
డబ్ల్యూపీఎల్-2024 చాంపియన్గా అవతరించింది రాయల్ చాలెంజర్స్ మహిళా జట్టు

ఆదివారం జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను 8 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది

ఫలితంగా 16 ఏళ్ల చరిత్రలో ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడింది

ఇందులో ఆ జట్టు యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ది కీలక పాత్ర

ఓ వైపు కాలి గాయంతో బాధపడుతూనే అద్బుతమైన ప్రదర్శన కనబరిచి తన జట్టుకు టైటిల్ను అందించింది

ఫైనల్లో నాలుగు వికెట్లతో మెరిసింది శ్రేయాంక

21 ఏళ్ల శ్రేయాంక పాటిల్ బెంగళూరులో జన్మించింది

శ్రేయాంక దేశీవాళీ క్రికెట్లో కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది

దేశవాళీ క్రికెట్లో మెరుగ్గా రాణించడంతో ఆమె భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది

గతేడాది ఆఖరిలో ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లోకి శ్రేయాంక అడుగుపెట్టింది

ఇప్పటివరకు భారత్ తరపున 2 వన్డేలు, 6 టీ20లు ఆడిన ఈ కర్ణాటక క్రికెటర్.. వరుసగా 4, 8 వికెట్లు పడగొట్టింది. కాగా డబ్ల్యూపీఎల్ 2023 వేలంలో శ్రేయాంకను రూ.10 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది










