




టాలీవుడ్ దర్శకుడు సందీప్ రాజ్ తిరుమలలో వివాహం చేసుకున్నారు. 'కలర్ ఫోటో' సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చకున్న ఆయన తన తొలి మూవీలో చిన్న పాత్ర చేసిన చాందిని రావుతో కలిసి ఏడడుగులు వేశారు.

కొద్దిరోజుల క్రితం వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి

షార్ట్ ఫిల్మ్లతో కెరీర్ ప్రారంభించిన సందీప్ రాజ్ .. కలర్ ఫోటో చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు

అయితే, తిరుమల వేదికగా నేడు చాందిని రావుతో ఆయన వివాహం ఘనంగా జరిగింది

సినిమా చిత్రీకరణ సమయంలో ఏర్పడిన వారిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారడం ఆపై మూడు ముళ్ల బంధం వరకు సాగడంతో వారు చాలా సంతోషంగా కనిపించారు

పెద్దల అంగీకారంతోనే జరిగిన ఈ వేడుకలో కలర్ ఫోటో సినిమాలో నటించిన హీరో సుహాస్, వైవా హర్ష పాల్గొన్నారు












