
ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదు చేసింది

లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లు.. ఆపై విచారణ

మరోమారు కూడా సమన్లు.. ఆ సమన్లపై సుప్రీం కోర్టుకు వెళ్లిన కవిత. ‘‘ఈడీ సమన్లు మహిళలకు ఉన్న హక్కులను ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టేయాలని గత ఏడాది మార్చి 15న సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. దక్కిన ఉపశమనం’’

సరిగ్గా ఏడాది తర్వాత.. అదే తేదీన(మార్చి 15, 2024) కవితను మనీలాండరింగ్ యాక్ట్ కింద హైదరాబాద్ నివాసంలో ఈడీ అరెస్టు చేసింది

ఏప్రిల్ 11వ తేదీన సీబీఐ అరెస్ట్ చేసింది

తన కుమారుడికి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ట్రయల్ కోర్టును(రౌస్ అవెన్యూ కోర్టు) ఆశ్రయించిన కవిత.. న్యాయమూర్తి నిరాకరణతో చుక్కెదురు

ఈడీ, సీబీఐ కేసుల్లో సాధారణ బెయిల్ ఇవ్వలని ట్రయల్ కోర్టులో పిటిషన్ వేసినా.. నిరాశే ఎదురు

ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టుకు.. అక్కడా నిరాకరణే ఎదురు

కవితతోపాటు మరో నలుగురిపై అభియోగాలు మోపుతూ.. ట్రయల్ కోర్టులో సీబీఐ సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు

ఆ అభియోగాల్లో తప్పులున్నాయని, తనకు మద్యం పాలసీతో సంబంధమే లేదని, తనను కేసులో ఇరికించారని ఆరోపిస్తూ మరోసారి ట్రయల్ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్

ఈడీ, సీబీఐ కేసుల్లో సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయం.. ట్రయల్ కోర్టులో పిటిషన్ వెనక్కి

చివరకు.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. ఈ నెల 7న సుప్రీంకోర్టులో కవిత పిటిషన్

ఆగస్టు 27న లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు చేస్తూ ఊరట ఇచ్చిన సుప్రీం కోర్టు







