

అమృత ఫడ్నవీస్ సింగర్గా రాణిస్తూనే తన భర్త కంటే ఎక్కువగా ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహరాష్ట్ర, జార్ఖండ్లో ఎన్నికలు ముగిశాయి.

మహరాష్ట్రలో మహాయుతి కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మరాఠాల ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టారు.

ఆయన గెలుపు కోసం సతీమణి అమృత ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం చేసింది.

తాజాగా తన భర్త ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా హాజరైంది.

అయితే నాగ్పూర్లో పుట్టి పెరిగిన అమృత మొదట బ్యాంక్ ఉద్యోగంతో తన కెరీర్ ప్రారంభించింది.

ఆ తర్వాత సోషల్ యాక్టివిస్ట్గా, సింగర్గా రాణించింది.

ఆరేళ్ల వయస్సులోనే శాస్త్రీయ సంగీతంలో అమృత ఫడ్నవీస్ శిక్షణ తీసుకుంది.

మొదటిసారి ప్రియాంక చోప్రా నటించిన జై గంగాజల్ మూవీలో పాటను పాడింది.

ఆమె మొదటి మ్యూజిక్ వీడియో ఫిర్ సే ఏకంగా ఒక్క రోజులోనే 7లక్షల వ్యూస్ సాధించింది.

ఈ ఆల్బమ్ సాంగ్లో అమితాబ్ బచ్చన్ కూడా కనిపించారు.

ఆ తర్వాత 2018లో ముంబయి రివర్ యాంథెమ్, ముంబై-పోయిసర్, దహిసర్, ఓషివారా, మిథి అనే నాలుగు పాటలు పాడింది.