విషయాలలో మాదిరి ఉంచారు. పశువులతొట్టెలో పవళించి ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నానన్న సందేశాన్ని లోకానికి ఇచ్చారు. జగతిలో నిండివున్న అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చారు. దారీ తెన్నూ కనబడక దిశనిర్దేశం లేని జనులకు మార్గమయ్యారు. ఆయనే మార్గముగా, సత్యముగా, జీవముగా జగతిలో అవతరించారు. అగమ్యగోచరమైన బతుకులలో నడి సంద్రాన చిక్కి అల్లాడుతున్న జీవితాలలో నావను నడిపే నావికుడిగా భువిలో జన్మించారు. మనందరి జీవితాలకు ఒక గొప్ప పరమార్థాన్ని కలిగించారు. ‘నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు’ అనే జీవన సత్యాన్ని కేవలం బోధించుట మాత్రమే కాకుండా, క్రియల్లో ఋజువుచేసి ప్రపంచాన్ని ప్రేమమయం చేశాడు యేసుక్రీస్తు. ఓ పరమార్థంతో బతికేవాడు ఎప్పటికీ ఓడిపోడు. ఏ విషయంలోనూ నిరుత్సాహం చెందడు. క్రిస్మస్ రక్షణ మార్గాన్ని ప్రబోధించింది. ఏ భేదమూ లేదు. అందరూ పాపము చేసి దేవుడనుగ్రహించుచున్న మహిమను పొందలేకపోవుచున్నారని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. ఒక నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తికి ఎలా రక్షణ కావాలో, కాలిపోతున్న ఇంటిలో చిక్కుకున్న వ్యక్తికి రక్షణ ఎంత అవసరమో, ఒక గనిలో చిక్కుకుపోయి మరణానికి చేరువవుతున్న వారికి రక్షణ ఎంత అవసరమో పాపంలో జీవిస్తూ శాశ్వత మరణానికి చేరువవుతున్న మనిషికి ఆత్మరక్షణ అంతకన్నా ఎక్కువ అవసరం. యేసు అనే పేరుకు రక్షకుడు అని అర్ధం. ఆయన ప్రపంచాన్ని పాపము నుంచి విడిపించడానికి వచ్చి తన రక్తమును సిలువలో చిందించి విశ్వసించిన ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహిస్తున్నారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు (లూకా 2:11). మానవాళిని రక్షించి, తన దివ్యకాంతులతో ప్రతిఒక్కరినీ నింపి నిత్యజీవనానికి వారసులుగా చేయాలన్నదే దేవుని ఆకాంక్ష. రక్షకుని ఆగమనంతో ఎన్నో ఏళ్లుగా చూస్తున్న మానవుని ఎదురుచూపులు ఫలించాయి. ఒక పిల్లవాడు తండ్రి ఫోటో చూస్తూ, మనసు నిండా గొప్ప ఆశతో ‘మా నాన్న ఆ ఫోటోలోనుండి బయటకు వస్తే బాగుండును’ అని అనుకున్నాడు. సరిగ్గా ఇలాగే మానవులంతా ఆశించారు. ఆశిస్తున్నారు కూడా. కుల మత భాషా వర్గ విభేదాల్లేకుండా మనుష్యులంతా దేవుణ్ణి మరింత సన్నిహితం చేసుకోవాలని తపించారు. ఆయన ఎలా ఉంటాడో చూసి, ఆయనతో ముచ్చటించాలని ఆశపడ్డారు. సరిగ్గా రెండువేల సంవత్సరాల క్రితం దేవుడే మనిషిగా దిగివచ్చాడు. నింగి నేల ఏకమయ్యాయి. ఈ భూమికి నడిబొడ్డున ఉన్న బేత్లేహేము అనే కుగ్రామంలో రక్షకుడు వెలిశాడు. దేవుడు మానవ శరీరం ధరించుకొని వచ్చాడు. వాస్తవ రూపం దాల్చి మనిషికి గోచరుడయ్యాడు. ఎక్కడో రాజభవనంలో పుట్టియుంటే అందరికీ అందుబాటులో ఉండేవాడు కాడు గనుకనే పశువుల తొట్టెలో జన్మించాడు. అతి సామాన్యులైన గొర్రెల కాపరులు మొదట వెళ్ళి రక్షకుని చూశారు. భక్తి పారవశ్యంతో నింపబడి గుండెల నిండా నిరీక్షణతో ముందుకు సాగిపోయారు. క్రీస్తు్త ప్రబోధించిన రక్షణ మార్గం ఈ లోకానికీ ఆ పరలోకానికీ చెందినది. మనుష్యుల జీవిత స్వరూపాన్ని దేవుని మార్గంలోకి ఆ పరలోకానికీ చెందినది. మనుష్యుల జీవిత స్వరూపాన్ని దేవుని మార్గంలోకి మరలించే రక్షణ మార్గమిది నీకు నీవుగా జీవించే జీవితంలో నీ కోసం నువ్వు వెదికే రక్షణను క్రిస్మస్ నీకు అందించింది. శాపాలనుండి పాపాలనుండి విడుదలను పొందే రక్షణ మార్గన్ని క్రిస్మస్ ప్రబోధించింది. చీకటి దారుల్లోకి మరలి భ్రష్టత్వంచెందే మనుష్యులను నిజమైన రక్షణ మార్గంలోనికి తరలి రమ్మని క్రిస్మస్ ప్రబోధించింది. క్రీస్తుతో సహవాసం కలిగి వుండటం, ఆయనకు హృదయాన్ని అర్పించడం ఆ అద్వితీయుని ఆరాధించడం, అయన మార్గంలో నడవడం, ఆయన బోధలను ప్రచురం చేయడం, ఆయన కోసం జీవించడమే మనం చేయవలసిన పని. ఈ సంవత్సరం కరోనా వైరస్ ప్రపంచంలో విషాదాన్ని నింపింది. ఎటుచూసినా ఏం జరుగబోతుందన్న భయంతో మనుష్యులు గతించిన కొన్ని నెలల నుండి బతుకును వెళ్ళదీస్తున్నారు. మనిషి ప్రాణం కన్నా గొప్పది ఏదీ లేదని ఋజువైంది. మన ఉద్యోగాలు, ప్రయాణాలు, విహారాలు, వ్యాపారాలు ఏవీ మన బతుకుల కన్నా గొప్పవి కావని తేలిపోయింది. కొన్ని కొన్ని సందర్భాలలో మనిషి నిశ్చేష్టుడుగా నిలువబడడం తప్ప మరేమీ చేయలేడనే సత్యం బహిర్గతమయ్యింది. చాలామంది ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి. తమ వారిని కోల్పోయి విలపిస్తున్న వారు అనేకులున్నారు. జీవితం చాలా భారంగా మారినందువలన ప్రతిరోజూ దుఃఖంతో బతకాల్సిన పరిస్థితిలో చాలామంది జీవిస్తున్నారు. అయితే ఈ క్రిస్మస్ ప్రతి ఒక్కరికీ పరిస్థితులను ఎదుర్కొనగలిగే ధైర్యమును ప్రసాదించాలని, దేవుని వెలుగు ప్రతి ఒక్కరి హృదయంలో ప్రకాశించుట ద్వారా వెలుగులో ప్రజలంతా నడవాలని కోరుకుంటూ, సమసమాజ నిర్మాణంలో మనమంతా పాలిభాగస్తులమై సాగిపోవాలని ఆశిస్తున్నాను. సాక్షి పాఠకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. డా. జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
అందాల తారల క్రిస్మస్ గీతాలు
డిసెంబర్ మాసం కోసం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఎదురు చూస్తూ ఉంటారు. రంజాన్ మాసంలాగే నెలరోజుల నుంచే వేడుకల కోసం సిద్ధపడుతుంటారు. చర్చీలన్నీ ప్రత్యేక ప్రార్థన గీతాలతో మార్మోగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా యువతీ యువకులు సంగీత వాయిద్యాలతో ‘క్రిస్మస్ క్యారల్స్’ పేరుతో ఇంటింటికీ తిరిగి పాటలు పాడుతారు. ‘హ్యాపీ క్రిస్మస్! మెరీ క్రిస్మస్!’ అంటూ జింగిల్ బెల్స్లా ప్రతిధ్వనిస్తుంటారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా చెబుతారు. వాతావరణమంతా క్రిస్మస్ గుబాళింపులతో చలికాలపు రాత్రులు ఆహ్లాదకరంగా ఉంటాయి. ధనిక దేశాలు ఉత్సవాలను ఎంత ఆడంబరంగా జరుపుకున్నా, భారతదేశంలోని దళితవాడలు కూడా ఉన్నంతలో ఘనంగానే పండుగ జరుపుకుంటాయి. తమ తమ పేటల ముందు పోటీలు పడుతూ పెద్ద పెద్ద నక్షత్రాలు అలంకరిస్తారు. వాటి ప్రభలు నలువైపులా ధగధగలాడుతూ ఉంటాయి. ఈ సంబరాలు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కన్నుల పండుగలా కనిపిస్తుంది. క్రిస్మస్ అనగానే ఎవరికైనా ముందు గుర్తుకొచ్చేది పాటలు. విశ్వమంతా క్రిస్మస్ జరుపుకునే రోజుల్లో వారి వారి భాషల్లో హుషారుగా పాటలు పాడుకుంటారు. పారవశ్యానికి లోనవుతారు. తెలుగులో కూడా గొప్ప క్రిస్మస్ సాహిత్యం ఉంది. ఏ మతానికైనా సాహిత్యమే ప్రాణాధారం. అవి భజనలు అయినా, స్తుతి గీతాలైనా భక్తుల్ని, శ్రోతల్ని ఆకట్టుకుంటాయి. క్రైస్తవమతం తెలుగు ప్రాంతాల్లో పాదం మోపాక ఇక్కడి భాష సంస్కృతులతో, సంగీతాలతో మేళవించిన ‘ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు’ ఆవిర్భవించాయి. ఇప్పుడు కొత్తగా తెలంగాణా ఏర్పడ్డాక ‘ఆంధ్ర’ శబ్దానికి బదులు, ‘తెలుగు క్రై స్తవ కీర్తనలు’ అని పేరు మార్చుకున్నారు. అయితే తొలినాటి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గ్రంథాన్ని 1866లో ప్రథమ విదేశీ తెలుగు వాగ్గేయకారుడు విలియం డాసన్ ప్రచురించాడు. అతడు అచ్చం పదహారణాల తెలుగువాడిలా వేషంకట్టి, కాళ్ళకు గజ్జెలు కట్టుకొని చిడతలు వాయిస్తూ భక్తి పారవశ్యంలో శ్రీకాకుళం వీధుల్లో తన స్వీయ సంకీర్తనలు పాడేవాడు. మచ్చుకి ఒక పాట వినండి. అతడి భాషా పటిమ మనల్ని అబ్బురపరుస్తుంది. విలియం డాసన్.78వ కీర్తన. పల్లవి: యేసు భజనయే మనలను ఆ సుగతికి దీయు – జనులారా దాస జనులు జేయు, పలు దోసములు మోయు చరణం: అక్షయ కరుణేక్ష భువన రక్షణ ఖల శిక్షా ధ్యక్ష బుధ పక్ష కృత మోక్షమను దీక్షన్ రెవరెండ్ విలియం డాసన్ విదేశీయుడైనప్పటికీ ఇతడి శబ్దాలంకార ప్రావీణ్యం ఆశ్చర్యపరుస్తుంది. నమ్మశక్యం కాని నిజమేమిటంటే ఇతడే తొలి తెలుగు క్రైస్తవ కీర్తనకారుడు. ఈయన తర్వాతే పురుషోత్తము చౌధరి డాసన్ దొరతో కలిసి ఎన్నో కీర్తనలు రాయడం గమనించాల్సిన అంశం. ఇద్దరూ సమకాలీనులే. అయితే, ఇక్కడ మరో విశేషం చెప్పుకోవాలి. ‘చౌధరి’ కులవాచకం కాదు. ‘చౌ’ అంటే æనాలుగు. ‘ధరి’ అంటే భూమి. నాలుగు పరగణాల నేలకు అధిపతిని ఉత్తరభారతంలో ‘చౌధరి’ అని పిలుస్తారు. ఉదా: బాబూ ఖాన్ చౌధరి, సలీల్ చౌధరి. అయితే పురుషోత్తముడు బెంగాలీ బ్రాహ్మడు. తెలుగువాడు కాదు. ఒడిశాకు వలస వచ్చినవాడు. బహుభాషా కోవిదుడు. క్రీస్తు భక్తుడు. ఆ తరువాత కాలంలో 1893లో విలియం డాసన్తో కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం తేవడంలో కీలక పాత్ర నిర్వహించాడు. ∙∙ ఇప్పటి ఆధునిక సంగీతపు హోరులో పాటల భావం సరిగా వినిపించడంలేదు. పాత కాలంలోనైతే క్రీస్తు జయంతి సందర్భంగా ఏ చర్చిలో విన్నా తెలుగు కీర్తనలు వినబడుతూ ఉండేవి. (109) ఎన్. డీ. ఏబెల్ గారు రచించిన ఈ కీర్తన ఎంతో ప్రసిద్ధమైనది. ‘చింత లేదిక యేసు పుట్టెను వింతగను బెత్లేహమందున చెంత జేరను రండి సర్వజనాంగామా సంతస మొందుమా’ బిలహరి రాగంలో త్రిపుట తాళంలో శాస్త్రీయంగా పాడుకునే ఈ కీర్తన ఈనాటికీ చెక్కు చెదరలేదు. చెవులకు ఇంపు కలిగించడం మానలేదు. అలాంటిదే మరోగీతం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల లోనిదే, వరుస సంఖ్య 112. ‘రక్షకుండుదయించి నాడట – మన కొరకు పరమ రక్షకుండుదయించినాడట రక్షకుండుదయించినాడు – రారె గొల్ల బోయలార తక్షణమే బోయిమనని రీక్షణ ఫల మొందుదము చ: దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దేవుడగు యెహావా మన దిక్కుచేరి చూచినాడు’ మధ్యమావతి రాగంలోఅట తాళంలో పుట్టిన ఈ ప్రఖ్యాత క్రిస్మస్ కీర్తనకారుడు పందొమ్మిదో శతాబ్దపు మోచర్ల రాఘవయ్య. మరో ప్రసిద్ధ క్రీస్తు జనన విశేష గీతాన్ని (121) కొమ్ము కృప రాసింది. ‘శ్రీ యేసుండు జన్మించె రేయిలో– నేడు పాయక బెత్లేహేము యూరిలో కన్నియ మరియమ్మ గర్భమందున– నిమ్మాను యేలనెడి నామమందున.’ ఈ విఖ్యాత గీతం కర్ణాటక ముఖారి రాగంలోనూ అట తాళంలోనూ లయాన్వితంగా ఉంటుంది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో ఇద్దరు ముగ్గురు స్త్రీ కీర్తనకారులుండడం గమనించవలసిన అంశం. ఒకరు పైగీతం రాసిన కొమ్ము కృప. మరొకరు వేశపోగు గుల్బానమ్మ (గుల్+బానో+అమ్మ). పరిశోధన దృష్టితో పరిశీలిస్తే మొట్టమొదటి క్రైౖస్తవకీర్తన రాసిన తొలి తెలుగు క్రైౖస్తవకీర్తనకారిణి వేశపోగు గుల్బానమ్మగా గుర్తించాలి. ఇక మూడవ గీత రచయిత్రి పిల్లి విజయ చార్లెస్. ఈమె పేరు ఈ మధ్యనే పరిష్కరణ ప్రతిలో చేర్చారు. ∙∙ క్రైౖస్తవమతం లేదా మార్గం తెలుగు ప్రాంతాల్లో ప్రవేశించిన తరువాత 1746లో బెంజిమన్ షుల్జ్ ‘నూరు జ్ఞాన వచనాలు’ అనే తొలి తెలుగు క్రైౖ స్తవ పుస్తకం ప్రచురించాడు. ఇదే తెలుగులో అచ్చయిన మొదటి గ్రంథం. చాలాకాలం అజ్ఞాతంగా ఉండిపోయింది. కొన్ని శతాబ్దాల తరువాత వాసిరెడ్డి పద్మ, సన్నిధానం నరసింహ శర్మ (సేకరణకర్త), ఎండ్లూరి సుధాకర్ సంపాదకత్వంలో పునర్ముద్రణ పొందింది. 2006లో ఈ గ్రంథాన్ని ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డిగారు రాజమండ్రి సమీపంలో ఉండే మధురపూడి విమానాశ్రయంలో ఆవిష్కరించారు. సాహిత్య చరిత్రలో అదొక మరపురాని సంఘటన.ఈ గ్రంథాన్ని కె.ఎన్. వెస్లీ ప్రచురించడం విశేషం. జర్మన్ సౌవార్తికుడు (మిషనరీ) బెంజిమన్ షుల్జ్, ఇద్దరు తెలుగు స్వర్ణకారుల చేత అచ్చులు పోయించి ‘నూరుజ్ఞాన వచనాలు’ జర్మనీ దేశంలో ప్రచురించాడు. అప్పటికింకా ప్రెస్ రాలేదు, ‘వావిళ్ళ’వారు కూడా పుట్టనేలేదు. ఈక్రమంలో విలియం కేరీ అనే మరో సౌవార్తికుడు1818లో మొట్టమొదటిసారి ‘పరిశుద్ధ గ్రంథం’ పేరుతో తెలుగు బైబిల్ తీసుకువచ్చాడు. ఆ తరువాత చాలా బైబిళ్ళు తర్జుమా చేయబడ్డాయి. ఈనాటికీ ఎంత పేద క్రైస్తవుల ఇంట్లోనైనా ఆంధ్ర క్రైౖ స్తవ కీర్తనల పుస్తకం, తెలుగు బైబిల్ ఖచ్చితంగా ఉంటాయి. ఇవే తమ ఆస్తులుగా ఆ విశ్వాసులు భావిస్తూ ఉంటారు. ∙∙ ఎందరో గీతరచయితలు అజారమరమైన కీర్తనలు రచించి ఆంధ్ర క్రైౖ స్తవ కీర్తనలకు తెలుగు శోభను సంతరించారు. కథోలిక (కాథలిక్) గీతాలు కూడా విశేష ప్రాముఖ్యాన్ని పొందాయి. క్రిస్మస్ గీతాల వస్తురూపాలన్నీ క్రీస్తు జన్మదిన విశేషాల మీదే ఆధారపడి ఉంటాయి. అట్లా అని ఇతర ప్రక్రియలు లేవా అంటే చాలానే ఉన్నాయి. తెలుగు క్రైౖ స్తవ సాహిత్యానికి మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రబంధాలు, కావ్యాలు, నాటక నాటికలు, గేయ మాలికలు ఉన్నాయి. చాలామందికి తెలియని విషయం గుర్రం జాషువ 1921లో ‘చిదానంద ప్రభాతము’ అనే క్రిస్మస్ నాటకం సంప్రదాయ పద్ధతిలో రాశాడు.’క్రీస్తు చరిత్ర’ (1964) అనే కావ్యం కూడా వెలువరించాడు. ఈ కావ్యానికి 1965లో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. అటు నాటకానికి, ఇటు కావ్యానికి దళిత క్రై స్తవుడిగా జాషువాయే ‘ఆదికవి’ అనడంలో అనౌచిత్యం లేదు. మళ్లీ క్రిస్మస్ గీతాల దగ్గరికి వస్తే తొలినాటి పాటలన్నీ జర్మన్లోంచో, ఆంగ్లంలోంచో అనువాదం చేసుకున్నవే. వీటి స్వరగతులు కూడా యథాతథంగా ఉంటాయి. అందరికీ తెలిసిన ఈ ఉభయ భాషల గీతం పరిశీలించండి. "Silent night, ho-ly night All is calm, all is bright Round you virgin mother and child Holy infant so tender and mild Sleep in heavenly peace" ‘శుద్ధ రాత్రి! సద్దణంగ నందరు నిద్రపోవ శుద్ధ దంపతులే మేల్కొనంగా బరిశుద్ధుడౌ బాలకుడా! దివ్య నిద్ర పోమ్మా! దివ్య నిద్ర పోమ్మా!! ఈ ప్రపంచ ప్రసిద్ధి పొందిన గీతాన్ని అన్ని ఖండాల ప్రజలు తమ తమ భాషల్లో భావ గాంభీర్యంతో, ఏక కంఠంతో పియానో శ్రుతులతో అత్యంత ప్రేమగా పాడుకుంటారు. క్రిస్మస్ రోజుల్లో ఏ క్రైౖస్తవ గృహాన్ని సందర్శించినా సందడే సందడి. అతిథులతో ఆత్మీయులతో, రకరకాల కేకు రుచులతో పిల్లలూ పెద్దలు క్రిస్మస్ తాతలతో కేరింతలు కొడుతూ ఉంటారు. బాలక్రీస్తు గీతాలకు తన్మయులవుతారు. ఆకాశం రంగులీనుతూ ధగధగా మెరిసిపోతున్నపుడు ఎక్కడి నుంచో ‘నడిపించు నా నావ’, ‘మార్గము చూపుము ఇంటికి/నా తండ్రి ఇంటికి’ లాంటి పాటలు రాసిన ప్రసిద్ధ గీతరచయిత రెవ.డా.ఎ.బి మాసిలామణిగారి’ అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో/ అవతార మూర్తి యేసయ్యకీర్తి అవని జాటుచున్’ అనే గీతం విన్నప్పుడు మనం కూడా ఆ ఆనందసముద్రంలో తేలిపోతుంటాం. క్రీస్తు ఈ లోకానికి వచ్చి మమత, సమత, మానవత ప్రకటించాడు. ‘నిన్నువలె నీ పొరుగువాణ్ణి ప్రేమించ’మని గొప్ప శాంతిసందేశాన్ని అందించి సిలువ మీద నెత్తుటి కొవ్వొత్తిలా కరిగిపోయాడు. ఇప్పుడు ఈ ప్రపంచానికి అత్యవసరమైనది ప్రేమ. ఆ ప్రేమమయుని జన్మదినమే క్రిస్మస్. -ఆచార్య ఎండ్లూరి సుధాకర్ -
అది చిరస్మరణీయమైన క్రిస్మస్!!
అమెరికాలోని విస్కాన్సిన్ లో ఒక షాపింగ్ మాల్ చిరుద్యోగి, ఏడాదంతా కూడబెట్టిన తన డబ్బుతో బహుమానాలు కొని క్రిస్మస్ సమయంలో సాంటాక్లాజ్ గా వాటిని పిల్లలకు పంచుతాడు. అంతా అతన్ని సాంటా అనే పిలుస్తారు. ఒక క్రిస్మస్ సమయంలో చిన్న పిల్లవాడు, వృద్ధురాలైన అతని తాతమ్మ, చేతిలో ఒక పదేళ్ల పాప ఫోటోతో వచ్చి ఆయన్ను కలిశారు. ఎవరీమె? అనడిగాడు సాంటా. ‘నా సోదరి శారా’ అన్నాడా పిల్లాడు. అతన్ని దగ్గరికి తీసుకొని ‘ఇదిగో ఈ బహుమానాల్లో నీకు, నీ సోదరికి కూడా ఏమి కావాలో తీసుకో’ అన్నాడు సాంటా. అపుడతని తాతమ్మ, ‘శారా రక్తకణాల కాన్సర్తో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉంది. ఈ క్రిస్మస్ దాకా ఆమె బతకదేమో అంటున్నారు డాక్టర్లు. కాని శారా ఈ క్రిస్మస్ కు సాంటాను చూడాలనుకొంటోంది. వీలైతే ఒకసారి ఆసుపత్రికి రాగలరా? అని ఆమె సాంటాను కన్నీళ్లతో ప్రాధేయపడింది. శారా కథ విన్న సాంటా బాగా కలత చెంది, సరేనన్నాడు. ఆ సాయంత్రమే తన సాంటాడ్రెస్లో అతను ఆసుపత్రికి వెళ్ళాడు. గదిలో శారా అస్థిపంజరంలాగా మంచం పైన ఉంది. ఆమె తల్లి, తండ్రి, తమ్ముడు, తాతమ్మ, మరొక ఆంటీ చుట్టూ ఉన్నారు. కృశించిన ఆమె వంటి నిండా మచ్చలున్నాయి. కీమోథెరపీతో వెంట్రుకలు పూర్తిగా ఊడిపోయాయి. గదినిండా మృత్యువు వాతావరణం. సాంటా మనస్సు చివుక్కుమంది. అయినా తమాయించుకొని, సాంటా పద్ధతిలో ఒహ్హో.... అంటూ పెద్దగా ఆనంద శబ్దాలు చేస్తూ గదిలోకి వెళ్ళాడు. అతన్ని చూసి ఆనందం పట్టలేక ‘సాంటా ...’ అంటూ శారా గట్టిగా అరిచి మంచం మీది నుండి లేవబోయింది. సాంటా పరిగెత్తుకెళ్లి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, ఆమె పక్కనే కూర్చున్నాడు. శారా ఆనందంతో సాంటాకు ఏవేవో ఊసులు చెబుతోంది. కన్నీళ్లు ఆపుకొంటూనే సాంటా అవన్నీ వింటూ తాను కూడా చెబుతున్నాడు. శారాలో అంత ఆనందాన్ని చూసిన కుటుంబ సభ్యుల ఆనందానికి కూడా అంతు లేకుండా పోయింది. దానికి కారకుడైన సాంటాకు కృతజ్ఞతలు తెలిపారు. అంతలో నర్స్ వచ్చి, ఇక వెళ్లిపోవాలంటూ సైగచేసింది. ‘శారా, ఒక దేవదూతను నీకోసం ప్రత్యేకంగా నియమించమని దేవుని ప్రార్ధిస్తాను’ అన్నాడాయన. అంతా కళ్ళు మూసుకోగా, సాంటా ఆమె మంచం వద్ద మోకరిల్లి, శారా తల మీద చేయి పెట్టి,‘దేవా ఈ చిన్న బిడ్డను ముట్టండి, శారా వ్యాధిని బాగుచెయ్యండి’ అంటూ ప్రార్ధించాడు. అంతా ‘ఆమెన్’ అన్న వెంటనే, ‘సైలెంట్ నైట్...’ అనే సాంప్రదాయక క్రిస్మస్ కీర్తనను సాంటా శ్రావ్యంగా అందుకోగా, చెమ్మగిల్లిన నేత్రాలతో సారాతో సహా అంతా కలిసి అద్భుతంగా పాడారు. ‘శారా, నేను చనిపోతున్నాను అనికాక, నేను బాగవుతాను అన్న భావన ఇక నుండి నీలో బలపడాలి. ఈ వేసవిలో నువ్వు నీ స్నేహితులతో తనివి తీరా ఆడుకోబోతున్నావు. వచ్చే ఏడాది క్రిస్మస్ సమయంలో నా మాల్ కు వచ్చి నన్ను కలుసుకోబోతున్నావు’ అని సాంటా శారాకు ధైర్యం చెప్పాడు. మెరిసే కళ్ళతో శారా ‘సరే సాంటా’ అంది . సాంటా శారాకు ఆటవస్తువులివ్వలేదు, ఆ క్రిస్మస్కు జీవితంపై ‘ఆశ’ అనే గొప్ప బహుమతినిచ్చాడు. అంతా ఆయన్ను హత్తుకొని సాగనంపారు. శాంటా రాకతో అక్కడి శ్మశానవాతావరణం కాస్తా పండుగ వాతావరణమైంది. ఏడాది తరువాత మాల్కు ఒకమ్మాయి వచ్చి సాంటాను కలిసి ‘నేను గుర్తున్నానా సాంటా?’ అనడిగింది. పిల్లలందరితో అన్నట్టే ‘ఎందుకు గుర్తులేవు? ఉన్నావు’ అన్నాడు సాంటా. ‘పోయిన ఏడాది నన్ను చూసేందుకు మీరు ఆసుపత్రికి వచ్చారు’ అని ఆమె అంటూండగానే సాంటాకు గుర్తొచ్చి ‘నీవు శారావు కదూ’ అన్నాడు అత్యాశ్చర్యంగా. అద్భుతం!! జుట్టు బాగా పెరిగి, ఎంతో బొద్దుగా, అందంగా, ఆరోగ్యంగా ఉంది శారా. ఆనందబాష్పాలతో శారాను సాంటా హత్తుకున్నాడు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులంతా వచ్చారు. ఈసారి ఆమె బొమ్మల కోసం రాలేదు. తనలాంటి పిల్లలకు పంచమంటూ బోలెడు ఆటబొమ్మలు, వస్తువులు తెచ్చిచ్చి వెళ్ళింది. ‘ఇది నేను ఎన్నటికీ మర్చిపోలేని క్రిస్మస్’ అంటూ, శారాకిచ్చిన ‘కొత్త జీవితం’ అనే బహుమానానికి ఆకాశం వైపు చూస్తూ సాంటా దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. నిరుపేదలు, ముఖ్యంగా నల్లజాతీయుల జీవితాల్లో క్రిస్మస్ ఆనందాన్ని నింపేందుకు కొందరు క్రై స్తవ పెద్దలు అమెరికాలో 1773 లో నెలకొల్పిన సంప్రదాయమే సాంటా క్లాజ్ గా ప్రసిద్ధి చెందింది. ఇవ్వడంలోని ఆనందాన్ని, తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి రక్షకుడుగా ఇచ్చిన ‘క్రిస్మస్’ ద్వారా దేవుడు మానవాళికి నేర్పించాడు. అది అర్ధం కాక, జీవితంలో ఆనందించడం తెలియని, ఇతరులు ఆనందిస్తే ఓర్వలేని, ‘డబ్బు దండగ’ అని అన్నింటినీ కొట్టి పారేసే కొందరు ‘క్రై స్తవ పరిసయ్యులు’, అసలు క్రిస్మస్ చేసుకోవచ్చా? సాంటా క్లాజ్ సంప్రదాయం బైబిల్లో ఉందా? అంటూ కోడిగుడ్డుపై ఈకలు లాగుతుంటారు. సెల్ ఫోన్లు, ఫేస్బుక్ బైబిల్లో ఉన్నాయా? మరి వాటినెందుకు వాడుతున్నారు? మరి కొందరైతే, క్రిస్మస్, తోటివారు, పేదల పట్ల మన ప్రేమను చూపే పండుగైతే, ఎన్ని ప్రసంగాలు చేస్తే లేదా ఎన్ని వింటే అది అంత గొప్ప క్రిస్మస్ అని భావించే స్థాయికి దిగజారారు. మనది అనుదినం దేవుని ప్రేమను ప్రకటించే జీవితమైతే, ఏడాదికి 365 క్రిస్మస్ పండుగలు చేసుకొంటున్నట్టే. లేకపోతే, యేడాదికి కనీసం ఒకటైనా అర్థవంతమైన క్రిస్మస్ చేసుకోవద్దా?? (అమెరికాలో మార్క్ లియొనార్డ్, ఆయన భార్య సుసాన్ లియొనార్డ్ అనే జంట సాంటా క్లాజ్ లుగా ఎన్నో ఏళ్ళ పాటు పేద పిల్లల జీవితాల్లో ఆనందాన్ని నింపి, తమ అనుభవాలను ఒక పుస్తకంగా రాశారు. అందులోని ఒక వాస్తవ గాథ ఇది). – రెవ. డా. టి.ఎ. ప్రభుకిరణ్ -
సర్వోన్నతుడే దీనుడై దిగివచ్చిన క్రిస్మస్
ఆది నుండీ ఉన్న యేసుక్రీస్తు అనే ’జీవవాక్యాన్ని’ తాము చెవులారా విన్నామని, ఆయన్ను కళ్లారా చూశామని, మూడున్నరేళ్ళపాటు ఆయన్ను నిదానించి అనుభవించామని, తమ చేతులతో ఆయన్ను తాకామని ఆయన శిష్యుడైన యోహాను ప్రభువుతో ఉన్న తన అనుబంధాన్ని తన పత్రికలో అత్యద్భుతంగా వర్ణించాడు(1 యోహాను 1:1). కారు, ఇల్లు, టివి, కుర్చీలు, సోఫాలుఇలాంటి విలువైన వస్తువులన్నీ పాతబడిపోతాయి. కానీ తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళతో ఉన్న సజీవమైన అనుబంధాలు మాత్రం పాతబడవు. ఇక దేవునితో ఉండే బాంధవ్యమైతే అసలు పాతబడేదికాదు కదా, అది నిత్యనూతనమైనదని యోహాను అంటాడు. అందుకే యోహాను యేసుకు ’జీవవాక్యం’ అనే బిరుదుని చ్చాడు. పౌలు స్థాపించిన ఎఫెసీ అనే గొప్ప చర్చికి యోహాను చాలాకాలం పాస్టర్ గా ఉన్నాడు. ఆ చర్చిలో గ్నోస్టిక్స్ అంటే, విశ్వాసం కన్నా దేవుని గూర్చిన జ్ఞానం చాలా గొప్పదని వాదించే ‘మహాజ్ఞానులతో’ ఆయన చాలా సమస్యలనెదుర్కొన్నాడు. తాను మనిషికి అర్ధమై అతనితో కలిసి పోయేందుకు వీలుగా, అత్యంత సామాన్యుడు, నిరాడంబరుడైన వ్యక్తిగా ఈ లోకానికి దిగివచ్చి, అందరిలాగా ‘నేను పరిచారం చేయించుకోవడానికి కాదు, పరిచారం చెయ్యడానికి వచ్చిన దాసుడినని’ యేసుప్రభువే ప్రకటించుకుంటే(మత్తయి 20:28), దేవుడు నరుడు, దాసుడు కావడమేమిటి? లాంటి ‘అతిభక్తిపూర్వక’ ప్రశ్నలు లేవెనెత్తి, తన జీవనశైలిద్వారా ఆయన నిరూపించుకున్న అత్యున్నతమైన మానవీయ విలువలను కాక, ఆయనకు ఎలాగూ ఉన్న దైవత్వాన్ని మాత్రమే విశ్వసించడానికి, ప్రకటించడానికి పూనుకున్న ఆ ‘జ్ఞానుల’ వాదనలను యోహాను తన స్వీయానుభవపూర్వకమైన ఈ విశ్వాస ప్రకటన ద్వారా నిర్వీర్యం చేశాడు. దేవుడే తగ్గాడంటే, తాము కూడా తగ్గాల్సి వస్తుందని జంకే బాపతువాళ్ళు ‘ఈ జ్ఞానులు’. అందుకే ఆయన పరలోకంలో ఉండే దేవుడు మాత్రమే కాదు, ఈ లోకంలో తాను తాకిన, చూసిన, విన్న, అనుభవించిన దేవుడు అంటాడు యోహాను. తాను పరలోకాధిపతి అయి ఉండి కూడా, ఈ లోకంలోని సాధారణ మనుషులు తనను విని, చూసి, తాకి, తనతో సహవసించడానికి వీలుగా, వారిలో ఒకడిగా జీవించేందుకు గాను మనకు తోడుగా ఉండే’ ఇమ్మానుయేలు’ దేవుడుగా ప్రభువు దిగి వచ్చిన సందర్భమే క్రిస్మస్’ సంబరం, సంరంభం. దేవుడే మనిషిగా దిగిరాగా, మనిషి మాత్రం లేనిపోని డాంబికాలకు పోయి తనను తాను దేవునికన్నా గొప్పవాడిగా ఉహించుకొంటూ, కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, ప్రాంతాల పేరిట తోటి మనుషులను దూరంగా పెట్టడం ఎంత ‘అమానవీయమో’ తెలిపే సందర్భమే క్రిస్మస్. దేవుడే దీనుడై యేసుక్రీస్తుగా దిగివచ్చి మానవాళికి దీనత్వాన్ని ప్రబోధించాడు. తనను తాను తగ్గించుకోవడం అనే ‘దీనత్వం’ సర్వోత్కృష్టమైన మానవ ధర్మమని, దేవుడు అహంకారాన్ని ఏవగించుకొని దీనులను ఆదరిస్తాడని ‘బైబిల్’ చెబుతోంది. మానవాళి దీనత్వాన్ని అలవర్చుకోవాలన్నదే క్రిస్మస్ ఇచ్చే నిరంతర సందేశం!! – రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
హిందువులు చర్చికెళ్తే ఖబడ్దార్..
డిస్పూర్: ప్రేమికుల రోజు మన సంస్కృతి కాదు.. యువతీయువకులు బయట జంటగా కనిపిస్తే.. పెళ్లి చేస్తాం అని బెదిరించే బజరంగ్ దళ్ కార్యకర్తలు తాజాగా క్రైస్తవుల పవిత్ర పర్వదినం క్రిస్టమస్ మీద పడ్డారు. హిందువులు ఎవరైనా క్రిస్టమస్ నాడు చర్చికి వెళ్తే చితకబాదుతాం జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ సంఘటన అస్సాంలో చోటు చేసుకుంది. విశ్వ హిందూ పరిషత్ జనరల్ సెక్రటరీ మిథు నాథ్ అస్సాం కాచర్ జిల్లాలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాథ్ ఇలా మాట్లాడటానికి ప్రధాన కారణం.. కొన్ని రోజుల క్రితం క్రైస్తవ జనాభా అధికంగా ఉన్న మేఘలయాలో వివేకానంద సెంటర్ని మూసి వేశారు. ఆ కోపంతో నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘క్రైస్తవులు మన పవిత్ర పుణ్యక్షేత్రాలను మూసి వేశారు. ఈ స్థితిలో ఎవరైనా హిందువులు, చర్చికి వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ విషయంలో మేం చాలా సీరియస్గా ఉన్నాం’ అన్నారు. ( సంచలన వ్యాఖ్యలు : మసీదులో హోమం చేస్తాం!) అంతేకాక ‘మా మాటలు కాదని ఎవరైనా చర్చికెళితే.. మేం వారిపై తగిన చర్యలు తీసుకుంటాం. ఆ తర్వాత రోజు పేపర్లో మేం హెడ్లైన్స్లో నిలుస్తాం. "గుండాదళ్" ఓరియంటల్ పాఠశాలను ధ్వంసం చేసింది.. అని పేపర్లో వస్తుంది. కాని అది మా ప్రాధాన్యత కాదు. షిల్లాంగ్లోని క్రైస్తవులు మన దేవాలయాల ద్వారాలను లాక్ చేస్తున్నప్పుడు హిందువులు వారి కార్యక్రమాలలో పాల్గొనడాన్ని మేం అనుమతించము’ అని మిథు నాథ్ హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ ఖాసీ విద్యార్థి సంఘం రామకృష్ణ మిషన్ ఆలయాన్ని మూసివేసింది అని తెలిపారు. అయితే, ఈ వాదనను మేఘాలయ ప్రభుత్వ ఉన్నతాధికారి ఖండించినట్లు సమాచారం. డిస్ట్రిక్ హాలీడే కావడంతో సాంస్కృతిక కేంద్రం మూసివేశారని.. లాక్ చేయలేదని సదరు అధికారి తెలిపారు. -
జనవరిలో స్టార్ట్
ప్లాన్ ప్రకారం అన్నీ అనుకున్నట్లు జరిగినట్లయితే ఈ ఏడాది క్రిస్మస్ పండగకి హృతిక్ రోషన్ ‘క్రిష్ 4’ చిత్రం థియేటర్లోకి రావాల్సింది. కానీ ‘క్రిష్’ ఫ్రాంచైజీ దర్శకుడు రాకేశ్ రోషన్ (హృతిక్ రోషన్ తండ్రి) క్యాన్సర్ బారిన పడి, కోలుకోవడానికి కొంత సమయం పట్టడంతో ‘క్రిష్ 4’ చిత్రం సెట్స్పైకి వెళ్లలేదు. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఎలాగైనా విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారట రాకేశ్ రోషన్. ఇందుకు తగ్గట్లుగానే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని బాలీవుడ్ సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ను ఆరంభించాలనుకుంటున్నారని టాక్. అప్పటికి కరోనా పరిస్థితులు ఓ కొలిక్కి వస్తాయని, ఫారిన్ షూటింగ్స్కు పెద్ద సమస్యలు ఉండవని భావిస్తోందట చిత్రబృందం. -
బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్, 2 నెలలు అదనం
సాక్షి, ముంబై: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా సరికొత్త ప్రయోజనాలను తన వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.1,999 విలువైన వార్షిక ప్లాన్లో అదనపు ప్రయోజనాలను అందించనుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లో వినియోగదారులు 60 రోజుల ఎక్స్ట్రా వాలిడిటీని పొందవచ్చని బీఎస్ఎన్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు కాగా తాజా ఆఫర్ కింద 425 రోజుల వాలిడిటీని పొందవచ్చు. ఈ ఆఫర్ నేటి (జనవరి 25) నుంచి జనవరి 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. రూ.1,999 ప్లాన్ అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, ఉచిత బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, టీవీ సబ్స్రిప్షన్, రోజుకు 3జీబీ డేటా లభ్యం. కాగా రిలయన్స్ జియో హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్ కింద రూ.2020తో వార్షిక ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
వరల్డ్ ఫేమస్ క్రిస్మస్ సాంగ్స్
-
రాణి వెడలె
క్రిస్మస్కింకా రెండు రోజుల సమయం ఉంది. బ్రిటన్ ప్రజలు మాత్రం గత శుక్రవారమే అధికారికంగా క్రిస్మస్ మూడ్లోకి వచ్చేశారు. ఇది ఏటా ఉండేదే. క్వీన్ ఎలిజబెత్–2 లండన్లోని తన అధికార నివాసం బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి అక్కడికి నూట పన్నెండు మైళ్ల దూరంలోని శాండ్రింగ్హామ్ ఎస్టేట్కు రైల్లో బయల్దేరగానే బ్రిటన్ అంతటా క్రిస్మస్ సందడి మొదలౌతుంది. తొంభై మూడేళ్ల బ్రిటన్ రాణిగారు ఎప్పటిలా ఈ ఏడాది కూడా సాధారణ ప్రయాణీకుల రైల్లోనే తనకోసం ప్రత్యేకంగా ఒక బోగీని రిజర్వు చేయించు కుని డిసెంబరు 20న కింగ్ లిన్స్ స్టేషన్లో దిగారు. శాండ్రింగ్హామ్ ఎస్టేట్ అక్కడికి దగ్గర్లోనే ఉంటుంది. ఆమె తండ్రి ఆరవ జార్జి, తాత ఐదవ జార్జి నివసించిన రాజప్రాసాదం అది. అతి ముఖ్యులు ఆఖర్న ప్రతి క్రిస్మస్కీ కుటుంబంతో పాటు శాండ్రింగ్హామ్ ఎస్టేట్లో గడిపి వెళ్తారు క్వీన్ ఎలిజబెత్. మొదట ఆమె, ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ వెళ్తారు. వాళ్ల వెనుక మిగతావాళ్లు. ఆ మిగతావాళ్లు కూడా ఎవరు పడితే వాళ్లు రైలు ఎక్కేయడానికి లేదు. దానికో క్రమం ఉంటుంది. క్వీన్, ప్రిన్స్ వెళ్లాక.. ఇక ఆ వంశంలో వయసులో బాగా చిన్నవాళ్లు ఎవరైతే ఉన్నారో వాళ్లు బయల్దేరి వెళ్లారు. అందరి కన్నా చివర్లో ‘అతి ముఖ్యులు’ ఎస్టేట్కు చేరుకుంటారు. ఆ అతి ముఖ్యులు ఎవరంటే.. వారసత్వ స్థానానికి ప్రాధాన్యతా క్రమంలో ఉన్న క్వీన్ కుమారుడు ప్రిన్స్ చార్లెస్, ఆ కుమారుడి కుమారుడు ప్రిన్స్ విలియమ్స్, విలియమ్స్ భార్య కేట్ మిడిల్టన్.. అలా ఉంటుంది సంప్రదాయం. ఈసారి క్వీన్ ఎలిజబెత్తో పాటు ప్రిన్స్ ఫిలిప్ కూడా శాండ్రింగ్హామ్ ప్రయాణానికి సిద్ధం అయినప్పటికీ శుక్రవారం ఉదయం ఒంట్లో కాస్త నలతగా అనిపించడంతో ఆయన్ని లండన్లోని కింగ్ ఎడ్విర్డ్ సెవెన్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు తరలించవలసి వచ్చింది. ‘‘98 ఏళ్ల వయసులో ఇవి అవసరమైన పరీక్షలే తప్ప అకస్మాత్తు పరీక్షలేమీ కావు’’ అని రాజ వైద్యుడు చెప్పడంతో క్వీన్ తన మనసును కుదుటపరచుకుని తనొక్కరే శాండ్రింగ్హామ్ ఎస్టేట్కు వెళ్లవలసి వచ్చింది. ముందుగా నిర్ణయించిన సమయం కాబట్టి వెళ్లి తీరవలసి వచ్చింది. రెండు విందు భోజనాలు ఏటా రాజ కుటుంబం అంతా ఈ ఎస్టేట్లోనే క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్ డే వేడుకలు జరుపుకుంటుంది. క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్ ఒకటి కాదు. క్రిస్మస్ కోసం ఎదురు చూసే ముందురోజు సాయం సమయం అంతా క్రిస్మస్ ఈవ్ అయితే, ఆ మర్నాడు చేసుకునేది క్రిస్మస్. శాండ్రింగ్హామ్ ఎస్టేట్లో క్రిస్మస్ ఈవ్కి రాజకుటుంబం ‘బ్లాక్ టై డిన్నర్’ చేస్తుంది. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటుంది. క్రిస్మస్ రోజు టర్కీ కోడి విందు భోజనం ఎలాగూ ఉంటుంది. ముఖ్యమైన బయటి వ్యక్తులతో కలిసి చేసే డిన్నర్ ‘బ్లాక్ టై డిన్నర్’ అయితే, కుటుంబ సభ్యులు మాత్రమే కలిసి చేసేది టర్కీ కోడి విందు. దీనినే టర్కీ ఫీస్ట్ అంటారు. ఇలా అనడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం రైతులు పాల కోసం పశువుల్ని, గుడ్ల కోసం కోళ్లను తమ దగ్గర ఉంచుకుని, టర్కీ కోళ్ల ను మాత్రమే మాంసం కోసం అమ్మేవారట! పైగా అప్పట్లో పశువులు, కోళ్ల ధర ఎక్కువగా ఉండటం అందుకొక కారణం అంటారు. ఏదైనా టర్కీ ఫీస్ట్ అనేది బ్రిటన్లోనే కాదు, ఒక్క క్రిస్మస్ రోజే కాదు.. అన్ని పాశ్చాత్య దేశాలలో, అన్ని వేడుకలలో సంప్రదాయం అయింది. లిగింతల కానుకలు క్రిస్మస్ ఈవ్కి రాజమాత కుటుంబ సభ్యులు ఇచ్చిపుచ్చుకునే కానుకలు కూడా ప్రత్యేకమైనవిగా ఉంటాయి. ప్రత్యేకమైనవే తప్ప ఖరీదైనవి కాదు. పైగా మనసును ఉల్లాసపరిచేలా ఉంటాయి. తేనీటి విందు సమయంలో అందరూ కూర్చొని ఆ కానుకలను తెరచి చూసుకుంటారు. ఓ క్రిస్మస్ ఈవ్కి ప్రిన్స్ హ్యారీ తన నానమ్మకి (క్వీన్ ఎలిజబెత్కి) షవర్ క్యాప్ని గిఫ్టుగా ఇచ్చారు! షవర్ క్యాప్ అంటే స్నానం చేసేటప్పుడు తలపై షవర్ నీళ్లు పడకుండా పెట్టుకునేది. ఆ క్యాప్పైన ‘ఎయింట్ లైఫ్ ఎ బిూూూూ’ అని రాసి ఉంది. దాన్ని చూసి క్వీన్ తన మనవడి తాత్వికతకు మురిపెంగా నవ్వుకున్నారు. కష్టాలు వెంటపడి తరుముతున్నప్పుడు. ‘జీవితం ఏం బాగాలేదు’ అని చెప్పడానికి మొరటుగా వాడే మాట ఇది. హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ ఇచ్చిన సింగింగ్ హామ్స్టర్ (మైకు పట్టుకుని పాట పాడే ఎలుక బొమ్మ) కూడా క్వీన్ ఎలిజబెత్ను నవ్వించింది. ఎలిజబెత్ ఏకైక కుమార్తె ప్రిన్సెస్ యాన్ తన అన్న ప్రిన్స్ చార్లెస్కి లెదర్ టాయిలెట్ సీట్ను కానుకగా ఇచ్చారు. కేట్ మిడిల్టన్ తన మరిది ప్రిన్స్ హ్యారీకి ‘గ్రో–యువర్–ఓన్–గర్ల్ఫ్రెండ్’ కిట్ను ఇచ్చారు. ఎదిగే ఆడపిల్లలకు ఇచ్చే బొమ్మల కిట్ అది. ఈ నవ్వుల కానుకల సంప్రదాయం గురించి తెలియక ప్రిన్సెస్ డయానా రాజప్రాసాదంలో కొత్త కోడలిగా అడుగు పెట్టిన మొదటి ఏడాది క్రిస్మస్ ఈవ్కి ఇంట్లో వాళ్లందరికీ ఖరీదైన కాష్మియర్ స్వెట్టర్లు, (కశ్మీర్ స్వెట్టర్లు కాదు), మెహెయిర్ స్కార్ఫ్లు ఇస్తే అందరూ ఆమెను ఆటపట్టించారట. ఈ క్రిస్మస్కి ఎవరు ఎవరికి ఎలాంటి కానుకలు సిద్ధం చేసి ఉంచారో మరి. కింగ్ లిన్స్ స్టేషన్లో రైలు నుంచి దిగుతున్న బ్రిటన్ రాణి ఈసారి కొంచెం లేట్ వాస్తవానికి క్వీన్ ఎలిజబెత్ ఇంకాస్త ముందుగానే శాండ్రింగ్హామ్ ఎస్టేట్కి వెళ్లవలసి ఉన్నప్పటికీ ఇటీవలి బ్రిటన్ ఎన్నికల కారణంగా ఆమె ప్రయాణం కొంచెం ముందుకు జరిగింది. ఇప్పుడిక క్రిస్మస్ అయ్యాక కూడా రాణిగారు ఆ ఎస్టేట్లోనే మరికొన్ని రోజులు గడిపే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు, మనవలు, మునిమనవలు.. అంతా ఒకేసారి, ఒకే చోట ఆనందంగా కలుసుకునేందుకు ఏటా క్రిస్మస్ తనకు ఇచ్చే మహద్భాగ్యాన్ని రాణిగారు అంత తేలిగ్గా ఏమీ విడిచిపెట్టరు అని బ్రిటన్ రాజకుటుంబీకుల వర్తమానాన్ని ఎప్పటికప్పుడు లిఖిస్తుండే బయోగ్రఫర్లు అంటుంటారు. -
కేకో... కేక!
-
ఆశకు మరో పేరు క్రిస్మస్
గోళాకారంలో ఉన్న ప్రపంచంలో ఎక్కడి నుండి ప్రయాణించినా భూగోళం చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే రావచ్చునని రుజువు చేసి, ప్రపంచానికి అంతం అనేది లేదన్న ‘ఆశ’ను కొలంబస్ చిగురింప చేశాడు. మనిషిని బతికించే పనిని ఆక్సిజన్ కన్నా ‘ఆశ’ ఎక్కువగా చేస్తుంది. కారుచీకట్ల చివర్లో ఒక కాంతి కిరణముందన్న ఆశను, దౌర్జన్యం, దోపిడీ, అవినీతి, దిగజారిన జీవిత విలువలు, పెచ్చరిల్లే హింసాకాండ నడుమ అకస్మాత్తుగా శాంతి కిరణాలు ప్రభవించవచ్చునన్న ఆశను రేకెత్తించిన ‘క్రిస్మస్’, ఇప్పటికీ దాన్ని బతికిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మానవాళి ‘ఆశ’కు మరోపేరు ‘క్రిస్మస్’!! ఇటలీకి చెందిన మహా నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ అప్పటి స్పెయిన్ రాజుగారి ఆజ్ఞ మేరకు సుగంధ ద్రవ్యాల వర్తకం కోసం ఇండియాను చేరేందుకు పశ్చిమ దిక్కు నుంచి ఒక కొత్త దారి కనుక్కోవడానికి 15వ శతాబ్దంలో నౌకాయానం చెయ్యడానికి పూర్వం ప్రపంచమంతా బల్లపరుపుగా ఉందని, అందువల్ల నౌక సముద్ర ప్రయాణంలో ఎక్కడో ఒక చోట, ప్రపంచం చివరి అంచు నుంచి లోతుల్లేని అగాథంలోకి పడిపోతుందని అంతా నమ్మేవారు, భయపడేవారు కూడా. అయితే కొలంబస్ నౌకాయానం విజయవంతం కావడం వల్ల రెండు విషయాలు తెలిశాయి. యూరోప్ తదితర ప్రాంతాలకు అంతవరకు తెలియని అమెరికా అనే ఒక ఖండమున్నదని కొలంబస్ అక్కడికి చేరడం వల్ల లోకానికి తెలిసింది. పైగా ప్రపంచం బల్లపరుపుగా లేదని, ఒక అంచు నుంచి అగాథం లోకి పడిపోవడం కాదు, గోళాకారంలో ఉన్న ప్రపంచంలో ఎక్కడి నుండి ప్రయాణించినా భూగోళం చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే రావచ్చునని రుజువు చేసి, ప్రపంచానికి అంతం అనేది లేదన్న ‘ఆశ’ను కొలంబస్ చిగురింప చేశాడు. మనిషిని బతికించే పనిని ఆక్సిజన్ కన్నా ‘ఆశ’ ఎక్కువగా చేస్తుంది. కారుచీకట్ల చివర్లో ఒక కాంతి కిరణముందన్న ఆశను, దౌర్జన్యం, దోపిడీ, అవినీతి, దిగజారిన జీవిత విలువలు, పెచ్చరిల్లే హింసాకాండ నడుమ అకస్మాత్తుగా శాంతి కిరణాలు ప్రభవించవచ్చునన్న ఆశను రేకెత్తించిన ‘క్రిస్మస్’, ఇప్పటికీ దాన్ని బతికిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మానవాళి ‘ఆశ’కు మరోపేరు ‘క్రిస్మస్’!! లోకాన్నితన ప్రేమ, క్షమతో నింపి తద్వారా సరికొత్త దైవిక రాజ్యాన్ని నిర్మించాలన్న దేవుని అనాది సంకల్పంతో, దృఢమైన అభిమతంతో రెండు వేల ఏళ్ళ క్రితమే తొలి క్రిస్మస్ వెలిసింది, మరొక మతాన్ని ఆరంభించేందుకు కాదు, మనిషి తన కోసం తాను కాకుండా, తనను తాను ప్రేమించుకున్నంతగా తన పొరుగువాణ్ణి కూడా ప్రేమించడంలోనే అతనికి జీవన సాఫల్యమున్నదని తెలిపే ఒక విలక్షణమైన, విశిష్టమైన జీవన విధానాన్ని ఆవిష్కరించిన రక్షకుడుగా దైవ కుమారుడైన యేసుక్రీస్తు ఆవిర్భవించాడు. అంతే తప్ప ఒక కొత్త మతాన్ని ఆరంభించే ఉద్దేశం యేసుకు లేదు. ఆ కారణంగా, కత్తుల నడుమ నిర్మలమైన కలువపూవై, నెత్తుటి మరకలతో ఎర్రబారిన ఆకాశంలో ఎగిరే శ్వేత శాంతికపోతమై, ఒంటరితనంతో నిరాశాజీవిగా బతుకుతున్న మనిషితో, నీకు నేనున్నానంటూ అభయాన్నిచ్చిన ఒక ప్రియనేస్తమై యేసుక్రీస్తు రక్షకుడుగా క్రిస్మస్ ద్వారా లోకంలోకి అడుగుపెట్టాడు...ఆయన ఆకాశాన్ని తన సింహాసనంగా, భూమిని తన పాదపీఠంగా కలిగిన మహోన్నతుడైన ప్రభువని బైబిల్ వర్ణిస్తుంది (యెషయా 66:1–4). అయితే ఆనాడు విశ్వమంతటికీ సృష్టికర్త, పాలకుడు, యజమాని అయిన దైవకుమారుడైన యేసుక్రీస్తు ఆగమనాన్ని సూచించే ఆర్భాటం లేదు, కోలాహలం కూడా లేదు. స్వాగతోత్సవాలు, సన్మాన సభలు, విందులు, వినోదాల సందడే లేదు. రక్షకుని ఆగమన సూచనగా దేవుడు ఆకాశంలోనే ఒక అసాధారణమైన తారను పుట్టిస్తే, అది చూపే దారిలో తూర్పు దేశపు జ్ఞానులు రక్షకుని చూసేందుకు యెరూషలేముకొస్తే, అక్కడి యూదుల రాజైన హేరోదు పిలిపిస్తే యూదు పండితులు వచ్చి, యూదయ దేశపు చిన్న గ్రామమైన బేత్లెహేములో రక్షకుడు అంటే మెస్సియా పుడతాడని బైబిల్ చెబుతోందంటూ వివరించారు (మత్తయి 2:5). యెరుషలేములాంటి గొప్ప పట్టణముండగా, అక్కడికి కేవలం అయిదు కిలోమీటర్ల దూరంలోని బేత్లెహేము అనే అనామకమైన ఒక పేద గ్రామంలో రాజులకు రాజు, చక్రవర్తులకు చక్రవర్తియైన దైవకుమారుడు పుట్టడమేమిటో ఆ జ్ఞానులకు అర్థం కాలేదు, హేరోదు చక్రవర్తికీ అదేంటో అర్థం కాలేదు, ఆ బైబిల్ వచనాన్ని చదివి వినిపించిన యూదు పండితులకైతే ఆ వచనం పట్ల అసలు విశ్వాసమే లేదు. వాస్తవమేమిటంటే ఆ వచనాన్ని ఆనాడు ఎవ్వరూ నమ్మలేదు. ఒకవేళ నమ్మి ఉంటే, హేరోదు పురమాయింపుతో అతని సైనికులు లేదా బైబిల్ ప్రవచనాన్ని విశ్వసించే ఎవరైనా యూదు పెద్దలు పక్కనే ఉన్న బేత్లెహేముకు ఆ జ్ఞానులతో పాటే ఆ రోజే వెళ్లే వాళ్లు. అప్పుడు ప్రపంచానికంతటికీ రక్షకుని జన్మశుభవార్త ‘బ్రేకింగ్ న్యూస్’గా ఆరోజే తెలిసి ఉండేది. కాని దేవుడు తన మహా కార్యాలు, అనాది సంకల్పాల నెరవేర్పు కోసం, ధనవంతులు, పండితులు, అధికారమున్న గొప్పవాళ్లను కాక, పామరులను, నిరుపేదలను, బలహీనులను ఏర్పరచుకొని వారిని వాడుకొంటాడని బైబిల్ చెబుతోంది (మత్తయి 11:25). యేసుక్రీస్తు నూటికి నూరు పాళ్లూ పేదల పక్షపాతి, దీనబాంధవుడని చెప్పడానికి బైబిల్ నిండా, ముఖ్యంగా కొత్తనిబంధన నిండా వచనాలున్నాయి.మెస్సీయాగా యేసు రాజభవనాల్లో, చక్రవర్తులు, కుబేరుల ఇళ్లలో పుట్టబోడని దేవుడు స్పష్టం చేశాడు. పుడమినేలే రారాజు పశువుల పాకలో పుడతాడని చెప్పే ప్రవచనాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. పేద కుటుంబానికి చెందిన భక్తిపరురాలైన ఒక కన్యక పరిశుద్ధాత్మ శక్తితో యేసును గర్భం దాల్చుతుందని, యోసేపు అనే భక్తిపరుడు, నీతిమంతుడైన మరో పేద యువకుడు యేసుప్రభువుకు ఇహలోకంలో సంరక్షక తండ్రిగా ఉంటాడని, ఆయన జననం బేత్లెహేములో జరుగుతుందని దేవుడు ముందే వెల్లడించాడు. అలా, కోటానుకోట్ల నక్షత్ర మండలాల సముదాయమైన మహా విశ్వానికంతటికీ సృష్టికర్త, పాలకుడూ అయిన దైవకుమారుడు ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా, చడీ చప్పుడు చెయ్యకుండా, ఒక నలుసంత పరిమాణానికి తనను తాను తగ్గించుకొని, కన్య గర్భంలోకి ప్రవేశించి, తొమ్మిది నెలల పాటు మరియ గర్భంలో పిండస్థ శిశువుగా ఎదిగి, బేత్లెహేములోని సత్రంలో కూడా మరియ, యోసేపులకు తలదాచుకునే చోటు దొరక్కపోగా, వాళ్ళున్న పశువుల పాకలోనే యేసు జన్మించాడు. ప్రపంచంలో మానవాళి దృష్టికొచ్చిన అద్భుతాల్లోకెల్లా, అత్యంత అద్భుతమైన సంఘటన, చరిత్రను తిరగ రాసిన పరిణామమిది. బైబిల్లో మొత్తం 66 పుస్తకాలున్నాయి. పాత నిబంధన గ్రంథంలోని 39 పుస్తకాల్లోనూ యుద్ధాలు, మరణాలు, రక్తపు మరకల హింసాత్మక ఘటనలుండగా, కొత్త నిబంధనగా పిలిచే చివరి 27 పుస్తకాలూ యేసుప్రభువు వారి శాంతి సందేశంతో నిండి ఉన్నాయి. యుద్ధాలు, హింసాకాండ నేపథ్యంలో శాంతిదూతగా యేసు జననాన్ని ఎలా సమర్థిస్తారు? ఒక మార్గాన్ని వేస్తున్నప్పుడు, నేలను తవ్వి గుల్ల చేయాల్సివస్తుంది, అడ్డుగా ఉన్న కొండల్ని పేల్చి, లేదా తొలచి చదును చేయాల్సి వస్తుంది. అలా బలప్రయోగంతో సరళం చెయ్యబడిన పర్యవసానంగా రక్షణ మార్గం ఏర్పడగా, అందుకోసమే అనివార్యమైన హింసాత్మకత పాత నిబంధనలో చెలరేగింది. అయినా యేసుప్రభువు రక్షకుడుగా దిగివచ్చిన తర్వాత కూడా క్రై స్తవం పేరుతో ఈ రెండువేల ఏళ్లలో చాలాసార్లు చరిత్ర రక్తసిక్తమయ్యింది. కారణం? యేసుప్రభువు ఈ లోకానికి సంపూర్ణంగా అర్థం కాకపోవడం ఒక కారణమైతే,.దేవుని కుమారుడుగా శాంతి సందేశాన్ని మోసుకొచ్చిన యేసుక్రీస్తు ప్రబోధాల ప్రత్యేకతను, విశిష్టతను అర్థం చేసుకోలేని మధ్య యుగాల చర్చిల్లో పేరుకు మాత్రమే క్రై స్తవులైన వాళ్ళు ఎక్కువగా ఉన్న కారణంగా, ఆచరణలో నియంతృత్వపు పోకడలతో క్రై స్తవాన్ని ‘విస్తరించడానికి’ పూనుకున్న యూరోప్ దేశాల చక్రవర్తులు మరొక కారణం. యేసుప్రభువు శాంతి సందేశాన్ని, ప్రేమ, క్షమాపణే పునాదిగా కలిగిన విలక్షణమైన, విశిష్టమైన ఆయన రక్షణ సువార్త మార్గాన్ని, వాళ్లంతా ఒక ‘మతం’ స్థాయికి దిగజార్చారు. దైవిక మార్గం ఏదైనా సరే అది మతం స్థాయికి దిగజారిన ప్రతిసారీ మానవాళి తీవ్రంగా నష్టపోయి, దిగజారిన విలువల రూపంలో భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. దేవుని కన్నా యాజకులు, పరిచారకులు, పూజారులుండే చర్చిలు, దేవాలయాల వ్యవస్థ ప్రాబల్యం నానాటికీ ఎక్కువ కావడమే ఒక మతం స్థాయికి దైవికత దిగజారిందనడానికి స్పష్టమైన సూచన. ముఖ్యంగా మధ్య యుగాల్లో ఈ కారణం వల్లనే చర్చి దేవుణ్ణి తన గుప్పిట్లో పెట్టుకొని విశ్వాసుల మీద కనీ వినీ ఎరుగని దమనకాండను, దౌర్జన్యాన్ని సాగించింది. అయితే చరిత్రలో ఇలా హింసకు పాల్పడిన ఘటనలున్నా, మరోవైపు క్రై స్తవానిదైన ప్రత్యేక ప్రేమ, క్షమా సౌరభం లోకాన్ని ఎంతగా ప్రభావితం చేసిందంటే, తమ జీవితాలనే ప్రేమపూర్వక క్రీస్తు సందేశంగా మలచుకున్న మదర్ థెరిసాలాంటి ఎంతోమంది నిస్వార్ధపరులైన పరిచారకులు, గొప్ప అపొస్తలులు, దైవ జనులు ఒక మతం స్థాయికి దిగజారకుండా క్రై స్తవాన్ని ఎత్తి పట్టుకున్నారు. ఉద్యోగాలు, అడ్మిషన్ల దరఖాస్తుల్లో ‘మతం’ అనే కాలమ్ ఉంటే, దాన్ని క్రై స్తవులు వాడుకోవడానికి బైబిల్ ఒప్పుకోదు. ఎందుకంటే, క్రై స్తవం ఒక మతం కాదు. అది యేసు జీవించి, తన అనుచరులు కూడా అలాగే జీవించాలని ఆశించి, ఆదేశించిన ఒక విలక్షణమైన జీవన శైలి. క్రీస్తులాగా జీవించడం, తాను ఒకవైపు కరుగుతూ మరోవైపు లోకానికి ప్రేమ అనే వెలుగును పంచే కొవ్వొత్తి లాంటి జీవితం క్రై స్తవం!! క్రైస్తవం అంటే కొన్ని ఆచారాలు, నియమాలు,ఆరాధనా విధానాలు, నమ్మకాలు, సంప్రదాయాలు కాదు. ముందు క్రీస్తు అనుచరుని జీవితం మారాలి. అలా అతనిలో వచ్చిన మార్పు వల్ల ప్రభావితమైన లోకంలో కూడా గుణాత్మకమైన మార్పు రావాలి. అదే నిజ క్రై స్తవానికున్న శక్తి. విశ్వాసులు, పరిచారకులు ముందు తమకున్న మతం ముసుగు తీసేసి, నిజాలు చెప్పడం ఆరంభించాలి. సొంత డబ్బా వాయించుకునే ప్రచారార్భాటాలు మానెయ్యాలి. ‘నా సభకు లక్షమంది వచ్చారు’ అని ప్రకటించుకోవడం ‘అర్ధసత్యమే’ అని తెలుసుకోవాలి. ఎవరికి వారు గొప్పగా చాటింపు వేసుకోవడం మతపరమైన డాంబికం. అలా కాక ‘నా సభలో వాక్యం విన్న వారిలో వంద మంది తమ జీవితాన్ని మార్చుకున్నారు’ అని చెబితే అది పూర్తి సత్యం. అర్ధసత్యాలమీద, పరిచారకుల అతిశయాస్పద ప్రకటనల మీద, అసత్యాల మీద ఆధారపడేది మతం!! పరిచారకుల జీవితమే నిత్య సందేశంగా, నిస్వార్థం, పారదర్శకత, ప్రేమ, క్షమాపణే సూత్రంగా పరిఢవిల్లేది యేసు బోధించి, ఆచరించిన నిజ క్రై స్తవం. అదే బేత్లెహేములో నాటి తొలి క్రిస్మస్లో పరిమళించిన నిరాడంబరమైన, నిస్వార్థమైన, అనంతమైన దేవుని స్వచ్ఛమైన ప్రేమ!!! రక్తంకన్నా చిక్కనిది దేవుని ప్రేమ... ‘క్రిస్మస్’ను ఇపుడు మనమంతా ఆనందోత్సాహాలు, వేడుకలకు ప్రతీకగా జరుపుకొంటున్నాము కాని చరిత్రలో రెండువేల ఏళ్ల క్రితం తొలి క్రిస్మస్ జరిగిన బేత్లెహేములో పట్టపగలే చీకట్లు కమ్మి, అక్కడి వీధుల్లో రక్తపుటేరులు ప్రవహించాయన్నది వాస్తవం. యూదులరాజుగా యేసు జన్మించాడంటూ తూర్పు దేశపు జ్ఞానులు తెచ్చిన వార్త నాటి యూదులదైన యూదా రాజ్యానికి రాజుగా ఉన్న హేరోదులో కలవరాన్ని సృష్టించింది. తన సింహాసనానికి అడ్డొస్తారేమోనన్న అనుమానంతో తన సొంత కొడుకులిద్దరినే చంపిన నియంత, అత్యంత క్రూరుడు హేరోదు రాజు. ఇపుడు యూదుల రాజుగా పుట్టిన యేసును వదిలేస్తాడా? బేత్లెహేములో పుట్టినట్టుగా లేఖనాలు చెబుతున్న యేసును పూజించి తిరిగొచ్చి, ఆ వివరాలను తనకు తెలిపితే తాను కూడా వెళ్లి పూజిస్తానంటూ హేరోదు జ్ఞానులకు మాయ మాటలు చెప్పి పంపగా, దేవుడు దర్శనంలో కనిపించి వారికి హేరోదు కుట్రను బట్టబయలు చేశాడు. జ్ఞానులు యేసును దర్శించుకొని, కానుకలు సమర్పించి, పూజించి, దైవాజ్ఞ మేరకు హేరోదు వద్దకు తిరిగి వెళ్లకుండా, మరో మార్గంలో తమ దేశాలకు వెళ్ళిపోయి నిజంగానే జ్ఞానులనిపించుకున్నారు. తాను మోసపోయానని గ్రహించిన హేరోదు రాజు, శిశువైన యేసును హతమార్చే కుట్రలో భాగంగా, యూదయలోని రెండేళ్ల లోపు మగ శిశువులందరినీ చంపించగా, దేశమంతటా హాహాకారాలు, ఆక్రందనలు మిన్నంటాయి. కాని దేవుడప్పటికే యోసేపు, మరియ, బాలుడైన యేసును బేత్లెహేము నుండి ఐగుప్తుకు దాటించి హేరోదు కుట్రను భగ్నం చేశాడు. నీళ్లకన్నా రక్తం చిక్కనిదైతే కావచ్చు, కాని దేవుని ప్రేమ రక్తం కన్నా చిక్కనిది. శాంతి ప్రదాతయైన యేసు ఆగమన శుభవేళ, బేత్లెహేము ఆ పరిసర ప్రాంతాలన్నీ తమ పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రుల రోదనలతో దద్దరిల్లాయి, అక్కడి వీధులు రక్తసిక్తమయ్యాయి. కాని దైవకుమారుడైన యేసు స్థాపించబూనిన ప్రేమ, శాంతి, క్షమాపణా సామ్రాజ్యాన్ని బలవంతులు,పాలకులు తమ స్వార్ధం,ఈర‡్ష్య,ఆగ్రహం, అభద్రతాభావం, నియంతృత్వం, క్రూరత్వం, దౌర్జన్యంతో ఆదిలోనే మట్టుపెట్టేందుకు చరిత్రలో చేసిన తొలి ప్రయత్నం విఫలమయింది. ఈ పిలాతు దుర్మరణం తర్వాత, ఇతని స్థానంలో యూదయ రాజుగా నియమింపబడిన పొంతి పిలాతు పిరికివాడు, అందరితో రాజీపడటమే తన సింహాసనాన్ని పదిలపరచుకునే మార్గమని నమ్మినవాడు. అందుకే యూదులతో మంచివాడిననిపించుకునేందుకు యేసును సిలువవేసి ఆయన చరిత్రకు ముగింపు పలకాలన్న అతని కుట్ర కూడా యేసు పునరుత్థానంతో, ఆ తర్వాత క్రై స్తవచర్చి ఆవిర్భావంతో భగ్నమైంది. అమాయకుల కన్నీళ్లతో తడిసిన ఈ తొలి క్రిస్మసే ఆ తర్వాత ప్రపంచమంతా విస్తరించిన క్రీస్తు ప్రేమ సామ్రాజ్యానికి తొలి వేదిక అయ్యింది. కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యం, హింస, హత్యల నేపథ్యంలోనే యేసు ప్రభువు వారి క్షమా, కృపా, రక్షణా కేతనం ఉవ్వెత్తున రెప రెపలాడింది. విశేషమేమిటంటే ఒకప్పుడు లోకాన్నంతా గడగడలాడించిన రోమా సామ్రాజ్యం కాలగర్భంలో కలిసి ఆనవాళ్లే లేకుండా పోయింది. కాని శుభవార్త ఏమిటంటే యేసుప్రభువు ఆవిష్కరించిన ప్రేమ సామ్రాజ్యం మాత్రం పరలోక ప్రాభవంతో ఇన్నివేల ఏళ్లుగా అణువణువునా విస్తరిస్తూనే ఉంది. చెడుపైన శాశ్వత విజయం ఎప్పుడూ శాంతిదే అన్నది కేవలం ఒక నినాదం కాదు, అది చరిత్ర చెప్పే సత్యమన్నదే క్రిస్మస్ ప్రకటించే నిత్య సందేశం. క్రిస్మస్ను ప్రత్యేకం చేసుకోండి... ఈ క్రిస్మస్ ఒక ప్రత్యేకమైన క్రిస్మస్గా మీ జీవితంలో మిగిలిపోవాలనుకుంటే ఆ నాటి తొలి క్రిస్మస్ స్ఫూర్తితో కొన్ని పనులు చేయవచ్చు. బహుశా ఎంతోకాలంగా మాటలు నిలిచిపోయిన మిత్రులు, బంధువులకు ఈరోజు సెల్ఫోన్లో హలో చెప్పండి! ఏవో చిన్న చిన్న గొడవలు (పెద్దవైనా ఫర్వాలేదు), మాటపట్టింపులు ఉన్న కారణంగా రాకపోకలు ఆగిపోయిన మీ బంధువులు, మిత్రుల ఇంటికి ఒక చిన్న ‘క్రిస్మస్ కేక్’తో వెళ్లి వారిని సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తండి. మీరన్న ఒక మాట లేదా మీ పొరపాటు కారణంగా మనసు నొచ్చుకుని మీతో ముభావంగా ఉన్నవారిని ఒకసారి ప్రేమతో పలకరించి వారికి క్షమాపణ చెప్పండి. మీ సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి ఎంతోకొంత సాయం అందచేయండి. ఆప్తులను పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న వారిని, ఆసుపత్రులలో పడక మీద ఉన్న మీకు తెలిసిన వారిని వారి బంధువులను పరామర్శించి మీ ప్రేమను తెలుపండి. మీరు మీకోసం తయారు చేసుకున్న కేక్లు ఎంత తీయగా ఉంటాయో అప్పుడు తెలుసుకోండి. మీ ఇంట్లో ఈ క్రిస్మస్కు అలంకరించిన దీపాలు ఎంతగా మిరుమిట్లు గొలుపుతాయో అప్పుడు మీరే గ్రహిస్తారు. ఒక్కసారిగా మీ హృదయం, జీవితం కూడా ఎంత తేలికవుతుందో మీరే గ్రహిస్తారు. అన్నీ ఈ ఒక్కరోజే చేయాల్సిన అవసరం లేదు. ఈ వారమంతా క్రిస్మస్ వారమే! ఈ వారం రోజుల్లో ఏదో ఒక రోజు ఈ పనులకు పూనుకోండి. ఇవి పుట్టెడు ఆనందాన్నిచ్చే చిట్టిచిట్టి పనులు. ఇదే ఏసుప్రభువు బోధించిన ప్రేమమార్గం. ఈ మార్గంలో ఎవరికీ ఓటమి లేదు. అంతా విజేతలే! సారీ చెప్పినవారు, చెప్పించుకున్న వారు అంతా సమానులే! ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. ఇది ఎన్నటికీ విఫలంకాని విజయసూత్రమని ప్రభువే రుజువు చేసి చూపించాడు. ఇదే మనమంతా అనుసరించాల్సిన మార్గమనీ ఉద్బోధించాడు. అంతా యేసుప్రభువులు కానక్కరలేదు. ఎందుకంటే కాలేరు కూడా! అయితే ఆయన బోధించిన ఈ మార్గంలో మనమంతా ఒకటి రెండు అడుగులు వేసినా ఈ లోకం అనూహ్యంగా ఆనందమయమవుతుంది. కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా అంతా అర్థవంతంగా, ఆశీర్వాదకరంగా క్రిస్మస్ జరుపుకోవడానికి ఇది అత్యుత్తమమైన మార్గం. -
క్రిస్మస్ కేకు
ఉత్కంఠత భరించలేక పోతున్నాను. మూత తీసి చూసేద్దామంటే అమ్మ సంగతి తెలుసుకదా. ‘‘నేను రాకుండా నిన్నెవడు మూత తియ్యమన్నాడురా రాస్కెల్’’ అని నావీపు చిట్లగొట్టినాకొడుతుంది. ఊపిరి బిగబట్టి చూస్తున్నాను, అమ్మ ఎప్పుడొచ్చి మూత తీస్తుందా అని. పాపం మా నాన్న...తాతయ్యకీ నానమ్మకీ సొంతకొడుకు కాదట. పెంచుకున్నారట. తెచ్చుకున్న కొన్నాళ్ళకి పెంచుకున్నావిడ హఠాత్తుగా చనిపోయిందట. చక్కగా తిరుగుతూ ఎంతో ఆరోగ్యంగా ఉండే ఆవిడలా అర్ధాంతరంగా చనిపోవడానికి కారణం మా నాన్నే అనీ, అందుకని ఆయన్ని ఇంకెవరికైనా ఇచ్చేస్తే బాగుంటుందనీ బంధువులంతా అనుకుంటుంటే, మా తాత మాత్రం వాళ్లని వీరోచితంగా ఎదుర్కొని అందరి నోళ్ళూ ముయ్యించాడట. మా నాన్నని పెంచే బాధ్యత తన భుజస్కంధాలమీదే వేసుకొని పెంచేడట కూడానూ. అందుకే మా నాన్నకి తాతంటే చెప్పలేనంత ఇష్టం. తాత కొంచెం పెద్దాడైపోయాక తనని మా దగ్గరకి తీసుకొచ్చేసారు నాన్న. తీసుకొచ్చేముందు మమ్మల్నందర్నీ చుట్టూ కూర్చోబెట్టుకొని ‘‘తాత రేపు సాయంత్రానికి మనింటికి వచ్చేస్తాడు. ఇంకెప్పుడూ ఇక్కడే మనతోనే ఉంటాడు. అందరం తాతని ప్రేమగా, జాగ్రత్తగా చూసుకోవాలి సుమా. ఎవ్వరూ ఒక్క మాట కూడా అనడానికి వీల్లేదు’’ అని చాలా గట్టిగా హెచ్చరించారు. సరేనని బుద్దిగా తలలూపేం అందరం. కాకపోతే నాన్న చెప్పినట్టు తాతని ప్రేమగా చూసుకోవడం, అంత ‘వీజీ’ కాదని తాత వచ్చిన కొద్దిరోజుల్లోనే తెలిసిపోయింది నాకు. ఎలాగంటే, వచ్చిన దగ్గరనుండీ కనిపెడుతున్నాను కదా మా తాతకి నాకంటే మా తమ్ముడంటేనే ఎక్కువిష్టం. ‘‘ఆడి నడకా ఆడి నవ్వూ, అచ్చు మీ నాన్నేరా అబ్బాయ్’’ అనేవాడు మురిసిపోతూ. ‘‘ఆడ్ని చూస్తుంటే చిన్నప్పటి మీ నాన్నని చూస్తన్నట్టే ఉంటాదిరా’’ అని తెగ ఆనందిస్తూ ఉండేవాడు వాడ్నిచూసి. సరే పోనీలే పాపం ఏదో ముసలాడు ముచ్చట పడుతున్నాడని క్షమించేసేవాడ్నేమో. కాని తాత చేసే పనులుచూస్తే మాత్రం క్షమించడం అటుంచి సహించడమే కష్టమైపోయేది నాకు. నాకొక పదిపైసలో పావలావో పారేస్తే, వాడికేమో అర్థరూపాయో, రూపాయో ఇచ్చేవాడు. నన్నెప్పుడైనా బయటకి తీసుకెళ్తే ఒక పకోడీపొట్లంతో సరిపెట్టేసే తాత, మా తమ్ముడికి మాత్రం, పకోడీతో పాటు, ఒక లడ్డూ గాని, రెండు జిలేబీలుగాని కొనిపెట్టేవాడు. అప్పుడప్పుడూ కూల్ డ్రింక్ కూడా ఇప్పించేవాడట. ఇంతేకాకుండా తగరపువలస ‘శ్రీ సీతారామా పిక్చర్పాలెస్’ లో సినిమాలకి వాడ్ని తీసుకెళ్ళడమే కాకుండా, ‘కుర్చీ’ క్లాస్లో కూర్చొని మరీ సినిమా చూసొచ్చేవారిద్దరూ. నాకేమో మా అమ్మ పుణ్యమా అని ‘బెంచీ’ టికెట్టుకి కూడా గతిలేని బతుకు. నేల టికెట్టే. (అది కూడా సంవత్సరానికి ఒకసారే). తాత చేసే ఈ పనులేవీ నాకు తెలియవనుకునేవాడు గాని, మనం మాత్రం ఈ సమాచారం అంతా మా తమ్ముడి దగ్గరనుండి ఎప్పటికప్పుడు సేకరించి బుర్రలో జాగ్రత్తగా భద్రపరుచుకుంటున్న విషయం ఆయనకి తెలీదు పాపం. ఇంత తెలుసుకున్న నాకు కడుపుమండడం సహజంకదా. దాంతో తాతని ప్రేమగా చూసుకోవడం....అబ్బే జరిగేపని కాదని చాలా స్పష్టంగా అర్థమైపోయింది నాకు. అంతే, ఇక అప్పట్నుండీ నాకూ తాతకీ మధ్య కుక్కా–పిల్లీ వైరం చోటుచేసుకుంది. స్కూలుగ్రౌండులో ఫుట్బాల్ ఆడుకుంటున్నప్పుడో, ఇంట్లో చెల్లెళ్ళతో చింతపిక్కలాట ఆడుతున్నప్పుడో తప్ప ఎప్పుడూ తాతని ఏదో దానికి ఏడిపించడం... రెండుమూడు రోజులకొకసారైనా దొరికిపోయి నాన్నతో తట్లుదేరిపోయేలా తన్నులు తిని ఏడుస్తూ ఓమూల కూర్చోవడం నిత్యకృత్యం అయిపోయింది. అలా ఏడుస్తూ కూర్చుంటే మా బేబీ చెల్లి కూడా నాతో పాటూ ఏడుస్తూ నా ఒంటిమీద తేరిన తట్లుకి కొబ్బరినూనె రాయడం....అది వేరే కత. ఈ విధంగా మన జీవితం ముప్పైతన్నులూ, అరవై తిట్లూ చందాన వర్ధిల్లుతుండగా అక్టోబర్ నెల రావడం, వెళ్ళిపోవడం, దాని వెంబడే నవంబరు నెల ప్రవేశించడం చూస్తుండగానే జరిగిపోయింది. నవంబరు నెల వచ్చిందంటే ఇంటిముంగిట్లోకి క్రిస్మస్ వచ్చేసినట్టే. ఇంటికి సున్నాలూ, ఫర్నిచర్కి పాలీషూ, వేసుకోవడానికి కొత్తబట్టలూ, తినడానికి కేకులూ. ఇలా నెల రోజులూ ఊపిరితిరగని పని. అమ్మకైతే మరీనూ. అయితే క్రిస్మస్కి సంబంధించిన పనులన్నీ ఒకెల్తైతే, కేకు చెయ్యడం ఒక్కటీ ఒకెత్తు. దానికి కారణాలు రెండు. క్రిస్మస్ కేకు బాగా పొంగి రుచిగా కుదిరితే ఆ సంవత్సరం అంతా బాగుంటుందనే నమ్మకం మా అమ్మకి ఉండడం ఒక కారణం ఐతే, కేకు రుచిగా, అందంగా చెయ్యడం అనే విద్య అమ్మకి అస్సలు రాకపోవడం ఇంకొక ముఖ్యకారణం. ఈ రోజుల్లో అయితే వీధికొకటీ సందుకొకటీ బేకరీలూ అందులో మనకి కావలసిన సైజుల్లో, రంగుల్లో, రుచుల్లో రకరకాల కేకులూను. అప్పుడలా కాదుకదా. ప్రతీదీ ఇంట్లో చేసుకోవడమే. చెయ్యడానికి కావలసిన దినుసులు కూడా మా భీమిలీలో దొరికేవి కాదు. వైజాగో విజయనగరమో వెళ్ళాల్సి వచ్చేది వాటికోసం.అవి తీసుకొచ్చేస్తే కేకు తయరైపోదు కదా. చాలా కథుంది కేకు తయారవ్వడానికి. దీపావళి మతాబులు తయారుచెయ్యడానికి ఎంత శ్రద్ధగా, జాగ్రత్తగా కొలత ప్రకారం పాళ్ళు కలుపుతామో అంతే శ్రద్ధగా దీనిక్కూడా పాళ్ళు, అంటే, పిండీ, గుడ్లూ, వెన్నాలాంటి పదార్థాలు వెయ్యాల్సిన మోతాదులో కచ్చితంగా వేసి, ఆ మిశ్రమాన్ని కనీసం గంటసేపు చాలా బలంగా మర్దించి, అది కాటుకలాగ మెత్తగా అయిన తరవాత తగుమాత్రపు వేడిలో నెమ్మదిగా జాగ్రత్తగా ‘బేక్’ చెయ్యాలి. దినుసులు కొలత ప్రకారం కలపడం ఎంతముఖ్యమో, తగుమాత్రపు వేడిలో జాగ్రత్తగా ‘బేక్’ చెయ్యడం కూడా అంతే ముఖ్యం. పాళ్ళు కొంచెం అటూఇటూ అయినా, వేడి కొంచెం ఎక్కువతక్కువైనా కేకు మఠాషైపోవడం తథ్యం. ఇంత జాగ్రత్తగా చెయ్యాల్సిన కేకు తయారుచెయ్యడంలో మాఊర్లో అందెవేసిన చెయ్యి మా వజ్రమ్మ ఆంటీదే. ఎంత బాగా చేసేవారంటే, ఆంటీ చేసిన కేకు నోట్లోవేసుకుంటే ఐస్క్రీమ్ కరిగినట్టు కరిగిపోయేది. కేకు మీద వేసే ఐసింగ్ అయితే మరీ రుచిగా ఉండేది. తలంచుకుంటే ఇన్ని దశాబ్దాల తరవాత, ఇప్పుడుకూడా నోరూరిపోతుంది..ఆంటీ చేసిన కేకుల ముందు బేకరీలో కొన్న ఏ కేకైనా బలాదూర్ అంటే అతిశయోక్తి కానేకాదు. అమ్మకి మంచి స్నేహితురాలు కావడంతో ప్రతీ క్రిస్మస్కీ కేకు ఆంటీనే చేసిపెట్టేవారు మాకు...ఏజ్ ఎ స్పెషల్ ఫేవర్ టు అమ్మ. క్రిస్మస్ వారం రోజుల్లోకి వచ్చేసింది. అమ్మ మమ్మక్కని పిలిచి ‘‘వజ్రమ్మాంటీ ఇంటికి వెళ్ళి కేకు చెయ్యడానికి ఎప్పుడు వీలవుతుందో.....’’ అమ్మ మాట ఇంకా పూర్తికానే లేదు. రాకెట్ లాగ దూసుకొచ్చేసాడు తాత. ‘‘ఆవిడెందుకమ్మా పెత్తల్లీ. నేను లేనూ. నాకు రాకపోతే కదా మనకి వేరేవాళ్ళు చేసిపెట్టడం. నేను చేస్తానుకదా’’ అంటూ. అమ్మ ముందు ఆశ్చర్యపోయినా తాతకి కేకు చెయ్యడం వచ్చినందుకు సంతోషించినట్టే కనిపించింది. ‘‘అలాగే. నువ్వు చేస్తానంటే అంతకంటేనా. ఏంకావాలో లిస్ట్ రాసివ్వు. వీడ్ని పంపించి తెప్పిస్తాను’’ అంది అమ్మ నావేపు చూస్తూ. సరేనని తాత లిస్టు రాయించడం, అది పట్టుకొని ఆరోజు మధ్యాహ్నమే నేను వైజాగు వెళ్ళి లిస్టులో రాసినవన్నీ కొనుక్కొని మరసటిరోజు మధ్యాహ్నానికి తిరిగిరావడం జరిగింది. ఇంక కేకు తయారుచెయ్యడమే తరువాయి. సామాన్లు తెచ్చిన మరసటిరోజు మధ్యాహ్నానికి ముహూర్తం పెట్టాడు తాత. ముహూర్తం పెట్టి అమ్మతో ‘‘కేకు రేపు చేస్తానుగాని పెత్తల్లీ, అది చేసీటప్పుడు ఈ బాబ్జీగాడ్ని మాత్రం ఆ చుట్టుపక్కలకి రానియ్యకు. ఆడొచ్చేడంటే మొత్తం కంగాళీ చేసేస్తాడెదవ’’ అని చెప్పాడు నావేపు వేలుపెట్టి చూపిస్తూ. అమ్మ వెంటనే ‘‘నువ్వా చుట్టుపక్కల కనిపించేవంటే బాగోదొరేయ్ బాబ్జీగే’’ అని ఠెరిబుల్ వార్నింగ్ ఒకటి ఇచ్చింది నాకు. ఆదెబ్బతో బడెగ్గొట్టేసి కేకు చేస్తున్న తాత పని పడదామనుకున్న నా సంకల్పం చెట్టెక్కిపోయి, ఏడుపు మొహంవేసుకొని బడికెళ్ళాల్సి వచ్చింది. బడికి వెళ్ళేనేగాని నేనేమీ చేతులు కట్టుకొనికూర్చోలేదు. తాత చెయ్యబోయే కేకులు సర్వనాశనం అయిపోవాలని ఒక్క ‘ఏసుప్రభువు’కే కాకుండా ‘వెంకటేశ్వరస్వామికి’ కూడా దండం పెట్టుకున్నాను బళ్ళో కూర్చొని చాలాసార్లు. సాయంత్రం బడి నుండి వచ్చేసరికి, కేకు చెయ్యడం అయిపోయినట్టే ఉంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. తాత వరండాలో మడతకుర్చీలో కూర్చొని ఉన్నాడు ఆతృతగా గేటువైపు చూస్తూ. తాత ఒళ్ళో ఆయన ముద్దులమనవడు. అమ్మ వంటగదిలోఉంది. మధ్యగదిలో చింతపిక్కలాటలో మునిగిపోయి ఉన్నారు చెల్లెళ్ళిద్దరూ. నాన్నింకా స్కూలునుండి వచ్చినట్టులేదు. తాత చేసిన క్రిస్మస్కేకు ఎలా వచ్చిందో అనే ఆతృత నన్ను నిలబడనియ్యటంలేదు. మెల్లగా చెల్లెళ్ళ పక్కకి చేరి నెమ్మదిగా అడిగాను ‘‘కేకు తయారైపోయిందా, ఎలా కుదిరిందీ?’’ అని. ‘‘రాములు తీసుకెల్లేడన్నయ్యా ‘రొట్లోళ్ళ’ బేకరీకి. ఇంకా తీసుకు రాలేదు. దాని కోసమే చూస్తున్నారు తాతా చిన్నిగాడూను’’ అంది మమ్మక్క ఆడుతున్న ఆట నుండి కళ్ళైనా తిప్పకుండా. ‘‘తాతతోటే తేల్చుకుంటేపోలా’’ అనుకొని నెమ్మదిగా తాత పక్కకి చేరాను. ‘‘ఎందుకురా ఇక్కడికి తయారయ్యావ్ . పో ఇక్కడ్నుంచి’’ అన్నాడు తాత నావేపు అనుమానంగా చూస్తూ. ‘‘ఇంకా కేకు రాలేదా తాతా’’ అని అడిగాను తాత మాట విననట్టుగా. ‘‘నీకెందుకురా, ఒచ్చిందో లేదో పో ఇక్కడ్నుండి ’’ అన్నాడు తాత కోపంగా మళ్ళీ. ‘‘గుడ్లూ అవీ కరక్ట్గా లెక్క ప్రకారం వేసేవా తాతా’’ అడిగాను చిన్నగా నవ్వుతూ. ‘‘ఎన్నేయ్యాలో నాకు తెలీదా. నీకు చెప్పాలా ఎన్నేసేనో’’ అన్నాడు నా వేపు గుర్రుమని చూస్తూ. ‘‘కేకు పొంగుతుందంటావా. నిజం చెప్పూ’’ అడిగాను వేళాకోళంగా. ‘‘ఎందుకు పొంగదూ. బ్రహ్మాండంగా పొంగుతాది. అయినా నీకెందుకురా అయ్యన్నీ. పోతావా మీ నాన్నని పిలమంటావా’’ అన్నాడు తాత మరింత కోపంగా. ‘‘ఎందుకో నాకైతే ఈసారి కేకసలు పొంగదనిపిస్తుంది తాతా. నువ్వు బేకింగ్ పౌడర్ ఎక్కువ వేసేసుంటావని నా డౌటు’’ అన్నాను మరింత రెచ్చగొడుతూ. ‘‘నోరు మూస్తావా, పళ్ళు రాలగొట్టెయ్యమంటావా గాడిదా’’ అంటూ కుర్చీ మీద నుంచి లేవబోయాడు తాత. తాత చేతికి అందనంత దూరంగా పారిపోయి ఏదో అనబోతున్నంతలో బేకరీ నుండి వస్తున్న రాములు కనిపించాడు దూరంగా. నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి, బెంజిలారీలా ముక్కులోంచీ నోట్లోంచీ ‘‘ఉష్‡్ష’’ అంటూ గట్టిగా గాలి వదిలి, అతిభారంగా నెత్తి మీదున్న గిన్నెలు రెండూ, అవేవో వంద కేజీల బరువున్న బియ్యంబస్తాలా, డైనింగ్ టేబిల్ మీద దించి పక్కనే ఉన్న స్టూలు మీద చతికిలబడ్డాడు మళ్ళీ ‘ఉష్‡్ష’ అని గాలి వదుల్తూ. ఆత్రంగా రాములి మొహంలోకి చూస్తున్న నాకు అక్కడ ఏ సూచనా కనబడి చావలేదు. ఉత్కంఠత భరించలేక పోతున్నాను. మూత తీసి చూసేద్దామంటే అమ్మ సంగతి తెలుసుకదా. ‘‘నేను రాకుండా నిన్నెవడు మూత తియ్యమన్నాడురా రాస్కెల్’’ అని నావీపు చిట్లగొట్టినాకొడుతుంది. ఊపిరి బిగబట్టి చూస్తున్నాను, అమ్మ ఎప్పుడొచ్చి మూత తీస్తుందా అని. ఐదు నిమిషాలు భారంగా గడిచాక, అమ్మ తీరిగ్గావచ్చి గిన్నెమీద మూత తీసింది. ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి క్షణం పాటూ గిన్నెలోకి చూసింది. తరవాత రెండోగిన్నెమీద మూత కూడా తీసింది గాభరాగా. ఇంతలో నెమ్మదిగా అమ్మ పక్కకు చేరి అత్రంగా వాటిలోకి తొంగిచూసిన మాకు, గిన్నె నిండుగా పొంగి, చిక్కటి బ్రౌన్ కలర్లో నిగనిగలాడుతూ నోరూరించే చక్కటి కేకులు రెండింటికి బదులు......నల్లజీడిపిక్కలా మాడిపోయి, కుంచించుకుపోయి, గిన్నె అడుక్కి బంకలా అంటుకుపోయిన నల్లటి లింగాకారాలు రెండు దర్శనమిచ్చాయి. వాటిని చూసిన తాత మొహం కూడా అచ్చు వాటిలో ఒకదానిలా మాడిపోయింది. నా ఆనందానికి అంతేలేకుండా పోయింది. పొట్టచేత్తోపట్టుకొని, గట్టిగా...ఇంటిపెంకులు ఎగిరిపోయేలా గెచ్చాళీగా నవ్వుతున్న నన్ను చూసిన చెల్లెళ్ళిద్దరూ కూడా నవ్వడం మొదలుపెట్టారు. అమ్మ మాత్రం వస్తున్న నవ్వు బలవంతాన ఆపుకుంటూ త్వరత్వరగా వెళ్ళిపోయింది అక్కడ్నుంచి. తాతా, తమ్ముడూ కనుచూపుమేరలో అబ్బే........ క్రిస్మస్ ఎప్పుడూ ఒంటరిగా రాదు. గతించిన బాల్యాన్నీ దానితో ముడిపడి ఉన్న అనేకమైన జ్నాపకాల్నీ మోసుకొస్తుంది. మోసుకొచ్చి ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. ఇట్ మేక్స్ ఒన్ నాస్టాల్జిక్. అయితే నాస్టాల్జియా ఎప్పుడూ సంతోషాన్నే కలిగించదు. అప్పుడప్పుడూ ‘అప్పుడలా ఎందుకుచేసేను. అలా చెయ్యకపోతే ఎంత బాగుండేది’ అనే పశ్చాత్తాపాన్ని కూడా కలిగిస్తుంది. అలాంటప్పుడు ‘తప్పుచేసేను. క్షమించు’ అని చెప్పాలనిపిస్తుంది.తాతతో అదే చెప్పాలనుందిప్పుడు. కాని చెప్దామంటే తాత ఏడీ. లేడు కదా. ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇంక తిరిగిరాడు కూడా. -
గుంటూరులో మెరిసిన నగ్మా
గుంటూరు ఈస్ట్: నగరంలో ఓ ప్రైవేటు చానల్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలకు సినీ నటి నగ్మా హాజరయ్యారు. సినీ నేపథ్య గాయకులు మనో, శ్రీలేఖ, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ కార్యక్రమంలో తమ గానంతో సందడి చేశారు. జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనందకుమార్, ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా ముఖ్య అతిథులుగా హాజరైన ఈ వేడుకల్లో ఆర్సీఎస్ఎం ఫాదర్ బాలా, ఏఈఎల్సీ అధ్యక్షుడు పరదేశిబాబు, ఏఎంజీ అధ్యక్షుడు మహంతి, పాస్టర్లు, ఫెలోషిప్ ప్రతినిధులు, విశ్వాసులు పాల్గొన్నారు. -
అర్హులైన క్రైస్తవులకు గిఫ్ట్లు అందేలా చర్యలు
విజయనగర్ కాలనీ: క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని అర్హులైన క్రిస్టియన్ సోదరులకు గిఫ్ట్ ప్యాక్లు అందేలా శాసన సభ్యులు, కార్పొ రేటర్లు తగు చర్యలు తీసుకోవాలని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. శనివారం హైదరాబాద్లోని రాష్ట్ర పశు సంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని కాన్ఫరెన్స్ హాల్లో హోంమం త్రితో కలసి క్రిస్మస్ వేడుకల నిర్వహణపై సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఏడాది మాదిరిగానే 9 వేల మంది క్రైస్తవులకు ఎల్బీ స్టేడియంలో విందు నిర్వహిస్తామన్నారు. ఈ విందుకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతార న్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 200 ప్రాం తాల్లో పేద క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాక్లు అందిస్తున్నామన్నారు. ఒక్కో ప్రాంతంలో 500 గిఫ్ట్ ప్యాక్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్రిస్మస్ విందు నిర్వహణకు ఎంపిక చేసిన చర్చిలకు రూ.లక్ష చొప్పున చర్చి బ్యాంకు ఖాతాలో వేస్తామన్నారు. కార్యక్రమం లో ప్రభుత్వ సలహాదారులు ఏకే. ఖాన్, ఎమ్మెల్యేలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
పండగ ఎవరికి?
వచ్చే ఏడాది క్రిస్మస్కు బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు రెడీ అవుతున్నారు బాలీవుడ్ టాప్ హీరోలు ఆమిర్ఖాన్, హృతిక్ రోషన్. గత ఏడాది డిసెంబర్లో ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆమిర్ ఖాన్. ఈ చిత్రం అంతగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. దీంతో తర్వాతి సినిమాకు కాస్త టైమ్ తీసుకున్న ఆమిర్ ఖాన్ ఆస్కార్ అవార్డ్ సాధించిన హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ హిందీ రీమేక్ ‘లాల్సింగ్ చద్దా’లో నటించనున్నట్లు ఇటీవల తన పుట్టినరోజు నాడు వెల్లడించాడు. ‘సీక్రెట్ సూపర్స్టార్’ ఫేమ్ అద్వైత్ చందన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆమిర్ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిందని బాలీవుడ్ సమాచారం. ‘క్రిష్’ ఫ్రాంచైజీలో రానున్న ‘క్రిష్ 4’ సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్కే విడుదల చేయనున్నట్లు హృతిక్ రోషన్ తెలిపారు. సో.. ఇలా వచ్చే ఏడాది క్రిస్మస్కు ఇద్దరు టాప్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నారు. మరి.. బాక్సాఫీస్ వద్ద ఎవరి పంట పండుతుందో, సినిమా విజయంతో ఎవరు పండగ చేసుకుంటారో చూడాలి. అయితే ఇంకా ‘క్రిష్ 4’ సెట్స్ పైకి వెళ్లలేదు. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ కేన్సర్ బారిన పడి, చికిత్స తీసుకుని ప్రస్తుతం బాగానే ఉన్నారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నారు. -
క్రమశిక్షణ లేకుండా పోతుంది... బొత్తిగా!
క్రిస్మస్ పండుగకు ముందటి ఒక జ్ఞాపకమిది: ఇంటికి సున్నాలు, ఒంటికి కొత్త బట్టలూ, పంటి కిందికి కేకులూ, రోజ్ కుకీలూ... అబ్బో సందడే సందడి. కొత్తబట్టలు కొనుక్కోవడానికి విజయనగరం ట్యాక్సీలో వెళ్లడం మరుపురాని అనుభూతైతే, ఆ బట్టలు వైజాగ్లో కుట్టించుకోవడం ఇంకో మరిచిపోలేని జ్ఞాపకం. కాని, ఒక్క తలకత్తిరింపు ప్రహసనమే మరచిపోలేని పీడకల మాకు. పండక్కి మూడురోజుల ముందు మా ఆస్థాన క్షురకుడు వెంకటేశ్వర్లు మా ఇంటికి వచ్చి నాన్నకీ, నాకూ, మా తమ్ముడికి వరసగా క్షౌరం చేసి వెళ్ళిపోవడం ఎప్పట్నుంచో ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. ఆ సంవత్సరం ఆ సంప్రదాయానికి చరమగీతం పాడి, షాపు కెళ్ళి తల కత్తిరించుకోవాలనేది మా తమ్ముడి ప్రయత్నం. ఎందుకంటే అక్కడ అమ్మ ఆజమాయిషీ ఉండదు గనుక వాడిష్టం వచ్చినట్లు కత్తిరించుకోవచ్చని వాడి ఆశ.అదెలా సాధించాలా అనే ఆలోచనలోనే వాడుండగానే ఇరవైరెండో తేదీ వచ్చేసింది. కత్తులూ కత్తెర్లూ చేత్తో పట్టుకొని వెంకటేశ్వర్లు మా ఇంటిముంగిట్లో వాలిపోయాడు మాకు కటింగ్ చేయడానికి. వెంకటేశర్లుని చూడగానే మా వాడి ముఖం బ్రహ్మరాక్షసిని చూసినట్లు భయంతో పాలిపోయింది. సరే, ముందుగా నాన్న కూర్చున్నాడు కత్తిరింపుకి. నాన్న తల కత్తిరిస్తున్నంత సేపూ అక్కడే కూర్చొని వెంకటేశ్వర్లుతో బేరాలాడుతూనే ఉన్నాడు మా తమ్ముడు జుత్తు ఎక్కువ తగ్గించేయవద్దని. వెంకటేశ్వర్లు మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా తల కత్తిరించడంలో నిమగ్నమైనట్లు యమ యాక్షన్ చేస్తున్నాడు.నేను కొంచెం దూరంగా కూర్చొని పేపర్ చదువుతున్నట్టు నటిస్తూ జరుగుతున్న ప్రహసనాన్ని గమనిస్తున్నాను.అమ్మకు అర్థమైపోయింది తమ్ముడేదో ప్లాన్ చేస్తున్నట్లు.అందుకే ఆ చుట్టుపక్కలే తచ్చాడుతోంది ఏదో పని ఉన్నట్లు.వాడేమో అమ్మ అక్కడకు వచ్చినప్పుడు నోరుమూసుకొని, కొంచెం అటువైపు వెళ్లగానే మళ్లీ బ్రతిమిలాడడం మొదలుపెడుతున్నాడు జాలిగా దీనంగా. నాన్నేమో ఇవేమీ అస్సలు పట్టించుకోకుండా తల అప్పచెప్సేసి కళ్లు మూసుకు కూర్చున్నారు అలవాటు ప్రకారం.అరగంట గడిచింది భారంగా.నాన్న జుత్తు కత్తిరింపు అయిపోయింది. తర్వాత వంతు మా తిప్పడిదే. తిప్పడు తెగించేవాడు. తాడోపేడో తేల్చుకోవడానికి సిద్దపడిపోయాడు. అందరికీ... ముఖ్యంగా అమ్మకి వినిపించేలా గట్టిగా....‘‘వెంకటేశ్వర్లూ నా జుత్తు ఎక్కువ తగ్గించకు. కొంచెం పైపైన తీసేసి వదిలెయ్యి చాలు. చెవుల మీదకు అసలు తీయవద్దు’’ అన్నాడు. అంతే!అమ్మ రయ్యిమని దూసుకొచ్చేసింది స్పాట్లోకి.దూసుకొచ్చి భయంకరమైన హుకుం జారీ చేసింది...‘‘వెంకటేశ్వర్లూ వాడికి కటింగ్ ఎప్పుడూ చేస్తున్నట్టే చెయ్యి. ఏమీ మార్చకు. జుత్తు బాగా పెరిగింది. బాగా చెవుల మీదికి తీసెయ్యి’’ అని.అంతే..మా తిప్పడి ముఖం నల్లగా మాడిపోయింది. కళ్లలోకి సర్రన కోపం, చివ్వున కన్నీరూ ఎగదన్నుకొచ్చేసాయి. విసురుగా లేచిపోయాడు స్టూల్ మీద నుండి జుత్తు చెవుల మీదకి ఉంచుకోవడానికి కుదరకపోతే అసలు జుత్తే కత్తిరించుకోనంటూ. దాంతో అమ్మకు పూనకం వచ్చేసింది. ‘‘ఇంట్లో నా మాటకి విలువేమైనా ఉందా. అసలిదంతా ఆ పెద్దవెధవ వల్లే వచ్చింది. డిగ్రీ చదువుతున్న ఆ గాడిదకెలూగు చెప్పలేను. తొమ్మిదో క్లాసు చదువుతున్న ఆ చిన్నగాడిదకి కూడా...’’ ఇలా సాగిపోతుంది వాక్ప్రవాహం.నాన్న మాత్రం తమ్ముడి బాధ పడలేక...‘‘పోనిలేవే పాపం. క్రిస్మస్ కదా ఈ ఒక్కసారీ వాడి ఇష్టం వచ్చినట్టు కట్ చేయించుకోనివ్వకూడదూ. వాడూ పెద్దోడవుతున్నాడు కదా’’ అని అన్నారో లేదో దాడి మొత్తం ఆయన మీదికి మళ్లింది.‘‘నేను చెప్తూనే ఉన్నాను కదా...మీ వల్లే ఈ గాడిదలు ఇలా భయం, భక్తీ లేకుండా తయారవుతున్నారని. క్రమశిక్షణ లేకుండా పోతుంది బొత్తిగా! (ఇది మాఅమ్మ ఫెవరెట్ డైలాగ్). వీళ్లిలా తయారవడానికి కారణం మీరే. మీ వల్లే ఇదంతా’’ఇక తమాయించుకోవడం నా వల్ల కాలేదు.గట్టిగా నవ్వడం మొదలు పెట్టాను.నాతో పాటు నాన్న కూడా.అంతే మా తమ్ముడి సహనం చచ్చిపోయింది. అమ్మని ఎదిరించి ఇటువంటి విషయాల్లో వాడే కాదు నాన్న కూడా ఏమీ చేయలేరన్న విషయం చాలా స్పష్టంగా ఇంకొకసారి అవగతం అయ్యింది. క్రిస్మస్కి కనీసం చెవుల ఉప్పెనలా నిరాశ, నిస్పృహ ఆవహించి, తల విషయం తన తల రాతకి, భగవంతుడికీ వదిలేసి...‘‘వెంకటేశ్వర్లూ ఇంకా చెక్కేయ్. నీ ఇష్టం వచ్చినట్టు చెక్కేయ్. నేనేమైనా అంటే నీ చెప్పిచ్చుకు కొట్టు. కానీయ్’’ అని తల వంచుక్కూర్చున్నాడు.ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న వెంకటేశ్వర్లు తన కత్తెరతో వాడి తల మీద విలయతాండవం చేయించాడు. వాడి జుట్టు గుప్పెటకందనంత పొట్టిగా, చెవులకి అంగులంమీదుగా గొరిగేసాడు. చూస్తుండగానే మా తిప్పడి బుర్ర పంపరపనసకాయలా గుండ్రంగా రూపాంతరం చెందింది. దాన్ని చూసిన అమ్మ ముఖం ఆనందంతో దీపావళి మతాబులా వెలిగితే మా తిప్పడిముఖం మాత్రం చీదేసిన చిచ్చుబుడ్డిలా మాడిపోయింది. వాడి క్రిస్మస్ సర్దా అంతా మా ఊరి ఉప్పుటేట్లో కలిసిపోయింది. – పి.కృపాకర్, హైదరాబాద్ -
కువైట్లో తెలుగువారి మృతి
కువైట్ సిటీ : కువైట్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు మృతి చెందారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిలో ప్రార్థనలు ముగించుకుని తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో ఒకరు రాయచోటికి చెందినవారు కాగామరొకరు కాకినాడ వాసిగా గుర్తించారు. వీరు కైరవాన్ ప్రాంతంలో ఇంటిపనులు చేసి జీవనం సాగిస్తున్నట్టుగా తెలిసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
వాటికన్ సిటీలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
వాటికన్ సిటీ: ఉరుకులు పరుగుల యాంత్రిక జీవనానికి దూరంగా గడపాలని క్రిస్మస్ వేడుకల సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ మంగళవారం పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. పోప్ ప్రసంగం వినేందుకు సోమవారం రాత్రి వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికా చర్చికి వేల సంఖ్యలో క్రైస్తవులు హాజరయ్యారు. ‘నేటికీ మానవుడి జీవితం నిరాశ నిస్పృహలతో నిండి ఉంది. కొందరు విలాసవంతమైన జీవనాన్ని గడుపుతుంటే మరికొందరు ఓ పూట రొట్టె ముక్క కోసం ఇబ్బంది పడుతున్నారు..’అని పోప్ వ్యాఖ్యానించారు. ఇటు జీసస్ జన్మస్థలంగా భావించే బెత్లెహాంలో కూడా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు భారీగా తరలివచ్చారు. -
ప్రభువా.. మన్నించు!
సాక్షి ప్రతినిధికడప: ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి క్రిస్మస్ రోజున వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏసు వర్ధంతి రోజు క్రిస్మస్ జరుపుకుంటారని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా మాజీ మంత్రి వీరారెడ్డి మృతి రోజు ఏసు వర్ధంతి రోజు ఒకటేనని సెలవు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏసుక్రీస్తు జయంతి రోజున (డిసెంబర్ 25) క్రిస్మస్ పండుగ చేసుకుంటారు. అందులో భాగంగానే మంగళవారం బద్వేల్ పట్టణంలో మాజీ మంత్రి వీరారెడ్డి వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న అమాత్యుడు ఏసుక్రీస్తు చనిపోయిన రోజే మాజీ మంత్రి వీరారెడ్డి చనిపోయారని వెల్లడించారు. వాస్తవంగా ఏసుక్రీస్తు శిలువ ఎక్కిన రోజున ‘గుడ్ప్రైడే’ నిర్వహించడం క్రైస్తవుల సంప్రదాయం. ఆ మాత్రం పరిజ్ఞానం కూడా మంత్రికి లేదా.. లేకపోతే తాను ఏమి మాట్లాడినా చెల్లుబాటు అవుతోందనే థోరణా... అని పలువురు చర్చించుకోవడం కనిపించింది. గతంలో ‘ఎస్సీలు సక్రమంగా చదువుకోరు. పరిశుభ్రంగా ఉండరు. ప్రభుత్వాలు ఎంత ప్రోత్సహించినా మారరంటూ’ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ మంత్రి అయి ఉండీ ఏమిటీ తీరు ప్రశ్నిస్తున్నారు. -
ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
అక్కడ జనవరి 7న క్రిస్మస్..!
నేడు ఏసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా క్రైస్తవ సోదరులంతా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకొంటున్నారు. ఇందులో భాగంగా బంధువులను కలవడం.. చర్చికి వెళ్లి ప్రార్థనలు చేయడం.. స్వీట్లు పంచుకోవడం ఇవి దాదాపుగా అన్ని చోట్ల జరిగేవే. అయితే కొన్ని దేశాల్లో మాత్రం క్రిస్మస్ రోజున కొన్ని ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు. ఆ వివరాలు ఓ సారి చూద్దాం.. రోడ్లపై తిరగొద్దు వెనుజులా, కరాకస్ వంటి ప్రాంతాల్లో క్రిస్మస్ రోజున కార్లు రోడ్ల మీద తిరగకూడదు. పండగ పూట ప్రజలు గుంపులుగా స్కేటింగ్ చేసేందుకు వీలుగా రోడ్లను ఖాళీగా ఉంచాలని నియమం. ఈ రూల్ ఎన్నో ఏళ్లుగా అక్కడ అమల్లో ఉంది. ఇక జర్మన్ల విషయానికొస్తే... వారు క్రిస్మస్ ట్రీలో పచ్చళ్లను దాచి పెట్టుకుంటారు. మేక బొమ్మ దహనం దసరా పండుగ రోజున మన దగ్గర రావణ దహనం చేసినట్లుగానే... క్రిస్మస్ పర్వదినాన స్వీడన్లో పెద్ద మేక బొమ్మను దహనం చేస్తారు. 1966 నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. సంపద కలిసి వస్తుందని.. స్లోవేకియాలో ఓ వింత ఆచారం ఉంది. క్రిస్మస్ డిన్నర్ని ప్రారంభించడానికి ముందు ఇంటి పెద్ద ఆ రోజు తయారు చేసిన ఓ ప్రత్యేక వంటకాన్ని స్పూన్తో తీసుకుని ఇంటి సీలింగ్ మీదకు విసురుతాడు. ఎంత ఎక్కువ పదార్థం సీలింగ్కు అంటుకుంటే వారికి ఆ ఏడాది అంత ఎక్కువ సంపద కలిసి వస్తుందని నమ్మకం. అక్కడ జనవరి 7న.. ప్రపంచమంతా డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకొంటే.. రష్యా, ఉక్రెయిన్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం జనవరి 7న క్రిస్మస్ జరుపుకుంటారు. ఆర్థోడాక్స్ సంప్రదాయాలు పాటించే చర్చిల్లో దాదాపు 40 రోజుల ముందుగానే ఈ వేడుకలు ప్రారంభిస్తారు. జనవరి 6 సాయంత్రం తొలి నక్షత్రం కనిపించేంత వరకూ ప్రార్థనలు జరుపుతారు. దెయ్యాల భయంతో.. క్రిస్మస్ రోజున చీపుర్లను, ఇంటిని శుభ్రం చేసే వస్తువులను దాచి పెడతారు నార్వే ప్రజలు. క్రిస్మస్ రోజున దెయ్యాలు, ఆత్మలు చీపుర్ల సాయంతో ఆకాశంలో ఎగురుతాయని నార్వే ప్రజలు నమ్మకం. అందుకే ఆ రోజున వారు తమ చీపుర్లను దాచి పెడతారు. దెయ్యాలను బెదిరించడం కోసం మగవారు ఆరుబయట నిల్చుని తుపాకి కాలుస్తారు. బీర్తో స్వాగతం సాధారణంగా అందరూ క్రిస్మస్ రోజున స్వీట్లు, స్నాక్స్తో సాంటా క్లాజ్కు ఆహ్వానం పలికితే ఐర్లాండ్ ప్రజలు మాత్రం తమ దేశ సంప్రదాయం ప్రకారం బీర్తో ఆయనకు స్వాగతం చెబుతారు. సెలవు రోజుల్లోనే ఎక్కువగా.. క్రిస్మస్కు ముందు రోజు రాత్రంతా చదువుకుంటూ కూర్చుంటారు ఐస్ల్యాండ్ ప్రజలు. స్నేహితులకు, బంధువులకు కూడా పుస్తకాలనే బహుమతులుగా ఇస్తారు. ఒక సంవత్సరంలో ఐస్ల్యాండ్ పబ్లిష్ అయినన్ని బుక్స్ మరే దేశంలోనూ పబ్లిష్ కావు. మిగతా రోజుల్లో కంటే సెలవుల్లో ఇక్కడ ఎక్కువ పుస్తకాలు అమ్ముడు పోతాయి. -
ఎయిర్లైన్స్ న్యూ ఇయర్ ఆఫర్లు
న్యూఢిల్లీ: క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా విమానయాన సంస్థలు దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో భారీ తగ్గింపు ఆఫర్లను ప్రకటించాయి. చమురు ధరల భారంతో నష్టాలతో నెట్టుకొస్తున్నప్పటికీ, పోటీ పరంగా ఎయిర్లైన్స్ సంస్థలు దూకుడుగానే ఉన్నాయి. నవంబర్ నెలలో విమాన ప్రయాణికుల ట్రాఫిక్ 11.03 శాతం పెరిగింది. 116.45 లక్షల మంది ప్రయాణికులు ఈ నెల్లో విమానాల్లో ప్రయాణించారు. అయితే, ఈ వృద్ధి రేటు గత నాలుగేళ్ల కాలంలోనే అతి తక్కువ. అంతకుముందు అక్టోబర్ నెలలో ట్రాఫిక్ వృద్ధి 13.34 శాతంగా ఉంది. జెట్ఎయిర్వేస్: పరిమిత కాలం పాటు అమల్లో ఉండే విధంగా దేశీయ, అంతర్జాతీయ సర్వీసుల్లో టికెట్ చార్జీలపై 30 శాతం తగ్గింపు ఇస్తోంది. జనవరి 1వ తేదీ అర్ధరాత్రి వరకు టికెట్ బుకింగ్లపై ఈ ఆఫర్లు అమల్లో ఉంటాయి. ఒకవైపు, రానుపోను ప్రయాణాలకూ, బిజినెస్, ఎకానమీ తరగతుల టికెట్లపైనా తగ్గింపు ఇస్తోంది. అంతర్జాతీయ మార్గాల్లో జనవరి 7, ఆ తర్వాత ప్రయాణాలకు తగ్గింపు ధరలపై టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. గో ఎయిర్: గో ఎయిర్ సంస్థ థాయిలాండ్లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఫుకెట్లో వచ్చే నెల 10–13వ తేదీల మధ్య జరిగే యాట్ షో నేపథ్యంలో, ఫుకెట్ ప్రయాణ టికెట్లపై 50 శాతం తగ్గింపును ప్రకటించింది. భారత్ నుంచి ఫుకెట్కు నేరుగా విమాన సేవలను ప్రారంభిస్తున్న తొలి సంస్థ ఇదే. స్పైస్జెట్: హైదరాబాద్ నుంచి కోల్కతా, పుణె, కోయంబత్తూర్కు జనవరి 1 నుంచి కొత్తగా ఎనిమిది విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. బెంగళూరు, కొచ్చి, పోర్ట్బ్లెయిర్, బాగ్డోగ్రా మధ్య ఎనిమిది సీజనల్ విమాన సర్వీసులను జనవరి 5 నుంచి ఫిబ్రవరి 28 మధ్య నడపనున్నట్టు తెలిపింది. హైదరాబాద్ నుంచి వివిధ గమ్యస్థానాలకు మొత్తం మీద 41 విమానాలను నడపనుంది. హైదరాబాద్– కోల్కతా మార్గంలో రూ.2,699కే టికెట్లను ఆఫర్ చేస్తోంది. అలాగే, కోల్కతా–హైదరాబాద్ మార్గంలో రూ.3,199కే టికెట్ బుకింగ్కు అవకాశం కల్పించింది. ఇక హైదరాబాద్–పుణె మధ్య రూ.2,499, రూ.2,209 ధరలను నిర్ణయించింది. హైదరాబాద్– కోయంబత్తూరుకు రూ.2,809, తిరుగు ప్రయాణ టికెట్ను రూ.2,309కే ప్రమోషనల్ ఆఫర్ కింద అందిస్తున్నట్టు స్పైస్జెట్ పేర్కొంది. -
మాయమ్మ చేసిన క్రిస్మస్ కేకు
పలాసకు ఆరు మైళ్ళ దూరంలో డెబ్బై గడపలున్న మా ఊళ్లో ప్రభువును నమ్ముకున్న కుటుంబం మాదొక్కటే. దసరాకీ, గౌరీపూజకీ వడపప్పు, అరిసెలు, మెత్తటి గారెలు ఇరుగూ పొరుగు పంపిస్తే తినడమేగానీ క్రిస్మస్కు, ఈస్టర్కూ ఒక కేకుముక్కో, గులాప్పువ్వో వండి పక్కింటికీ ఎదురింటికీ పంపడానికి మాయమ్మకు సేతులొచ్చేవి కాదు. ఆ సమచ్చరం క్రిస్మసుకు ముందు పలాసా చర్చీ నుండి పాదరుగారు, సిస్టర్గార్లు ఒక రాత్రి పూట జీపులోవొచ్చి ఊరంతా నిద్రలెగిసినట్లు క్రిస్మస్ పాటలు పాడి మా ఇంటికొస్తే తెల్లటి బట్టల్లోన ఉన్న పాదరు గారిని సూడ్డానికి పక్కింటి రామారావు, ఆళ్ళావిడా ఒచ్చారు. వాళ్లు పాదరు గారితో ‘ఈ మొగుడూ పెళ్లాం మీ పండగ రోజు పిల్లడ్ని పట్టుకొని చర్చీకొచ్చీడమూ, పొద్దల్లా అక్కడే ఉండిపోయి పొద్దోయికి మీరిచ్చిన పాలుగుండ, పంచదార పట్టుకొని పార్రాడమే గాని ఒక కేకో , పండో, కాయో ఎవులకీ ఇచ్చింది లేదు’ అని చెప్పగానే మాయమ్మ , నాయిన మొఖాలు సున్నం రాసినట్లయిపోయినాయి. పాదరుగారు మాయమ్మతోటి ‘సరోజినమ్మా .. పండుగంటే సంతోషం పంచుకోవటం కదా. ఇరుగూ పొరుగుకు పండగపూట ఒక తీపో, కారమో చేసి పంపాలి. ఈ సంవత్సరం కేక్ చేసి అందరికీ పంచు’ అన్నారు. ‘దానికి తరవాని పులుసు సెయ్యడమే రాదు ఇంకా కేకు ఎక్కడ సేస్తాది’ అన్న మా నాయిన మాటలకు నవ్వీసి ‘కేక్ చెయ్యక్కర్లేదు. బజార్లో దొరుకుతుంది. కొనేసి ఊరంతా పంచండి ‘ అని సెప్పీసి పాదరుగారు ఎల్లిపోయారు. దాంతో ఈసారి క్రిస్మసుకు అరిసెలు వండీసి, మిగిలిపోయిన అరిసిల పిండిలో ఇంకొంచం నీళ్లు కలిపి పొంగడాలు సేసి, దానితోటి ఒక కేకు ముక్క కూడా ఊరంతా పంచీసి ఉన్న సెడ్డపేరును సెరిపీసుకోవాలని మాయమ్మ నాయిన అనుకున్నారు. క్రిస్మస్సుకు ఊరందరికీ పంచడానికి ఎంత కేకు కావాలని మాయమ్మ మా నాయిన ఆలోచన సేస్తే సుమారు నాలుక్కేజీలు కావాలని లెక్క తేలింది.నాలుక్కేజీల కేకు రేటెంత అని అడిగితే పలాసల కోవాకొట్టు గురుమూర్తి వందరూపాయలు సెప్పినాడు. మా నాయిన బుర్ర మీద గుడ్డేసుకుని ఇంటికొచ్చి విసయం సెప్పి, వందరూపాయల అప్పు ఇచ్చెటోడు ఇప్పుడుకిప్పుడు ఎక్కడ దొరుకుతాడని మాయమ్మనడిగాడు. మాయమ్మ అప్పుడికే తను దాసుకున్న సొమ్ముతోటి మా నాయినకొక పంచి, నాకు ఎర్ర నిక్కరు, పసుపు జుబ్బా , దానికి ఒక సీర కొనీసింది.మిగిలిన డబ్బులుకి పప్పలు సెయ్యడానికి నూని కొనీసి, ఆరబెట్టిన బియ్యము మిల్లాడించేసి రడీగా ఉన్నాది. కేక్ కొనడానికి ముప్పై రూపాయలు పట్టుకెల్లిన మా నాయిన పప్పులుడకలేదు. తెల్లారితే క్రిస్మస్సు. ఇరవై నాలుగు తేదీ రాత్రి చర్చికి ఎల్లడానికి ముందే పప్పల వంట పూర్తి చేసీసింది మా యమ్మ. ఆ రాత్రి యేసయ్య పాటలతో, కొవ్వొత్తుల కాంతులతో చర్చంతా ప్రభువు పుట్టిన గడియల్ని పండుగ సేసుకున్నాం. ఊరికి బయలుదేరుతుంటే పాదరుగారు ‘కేక్ పంచుతున్నారా లేదా’ అని మా నాయినను అడిగితే మొగమాటంగా తలూపీసి ఊరికి పారొచ్చినాము. మాయమ్మ దారంతా సణుక్కోనొచ్చింది.ఇంటికొచ్చినప్పడుకి వేకువజామైపోయింది. నేను రాగానే పడుకుండి పోయినాను. పొద్దున్న నేను లెగిసినప్పుడికి మాయమ్మ , మా నాయిన ఇద్దరూ ఇంటిలోన లేరు. కానీ ఎదురుగా నల్లటి రంగులోన కొంచం మిగిలున్న కేకు కనిపించింది. అది పెద్ద అట్ట మీద ఉంది. చాలా కేకు ఎవరో తినీసినట్లు అర్థమవుతున్నది. అంత పెద్ద కేకు ఎక్కడిది, ఎవరు తెచ్చారు అని నేను ఆలోసిస్తుంటే మాయమ్మ మొకమంతా పళ్ళు చేసుకొని లోపలికొచ్చింది. ‘ఊర్ల ఒక్కిల్లు ఒగ్గకుండా పంచీసినాను. పక్కింటి రామారావు నాలుగు ముక్కలు ఒక్కడే తినీసాడు బెగ్గురోడు’ అని ‘ఇది మొత్తం నీకే నాయినా.. తినీ’ అని అన్నాది.‘డబ్బుల్లేవని నాయిన అన్నాడు కదా.. మరిప్పుడెలగ కొన్నాడమ్మా’ పెద్ద ముక్కను తెంపి నోట్లో కుక్కుకోబోతూ అడిగాను. ‘మీరు పక్షులను చూడుడు. అవి విత్తవు, కోయవు’ అని పాదరు బైబిల్లోన మాటలు సెప్తారు కదా .. ఇదీ అలగే . మన పరిస్థితి జీపు డ్రైవరు జీవరత్నము తెలిసిన నలుగురికీ సెప్పితే, చర్చిలోనే కలిగినోళ్లందరూ నాలుగు డబ్బులేసుకొని కొవాకొట్టులోన డబ్బులు కట్టి జీవరత్నము తోటే తెల్లవారినప్పుడుకి పంపించినారు. మీ నాయన అరిసిలు, కేకు ముక్క పట్టుకొని జీవరత్నంఇంటికే బయల్దేరినాడు. ఈ ఊర్ల యేసును నమ్ముకున్న ఒక్క కుటుంబము మనది. ఉన్న రెండు పండుగలూ జరుపుకోలేని జరుగుబాటు మనది. ఈ సమ్మచ్చరం మనము సక్కగా క్రిస్మస్సుసేసుకున్నట్లు సేసిన ఆల్లందరూ సల్లగుండాలని ప్రార్ధన సెయ్యు నాయినా’ అని సెప్పింది మా యమ్మ. నేను గోడకున్న ప్రభువు ఫొటో ఉన్న కాలెండర్ దుక్కు సూసి, సిలువ గుర్తు ఏసుకుని .. కళ్ళు మూసుకుని ఆమెన్ అనుకున్నాను. - కె.వి. కరుణకుమార్