breaking news
Shreyanka Patil
-
RCB vs UPW: రాణించిన ఆల్రౌండర్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మ్యాచ్లో యూపీ వారియర్స్ నామమాత్రపు స్కోరు సాధించింది. నవీ ముంబై వేదికగా సోమవారం నాటి మ్యాచ్లో యూపీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేయగలింది.మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026లో భాగంగా డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా యూపీతో మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన యూపీకి ఆదిలోనే షాకులు తగిలాయి.ఓపెనర్లలో హర్లిన్ డియోల్ (14 బంతుల్లో 11)ను స్వల్ప స్కోరుకే లారెన్ బెల్ పెవిలియన్కు పంపగా.. కెప్టెన్ మెగ్ లానింగ్ (14), వన్డౌన్ బ్యాటర్ ఫోబీ లిచిఫీల్డ్ (20)ల వికెట్లు శ్రేయాంక పాటిల్ తన ఖాతాలో వేసుకుంది.రాణించిన దీప్తి, డియాండ్రాఇక కిరన్ నవగిరె (5)తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ శ్వేతా సెహ్రావత్ (0)లను నదైన్ డిక్లెర్క్ అవుట్ చేసింది. దీంతో కష్టాల్లో కూరుకుపోయిన యూపీ జట్టును ఆల్రౌండర్లు దీప్తి శర్మ, డియాండ్రా డాటిన్ ఆదుకున్నారు. ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన టీమిండియా స్టార్ దీప్తి... 35 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 45 పరుగులతో అజేయంగా నిలిచింది.వెస్టిండీస్ వెటరన్ స్టార్ డియాండ్ర డాటిన్ సైతం 37 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 40 పరుగులు చేసింది. ఆఖరి వరకు దీప్తి, డాటిన్ ధనాధన్ దంచికొట్టడంతో యూపీ 140 పరుగుల మార్కు దాటగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్, డిక్లెర్క్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. లారెన్ బెల్ ఒక వికెట్ దక్కించుకుంది. ఇక యూపీ విధించిన 144 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలని ఆర్సీబీ పట్టుదలగా ఉంది.కాగా ఈ సీజన్లో ఆర్సీబీ తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను ఓడించి గెలుపు నమోదు చేసింది. మరోవైపు.. యూపీ తమ తొలి మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలైంది.ఆర్సీబీ వర్సెస్ యూపీ తుదిజట్లుఆర్సీబీగ్రేస్ హారిస్, స్మృతి మంధాన (కెప్టెన్), దయాళన్ హేమలత, గౌతమి నాయక్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), రాధా యాదవ్, నదైన్ డిక్లెర్క్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, లిన్సే స్మిత్, లారెన్ బెల్యూపీకిరణ్ నవ్గిరే, మెగ్ లానింగ్ (కెప్టెన్), ఫోబ్ లిచ్ఫీల్డ్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, శ్వేతా సెహ్రావత్ (వికెట్ కీపర్), డియాండ్రా డాటిన్, సోఫీ ఎక్లెస్టోన్, ఆశా శోభన, శిఖా పాండే, క్రాంతి గౌడ్. -
CPL విజేత బార్బడోస్ రాయల్స్.. కీలకపాత్ర పోషించిన టీమిండియా ప్లేయర్
2025 మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ను బార్బడోస్ రాయల్స్ ఎగరేసుకుపోయింది. నిన్న (సెప్టెంబర్ 17) జరిగిన ఫైనల్లో ఆ జట్టు గయానా అమెజాన్ వారియర్స్ను 3 వికెట్ల తేడాతో ఓడించి, వరుసగా మూడో టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేసింది. యామీ హంటర్ (29), కెప్టెన్ షెమెయిన్ క్యాంప్బెల్ (28 నాటౌట్), వాన్ నికెర్క్ (27 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. బార్బడోస్ బౌలర్లలో షమీలియా కాన్నెల్, అఫీ ఫ్లెచర్, ఆలియా అల్లెన్ తలో వికెట్ తీశారు.అనంతరం బరిలోకి దిగిన బార్బడోస్.. 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కోట్నీ వెబ్ (31), కైసియా నైట్ (31), చమారీ ఆటపట్టు (25) గెలుపుకు తమవంతు సహకారాన్ని అందించగా.. ఆఖర్లో టీమిండియా ఆల్రౌండర్ శ్రేయాంక పాటిల్ (6 బంతుల్లో 10 నాటౌట్; 2 ఫోర్లు), ఆలియా అల్లెన్ (9 బంతుల్లో 17 నాటౌట్; ఫోర్, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి బార్బడోస్ను విజయతీరాలకు చేర్చారు.స్వల్ప స్కోర్ను కాపాడుకునేందుకు గయానా బౌలర్లు చాలా కష్టపడినప్పటికీ.. ఆఖర్లో ఆలియా, శ్రేయాంక వారి నుంచి మ్యాచ్ను లాగేసుకున్నారు. 18 బంతుల్లో 27 పరుగులు చేయాల్సిన తరుణంలో వరుసగా రెండు వికెట్లు కోల్పోగా.. శ్రేయాంక వరుసగా రెండు బౌండరీలు బాది బార్బడోస్ గెలుపును ఖరారు చేసింది.ఆతర్వాతి ఓవర్లో ఆలియా వరుసగా సిక్సర్, బౌండరీ బాది బార్బడోస్ గెలుపును లాంఛనం చేసింది. ఈ టోర్నీలో తొలిసారి బ్యాటింగ్కు దిగిన శ్రేయాంక, బంతితోనూ (2-0-15-0) పర్వాలేదనిపించింది. 21 ఏళ్ల శ్రేయాంక గత కొంతకాలంగా గాయాలతో సతమతమవుతూ భారత వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయింది. -
శ్రేయాంకతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్ (ఫొటోలు)
-
లవ్ లెటర్లు తీసుకుంటా.. ల్యాండ్ లైన్ కాల్స్ లిఫ్ట్ చేస్తా: శ్రేయాంక (ఫోటోలు)
-
BCCI: వార్షిక కాంట్రాక్టులు ప్రకటించిన బీసీసీఐ.. వాళ్లపై వేటు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మహిళా క్రికెటర్లకు సంబంధించి వార్షిక కాంట్రాక్టుల జాబితా విడుదల చేసింది. 2024-25 ఏడాదికి గానూ గ్రేడ్-ఎ, బి, సిలలో చోటు దక్కించుకున్న ప్లేయర్ల పేర్లను సోమవారం వెల్లడించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana), ఆల్రౌండర్ దీప్తి శర్మ గ్రేడ్-‘ఎ’లో తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు.మరోవైపు.. రేణుకా ఠాకూర్ (Renuka Thakur), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షఫాలీ వర్మ గ్రేడ్-‘బి’లో స్థానం పదిలం చేసుకున్నారు. అయితే, బౌలర్ రాజేశ్వర్ గైక్వాడ్కు మాత్రం ఈసారి ఈ జాబితాలో చోటు దక్కలేదు.వాళ్లపై వేటు.. వీరికి తొలిసారి చోటుఇక గ్రేడ్-‘సి’లో ఉన్న హర్లీన్ డియోల్, మేఘనా సింగ్, దేవికా వైద్య, సబ్బినేని మేఘన, అంజలి శర్వాణిలపై బీసీసీఐ ఈసారి వేటు వేసింది. వర్ధమాన స్టార్లు శ్రేయాంక పాటిల్, టైటస్ సాధు, అరుంధతి రెడ్డి, అమన్జ్యోత్ కౌర్, ఉమా ఛెత్రిలకు తొలిసారిగా, గ్రేడ్-‘సి’లో చోటు ఇచ్చింది.ఈ మేరకు.. ‘‘టీమిండియా సీనియర్ వుమెన్ జట్టుకు సంబంధించి బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు ప్రకటించింది. 2024-2025 సీజన్ (అక్టోబరు 1, 2024-సెప్టెంబరు 30, 2025)గానూ వివరాలు వెల్లడించడమైనది’’ అని బీసీసీఐ సోమవారం నాటి ప్రకటనలో పేర్కొంది. సమీప భవిష్యత్తులో ప్రకటించంఅయితే, పురుషుల సీనియర్ జట్టుకు సంబంధించి సమీప భవిష్యత్తులో వార్షిక కాంట్రాక్టుల జాబితా ప్రకటించబోమని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా గురువారం స్పోర్ట్స్ స్టార్కు వెల్లడించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. మహిళా క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టులకు సంబంధించి మూడు గ్రేడ్ల ప్లేయర్ల జీతాలు వేరుగా ఉంటాయి. అయితే, ఆ మొత్తం ఎంత అన్నది మాత్రం బీసీసీఐ ఈసారి వెల్లడించలేదు. ఆఖరిసారిగా బీసీసీఐ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. గ్రేడ్-‘ఎ’లో ఉన్న ప్లేయర్లకు రూ. 50 లక్షలు, గ్రేడ్-‘బి’లో ఉన్న క్రికెటర్లకు రూ. 30 లక్షలు, గ్రేడ్-‘సి’లో ఉన్న ప్లేయర్లకు రూ. 10 లక్షల చొప్పున వార్షిక వేతనం చెల్లిస్తారు.అయితే, పురుష క్రికెటర్లతో పోలిస్తే మహిళా క్రికెటర్లకు చెల్లించే మొత్తం అసలు ఏమాత్రం లెక్కకాదు. పురుష క్రికెటర్లలో A+ గ్రేడ్లో ఉన్న వారికి రూ. 7 కోట్లు, A గ్రేడ్లో ఉన్నవారికి రూ. 5 కోట్లు, B గ్రేడ్లో ఉన్న వారికి రూ. 3 కోట్లు, C గ్రేడ్లో ఉన్నవారికి రూ. కోటి చొప్పున బీసీసీఐ చెల్లిస్తోంది.బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు(2024-25)గ్రేడ్-ఎ: హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మగ్రేడ్-బి : రేణుకా సింగ్ ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షఫాలీ వర్మగ్రేడ్-సి : యస్తికా భాటియా, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, టైటస్ సాధు, అరుంధతి రెడ్డి, అమన్జోత్ కౌర్, ఉమా ఛెత్రి, స్నేహ్ రాణా, పూజా వస్త్రాకర్.చదవండి: కలకాలం గుర్తుండిపోతుంది!.. ఎవరీ విఘ్నేశ్?.. ధోని కూడా ఫిదా! -
గెలుపు జోష్లో ఉన్న ఆర్సీబీకి బిగ్ షాక్..
డబ్ల్యూపీఎల్-2025 సీజన్ తొలి మ్యాచ్లో గెలిచి మంచి జోష్ మీద ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా టోర్నీ నుంచి నుంచి తప్పుకుంది. శ్రేయంక ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతోంది.దీంతో గతేడాది జరిగిన ఆసియాకప్కు దూరమైంది. ఆతర్వాత యూఏఈ వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్లో ఆమె రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే తన గాయం మళ్లీ తిరగబెట్టడంతో స్వదేశంలో ఐర్లాండ్, వెస్టిండీస్తో జరిగిన సిరీస్లకు దూరంగా ఉంది. పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో శుక్రవారం జరిగిన టోర్నీ తొలి మ్యాచ్లో కూడా ఆమె బరిలోకి దిగలేదు.ఆమె పూర్తిగా కోలుకోవడానికి నెల రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీజన్ మొత్తానికి పాటిల్ దూరమైంది. తాజాగా శ్రేయాంక పాటిల్ కూడా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ను షేర్ చేసింది. తన గుండె పగిలిందని, అయినా కానీ తాను మళ్లీ పుంజుకుంటాననే క్యాప్షన్తో ఊయల ఊగుతున్న ఫొటోను పంచుకుంది. ఇక శ్రేయాంక స్థానంలో స్నేహ్ రాణాను ఆర్సీబీ జట్టులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని శనివారం ఆర్సీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడిన రాణా ఈ సారి వేలంలో ఎంపిక కాలేదు. రాణాను రూ.30 లక్షలకు బెంగళూరు ఎంచుకుంది.గతేడాది సీజన్లో ఆర్సీబీ ఛాంపియన్గా నిలవడంలో శ్రేయంకది కీలక పాత్ర. 8 మ్యాచ్ల్లో 13 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఫైనల్లో 4 వికెట్లతో ఆమె సత్తాచాటింది. ఆర్బీబీ తమ తదుపరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో ఈనెల 17న తలపడనుంది.ఆర్సీబీ జట్టు: స్మృతి మంధాన (కెప్టెన్), ఆశా శోభన జాయ్, జోషిత విజయ్, రిచా ఘోష్, డానీ వ్యాట్, కనికా అహుజా, సబినేని మేఘన, ఏక్తా బిష్ట్, కేట్ క్రాస్, స్నేహ్రాణా, ఎల్లీస్ పెర్రీ, ప్రేమ రావత్, జార్జియా బాహ్మ్, రేణుకా సింగ్, సోఫీ మోలిన్యూక్స్.చదవండి: IPL 2025: ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ షెడ్యూల్ ఖారారు! తొలి మ్యాచ్ ఎప్పుడంటే? -
Diwali 2024: ఆర్సీబీ ‘క్వీన్’ అలా.. అందమైన అలంకరణతో స్మృతి ఇలా(ఫొటోలు)
-
ప్రేమలో పడ్డానంటూ షాకిచ్చిన భారత స్టార్ క్రికెటర్ (ఫొటోలు)
-
గుర్తించారు... చాలు! క్రికెటర్ శ్రేయాంక పాటిల్ ఇన్స్టా పోస్ట్ వైరల్
‘కుదిరితే క్షమించు. లేదంటే శిక్షించు. కానీ మేమున్నామని గుర్తించత్తా. దయచేసి గుర్తించు. దయచేసి గుర్తించు..’ అని అనేది ఓ సినిమాలో డైలాగ్! నిజమే.. క్షమించినా, శిక్షించినా, విమర్శించినా, ద్వేషించినా... అసలంటూ గుర్తించటమే కావలసింది. ఆటలోనైనా, బతుకు పోరాటంలోనైనా గెలుపోటములు ఎలా ఉన్నా ముందైతే గుర్తింపు ముఖ్యం. ఆ విషయాన్నే భారత మహిళా క్రికెట్ జట్టులోని ఆల్ రౌండర్ శ్రేయాంక పాటిల్ తన ఇన్స్టాగ్రామ్లో ఎంతో చక్కగా వ్యక్తం చేశారు. ‘మీ అభిమానానికి, మీ విమర్శలకూ నిజంగా అభివందనాలు. ఈవిధంగానైనా మమ్మల్ని గుర్తించినందుకు ధన్యవాదాలు. ఓటమి మమ్మల్ని ఒకవైపు బాధిస్తున్నా, గెలుపు కోసం మరింతగా ఆకలిని మాలో రాజేసింది.. ‘ అని రాశారు. యూఏఈలో ప్రస్తుతం జరుగుతున్న టి20 విమెన్ వరల్డ్ కప్లో భారత జట్టు సెమీస్కి క్వాలిఫై కాలేక సోయిన సంగతి అటుంచితే... ఇన్స్టాగ్రామ్లో శ్రేయాంక పాటిల్ పెట్టిన ఈ పోస్ట్...ముఖ్యంగా స్పాన్సరర్లు మహిళల క్రికెట్ జట్టును గుర్తించి, మరింతగా ప్రోత్సహించవలసిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. View this post on Instagram A post shared by Shreyanka Patil (@shreyanka_patil31) -
ఆసియాకప్లో టీమిండియాకు ఊహించని షాక్..
మహిళల ఆసియాకప్-2024లో భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు దూరమైంది. జూలై 18న పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో పాటిల్ గాయపడింది.ఈ మ్యాచ్లో క్యాచ్ను పట్టే ప్రయత్నంతో శ్రేయాంక చేతి వేలికి గాయమైంది. మ్యాచ్ అనంతరం ఆమెను స్కానింగ్ తరలించగా చేతి వేలి విరిగినట్లు నిర్ధారణైంది. ఈ క్రమంలోనే టోర్నీ మధ్యలోనే ఆమె వైదొలిగింది. ఈ విషయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఓ ప్రకటనలో ధ్రువీకరించింది.కాగా పాక్తో జరిగిన మ్యాచ్లో శ్రేయాంక అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. 3.2 ఓవర్లలో కేవలం 14 పరుగుల మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టింది. ఇక ఆమె స్ధానాన్ని మరో యువ స్పిన్నర్ తనూజా కన్వర్తో బీసీసీఐ భర్తీ చేసింది. ఈ ఏడాది డబ్ల్యూపీఎల్ సీజన్లో కన్వర్ తన బౌలింగ్తో అందరని ఆకట్టుకుంది. గుజరాత్ జెయింట్స్ తరపున 10 వికెట్లు పడగొట్టి సత్తాచాటింది. ఇక పాకిస్తాన్పై అద్భుత విజయం సాధించిన భారత మహిళల జట్టు.. ఆదివారం తమ రెండో మ్యాచ్లో యూఏఈతో తలపడనుంది. -
RCB ‘అందాల’ పేర్లు పచ్చబొట్టుగా.. చాంపియన్లకు ట్రిబ్యూట్ (ఫోటోలు)
-
అతడికి నా పేరు కూడా తెలుసు: ఆర్సీబీ క్వీన్ పోస్ట్ వైరల్
భారత మహిళా క్రికెటర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ శ్రేయాంక పాటిల్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఇంతకంటే ఇంకేం కావాలి అన్నట్లు గాల్లోతేలిపోయే అనుభూతిని ఆస్వాదిస్తోంది. తన రోల్ మోడల్ను నేరుగా కలవడమే గాకుండా.. అతడితో ప్రశంసలు అందుకోవడమే ఇందుకు కారణం. ఐపీఎల్ తర్వాత బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన టీ20 టోర్నీ వుమెన్ ప్రీమియర్ లీగ్ ద్వారా లైమ్లైట్లోకి వచ్చిన బెంగళూరు అమ్మాయి శ్రేయాంక. దేశవాళీ క్రికెట్లో సొంత రాష్ట్రం కర్ణాటకకు ఆడుతున్న 21 ఏళ్ల ఈ ఆఫ్ స్పిన్ బౌలర్ గతేడాది భారత జట్టు తరఫున అరంగేట్రం చేసింది. గతేడాది ఆరంభమైన వుమెన్ ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీకి ఆడే అవకాశాన్ని దక్కించుకుంది. రూ. 10 లక్షలకు తనను కొనుక్కున్న ఆర్సీబీకి తాజా ఎడిషన్లో పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చింది. ముఖ్యంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఫైనల్లో కీలక సమయంలో నాలుగు వికెట్లు తీసింది. తద్వారా డబ్ల్యూపీఎల్-2024లో ఆర్సీబీ చాంపియన్గా నిలవడంతో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకుంటోంది. ఇక సీజన్లో మొత్తంగా 9 మ్యాచ్లు ఆడి 13 వికెట్లు తీసిన శ్రేయాంక పర్పుల్ క్యాప్(అత్యధిక వికెట్లు) విజేతగా నిలిచింది. No we’re not crying, you are 😭pic.twitter.com/Nb9TKf5NFw — Royal Challengers Bengaluru (@RCBTweets) March 17, 2024 అంతేకాదు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డునూ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. మార్చి 22న ఐపీఎల్-2024 ఆరంభం కానున్న నేపథ్యంలో ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రోఫీ గెలిచిన మహిళా జట్టును ఆర్సీబీ పురుష జట్టు గార్డ్ ఆఫ్ ఆనర్తో సముచితంగా గౌరవించింది. ఇక ఈ ఈవెంట్లో పేరు, లోగో మార్పులతో కొత్త జెర్సీని రివీల్ చేసింది ఆర్సీబీ. ఈ కార్యక్రమంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని కలిసే అవకాశం వచ్చింది శ్రేయాంకకు! ఈ నేపథ్యంలో కింగ్ కోహ్లితో దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఉద్వేగానికి లోనైందామె. ‘‘అతడి వల్లే క్రికెట్ చూడటం అలవాటు చేసుకున్నా. అతడిలాగే క్రికెటర్ కావాలని కలలు కంటూ పెరిగాను. ఎట్టకేలకు.. జీవితకాలానికి సరిపడా సంతోషాన్నిచ్చే క్షణం నిన్న రాత్రి చోటుచేసుకుంది. ‘హాయ్.. శ్రేయాంక.. అద్భుతంగా బౌల్ చేశావు’ అని విరాట్ నాతో అన్నాడు. అతడికి నా పేరు కూడా తెలుసు’’ అంటూ రోల్మోడల్తో కలిసి ఫ్యాన్గర్ల్ మూమెంట్ను ఆస్వాదించినట్లు శ్రేయాంక పాటిల్ తెలిపింది. ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టగా వైరల్గా మారింది. చదవండి: Sachin Tendulkar: నేను 22 ఏళ్లు ఎదురుచూశా.. నువ్వు ఆ మాత్రం వెయిట్ చేయలేవా? Started watching cricket cos of him. Grew up dreaming to be like him. And last night, had the moment of my life. Virat said, “Hi Shreyanka, well bowled.” He actually knows my name 😬😬😬#StillAFanGirl #rolemodel pic.twitter.com/z3DB0C8Pt0 — Shreyanka Patil (@shreyanka_patil) March 20, 2024 -
WPL 2024: ఆర్సీబీ క్వీన్.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
WPL 2024: ఫైనల్లో 4 వికెట్లు.. ఆర్సీబీ క్వీన్! ఎవరీ శ్రేయాంక?
రాయల్ ఛాలెజంజర్స్ బెంగళూరు నిరీక్షణకు తెరపడింది. గత 16 ఏళ్లగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న ట్రోఫిని ఎట్టకేలకు ఆర్సీబీ ముద్దాడింది. అయితే ఆర్సీబీ అబ్బాయిలకు సాధ్యం కాని టైటిల్ను.. అమ్మాయిలు అందుకుని చూపించారు. డబ్ల్యూపీఎల్-2024 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించిన ఆర్సీబీ తొలి టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. అయితే ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడడంలో ఆ జట్టు యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ది కీలక పాత్ర. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో 4 వికెట్లు పడగొట్టి సత్తాచాటింది. అంతకుముందు సెమీఫైనల్లో రెండు కీలక వికెట్లు ఆమె పడగొట్టింది. ఓ వైపు కాలి గాయంతో బాధపడుతూనే అద్బుతమైన ప్రదర్శన కనబరిచి తన జట్టుకు టైటిల్ను అందించింది. ఓవరాల్గా ఈ సీజన్లో 8 మ్యాచ్లు ఆడిన పాటిల్ 13 వికెట్లు పడగొట్టి.. పర్పుల్ క్యాప్ను సొంతం చేసుకుంది. కాగా తొలి నాలుగు మ్యాచ్ల్లో దారుణంగా విఫలమైన పాటిల్ను ఆర్సీబీ మేనెజ్మెంట్ రెండు మ్యాచ్లకు పక్కన పెట్టేసింది. ఆ తర్వాత మళ్లీ తుది జట్టులోకి వచ్చిన శ్రేయాంక దెబ్బతిన్న సింహంలా చెలరేగిపోయింది. ఈ క్రమంలో ఎవరీ శ్రేయాంక పాటిల్ను నెటిజన్లు తెగ వేతికేస్తున్నారు. ఎవరీ శ్రేయాంక పాటిల్.. 21 ఏళ్ల శ్రేయాంక పాటిల్ బెంగళూరులో జన్మించింది. శ్రేయాంక దేశీవాళీ క్రికెట్లో కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తుంది. అయితే దేశవాళీ క్రికెట్లో మెరుగ్గా రాణించడంతో ఆమె భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది. గతేడాది ఆఖరిలో ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లోకి శ్రేయాంక అడుగుపెట్టింది. ఇప్పటివరకు భారత్ తరపున 2 వన్డేలు, 6 టీ20లు ఆడిన ఈ కర్ణాటక క్రికెటర్.. వరుసగా 4, 8 వికెట్లు పడగొట్టింది. కాగా డబ్ల్యూపీఎల్ 2023 వేలంలో శ్రేయాంకను రూ.10 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్-2024 సీజన్కు ముందు ఆమెను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. కాగా పాటిల్ మహిళల కరేబియన్ ప్రీమియర్ లీగ్లోనూ భాగమైంది. ఈ లీగ్లో గయానా ఆమెజాన్ వారియర్స్కు శ్రేయాంక ప్రాతినిథ్యం వహిస్తుంది. చదవండి: T20 WC: టీ20 జట్టు నుంచి అవుట్! వరల్డ్కప్లో నో ఛాన్స్! Shreyanka Patil with her Purple Cap award. - The hero of the team! 💜 pic.twitter.com/ATA6DMiYqT — Mufaddal Vohra (@mufaddal_vohra) March 18, 2024 Ellyse Perry " Pretty bonkers to be honest. It's another level for us.Shreyanka Patil is such a young player and she has got the world at her feet, they are awesome.Shreyanka and Sophie devine will be owning the stage and they are the goat dangers 😄 "pic.twitter.com/ukWj0D4g9P — Sujeet Suman (@sujeetsuman1991) March 18, 2024


