
హీరోయిన్ కత్రినా కైఫ్ తన బెస్ట్ ఫ్రెండ్ కరిష్మా కోహ్లి పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. వెడ్డింగ్ సెలబ్రేషన్స్కు హాజరవడమే కాకుండా డ్యాన్స్ కూడా చేసింది.

బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్ అంటూ పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

కరిష్మా.. నీలా ఎవరూ ఉండరు. 16 ఏళ్ల క్రితం నువ్వు కలిశావ్.. నీ చలాకీతనం నన్ను కట్టిపడేసింది.

మంచీచెడులో ఎల్లప్పుడూ నాకు తోడుగా నిలబడ్డావ్.. నీ జీవితంలో ఏం జరుగుతున్నా పట్టించుకోకున్నా నాకు అండగా నిల్చున్నావ్.

నువ్వు నిజంగా చాలా గొప్పదానివి. నువ్వు, మైఖేల్ అందమైన జీవితాన్ని కొనసాగించండి అని రాసుకొచ్చింది.

బాలీవుడ్లో ఎన్నో సినిమాలు చేసిన కత్రినా తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు చిత్రాల్లో నటించింది.




