
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, దేశం విడిచి వెళ్లడంతో నిరసనకారులు సంబరాలు జరుపుకుంటున్నారు.

సంతోషంతో వీధుల్లో జెండాలు పట్టుకొని, నాట్యం చేస్తూ కనిపిస్తున్నారు.

లక్షలాది మంది విద్యార్థులు, సామాన్య ప్రజలు రోడ్లపైకి వచ్చి విజయోత్సవ ర్యాలీలు చేస్తున్నారు.

ఈ క్రమంలో పలువురు ఆందోళనకారులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు.

రాజధాని ఢాకాలోని ప్రధానమంత్రి అధికారిక నివాసం గనాభవన్ వద్ద గేట్లను బద్దలు కొట్టుకొని వందలాది మంది ఇంట్లోకి ప్రవేశించారు.

నిరసనకారులు ఇళ్లంతా రచ్చ రచ్చ చేశారు.

డైనింగ్ ఏరియా, స్విమ్మింగ్ ఫూల్ వద్ద అల్లరి అల్లరి చేశారు.

ఇంట్లో చేతికందిన వస్తువులు, బెడ్షీట్లు, కుర్చీలు బయటకు మోసుకొచ్చి గట్టిగా అరుస్తూ తమ ఆ గ్రహాన్ని ప్రదర్శించారు.

వీటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

బంగ్లాదేశ్ పార్లమెంట్లోనూ విద్యార్ధులు అల్లకల్లోలం సృష్టించారు




