Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

India Vs New Zealand ICC Champions Trophy 2025 Final Live Updates1
ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 విజేత భారత్‌.. ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం

IND vs NZ Final Live Updates: దుబాయ్‌ వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతోంది.ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌.. అక్షర్‌ ఔట్‌203 పరుగుల వద్ద భారత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. బ్రేస్‌వెల్‌ బౌలింగ్‌లో రూర్కీకి క్యాచ్‌ ఇచ్చి అక్షర్‌ పటేల్‌ (29) ఔటయ్యాడు. 44 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 212/5గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలంటే 36 బంతుల్లో 40 పరుగులు చేయాలి. నాలుగో వికెట్‌ కోల్పోయిన భారత్‌.. శ్రేయస్‌ ఔట్‌183 పరుగుల వద్ద భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. వేగంగా పరుగులు రాబట్టే క్రయంలో శ్రేయస్‌ అయ్యర్‌ (48) ఔటయ్యాడు. సా​ంట్నర్‌ బౌలింగ్‌లో రచిన్‌ క్యాచ్‌ పట్టడంతో శ్రేయస్‌ పెవిలియన్‌ బాటపట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలంటే 68 బంతుల్లో 69 పరుగులు చేయాలి. 38.4 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 183/4గా ఉంది.జాగ్రత్తగా ఆడుతున్న శ్రేయస్‌, అక్షర్‌252 పరుగుల ఛేదనలో స్వల్ప వ్యవధిలో గిల్‌, విరాట్‌, రోహిత్‌ శర్మ వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన భారత్‌ను శ్రేయస్‌ అయ్యర్‌ (47), అక్షర్‌ పటేల్‌ (17) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు జాగ్రత్తగా ఆడుతూ భారత్‌ను విజయతీరాలవైపు తీసుకెళ్తున్నారు. 37 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 176/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలంటే 78 బంతుల్లో 76 పరుగులు చేయాలి. మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. రోహిత్‌ శర్మ ఔట్‌252 పరుగుల ఛేదనలో టీమిండియాకు మంచి ఆరంభం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. తొలి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం అనంతరం భారత్‌ 17 పరుగుల వ్యవధిలో మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది. 105 పరుగుల వద్ద పరుగు వ్యవధిలో గిల్‌, కోహ్లి వికెట్లు కోల్పోయిన భారత్‌.. 122 పరుగుల వద్ద రోహిత్‌ శర్మ (76) వికెట్‌ కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పటిదాకా చాలా జాగ్రత్తగా ఆడిన రోహిత్‌.. పరుగులు అస్సలు రాకపోవడంతో ఒత్తిడికి లోనై భారీ షాట్‌కు ప్రయత్నించాడు. రచిన్‌ రవీంద్ర బౌలింగ్‌లో క్రీజ్‌ దాటి చాలా ముందుకు వచ్చిన రోహిత్‌ బంతి కనెక్ట్‌ కాకపోవడంతో స్టంపౌటయ్యాడు. పరుగు వ్యవధిలో గిల్‌, కోహ్లి వికెట్లు కోల్పోయిన టీమిండియాపరుగు వ్యవధిలో టీమిండియా రెండు కీలకమైన వికెట్లు కోల్పోయింది. 105 పరుగుల వద్ద గిల్‌, 106 పరుగుల వద్ద కోహ్లి ఔటయ్యారు. అప్పటిదాకా గెలుపుపై ధీమా ఉన్న టీమిండియా ఒక్కసారిగా ఇద్దరు స్టార్ల వికెట్లు కోల్పోవడంతో డిఫెన్స్‌లో పడింది. గిల్‌ను సాంట్నర్‌.. కోహ్లిని బ్రేస్‌వెల్‌ ఔట్‌ చేశారు. గ్లెన్‌ ఫిలిప్స్‌ నమ్మశక్యంకాని రీతిలో క్యాచ్‌ పట్టడంతో గిల్‌ పెవిలియన్‌ బాట పట్టగా.. కోహ్లిని బ్రేస్‌వెల్‌ వికెట్ల ముందు దొరికించుకున్నాడు. 17 ఓవర్లలో 100 పరుగులు పూర్తి చేసిన టీమిండియా252 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ 17 ఓవర్లలో 100 పరుగులు పూర్తి చేసుకుంది. భారత్‌ వికెట్‌ నష్టపోకుండా ఈ మార్కును తాకింది. రోహిత్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుని 68 పరుగులతో, గిల్‌ 27 పరుగులతో అజేయంగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలంటే మరో 152 పరుగులు చేయాలి. హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్‌ శర్మ 252 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్‌ శర్మ ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. 41 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 11 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 65/0గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలంటే మరో 187 పరుగులు చేయాలి.టార్గెట్‌ 252.. ధాటిగా ఆడుతు‍న్న రోహిత్‌ శర్మ252 పరుగుల ఛేదనలో భారత్‌కు రోహిత్‌ శర్మ మెరుపు ఆరంభాన్ని అందించాడు. రోహిత్‌ 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. మరో ఎండ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ 13 బంతుల్లో 7 పరుగులు చేసి రోహిత్‌కు ఎక్కువగా స్ట్రయిక్‌ ఇస్తున్నాడు. 8 ఓవర్ల తర్వాత ఇండియా స్కోర్‌ 59/0గా ఉంది. మిచెల్‌, బ్రేస్‌వెల్‌ హాఫ్‌ సెంచరీలు.. టీమిండియా టార్గెట్‌ 252ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఫైనల్లో న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి టీమిండియా ముందు 252 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కివీస్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. డారిల్‌ మిచెల్‌ (63), మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (53 నాటౌట్‌) అర్ద సెంచరీలు చేసి టీమిండియాకు ఫైటింగ్‌ టార్గెట్‌ను నిర్దేశించారు. భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్‌ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. విరాట్‌ కోహ్లి సూపర్‌ త్రో.. సాంట్నర్‌ రనౌట్‌విరాట్‌ కోహ్లి సూపర్‌ త్రోతో మిచెల్‌ సాంట్నర్‌ను (8) రనౌట్‌ చేశాడు. 239 పరుగుల వద్ద న్యూజిలాండ్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది.ఆరో వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌45.4వ ఓవర్‌: 211 పరుగుల వద్ద న్యూజిలాండ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ క్యాచ్‌ పట్టడంతో డారిల్‌ మిచెల్‌ (63) ఔటయ్యాడు. ఔట్‌ కాకముందు మిచెల్‌ షమీ బౌలింగ్‌లో రెండు బౌండరీలు కొట్టాడు.డేంజరెస్‌ బ్యాటర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ ఔట్‌37.5వ ఓవర్‌: డేంజరెస్‌ బ్యాటర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ ఔటయ్యాడు. వరుణ్‌ చక్రవర్తి ఫిలిప్స్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 38 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 165/5గా ఉంది. డారిల్‌ మిచెల్‌కు (44) జతగా బ్రేస్‌వెల్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. నిలకడగా ఆడుతున్న మిచెల్‌, ఫిలిప్స్‌లాథమ్‌ వికెట్‌ పడ్డ తర్వాత న్యూజిలాండ్‌ మరో వికెట్‌ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతుంది. డారిల్‌ మిచెల్‌ (41), గ్లెన్‌ ఫిలిప్స్‌ (28) నిలకడగా ఆడుతున్నారు. 36 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 156/4గా ఉంది. కివీస్‌ నాలుగో వికెట్‌ డౌన్‌..టామ్‌ లాథమ్‌ రూపంలో న్యూజిలాండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 14 పరుగులు చేసిన లాథమ్‌ జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి గ్లెన్‌ ఫిలిప్స్‌ వచ్చాడు. 26 ఓవర్లకు న్యూజిలాం‍డ్‌ స్కోర్‌: 116/4నిలకడగా ఆడుతున్న మిచెల్‌, లాథమ్‌..22 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్‌ 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. మిచెల్‌(18), టామ్‌ లాథమ్‌(14) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.విలియమ్సన్‌ ఔట్‌..కేన్‌ విలియమ్సన్‌ రూపంలో న్యూజిలాండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 11 పరుగులు చేసిన విలియమ్సన్‌.. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో విలియమ్సన్‌ రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి టామ్‌ లాథమ్‌ వచ్చాడు. 15 ఓవర్లకు న్యూజిలాండ్‌ స్కోర్‌: 82-3కివీస్‌ స్పిన్‌​ మ్యాజిక్‌.. రవీంద్ర క్లీన్‌ బౌల్డ్‌రచిన్‌ రవీంద్ర రూపంలో న్యూజిలాండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 37 పరుగులు చేసిన రవీం‍ద్ర.. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. క్రీజులోకి డార్లీ మిచెల్‌ వచ్చాడు. 11 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 73/3వరుణ్‌​ మ్యాజిక్‌.. కివీస్‌ తొలి వికెట్‌​ డౌన్‌న్యూజిలాండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 15 పరుగులు చేసిన విల్‌ యంగ్‌.. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి కేన్‌ విలియమ్సన్‌ వచ్చాడు. 8 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్‌ వికెట్‌ నష్టానికి 58 పరుగులు చేసింది. రవీంద్ర 34 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.దూకుడుగా ఆడుతున్న రచిన్‌..టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ దూకుడుగా ఆడుతోంది. 4 ఓవర్లు ముగిసే సరికి కివీస్‌ వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. క్రీజులో రచిన్‌ రవీంద్ర(16), విల్‌ యంగ్‌(8) ఉన్నారు.ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో భార‌త్‌-న్యూజిలాండ్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌కు తెర‌లేచింది. దుబాయ్ అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక‌గా జ‌ర‌గుతున్న ఈ టైటిల్‌ పోరులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కివీస్‌ స్టార్‌ పేసర్‌ మాట్‌ హెన్రీ దూరమయ్యాడు. అతడి స్ధానంలో నాథన్‌ స్మిత్‌ తుది జట్టులోకి వచ్చాడు. భారత్‌ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది.తుది జ‌ట్లున్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీప‌ర్‌), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), కైల్ జామిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్భార‌త్‌ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్‌ రాహుల్(వికెట్ కీప‌ర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిమరి కాసేపటిలో టాస్‌..ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో భార‌త్‌-న్యూజిలాండ్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌కు సర్వం సిద్దమైంది. మరికాసేపట్లో టాస్‌ పడనుంది. ఇరు జట్లకు టాస్‌ కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు ఇరు జట్లు తమ ఆస్తశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. 25 ఏళ్ల తర్వాత ఐసీసీ వన్డే టోర్నీ ఫైనల్లో ఇరు జట్లు తలపడుతున్నాయి.హెడ్ ​​టు హెడ్ రికార్డ్..ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్‌-న్యూజిలాండ్ జ‌ట్లు ముఖాముఖి 119 వ‌న్డేల్లో త‌ల‌ప‌డ్డాయి. ఇందులో భార‌త్ 61 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించ‌గా.. న్యూజిలాండ్ 50 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. మ‌రో 7 మ్యాచ్‌ల్లో ఫ‌లితం తేల‌క‌పోగా.. ఓ మ్యాచ్ టై అయింది.

Chandrababu Naidu Skips As SVSN Varma For MLC Ticket2
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి చంద్రబాబు షాక్

అమరావతి: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన బాబు..ఇప్పుడు ఆ హామీని గాలికొదిలేశారు. దాంతో చంద్రబాబు మాట నమ్మి ఇప్పటికే రెండు సార్లు మోసపోయిన వర్మ.. మరోసారి దానికి గురి కాకతప్పలేదు. తాజాగా టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ టికెట్ల జాబితాలో వర్మ పేరు ఎక్కడా కనిపించలేదు.పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ఎమ్మెల్యే సీటును వర్మ వదులుకున్న క్రమంలో ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు తీరా చూస్తే వర్మ కి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు చంద్రబాబు. దాంతో చంద్రబాబు తీరుపై వర్మ వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరొకవైపు వర్మ రాజకీయ భవిష్యత్ ముగిసిందనే ప్రచారం కూడా సాగుతోంది. చంద్రబాబు ఇచ్చిన షాక్ తో వర్మ వర్గం అయోమయంలో పడింది. తమనేత రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిన సమయంలో ఏం చేయాలనే దానిపై వారు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

Telangana Congress MLC candidates list released3
TG: ఊహించని విధంగా విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్‌

సాక్షి,హైదరాబాద్‌ : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై కసరత్తు పూర్తయింది. కొద్ది సేపటి క్రితమే ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్‌ అధిష్టానం ఖారారు చేసింది. ఎవరూ ఊహించని విధంగా పార్టీ అధిష్టానం విజయశాంతితో పాటు అద్దంకి దయాకర్‌, కెతావత్‌ శంకర్ నాయక్‌కు టికెట్లు ఇచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. సీపీఐ నుంచి ఒకరికి ఎమ్మెల్సీ టికెట్‌ కేటాయించింది.తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను ఖరారు చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.అయితే, చివరి నిమిషంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లేకపోవడంతో తెలంగాణ నేతల ఢిల్లీ పర్యటన రద్దయ్యింది. అయినప్పటికీ రాష్ట్ర అగ్రనేతలతో కేసీ వేణుగోపాల్ ఫోన్‌లో మంతనాలు జరిపారు. ముగ్గురు అభ్యర్థుల ఎంపికను ఖరారు చేయడంతో ఉత్కంఠతకు తెరపడింది. మరోవైపు ఎమ్మెల్సీ స్థానాల కోసం కాంగ్రెస్‌లో భారీ పోటీ నెలకొంది. తమకు అవకాశం కల్పించాలంటూ ఆశావహులు పెద్ద ఎత్తున లాబియింగ్‌లు జరిపారు. చివరికి పార్టీ అధిష్టానం విజయశాంతి, అద్దంకి దయాకర్‌, కెతావత్‌ శంకర్‌ నాయక్‌ పేర్లను ఫైనల్‌ చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బరిలో ఓసీ కేటగిరి నుంచి వేం నరేందర్ రెడ్డి, పారిజాత నరసింహ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, కుమార్ రావు, కుసుమ కుమార్ పేర్లు బలంగా వినిపించాయి. వీరితో పాటు బీసీ కేటగిరి నుండి ఇరవత్రి అనిల్, కొనగాల మహేష్, జెర్పేటి జైపాల్, గాలి అనిల్, ఎస్సీ కేటగిరి నుండి అద్దంకి దయాకర్, జ్ఞాన సుందర్, దొమ్మటి సాంబయ్య, రాచమల్ల సిద్దేశ్వర్, ఎస్టీ నుంచి బెల్లయ్య నాయక్, బానోతు విజయాభాయి, రేఖా నాయక్ పేర్లు వినిపించాయి.

Hollywood Actor Michael Sheen Pays Off Rs 8 Crore to Clear Debts of 900 People After Tata Steel Closure in Wales
టాటా స్టీల్‌ మూసివేత.. 900 మంది అప్పు తీర్చిన హాలీవుడ్ నటుడు

సౌత్ వేల్స్ లోని పోర్ట్ టాల్‌బోట్‌లోని టాటా స్టీల్ బ్లాస్ట్ ఫర్నేస్‌ మూసివేత తర్వాత అక్కడి వారి జీవితాలు దుర్భరంగా మారాయి. 2,800 మంది కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ షీన్.. తమ ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు ముందుకువచ్చారు. సుమారు 900 మందికి చెందిన 1 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.8 కోట్లు) రుణాలను తాను చెల్లించారు.ది క్వీన్, గుడ్ ఓమెన్స్, ట్విలైట్ చిత్రాల్లో నటించిన మైఖేల్ షీన్ బాధితుల ఆర్థిక భారాన్ని తగ్గించే బాధ్యతను తనపై వేసుకున్నాడు. షీన్ తన వ్యక్తిగత సంపాదన లోంచి 1,00,000 పౌండ్లు వెచ్చించి 900 మందికి సంబంధించిన రుణాలను తీర్చడం కోసం ఒక సంస్థను స్థాపించాడు. రుణ పరిశ్రమ ఎలా పనిచేస్తుందనే దానిపై మొదట్లో తనకు అవగాహన లేదని, కానీ మార్పు తీసుకురావాలని నిశ్చయించుకున్నానని షీన్‌ చెప్పాడు. మైఖేల్ షీన్ సీక్రెట్ మిలియన్ పౌండ్ గిఫ్ట్ గురించి త్వరలో ప్రసారం కానున్న ఛానెల్ 4 షోలో డాక్యుమెంట్ చేశారు.టాటా స్టీల్ మూసివేత ప్రభావంపోర్ట్ టాల్‌బోట్‌లోని టాటా స్టీల్ బ్లాస్ట్ ఫర్నేస్ మూసివేత ఈ ప్రాంతంలో సాంప్రదాయ ఉక్కు తయారీ ముగింపును సూచిస్తోంది. పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల గణనీయ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు స్థానికులకు సైతం ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. పోర్ట్ టాల్‌బోట్‌కు చెందిన షీన్.. కార్మికులు, వారి కుటుంబాల దుస్థితిని చూసి చలించిపోయారు. స్థానిక కేఫ్ ను సందర్శించిన సందర్భంగా ఆయన ఉద్యోగుల తొలగింపు భావోద్వేగాలను కళ్లారా చూశారు. ఉక్కు కార్మికులు తమ అనిశ్చిత భవిష్యత్తుపై కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో వారిని ఆదుకునేందుకు ఏదైనా చేయాలని సంకల్పించారు.ఎవరీ మైఖేల్ షీన్?మైఖేల్ షీన్ బహుముఖ ప్రజ్ఞతోపాటు సామాజిక కారణాల పట్ల నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన నటుడు. 1969లో వేల్స్ లోని న్యూపోర్ట్ లో జన్మించిన షీన్ రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్ (రాడా)లో శిక్షణ పొంది నాటకరంగంలో తన కెరీర్ ను ప్రారంభించారు. ది క్వీన్ అండ్ ది స్పెషల్ రిలేషన్ షిప్ లో బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లెయిర్ పాత్రలకు అంతర్జాతీయ ప్రశంసలు పొందాడు. తన నటజీవితానికి మించి, సామాజిక పోరాటకారుడైన షీన్.. తనను తాను "లాభాపేక్ష లేని నటుడిగా" ప్రకటించుకున్నాడు. తన సంపాదనను సామాజిక కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నాడు. ఇప్పుడే కాదు.. 2021లోనే అతను తన సంపదను ధార్మిక కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాలనే నిర్ణయాన్ని ప్రకటించాడు.

Ravindra Jadeja ODI Retirement Confirmed, Virat Kohli Act In CT 2025 Final Sparks Speculation5
CT 2025 Final: రవీంద్ర జడేజా రిటైర్మెంట్‌..?

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఫైనల్‌ తర్వాత టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. ఫైనల్‌ మ్యాచ్‌లో జడ్డూ తన కోటా 10 ఓవర్లు పూర్తి చేసిన తర్వాత విరాట్‌ కోహ్లి అతన్ని భావోద్వేగంతో హగ్‌ చేసుకోవడంతో ఈ ప్రచారం మొదలైంది. విరాట్‌.. ఆసీస్‌తో జరిగిన సెమీఫైనల్‌ తర్వాత స్టీవ్‌ స్మిత్‌ను కూడా ఇలాగే హగ్‌ చేసు​కున్నాడు. ఆ మ్యాచ్‌ అనంతరం​ స్టీవ్‌ స్మిత్‌ వన్డేలకు గుడ్‌ బై చెప్పాడు. దీంతో ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత జడేజా కూడా రిటైర్‌ అవుతాడని సోషల్‌మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తుంది.Kohli hugged Smith - Retirement Kohli hugged jadeja - Retirement??#Indvsnz #Indvsnzfinal pic.twitter.com/DtKFESNFii— भाई साहब (@Bhai_saheb) March 9, 2025కాగా, న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్లో జడేజా ఎక్కువ వికెట్లు తీయకపోయినా చాలా పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో జడ్డూ కీలకమైన టామ్‌ లాథమ్‌ వికెట్‌ తీసి తన కోటా 10 ఓవర్లలో కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చాడు. జడేజా మిడిల్‌ ఓవర్లలో చాలా పొదుపుగా బౌలింగ్‌ చేసి న్యూజిలాండ్‌ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ టోర్నీలో జడేజా మొదటి మ్యాచ్‌ నుంచి ఇలాంటి ప్రదర్శనలతోనే ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో జడేజా 5 మ్యాచ్‌ల్లో 4.36 ఎకానమీతో 5 వికెట్లు తీశాడు. జడేజా గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఆ టోర్నీలో భారత్‌ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 2024 టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత జడేజాతో పాటు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి కూడా పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు. ఒకవేళ జడేజా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ తర్వాత నిజంగానే వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించినా టెస్ట్‌ల్లో కొనసాగే అవకాశం ఉంది.మ్యాచ్‌ విషయానికొస్తే.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్లో భారత స్పిన్నర్లు చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో జడేజా సహా భారత స్పిన్నర్లంతా చెలరేగినా న్యూజిలాండ్‌ బ్యాటర్లు మంచి స్కోర్‌నే చేశారు. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై డారిల్‌ మిచెల్‌ (63), మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (53 నాటౌట్‌) అద్భుతమైన అర్ద సెంచరీలు చేసి న్యూజిలాండ్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో విల్‌ యంగ్‌ 15, రచిన్‌ రవీంద్ర 37, కేన్‌ విలియమ్సన్‌ 11, టామ్‌ లాథమ్‌ 14, గ్లెన్‌ ఫిలిప్స్‌ 34, మిచెల్‌ సాంట్నర్‌ 8 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్‌ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.252 పరుగుల ఛేదనలో భారత్‌కు రోహిత్‌ శర్మ మెరుపు ఆరంభాన్ని అందించాడు. రోహిత్‌ 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. మరో ఎండ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ 13 బంతుల్లో 7 పరుగులు చేసి రోహిత్‌కు ఎక్కువగా స్ట్రయిక్‌ ఇస్తున్నాడు. 8 ఓవర్ల తర్వాత ఇండియా స్కోర్‌ 59/0గా ఉంది.

Sajjala Ramakrishna Reddy Key Comments Over YSRCP Yuvatha Poru6
ప్రతీ పల్లెలో ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకలు: సజ్జల

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ ఈనెల 12న చేపట్టిన ‘యువత పోరు’ ద్వారా రాష్ట్రంలో యువతను, నిరుద్యోగులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అలాగే, 12వ తేదీన వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలన్నారు. ప్రతి పల్లెలోనూ పార్టీ జెండాలను ఎగురవేయాలని సూచించారు.యువత పోరు, పార్టీ ఆవిర్భావ దినోత్సవాలపై ఆదివారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో సజ్జల రామకృష్ణారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘రాష్ట్ర వ్యాప్తంగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం రూ.3900 కోట్ల మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉంటే ఈ బడ్జెట్‌లో కేవలం రూ.2600 కోట్లు కేటాయించడం దుర్మార్గం. అంటే విద్యార్ధుల సంఖ్యను కూడా కుదించేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోంది.బకాయిలు పెండింగ్‌..పేద, మధ్యతరగతి విద్యార్ధులను చదువులకు దూరం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అయిదు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టడం రాక్షసత్వం. ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీల నుంచి విద్యార్ధులను వెళ్లగొడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో చదువులు మధ్యలో ఆగిపోతున్నా సర్కారు చోద్యం చూస్తోంది. పేద పిల్లలకు పెద్ద చదువులు సాకారం చేస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఆనాడు మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చారు. నిరుపేద ఇళ్ల నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు తయారు కావాలన్న సమున్నత లక్ష్యంతో నాడు ఫీజు రీయింబర్స్‌మెంట్ కు శ్రీకారం చుట్టారు.చంద్రబాబు సర్కార్ 2014-19 మధ్యలో ఈ పథకానికి తిలోదకాలు ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగా బకాయిలు పెట్టి, కాలేజీ యాజమాన్యాలను, విద్యార్ధులను ఇబ్బందుల పాలు చేసింది. వైఎస్సార్‌ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసిన వైఎస్‌ జగన్ 93 శాతం మంది విద్యార్ధులకు మేలు చేసేలా ఈ పథకాన్ని విస్తరింపచేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు కూటమి సర్కార్ ఈ పథకాన్ని నీరు గార్చేందుకు ప్రయత్నిస్తోంది.నిరుద్యోగులను వంచిస్తున్న కూటమి..కూటమి ప్రభుత్వంపై యువతలోనూ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిరుద్యోగ యువతకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని విస్మరించారు. ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా ప్రతినెలా మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామంటూ ఇచ్చిన హామీ ఏమైంది?. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.7200 కోట్లు అవసరం. కానీ గత బడ్జెట్ లో దీనికి కేటాయింపులు లేవు. ఈ ఏడాది బడ్జెట్ లోనూ పైసా కూడా కేటాయించలేదు.మెడికల్‌ కాలేజీలు ప్రైవేటుపరం..ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు వైఎస్సార్‌సీపీ హయాంలో పదిహేడు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. ఇందులో అయిదు కాలేజీల నిర్మాణం పూర్తై, తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలిన వాటిల్లో నిర్మాణపనులు పూర్తిచేసి, తరగతులను ప్రారంభించాల్సి ఉంది. కానీ వాటిని కూడా ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఇచ్చిన మెడికల్ సీట్లను కూడా వద్దంటూ రాష్ట్రప్రభుత్వమే లేఖ రాయడం దుర్మార్గం. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో ఒకేసారి పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టింది.వీటిల్లో విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల కాలేజీలు 2023లో ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2019 వరకు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కేవలం 11 వైద్య కాలేజీలే ఉండేవి. వందేళ్ళ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టిన ఘనత వైఎస్‌ జగన్‌కు దక్కుతుంది. అయితే కొత్త మెడికల్ కాలేజీలను, వాటిద్వారా వచ్చే సీట్లను కూటమి ప్రభుత్వం అడ్డుకుంటోంది. వాటిని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తోంది.విద్యార్థి సంఘాలు కలిసి రావాలి..ఈ తరుణంలో ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ.. యువతకు, విద్యార్ధులకు అండగా నిలిచి ప్రభుత్వం విధానాలపై పోరాడాలి. అందుకోసం తలపెట్టిన యువత పోరులో కలిసి వచ్చే అన్ని విద్యార్థిసంఘాలు, యువజన సంఘాలతో వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించాలి. అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట విద్యార్థులు, నిరుద్యోగులు, యవతతో కలిసి వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రదర్శన, ధర్నా కార్యక్రమం చేపట్టాలి. అనంతరం కలెక్టర్లకు సమస్యలపై విజ్ఞాపన పత్రాలు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, మండల స్థాయి నేతలు సమన్వయంతో విజయవంతం చేయాలి.వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలు..ఈనెల 12వ తేదీ వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం. రాష్ట్రంలోని వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలి. ప్రతి పల్లెలోనూ పార్టీ జెండాలను ఎగురవేయాలి. ప్రజల్లో వైఎస్సార్‌సీపీకి ఉన్న బలాన్ని చాటుకోవాలి. పార్టీ పట్ల సానుభూతితో ఉన్న శ్రేణులను ఆవిర్భావ వేడుకల్లో భాగస్వాములను చేయాలి. ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణను నిలబెట్టుకుంటూ, రానున్న రోజుల్లో వారికి అండగా ఉంటామనే భరోసాను కల్పించాలి. మండలస్థాయి కమిటీల ఏర్పాటుకు కూడా నియోజకవర్గ ఇన్‌చార్జీలు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.

Pranay Case Investigation Enters Final Stage7
Pranay Amrutha: ప్రణయ్ అమృత కేసులో రేపే తుది తీర్పు

సాక్షి,నల‍్లగొండ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో రెండో అదనపు సెషన్స్‌ కోర్టు,ఎస్సీ ఎస్టీ కోర్టు సోమవారం (మార్చి 10న) తుది తీర్పును వెలవరించనుంది. దీంతో ఈ కేసులో నిందితుల పాత్రపై సాక్ష్యాధారాలను పరిగణించి శిక్ష ఖరారు చేస్తూ న్యాయస్థానం వెల్లడించే తుదితీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఇక కేసు విషయానికొస్తే.. తన కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుసుకుందన్న నెపంతో తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో 2018 సెప్టెంబరు 14వ తేదీన ప్రణయ్‌ను హత్యచేయించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసుశాఖ అన్ని కోణాల్లో విచారణ పూర్తిచేసి 1600పేజీల్లో చార్జిషీట్‌ నివేదికను రూపొందించింది. 2019 జూన్‌ 12న చార్జిషీట్‌ దాఖలు చేయగా ఎస్సీ, ఎస్టీ జిల్లా సెషన్‌కోర్టు విచారణ మొదలుపెట్టింది.సుమారు ఐదున్నర ఏళ్ల పాటు విచారణ కొనసాగగా, ఈ కేసులో ఇప్పటికే ఏ-1 మారుతీరావు 2020 మార్చి 7న ఖైరతాబాద్ వైశ్య భవన్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఏడుగురు నిందితుల పాత్రపై సైంటిఫిక్ ఎవిడెన్స్, పోస్టుమార్టం నివేదిక, చార్జ్ షీట్‌తో పాటు సాక్షులను విచారించిన న్యాయస్థానం విచారించి తుది తీర్పును మార్చి 10వ తేదీకి రిజర్వు చేసింది. రేపు తుది తీర్పును వెలువరించనుంది.ఈ కేసులో ఏ-2 సుబాష్ శర్మ, ఏ-3 అజ్గర్ అలీ, ఏ-4 అబ్దుల్ బారీ, ఏ-5 ఎంఏ కరీం, ఏ-6 తిరునగరు శ్రవణ్ కుమార్, ఏ-7 శివ, ఏ-8 నిజాంలుగా నిర్ధారించారు. సుబాష్ శర్మ, అస్గర్ అలీ మినహా మిగతా ఐదుగురు నిందితులు గతంలోనే బెయిల్ పొందారు. నిందితుల్లో అస్గర్ అలీ గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లో కీలక నిందితుడు.

Rescue Operation In Slbc Tunnel 16th Day Continues8
SLBC: ఒక మృతదేహం వెలికితీత

నాగర్ కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి ఒక మృతదేహాన్ని ఎట్టకేలకు వెలికితీశారు. మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ వెలికి తీసుకొచ్చింది. అతన్ని టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గా అనుమానిస్తున్నారు. వెలికితీసిన మృతదేహాన్ని నాగర్‌ కర్నూల్‌ ఆస్పత్రికి తరలించారు.ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఇంకా 8 మంది కార్మికుల జాడ తెలియలేదు. ఇక రోబోల వినియోగం తప్పదని అధికారులు అంటున్నారు. ఆ మేరకు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. చివరి 50 మీటర్ల ప్రాంతంలో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. టెన్నెల్‌ ఎండ్‌ పాయింట్‌లో కీలక స్పాట్స్‌ను గుర్తించారు. కీలకమైన స్పాట్స్‌లో ర్యాట్‌ హోల్‌ మైనర్ల తవ్వకాలు చేపట్టారు. రెస్య్కూలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటున్నారు.జీపీఆర్‌, కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు. టీబీఎంకు ఎడమ పక్కన కనిపించిన ఓ మృతదేహానికి సంబంధించిన చేయిని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్‌లో కూరుకుపోయింది. డ్రిల్లింగ్ ద్వారానే బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు ఆ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చింది రెస్క్యూ టీమ్.కాగా, గత నెల 22వ తేదీన శైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంలో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు మెషీన్‌ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది.

Tollywood Comedian Racha Ravi emotional post on his Marriage day9
'ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను'.. టాలీవుడ్ కమెడియన్ ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీలో రచ్చ రవి అందరికీ సుపరిచితమే. బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. తనదైన కామెడీ, పంచ్‌ డైలాగ్స్‌తో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే బాపు సినిమాలో రచ్చరవి నటించారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. నటుడిగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్‌ హీరోల సినిమాల్లో నటించారు.తాజాగా రచ్చ రవి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఇవాళ తన పెళ్లి రోజు కావడంతో భార్యకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన ప్రేమను వ్యక్తం చేశారు. నా ప్రపంచానికి చిరుదివ్యల వెలుగును పంచుతూ నా జీవన ప్రయాణంలో తోడుగా నిలిచిన తన భార్య స్వాతిని ప్రశంసిస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ఇది చూసిన రచ్చ రవి అభిమానులు తమ అభిమాన నటుడికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.రచ్చ రవి తన ఇన్‌స్టాలో రాస్తూ..' నిన్ను పరిచయం చేసిన నీ... నా... తల్లిదండ్రుల రుణం తీరదు. నా జీవన ప్రయాణంలో నీ పూర్తి సహాయ సహకారం అందిస్తున్న నాకు తృప్తి ఉండదు. ఎన్ని ఆశలు.. కోరికలు.. ఇష్టాలు.. ఉన్నాయో నీకు వాటిని నేను తీర్చగలనో లేదో అని ఎన్నడు నేను అడగలేదు..నువ్వు చెప్పలేదు. నా ప్రపంచానికి చిరుదివ్యల వెలుగును పంచుతూ నా జీవన ప్రయాణానికి వసంతాలు పూయిస్తూ కష్టాలను భరిస్తూ దుఃఖాలను దిగమింగుకుంటూ... కాంప్రమైజ్ అవుతూ లైఫ్‌లో నన్ను సక్సెస్ చేయిస్తూ.... ఇదే జీవితంలో నీ ఇష్టాలు కోరికలు ఆశలను తీర్చాలని... అంత శక్తి నాకు భగవంతుడు ఇవ్వాలని.. నా నిస్వార్థ కోరిక అర్థం చేసుకొని ఇస్తాడని.... నీ రుణం కూడా తీరదని తెలిసి కూడా కనీసం వడ్డీగానైనా ప్రేమిస్తానని ప్రేమగా చూసుకుంటానని...నా సహచరికి పెళ్లిరోజు శుభాకాంక్షలు.. ఐ లవ్ యు స్వాతి..' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. View this post on Instagram A post shared by Ravi Racha (@meracharavi)

Glenn Phillips Takes Flying Blinder In CT 2025 Final, Stuns Shubman Gill10
CT 2025 Final: గ్లెన్‌ ఫిలిప్స్‌ కళ్లు చెదిరే క్యాచ్‌.. క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమం

క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమమైన క్యాచ్‌ నమోదైంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఫైనల్లో గ్లెన్‌ ఫిలిప్స్‌ ఈ క్యాచ్‌ను అందుకున్నాడు. మిచెల్‌ సాంట్నర్‌ బౌలింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ ఆడిన షాట్‌ను (కవర్స్‌ దిశగా) ఫిలిప్స్‌ అమాంతం గాల్లోకి ఎగిరి పట్టేసుకున్నాడు. ఈ క్యాచ్‌ను ఫిలిప్స్‌ సైతం నమ్మలేకపోయాడు. క్యాచ్‌ పట్టిన తర్వాత కింద కూర్చుని క్యాచ్‌ పట్టానా అన్నట్లు ఎక్స్‌ప్రెషన్‌ పెట్టాడు. What a magnificent catch by GLENN PHILLIPS 🤯👏👏👏#INDvsNZ #ChampionsTrophyFinal pic.twitter.com/1CxjG3QYiw— INNOCENT EVIL ⁶𓅓 (@raju_innocentev) March 9, 2025ఈ క్యాచ్‌ను చూసి గిల్‌ నోరెళ్లపెట్టాడు. ఈ క్యాచ్‌ తర్వాత దుబాయ్‌ స్టేడియంలో నిశ్శబ్దం ఆవహించింది. అప్పటిదాకా భారత్‌కు సపోర్ట్‌ చేసిన ప్రేక్షకులు ఫిలిప్స్‌ క్యాచ్‌ చూసి షాక్‌లో ఉండిపోయారు. అస్సలు సాధ్యంకాని క్యాచ్‌ను పట్టడంతో అభిమానులు ఫిలిప్స్‌కు జేజేలు పలుకుతున్నారు. ఈ క్యాచ్‌ను సంబంధించిన వీడియో సోషల్‌మీడియాను షేక్‌ చేస్తుంది. ఫిలిప్స్‌ మనిషా లేక పక్షా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఫిలిప్స్‌ ఇదే టోర్నీలో విరాట్‌ కోహ్లి క్యాచ్‌ను (గ్రూప్‌ దశ మ్యాచ్‌లో) కూడా ఇలాగే నమ్మశక్యంకాని రీతిలో పట్టుకున్నాడు. ఆ క్యాచ్‌ను ఇది తలదన్నేలా ఉంది. క్యాచెస్‌ విన్‌ మ్యాచెస్‌ అన్న నానుడుని ఫిలిప్స్‌ నిజం చేస్తాడేమో చూడాలి.ఫిలిప్స్‌​ పట్టుకున్న క్యాచ్‌ ఆషామాషీ వ్యక్తిది కాదు. గిల్‌ మ్యాచ్‌ ఫలితాన్ని డిసైడ్‌ చేసే సత్తా ఉన్న ఆటగాడు. అదీ కాక భారత్‌ అప్పటిదాకా బాగా స్కోర్‌ చేసి విజయం దిశగా దూసుకుపోతుండుంది. ఫిలిప్స్‌ క్యాచ్‌తో భారత్‌ డిఫెన్స్‌లో పడింది. పుండుపై కారం చల్లినట్లు గిల్‌ (31) ఔటైన పరుగు వ్యవధిలోనే భారత్‌ అత్యంత కీలకమైన విరాట్‌ కోహ్లి (1) వికెట్‌ కూడా కోల్పోయింది. మరో 17 పరుగుల తర్వాత క్రీజ్‌లో కుదురుకుపోయిన రోహిత్‌ శర్మ (76) కూడా ఔటయ్యాడు. దీంతో భారత్‌ ఒక్కసారిగా కష్టాల్లో కూరుకుపోయినట్లైంది. శ్రేయస్‌ అయ్యర్‌ (35), అక్షర్‌ పటేల్‌ (13) భారత ఇన్నింగ్స్‌ను చక్కద్దిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 35 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 161/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలంటే 90 బంతుల్లో 91 పరుగులు చేయాలి. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి.అంతకుముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై డారిల్‌ మిచెల్‌ (63), మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (53 నాటౌట్‌) అద్భుతమైన అర్ద సెంచరీలు చేసి న్యూజిలాండ్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో విల్‌ యంగ్‌ 15, రచిన్‌ రవీంద్ర 37, కేన్‌ విలియమ్సన్‌ 11, టామ్‌ లాథమ్‌ 14, గ్లెన్‌ ఫిలిప్స్‌ 34, మిచెల్‌ సాంట్నర్‌ 8 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్‌ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసినా న్యూజిలాండ్‌ మంచి స్కోర్‌ చేసింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
White House: గన్ తో సంచరిస్తున్న వ్యక్తి కాల్చివేత

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు నివాసముండే వైట్ హౌస్ కు కూతవే

title
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌ వింత కోరిక.. ట్రంప్‌ అందుకు ఒప్పుకుంటారా?

వాషింగ్టన్‌: అమెరికాలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐకు

title
ఐఎస్‌ఎస్‌ కమాండ్‌ బాధ్యతలు.. రష్యా వ్యోమగామికి అప్పగించిన సునీత

వాషింగ్టన్‌: కేవలం పది రోజుల మిషన్‌ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)కి వెళ్లి అనుకోని పరిస్థితుల్లో 9 నెలలపాట

title
వీడియో: న్యూయార్క్‌లో కార్చిర్చు మంటలు.. ఎమర్జెన్సీ విధింపు

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో కార్చిర్చు అంటుక

title
భారత్‌ వ్యతిరేక రాతలు.. అమెరికా టెంపుల్‌ ధ్వంసం

కాలిఫోర్నియా: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి జరిగింది.

NRI View all
title
న్యూయార్‌లో ఘనంగా తెలుగువారి సంబరాలు.

అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి.

title
ఆస్ట్రేలియాలో మహిళలపై లైంగిక దాడి.. భారతీయ ప్రముఖుడికి 40 ఏళ్ల జైలు శిక్ష

సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఐదుగురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన

title
విశాఖకు ఎన్నారై మహిళ ఎందుకొచ్చింది?.. ఆ రూమ్‌లో ఏం జరిగింది?

విశాఖ సిటీ: విశాఖలో ఖాకీ క్రైమ్‌ కథా చిత్రం..

title
లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

బిందువు బిందువు కలిస్తేనే సింధువు అనే విధంగా యూకే లో నివసిస్తున్న తెలుగు మహిళలు అందరూ “తెలుగు లేడీస్ యుకె” అనే ఫేస్‌బుక్

title
న్యూజెర్సీలో నాట్స్ ఇమ్మిగ్రేషన్ సెమినార్

న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చ

National View all
title
సీఎం నితీష్‌కు మీరు ఏదో ఆఫర్ చేశారంట కదా?

పాట్నా:  ఈ ఏడాది చివర్లో బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక

title
TG: తుది దశకు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక

ఢిల్లీ ; తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యే కోటా ఎంఎల్‌సీ అభ్యర్థుల ఖరారు అంశం తు

title
ఉప రాష్ట్రపతి జగదీప్ దన్కర్ త్వరగా కోలుకోవాలి: ప్రధాని

న్యూఢిల్లీ:  భారత ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కర్ త్వరలో కోల

title
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌కు అ‍స్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు

ఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌(Jagdeep Dhankar) అస

title
సెలవు లేదన్న హెడ్మాస్టర్‌.. లెక్కల టీచర్‌ ఏం చేశారంటే?

భువనేశ్వర్‌: తీవ్ర అనారోగ్యం పాలైన ఓ ఉపాధ్యాయుడు సెలవు కోసం

Advertisement
Advertisement