Top Stories
ప్రధాన వార్తలు

సర్కారు మోసం.. మిర్చి రైతు హాహా‘కారం’
సాక్షి, అమరావతి/నెట్వర్క్: మిరప రైతుల నెత్తిన టీడీపీ కూటమి ప్రభుత్వం కుచ్చుటోపి పెట్టింది. మద్దతు ధర పేరిట ఊరించి ఊహల పల్లకిలో ఊరేగించి నిలుపునా ముంచేసింది. మద్దతు, మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసానికితోడు రైతుల ఖాతాకు జమ చేస్తామని కొంతకాలం, బోనస్ ఇచ్చే ఆలోచన చేస్తున్నామంటూ మరికొంత కాలం నాన్చింది. ఇప్పుడు మార్కెట్లో ధరలు ఎగబాకిపోతున్నందున ఇక మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం లేదంటూ తేల్చి చెబుతోంది. మరి నష్టానికి అమ్ముకుంటున్న రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తే ప్రభుత్వ పెద్దల నోరు పెగలడం లేదు. బోనస్ విషయంలో చేతులెత్తేశారు. తేజ రకం తప్ప మిగిలిన రకాలన్నీ నేటికీ మద్దతు ధర కంటే తక్కువగానే పలుకుతున్నాయి. అయినా సరే ధరలు ఎగబాకిపోతున్నాయంటూ అసెంబ్లీ సాక్షిగా మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీ పడుతూ అబద్ధాలు వల్లె వేస్తున్నారు. విదేశాలకు ఎగుమతుల ఆర్డర్లు తగ్గడంతో పంట మార్కెట్కు వచ్చే సమయంలోనే ధరల పతనం మొదలైంది. మరో వైపు ధరలు మరింత తగ్గుతాయన్న ఆలోచనతో మసాలా కంపెనీలు కూడా కొనుగోలు నిలిపివేశాయి. ఇదే విషయమై ఓ వైపు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం హెచ్చరికలు చేసినా, మార్కెటింగ్ శాఖ ముందుగానే గుర్తించించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా రంగంలోకి దిగి మిర్చి యార్డుకు వెళ్లి మిరప రైతులకు బాసటగా నిలవడంతో కూటమి పెద్దలు నానా హంగామా చేశారు. చేతిలో ఉన్న మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి ఆదుకోవల్సింది పోయి కేంద్రానికి లేఖలు రాశామని, సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రితో భేటీ అయ్యారని.. మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్రం దిగివచ్చేసిందంటూ ఊదరగొట్టారు. కేంద్రంపై భారం మోపి.. చేతులెత్తేశారు దిగుబడుల్లో కనీసం 30 శాతం (3 లక్షల టన్నులపైన) పంట సేకరిస్తే రూ.3,480 కోట్లు ఖర్చవుతుందని.. ఆ భారం కేంద్రమే భరించేలా ఒప్పిస్తామంటూ తొలుత రాష్ట్ర ప్రభుత్వం నమ్మబలికింది. ఆ తర్వాత మార్కెట్ ధర, మద్దతు ధర మధ్య వ్యత్యాసంలో 50 శాతం (మిగతా 50 శాతం కేంద్రం) భరించేలా ఫిబ్రవరి మూడో వారంలో ఎకరాకు 5 క్వింటాళ్ల చొప్పున 25 శాతం (2.9 లక్షల టన్నులు) పంటకు రూ.846.15 కోట్లు, 50 శాతం (5.83 లక్షల టన్నులు) పంట కొనుగోలుకు రూ.1,692.31 కోట్లు, 75 శాతానికి (8.75 లక్షల టన్నులు) రూ.2,538.46 కోట్లు ఖర్చవుతుందని అధికారులు రెండోసారి ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రతిపాదనలు కేంద్రానికి పంపి చేతులు దులిపేసుకున్నారు. రూ.11,781 చొప్పున కేంద్రం కొంటుందంటూ కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని గొప్పగా ప్రకటించారు. అన్నీ తెలిసి దొంగ నాటకాలు సీఎం చంద్రబాబు మిర్చి రైతులు, ఎగుమతిదారులు, వ్యాపారులతో గత నెల 21న ఏర్పాటు చేసిన సమావేశంలో తమకు శుభవార్త చెబుతారని రైతులు ఎంతగానో ఆశగా ఎదురు చూశారు. 25 శాతానికి మించి కేంద్రం కొనుగోలు చేసే పరిస్థితులు కన్పించడం లేదంటూ తేల్చి చెప్పేశారు. వాస్తవానికి మద్దతు ధర పెంచాలన్నా, 25 శాతానికి మించి కొనుగోలు చేయాలన్నా, కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయాల్సిందే. నాటి భేటీలో వారం పది రోజుల్లో మరోసారి భేటీ అయ్యి తాము నిర్దేశించిన మద్దతు ధర రూ.11,781 కంటే తక్కువగా ఉంటే అప్పుడు ఆలోచిద్దామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన చేసి మూడు వారాలు దాటినా మళ్లీ ఆ ఊసెత్తడం లేదు. ధరలు పెరిగిపోయాయంటూ అబద్ధాలు మద్దతు–మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసం చెల్లిస్తామంటూ హంగామా చేశారు. ఆ మేరకు యార్డులో మిర్చి విక్రయించిన రైతుల వివరాలను సేకరించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయకుండా కాలయాపన చేస్తోంది. పైగా ఈ హడావుడి తర్వాత మార్కెట్లో ధరలు పెరిగిపోతున్నాయంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా పోటీపడి స్టేట్మెంట్లు ఇస్తూ సమస్యను నీరుగార్చేస్తున్నారు. వాస్తవానికి గురువారం మిర్చి యార్డులో తేజ రకానికి మాత్రమే గరిష్టంగా రూ.14 వేలు, కనిష్టంగా రూ.5,500 పలికింది. తక్కువ ధరకు అమ్ముకున్న రైతులకు ఎంతో కొంత బోనస్ ప్రకటించి ఆదుకోవాలని కోరుతున్నారు.ఈయన పేరు కన్నెబోయిన బాలసాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వాదంపల్లి స్వగ్రామం. తనకున్న మూడెకరాల్లో తేజ రకం మిర్చి సాగు చేశారు. ఎకరాకు రూ.1.75 లక్షలు ఖర్చయ్యింది. గతేడాది ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే ఈ ఏడాది తెగుళ్లు, వాతావరణ పరిస్థితుల ప్రభావంతో 15 క్వింటాళ్ల లోపే వచ్చింది. సగానికి పైగా తాలు. గత సీజన్లో క్వింటా రూ.23వేల నుంచి రూ.27 వేల మధ్య పలికిన తేజ రకం కాయలు నేడు రూ.11వేల నుంచి రూ.12 వేల మధ్య పలుకుతున్నాయి. తాలు రకానికి గత సీజన్లో క్వింటాకు రూ.17 వేలు ధర వస్తే ఈ ఏడాది రూ.5 వేలు కూడా దక్కలేదు. ‘గత నెల మొదటి వారంలో 40 బస్తాలు గుంటూరు యార్డుకు తీసుకొస్తే క్వింటాకు రూ.15 వేలు ధర వస్తే నేడు 50 బస్తాలు తెస్తే క్వింటా రూ.11 వేలు ఇస్తామంటున్నారు. ప్రభుత్వం క్వింటాకు మద్దతు ధర రూ.11,781గా ప్రకటించిన తర్వాత ధరలు మరింత పతనమయ్యాయి. రైతులను పట్టించుకునే నాథుడే లేడు. మిర్చి పంట అమ్ముకోవాలంటే భయం వేస్తోంది. ఇళ్ల వద్ద కూలీలతోపాటు ఎరువులు, మందుల షాపుల వారు కాచుకుని కూర్చున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. క్వింటాకు రూ.20 వేలు ధర పలికితే పెట్టుబడి వస్తుంది. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం’ అని బాలసాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సాగు, దిగుబడి లెక్కలివి.. రాష్ట్రంలో 2023–24 సీజన్లో 6 లక్షల ఎకరాలకు పైగా మిరప సాగైంది. 14.50 లక్షల టన్నులకుపైగా దిగుబడులొచ్చాయి. అలాంటిది 2024–25లో వరుస వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ నిర్వాకంతో కేవలం 3.95 లక్షల ఎకరాల్లో మాత్రమే మిరప సాగైంది. దిగుబడి 11 లక్షల టన్నులొస్తాయని అంచనా వేయగా, క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కన్పించడం లేదు. మరోపక్క గుంటూరు మార్కెట్ యార్డుకు ఈ ఏడాది 4.76 లక్షల టన్నులు మిరప వస్తుందని అంచనా వేయగా, జనవరిలో 61 వేల టన్నులు, ఫిబ్రవరిలో 1.10 లక్షల టన్నులు రాగా, ఈ నెలలో ఇప్పటి వరకు 1.09 లక్షల టన్నులొచ్చాయి. ఈ నెలలో మరో లక్ష టన్నులు, ఏప్రిల్లో 65 వేల టన్నులు, మేలో 30 వేల టన్నులు మార్కెట్కు వస్తాయని అంచనా. ఈ దుస్థితి ఏనాడు లేదు దశాబ్దాలుగా మిర్చి పంటను పండిస్తున్నా. ఈ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. కాయలు కోత కోద్దామంటే కూలీలు వచ్చే పరిస్థితి లేదు. గత సీజన్లో కిలో ఎండు మిర్చి తీతకు రూ.10 ఇస్తే, ఈ ఏడాది రూ.25 ఉంది. గతేడాది తేజ రకం మిర్చి క్వింటా రూ.20 వేలకు పైగా అమ్మితే ఈ ఏడాది రూ.10 వేలకు మించి కొనడం లేదు. విచిత్రంగా మిర్చి ధర తగ్గి కూలీల ధర పెరగటం దారుణం. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.11,781 దేనికీ సరిపోదు. – దొండపాటి అంజయ్య, అడిగొప్పుల, పల్నాడు జిల్లాఅప్పులే మిగిలాయి3 ఎకరాల్లో మిరపసాగుకు ఎకరాకు రూ.75 వేలకుపైగా పెట్టుబడి పెట్టా. వైరస్ సోకి ఎకరాకు 8 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. మార్కెట్లో ధర లేదు. చివరికి క్వింటా రూ.9 వేలకు అమ్ముకున్నా. కనీస పెట్టుబడి కూడా మిగల్లేదు. అప్పులు మాత్రమే మిగిలిపోయాయి. – అహ్మద్, కమాన్దొడ్డి, కొసిగి మండలం, కర్నూలు జిల్లా

డిజిటల్ జోరు..!
కొన్నాళ్ల క్రితం వరకు ప్రకటనలంటే పత్రికలు, టీవీలు, రేడియోల్లాంటి సాంప్రదాయ మాధ్యమాలకే పరిమితమయ్యేవి. ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత నెమ్మదిగా డిజిటల్ వైపు మళ్లడం మొదలైంది. ఇక అందరి చేతుల్లోకి స్మార్ట్ఫోన్లు వచ్చేస్తుండటం, డేటా చౌకగా లభిస్తుండటంలాంటి అంశాల కారణంగా ఇది మరింతగా జోరందుకుంది. ఎంత లా అంటే .. అడ్వర్టైజింగ్ సంస్థలు తమ బడ్జెట్లో దాదాపు సగభాగాన్ని డిజిటల్కే కేటాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆఖరు నాటికి దేశీయంగా డిజిటల్ అడ్వర్టైజింగ్ విభాగం, సాంప్రదాయ మాధ్యమాలకు మించి ఏకంగా రూ. 62 వేల కోట్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి. అడ్వర్టైజింగ్ పరిశ్రమలో డిజిటల్ మీడియా చాలా వేగంగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. నగరాలు మొదలుకుని గ్రామాల వరకు ఇది అసాధారణ స్థాయిలో విస్తరిస్తోంది. దీంతో డిజిటల్ యూజర్ల దృష్టిని ఆకట్టుకునేందుకు కంపెనీలు ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. సాం ప్రదాయ మీడియాని మించి డిజిటల్పై భారీగా వెచ్చిస్తున్నాయి. అంతర్జాతీయ అడ్వర్టైజింగ్ దిగ్గజం డెంట్సు నివేదిక ప్రకారం.. దేశీఅడ్వర్టైజింగ్ పరిశ్రమ ప్రస్తుతం రూ. 93,166 కోట్లుగా ఉంది. 2025 ఆఖరు నాటికి ఇది సుమారు మరో 10 శాతం పెరిగి రూ. 1,12,453 కోట్లకు చేరుతుందని అంచనా. 2022లోలో రూ. 40,685 కోట్లుగా ఉన్న డిజిటల్ విభాగం ఈ ఏడాది ఆఖరుకల్లా రూ. 62,045 కోట్లకు.. అంటే మొత్తం అడ్వర్టైజింగ్ బడ్జెట్లలో సగానికి పైగానే వాటా దక్కించుకునే అవకాశం ఉంది. గతేడాది విషయం తీసుకుంటే 44 శాతం వాటాతో డిజిటల్ అగ్రస్థానంలో ఉండగా, టీవీ 32 శాతం, ప్రింట్ మీడియా 20% వాటాతో తర్వాత స్థానాల్లో నిల్చాయి. ఏఐలాంటి టెక్నాలజీ ఊతంతో టార్గెట్ ఆడియన్స్ను సరిగ్గా చేరుకునే వెసులుబాటు ఉండటం డిజిటల్కి సానుకూలాంశంగా ఉంటోంది. టెలికం అత్యధిక కేటాయింపులు.. టెలికం రంగ సంస్థలు తమ మీడియా బడ్జెట్లలో 64 శాతం భాగాన్ని డిజిటల్కి కేటాయిస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ తమ బడ్జెట్లలో 94 శాతం భాగాన్ని డిజిటల్, టీవీ మాధ్యమాలకు కేటాయిస్తోంది. సాంప్రదాయ అడ్వర్టైజర్లే కాకుండా, డైరెక్ట్ టు కన్జూమర్ బ్రాండ్లు, స్టార్టప్లు మొదలైనవి ఎక్కువగా ఆన్లైన్ ప్రకటనలపైనే దృష్టి పెడుతున్నాయి. క్విక్–కామర్స్, ఈ–కామర్స్, విద్యా రంగ సంస్థల్లాంటివి మరింతగా కస్టమర్లకు చేరువయ్యేందుకు డిజిటల్ మాధ్యమాల మీదే ఆధారపడుతున్నాయి. షార్ట్ వీడియోలు, సోషల్ కామర్స్లపై ఇన్వెస్ట్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల డిజిటల్ బడ్జెట్లూ ఎక్కువగానే ఉంటున్నాయి. దేశీయంగా డిజిటల్ విప్లవం ప్రజల జీవితాలు, పరిశ్రమలు, సమాజంలో పెను మార్పులు తీసుకొస్తోందని, కృత్రిమ మేథ కూడా ఇందుకు దోహదపడుతోందని డెంట్సు దక్షిణాసియా సీఈవో హర్ష రజ్దాన్ చెప్పారు. టెక్నాలజీ ఎంత పెరిగినా మానవీయ కోణానికి కూడా ప్రాధాన్యతనివ్వాలని, పారదర్శకత, జవాబుదారీతనం, నైతిక విలువలకు పెద్ద పీట వేస్తూ పరిశ్రమ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా హవా...డిజిటల్ మీడియా కేటగిరీలో చూస్తే 30% వాటాతో (రూ. 11,962 కోట్లు) సోషల్ మీడియా అగ్రస్థానంలో ఉండగా, ఆన్లైన్ వీడియోలు 29%, పెయిడ్ సెర్చ్ 23% వాటా దక్కించుకున్నాయి. టెలికం కంపెనీలు తమ డిజిటల్ మీడియా బడ్జెట్లో 80% భాగాన్ని ఆన్లైన్ వీడియో, సోషల్ మీడియా, పెయిడ్ సెర్చ్లకు కేటాయిస్తున్నాయి. ఈ–కామర్స్ కంపెనీలైతే తమ మొత్తం మీడియా బడ్జెట్లో 61 శాతాన్ని డిజిటల్ మీడియాకు కేటాయిస్తున్నాయి.తెలుగు రాష్ట్రాల్లోనూ అదే తీరు.. తెలుగు రాష్ట్రాల్లోనూ డిజిటల్, సోషల్ మీడియా ప్రకటనలు జోరుగానే ఉంటున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వీటికి భారీగానే బడ్జెట్లు కేటాయిస్తున్నాయి. రాజకీయేతర డిజిటల్ ప్రకటనల వ్యయాలపై నిర్దిష్ట డేటా లేకపోయినప్పటికీ గత కొన్నాళ్లుగా, చాలా వేగంగా వృద్ధి చెందుతోందని ఓటీఎస్ అడ్వర్టైజింగ్ అకౌంట్ డైరెక్టర్ సాయి సిద్ధార్థ్ నల్లూరి తెలిపారు. దక్షిణాదివ్యాప్తంగా 2020 నాటి నుంచి గణాంకాలు చూస్తే డిజిటల్ అడ్వర్టైజింగ్ 30 శాతం వృద్ధి రేటు కనపర్చిందని చెప్పారు. విద్య తదితర రంగాలు డిజిటల్పై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయని, ఈ సేవల కోసం స్పెషలైజ్డ్ ఏజెన్సీలు కూడా వచ్చాయని పేర్కొన్నారు. కోవిడ్ తర్వాత సాంప్రదాయ మీడియాపై ప్రకటనల వ్యయాలు తగ్గాయని వివరించారు. – సాక్షి, బిజినెస్డెస్క్

జ్వరం గోలీలూ లేవు!
ఆస్పత్రిలో మందుల్లేక..బయట కొనలేక! ఈ ఫొటోలో కన్పిస్తున్న వృద్ధురాలి పేరు మాశమ్మ. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని నాగనూల్ గ్రామానికి చెందిన ఈమె ఒంటి నొప్పుల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చింది. పరీక్ష చేసిన డాక్టర్ మందులు రాశారు. అయితే ఆ మందులు ఆసుపత్రిలో లేవని చెప్పిన సిబ్బంది బయట ప్రైవేటులో తీసుకోవాలని చెప్పారు. డబ్బులు పెట్టి ప్రైవేట్ దుకాణంలో మందులు కొనే స్తోమత లేని మాశమ్మ ఇలా నిస్సహాయంగా నిలబడింది.సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులను మందుల కొరత పీడిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో (పీహెచ్సీలు) పాటు రాష్ట్రంలో కీలకమైన ఉస్మానియా, గాం«దీ, నిలోఫర్, ఎంఎన్జే, వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్ వంటి ఆసుపత్రుల్లో కూడా రోగులు మందుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. అనేకచోట్ల సాధారణ జబ్బులకు అవసరమైన ట్యాబ్లెట్లు కూడా ఉండటం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.జ్వరానికి వాడే పారాసెటమాల్, జలుబుకు ఉపయోగించే సిటిరిజైన్ లాంటివి కూడా బయట కొనుక్కోవాల్సి వస్తోందని రోగులు చెబుతున్నారు. డాక్టర్లు రాసిచ్చిన 5 మందుల్లో కనీసం 2 లేదా 3 బయట కొనుక్కోక తప్పడం లేదని అంటున్నారు. మందుల కొరత నేపథ్యంలో కొన్ని జిల్లా ఆసుపత్రుల్లో అవసరమైన మేరకు కాకుండా 10 రోజుల వరకే మందులు ఇస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.అయితే రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులకు అవసరమైన మందుల నిల్వలు తమ వద్ద ఉన్నాయని టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్ చెపుతున్నారు. అలాగే జిల్లాల్లోని సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ (సీడీఎస్)లలో కూడా మందుల నిల్వలు ఉన్నాయని ఆయా జిల్లాల డీఎంహెచ్ఓలు చెబుతున్నప్పటికీ..వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. చాలాచోట్ల అవసరమైన మందుల కోసం ఇండెంట్లు పెట్టేవారే లేరని, మరోవైపు మందులు సమీకరించి పంపాల్సిన టీజీఎంఎస్ఐడీసీకి నిధుల కొరత సమస్యగా మారిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణ మందులకూ తిప్పలు తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) ద్వారా రాష్ట్రంలోని జిల్లా ఆసుపత్రులు, బోధన కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులు, పీహెచ్సీలకు అక్కడి నుంచి ఆరోగ్య ఉప కేంద్రాలకు మందులు సరఫరా అవుతుంటాయి. ఈ మేరకు జిల్లా ఆస్పత్రులు, తదితర ఆస్పత్రుల నుంచి ఇండెంట్లు అందుతుంటాయి. ఈ విధంగా పలు ఆస్పత్రులు ఇండెంట్లు పంపినా కొన్ని మందులు నెలలుగా సరఫరా కావడం లేదు. జ్వరానికి వాడే పారాసెటమాల్ టాబ్లెట్ ప్రతి ఆసుపత్రిలో తప్పక ఉండాలి.కానీ పెద్దపల్లి జిల్లాలోని కొన్ని పీహెచ్సీల్లో ఈ ట్యాబ్లెట్ల కొరత ఉన్నట్లు రోగులు చెపుతున్నారు. ఐదేళ్ల లోపు పిల్లల్లో కంటి చూపు సమస్య నివారణ కోసం వ్యాధి నిరోధక టీకాలకు అనుబంధంగా అందించే విటమిన్ –ఏ సిరప్ కొరత దాదాపుగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఉంది. నెల రోజులుగా ఈ సిరప్ నిల్వలు నిండుకోగా.. జిల్లా ఆసుపత్రులతో పాటు పీహెచ్సీలు, ఇతర ఆరోగ్య కేంద్రాల్లో కేవలం టీకాలు మాత్రమే ఇస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి మరో 15 రోజులు పట్టే అవకాశం ఉందని వైద్యాధికారులే చెపుతున్నారు.అలాగే సర్వ సాధారణ మందులైన రాన్టాక్, పాన్టాప్, జోఫర్, డైసైక్లోమిన్, ఎవిల్, ఫెరజోడిన్, సిటిరిజైన్, మెట్రోజిల్, బెటాడిన్ ఆయింట్మెంట్, డైక్లో, స్రైబీష్ లోషన్ వంటివి కూడా కొన్నిచోట్ల అందుబాటులో లేవు. పీహెచ్సీల్లో బీపీ, షుగర్కు సంబంధించి నెల రోజులకు సరిపడే మందులు ఇవ్వాల్సి ఉండగా, గత కొంతకాలంగా 10 రోజులకే పరిమితం చేస్తున్న పీహెచ్సీలు చాలా ఉన్నాయి. జింక్, యాంటి బయోటిక్, ఐరన్ గోలీలతో పాటు ఐవీ సెట్లు కూడా చాలా పీహెచ్సీలు, ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో లేవని, బయట కొనుక్కోమంటున్నారని రోగులు చెపుతున్నారు. ప్రముఖ ఆసుపత్రుల్లోనూ... ఉస్మానియా, గాందీ, నీలోఫర్, ఎంజీఎం, ఎంఎన్జే ఆసుపత్రుల్లో అధికారిక పడకలు, నిత్యం వచ్చే రోగులను పరిగణనలోకి తీసుకుని టీజీఎంఎస్ఐడీసీ మందులను సరఫరా చేస్తోంది. 80 శాతం మందులు ఇక్కడి నుంచే వస్తుండగా, మరో 20 శాతం మందులను అత్యవసర పద్ధతిలో ఆసుపత్రి అధికారులు కొనుగోలు చేస్తుంటారు. కానీ 20 శాతం మందుల కొనుగోలుకు సంబంధించి 8 నెలలైనా టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉండటం లేదు. మరోవైపు అధికారిక లెక్కల కంటే రోగుల తాకిడి ఎక్కువగా ఉండటం కూడా సమస్యకు కారణమవుతోంది.ఉస్మానియా ఆసుపత్రిలో 1,100 పడకల వరకు ఉండగా, నిత్యం 1,500 మందికి పైగానే రోగులు వస్తున్నారు. ఇక గాంధీ ఆస్పత్రిలో 1000 పడకలకు గానూ 1,500కు పైనే రోగుల తాకిడి ఉంటోంది. కొన్నిసార్లు (సీజన్) ఈ రెండు ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య 2 వేలకు పైగానే ఉంటోంది. దీంతో గాం«దీ, ఉస్మానియా ఆసుపత్రుల ఆవరణల్లో అక్రమంగా నిర్వహిస్తున్న ప్రైవేటు మెడికల్ దుకాణాలు 24 గంటలు రోగులతో కిటకిటలాడుతూ ఉంటున్నాయి. వరంగల్ ఎంజీఎంలో 2,500 నుంచి 3,000 వరకు రోగులు నమోదవుతున్నారు. కాగా మందుల కొరత నేపథ్యంలో జిల్లా ఆసుపత్రులు, మండలాలు, పట్టణ కేంద్రాల్లోని ఆరోగ్య కేంద్రాల పక్కనే ఉంటున్న ప్రైవేటు మెడికల్ షాపులే రోగులకు గతవుతున్నాయి. 293 మందులకు 100 కూడా ఉండటం లేదు.. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) మార్గదర్శకాల ప్రకారం గ్రామాల్లోని పీహెచ్సీలు, సబ్సెంటర్స్లో మందులు, సిరప్లు, ఇంజెక్షన్లు, ఆయింట్మెంట్లు, లోషన్లు, యాంటి బయాటిక్స్, ఐవీ సెట్లు మొదలైనవన్నీ కలిపి 293 కేటగిరీల మందులు ఉండాలి. జ్వరం, దగ్గు, జలుబుతో వచ్చే రోగులు మొదలుకొని ధీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, బీపీతో వచ్చే వారికి, చర్మ వ్యాధులు, పాము కాట్లు, పురుగు మందులు తాగి ఆత్మహత్యకు ప్రయత్నిచిన వారికి ఉపయోగపడే మందుల వరకు ప్రతి ఒక్కటీ పీహెచ్సీల్లో ఉండాలి.కానీ ప్రస్తుతం రాష్ట్రంలోని 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 249 పట్టణ పీహెచ్సీలు, 4,693 ఉప ఆరోగ్య కేంద్రాల్లో పలుచోట్ల 50 నుంచి 100 లోపు కేటగిరీల్లోనే మందులు ఉంటున్నాయనే ఆరోపణలున్నాయి. పాముకాటుకు గురై పీహెచ్సీలకు వచ్చే వారికి ‘పాం’ ఇంజక్షన్ అందుబాటులో ఉండడం లేదు. కుక్కకాటుకు కూడా ఇంజెక్షన్ అందుబాటులో ఉండాలని ఎన్హెచ్ఎం చెపుతుండటం గమనార్హం. మందుల కొరత లేదు.. టీజీఎంఐడీసీ ద్వారా 568 రకాల మందులను కొనుగోలు చేసి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులకు పంపిస్తున్నాం. ఇందులో ఒక కేటగిరీ కింద 293 రకాల మందులు, మరో కేటగిరీలో 100 రకాల మందులు అవసరానికి అనుగుణంగా పంపిస్తాం.ప్రధాన ఆసుపత్రులైన ఉస్మానియా, గాం«దీ, ఎంఎన్జే, నీలోఫర్, ఎంజీఎం ఆసుపత్రులను వారానికోసారి సంప్రదించి ఇండెంట్ ద్వారా వారికి అవసరమైన మందులను పంపిస్తాం. అలాగే జిల్లాల్లోని సీడీఎస్లకు కూడా వారు పంపే ఇండెంట్లను బట్టి మందులు పంపిస్తున్నాం. మందుల కొరత లేదు. ఎక్కడైనా ఉన్నట్లు మా దృష్టికి వస్తే వెంటనే పంపించే ఏర్పాటు చేస్తాం. – హేమంత్ (టీజీఎంఐడీసీ ఎండీ) పాముకాటు మందు కోసం 17 కి.మీ ప్రయాణం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన శ్రీను కొన్నిరోజుల క్రితం ఓ ఇంటి దగ్గర ఉదయం వేళ పనిచేస్తుండగా, కట్టెల కింద పడుకున్న విషపు పాము చేతిపై కాటేసింది. అక్కడే ఉన్న శ్రీను బావ తాడుతో చేయికి కట్టుకట్టి, బైక్పైన గ్రామంలోని పీహెచ్సీకి తీసుకెళ్లాడు. అక్కడ పాము కాటుకు వేసే మందు ‘పాం’ అందుబాటులో లేదు. కరీంనగర్ వెళ్లాలని సిబ్బంది సూచించారు. దాంతో బైక్ పైనే అక్కడికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్ పెద్దాసుపత్రికి వెళ్లగా వైద్యులు చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు.

ఈ రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయం.. శుభవార్తలు వింటారు
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.పాడ్యమి ప.1.02 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: ఉత్తర ఉ.7.48 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: సా.5.02 నుండి 6.46 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.18 నుండి 7.47 వరకు, అమృతఘడియలు: రా.3.29 నుండి 5.15 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 6.13, సూర్యాస్తమయం: 6.06.మేషం: పనులలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి.వృషభం: ఆర్థిక విషయాలు కొంత నిరాశ పరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. ఉద్యోగయత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.మిథునం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనులు మధ్యలో విరమిస్తారు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. ధన్యయం.కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.సింహం: వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. విద్యార్థులకు నిరాశ. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.కన్య: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వివాదాలు తీరతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు.తుల: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. శ్రమ తప్పదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.వృశ్చికం: కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.ధనుస్సు: ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. నూతన ఉద్యోగప్రాప్తి. భూలాభాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.మకరం: కుటుంబంలో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమకు ఫలితం కనిపించదు. నిరుద్యోగుల యత్నాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. ఆలయ దర్శనాలు.కుంభం: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. విద్యార్థులకు నిరుత్సాహం. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.మీనం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

‘రూ’పం... సారం
నిరుడు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి వరసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకొచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి విపక్షాల ఆధ్వర్యంలోని రెండు రాష్ట్రాలు గట్టి ప్రతిఘటననిస్తున్నాయి. ఇందులో తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం బెంగాల్లోని తృణమూల్ సర్కారుకన్నా ఒకడుగు ముందుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఒకపక్క నియోజక వర్గాల పునర్విభజన, మరోపక్క హిందీ భాష పెత్తనం అనే రెండు పదునైన ఆయుధాలతోకేంద్రాన్ని ఇరకాటంలో పడేస్తున్నారు. పార్లమెంటులోనూ, వెలుపలా ఈ రెండింటిపైనా విస్తృతమైన చర్చ జరిగేలా చూస్తున్నారు. నిత్యం పతాక శీర్షికలకెక్కుతున్నారు. శుక్రవారం ప్రవేశపెట్టే 2025–26 రాష్ట్ర బడ్జెట్ లోగో లోని హిందీ అక్షరం‘రూ’ బదులు తమిళ అక్షరం ‘రూ’ను వినియోగించబోతున్నా మని గురువారం స్టాలిన్ ప్రకటించటం అందులో భాగమే. అయితే తమ ఉద్దేశం తమిళభాష ఔన్న త్యాన్ని పెంచటమే తప్ప, హిందీని వ్యతిరేకించటం కాదని డీఎంకే ప్రతినిధి శరవణన్ వివరణ నిచ్చారు. హిందీ ‘రూ’ జాతీయ కరెన్సీ అధికారిక చిహ్నంగా 2010 జూలై నుంచి అమల్లోవుంది.వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్టితోనే డీఎంకే ఇలాంటి విన్యాసాలు చేస్తున్న దని బీజేపీ అంటున్నా, ఆ పార్టీ లేవనెత్తుతున్న రెండు అంశాలూ కొట్టిపారేయదగ్గవి కాదు.రాజ్యాంగం నిర్దేశించిన ఫెడరలిజం భావనను కేంద్రం నీరుగారుస్తోందన్న అభిప్రాయం రాష్ట్రాల్లో బలపడనట్టయితే డీఎంకే లేవనెత్తిన అంశాలకు ఇప్పుడున్నంత ప్రాముఖ్యత లభించేది కాదన్నది వాస్తవం. ఇంతకూ జాతీయ కరెన్సీ చిహ్నం రూపొందించింది తమిళనాడు వ్యక్తి, పైగా డీఎంకే మాజీ ఎమ్మెల్యే కుమారుడు. కనుకనే డీఎంకే నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ చిహ్నంలో హిందీ అక్షరమేవున్నా ఇంగ్లిష్ అక్షరం ‘ఆర్’ను కూడా పోలివుండటం దాని ప్రత్యేకత. కానీ సమస్య తలెత్తినప్పుడు ఇవన్నీ మరుగున పడతాయి. ఆ సంగతలా వుంచి ఈ అంశంలో బీజేపీ స్పందనలు శ్రుతిమించాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కరెన్సీ చిహ్నం మార్పు దేశ ఐక్యతను బలహీనపరిచే ప్రమాదకరమైన మనస్తత్వం పర్యవసానమని అభివర్ణించారు. హిందీ అమలుకు అనుసరించే విధానాలవల్లే ఆ భాషపై వ్యతిరేకత వస్తోంది. ఇది బీజేపీతో మొదలు కాలేదు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోవున్నా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వాటికి ఎప్పటికప్పుడు ప్రతిఘటన వస్తూనే వున్నది. 2008లో యూపీఏ సర్కారు హిందీ వాడకాన్ని పెంచడానికంటూ విడుదల చేసిన సర్క్యులర్పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మెట్రిక్, ఆపై స్థాయి అభ్యర్థులకు కేంద్ర నియామకాల కోసం నిర్వహించే పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా హిందీ ప్రశ్నపత్రం ఉండాలన్నది సర్క్యులర్ సారాంశం. తమ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ సర్కారే దీన్ని తీసుకొచ్చినా అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఇతర ప్రశ్న పత్రాల్లో మెరుగైన మార్కులు వచ్చినా హిందీలో ఫెయిలైతే ఉద్యోగానికి అనర్హులవు తారని ఆ ప్రతిపాదన తెలిపింది. ఇది హిందీ భాషా ప్రాంతాల అభ్యర్థులకే లాభిస్తుందనీ, దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనీ వైఎస్ లేఖ రాశారు. చివరకు ఆ సర్క్యులర్ను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2014, 2017, 2019లలో సైతం కేంద్రం ఈ మాదిరి ప్రతిపాదనలే ముందుకు తోసింది. ఇంగ్లిష్కు ప్రత్యామ్నాయంగా హిందీ ఉండాలని రెండేళ్ల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నప్పుడు కూడా వివాదం రేగింది.జాతీయ విద్యావిధానం–2020తో తమిళనాడుకు పేచీవుంది. తాము ఎప్పటినుంచో వ్యతిరేకి స్తున్న త్రిభాషా సూత్రాన్ని తీసుకురావటమే ఆ విద్యావిధానం సారాంశమని డీఎంకే అంటున్నది. ఆ విధానం ప్రకారం విద్యార్థి మాతృ భాషతోపాటు ఇంగ్లిష్, మరేదైనా దేశీయ భాష నేర్చుకోవాలన్న నిబంధన వుంది. హిందీయే నేర్చుకోవాలని అందులో లేదన్నది నిజమే కావొచ్చుగానీ... వేరే భాష నేర్చుకోవాలనుకుంటే ఆ భాషా ఉపాధ్యాయులు అందుబాటులో ఉండే అవకాశముందా? హిందీ ప్రాంతాల్లో దక్షిణాది భాషలు నేర్పే టీచర్లే లేరు. అసలు ఈ త్రిభాషాసూత్రం వల్ల ఈ స్థాయిలో మేలు జరిగిందని చెప్పే గణాంకాలున్నాయా? జాతీయ విద్యావిధానం అమలు చేయలేదన్న కార ణంతో సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) కింద కేంద్రం నుంచి రావాల్సిన 2,152 కోట్లను నిలిపివేశారని తమిళనాడు ఆరోపిస్తోంది. ఎస్ఎస్ఏకు రావాల్సిన ఆ నిధులను సొంత వనరులనుంచే సమీకరించాలని నిర్ణయించినట్టు ఆ రాష్ట్ర బడ్జెట్లో ప్రకటించారు. హిందీకి వ్యతిరేకమనో, నూతన విద్యావిధానానికి వ్యతిరేకమనో చూపి నిధులు ఆపేయటం ఒత్తిడి తీసుకొచ్చే మార్గమనికేంద్రం అనుకోవచ్చుగానీ... దీన్ని బెదిరించటంగా, బ్లాక్మెయిల్గా తమిళనాడు పరిగణిస్తోంది. విద్యాపరంగా చూసినా, పన్నుల వసూళ్లపరంగా చూసినా తమిళనాడు అనేక రాష్ట్రాలకన్నా ఎంతో ముందుంది. అందుకు ఇదా బహుమతి అనే ప్రశ్న తలెత్తదా?అమల్లోకి తీసుకురాదల్చుకున్న ఏ విధానంపైన అయినా సమగ్ర చర్చ జరపడం, అపోహల్ని తొలగించటం అవసరమని కేంద్రం గ్రహించాలి. ప్రాథమిక స్థాయి విద్య మొదలుకొని విశ్వవిద్యా లయ విద్యవరకూ అన్నింటా తన ఆధిపత్యమే ఉండాలన్న ఆత్రుత వేరే పర్యవసానాలకు దారి తీస్తున్నదని గుర్తుంచుకోవాలి. రాష్ట్రాలను మున్సిపాలిటీల స్థాయికి దిగజారిస్తే, ఫలానా పథకం అమలు చేయలేదన్న కారణం చూపి నిధులు ఎగ్గొడితే సాధారణ ప్రజలకు వేరే సంకేతాలు పోతాయి. ఆ పరిస్థితి తలెత్తకుండా చూసుకోవటం కేంద్రం బాధ్యత.

ఢిల్లీ ఈ సారైనా సాధించేనా!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 17 సీజన్ల పాటు ఆడినా ఢిల్లీ జట్టు టైటిల్ గెలవలేకపోయింది. అదే యాజమాన్యానికి చెందిన మహిళల జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో వరుసగా రెండు సీజన్ల పాటు నిరాశపర్చింది. 2023, 2024 సీజన్లలో గ్రూప్ దశలో టాపర్గా నిలవడంతో ఫైనల్కు చేరిన క్యాపిటల్స్ రెండుసార్లూ ఫైనల్ మ్యాచ్లలో ఓడి రన్నరప్గానే సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఇప్పుడు తాజా సీజన్లో కూడా టాపర్గా ఫైనల్ చేరిన టీమ్ మరోసారి ట్రోఫీ కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. నేడు జరిగే ఫైనల్లో 2023 చాంపియన్ ముంబై ఇండియన్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడుతుంది. తాజా సీజన్ లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్లలోనూ ఢిల్లీనే నెగ్గి 2–0తో ఆధిక్యం ఉంది. అంతర్జాతీయ మహిళల క్రికెట్లో ఆల్టైమ్ గ్రేట్ కెప్టెన్ గా ఉన్న మెగ్ లానింగ్ గత ఏడాది ఢిల్లీకి టైటిల్ అందించడంలో విఫలమైంది. ఈసారి అది పునరావృతం కాకుండా సత్తా చాటాలని ఆమె పట్టుదలగా ఉంది. సీజన్లో ఏకంగా 157.89 స్ట్రయిక్ రేట్తో 300 పరుగులు చేసిన షఫాలీ వర్మ మరోసారి టీమ్కు కీలకం కానుంది.మెగ్ లానింగ్ కూడా 263 పరుగులతో టీమ్ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించింది. జెమీమా రోడ్రిగ్స్ మాత్రం ఆశించినంత మెరుగైన ప్రదర్శన ఇవ్వలేదు. ఫైనల్లోనైనా ఆమె రాణించాల్సి ఉంది. ఆల్రౌండర్గా జెస్ జొనాసెన్ టోర్నీలో చక్కటి ప్రదర్శన కనబర్చింది. 137 పరుగులతో పాటు 11 వికెట్లు తీసిన ఆమెకు శిఖా పాండే (11) అండగా నిలిచింది. వీరిద్దరితో పాటు అనాబెల్ సదర్లాండ్ తమ బౌలింగ్తో ప్రత్యరి్థని కట్టడి చేయగలరు. దూకుడైన బ్యాటింగే ముంబై ప్రధాన బలం. నాట్ సివర్ 156.50 స్ట్రయిక్రేట్తో 5 అర్ధసెంచరీలు సహా 493 పరుగులు సాధించి అగ్ర స్థానంలో ఉంది. హేలీ మాథ్యూస్ (304) కూడా దూకుడైన ఆటకు మారు పేరు. కెపె్టన్గా హర్మన్ప్రీత్ కౌర్ కూడా 156.29 స్ట్రయిక్ రేట్తో 236 పరుగులు చేసి తన వంతు పాత్ర పోషించింది. బౌలింగ్లో హేలీ, అమెలియా కెర్ కలిసి 33 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. సమష్టిగా సత్తా చాటడంతో ముంబై జట్టుదే పైచేయి. ఈ నేపథ్యంలో అంతిమ విజేత ఎవరు అవుతారనేది చూడాలి.

ఫైర్ లేని వాల్స్!
సాక్షి, హైదరాబాద్: ప్రతీ రంగంలో సాంకేతికత అత్యంత కీలకంగా మారింది. అదేస్థాయిలో సైబర్ దాడుల ముప్పు పొంచి ఉంటోంది. ఏదైనా సంస్థ నెట్వర్క్ను భద్రంగా ఉంచేందుకు పటిష్టమైన ఫైర్వాల్ రక్షణ వ్యవస్థ తప్పనిసరి. అయితే, హ్యాకర్ల దాడుల విషయంలో భారతీయ కంపెనీలకు చెందిన నెట్వర్క్లు బలహీనమని గ్రూప్–ఐబీ సంస్థ ఇటీవల విడుదల చేసిన హైటెక్ క్రైం ట్రెండ్స్ రిపోర్ట్–2025లో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 2024లో జరిగిన సైబర్ దాడుల్లో అత్యధికంగా 13 శాతం ఘటనలు భారత్లోనే జరిగినట్టు ఆ నివేదిక స్పష్టంచేసింది. ప్రధానంగా విద్యాసంస్థలకు సంబంధించిన నెట్వర్క్లపైనే హ్యాకర్లు దాడులకు పాల్పడుతున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత ప్రభుత్వరంగ సంస్థల నెట్వర్క్, మిలిటరీ, ఆర్థికసేవల సంస్థల నెట్వర్క్లు హ్యాకర్లకు లక్ష్యంగా మారుతున్నాయని పేర్కొంది. హ్యాకర్లు ఫైర్వాల్స్ను ఛేదించి సదరు నెట్వర్క్లోకి చొరబడి మొత్తం వ్యవస్థను తమ అ«దీనంలోకి తీసుకుని సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తున్నట్టు తెలిపింది. డేటా లీకేజీలో అమెరికాది తొలిస్థానంపబ్లిక్ డొమైన్లో ఉండే డేటా లీకేజీలో అమెరికా తొలిస్థానంలో ఉన్నట్టు నివేదిక తెలిపింది. 2024లో ఈ తరహా ఘటనలు అమెరికాలో 214 నమోదైనట్టు పేర్కొంది. తర్వాత స్థానంలో రష్యా (195 ఘటనలు) ఉండగా.. భారత్ (60) మూడో స్థానంలో నిలిచినట్టు గ్రూప్–ఐబీ నివేదిక పేర్కొంది. ఈ–మెయిల్ అడ్రస్లు, ఫోన్ నంబర్లు, పాస్వర్డ్లు ఈ డేటా లీకేజీలో ఉంటున్నాయి. 2024లో ఈ–మెయిల్ అడ్రస్లు, పాస్వర్డ్లను డార్క్వెబ్లో విక్రయించడం ద్వారానే సైబర్ నేరగాళ్లు రూ.248.9 కోట్లు కొల్లగొట్టారు.ఫైర్వాల్స్ అంటే? అనధికారికంగా నెట్వర్క్లోకి చొరబడకుండా, హానికరమైన డేటాను నెట్వర్క్లోకి చొప్పించకుండా రక్షించే భద్రతా పరికరమే ఫైర్వాల్. ఇది హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్ కావొచ్చు. నెట్వర్క్ ప్యాకెట్లను పరిశీలించి వాటిని అనుమతించాలా లేదా నిరోధించాలా అనేదాన్ని ఫైర్వాల్ నిర్ణయిస్తుంది. ఫైర్వాల్స్ ఇంటర్నెట్ ద్వారా కంప్యూటర్ లేదా నెట్వర్క్ను యాక్సెస్ చేయకుండా హానికరమైన సాఫ్ట్వేర్ను నిరోధించగలవు.

అవును.. వాళ్లు యువతులను మావోల్లో చేర్పిస్తున్నారు
సాక్షి, అమరావతి: యువతులకు బ్రెయిన్వాష్ చేసి వారిని నిషేధిత మావోయిస్టు పార్టీలో చేర్పిస్తున్న వ్యవహారంలో నిందితులుగా ఉన్న డొంగరి దేవేంద్ర, చుక్కా శిల్పలకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన కేసులో బెయిల్ కోసం వారు దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు కొట్టేసింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ కింది కోర్టు గతంలో జారీచేసిన ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. పిటిషనర్లు యువతులకు బ్రెయిన్వాష్ చేసి మావోయిస్టు పార్టీలో చేర్పిస్తున్నారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కంచిరెడ్డి సురేష్రెడ్డి, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.నా కుమార్తెను బలవంతంగా చేర్చారు..డొంగరి దేవేంద్ర, చుక్కా శిల్ప మరికొందరు కలిసి మావోయిస్టు పార్టీలోకి యువతులను చేర్పించేందుకు చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) పేరుతో ఓ సంఘం ఏర్పాటుచేశారు. సామాజిక సేవ నెపంతో యువతులను చేరదీసి, వారు మావోయిస్టు భావజాలానికి ఆకర్షితులయ్యేలా చేసి, ఆ తరువాత మావోయిస్టుల్లో చేర్పిస్తున్నారు. ఇదే రీతిలో విశాఖపట్నం, పెద్దబయలుకు చెందిన రాధా అనే యువతిని 2017లో మావోయిస్టుల్లో చేర్పించారు.2021లో రాధా తల్లి తన కుమార్తెను బలవంతంగా మావోయిస్టుల్లో చేర్పించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా దర్యాప్తు బాధ్యతలను ఎన్ఐఏకి అప్పగించారు. ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. ఇదిలాఉంటే.. ఈ కేసులో తమకు బెయిల్ ఇవ్వాలంటూ డొంగరి దేవేంద్ర, చుక్కా శిల్ప విశాఖపట్నంలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు వారి బెయిల్ పిటిషన్లను కొట్టేస్తూ 2024 మే 29న తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలుచేస్తూ వారిరువురూ హైకోర్టులో క్రిమినల్ అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై జస్టిస్ సురేష్రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.మావోయిస్టు కార్యకలాపాల్లో క్రియాశీలకంగా..పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎ. సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. 2017లో రాధాను తీసుకెళ్లారంటూ ఆమె తల్లి 2021లో పోలీసులకు ఫిర్యాదు చేశారని.. కానీ, అప్పటికే ఆమె నాలుగేళ్లపాటు మౌనంగా ఉన్నారన్నారు. ఎన్ఐఏ తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) పసల పొన్నారావు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని తేల్చిచెప్పారు. ఇందుకు సంబంధించి ఎన్ఐఏ పలు కీలక ఆధారాలు సేకరించిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఎన్ఐఏ సేకరించిన ఆధారాలను, అది దాఖలు చేసిన చార్జిషీట్ను పరిశీలించింది. పిటిషనర్లకు బెయిల్ నిరాకరిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పులో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. పిటిషనర్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కొట్టేస్తున్నట్లు తెలిపింది.

గ్రీన్ కార్డు శాశ్వత నివాసానికి... హక్కు కాదు: వాన్స్
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా వలస విధానంపై ఇప్పటికే ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆందోళనలను మరింతగా పెంచే పరిణామం చోటుచేసుకుంది. డాలర్ డ్రీమ్స్ను నిజం చేసుకోవడానికి రాచబాటగా భావించే అమెరికా గ్రీన్కార్డుపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్కార్డు ఉన్నంతమాత్రాన అమెరికాలో నివాసానికి, పని చేయడానికి శాశ్వత హక్కులు దఖలు పడ్డట్టు కాదని స్పష్టం చేశారు. న్యూయార్క్లోని ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ విద్యార్థి మహ్మద్ ఖలీల్ యూదు విద్వేష ఆరోపణలపై ఇటీవలే అరెస్టవడం తెలిసిందే. అతను గ్రీన్కార్డు హోల్డరే కావడాన్ని ప్రస్తావిస్తూ వాన్స్ పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇదేమీ వాక్ స్వాతంత్య్రానికి సంబంధించిన అంశం కాదు. జాతీయ భద్రతకు సంబంధించిన అతి కీలకమైన విషయం. అంతకుమించి, అమెరికాలో శాశ్వత నివాసులుగా మాతోపాటు ఎవరుండాలన్న దానికి సంబంధించిన అంశం. దీన్ని నిర్ణయించేది అమెరికన్లు మాత్రమే’’ అంటూ కుండబద్దలు కొట్టారు. ఆయన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా, ముఖ్యంగా భారత్లో దుమారం రేపుతున్నాయి. ఏటా భారీ సంఖ్యలో అమెరికా బాట పట్టే భారత విద్యార్థులందరికీ గ్రీన్కార్డు ఒక బంగారు కల. అది చిక్కిందంటే అమెరికాలో శాశ్వత నివాసం దక్కినట్టేనని భావిస్తారు. వాన్స్ వ్యాఖ్యలు వారినేగాక అమెరికాలో గ్రీన్కార్డు హోల్డర్లయిన లక్షలాది మంది భారతీయులను కూడా కలవరపాటుకు గురిచేస్తున్నాయి. గురువారం ఫాక్స్ న్యూస్ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా వలస విధానాలకు సంబంధించి వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కొలంబియా వర్సిటీలో హమాస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న విద్యార్థి ఖలీల్ కూడా గ్రీన్కార్డు హోల్డరే. అందుకే చెబుతున్నా, గ్రీన్కార్డు హోల్డర్కు అమెరికాలో శాశ్వతంగా ఉండిపోయే హక్కు లేదు’’ అని స్పష్టం చేశారు. గ్రీన్కార్డు హోల్డర్లయినా సరే, అమెరికా భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు అనుమానిస్తున్న విద్యార్థులు తదితరులపై కఠిన చర్యలకు ట్రంప్ సర్కారు సిద్ధమవుతోందని ఉపాధ్యక్షుడు ప్రకటించారు. ‘‘వారి ఉనికి అమెరికాకు ముప్పని తేలిన పలువురిని త్వరలో తిప్పి పంపుతున్నాం. ఈ జాబితాలో విద్యార్థులతో పాటు ఇతరులు కూడా ఉన్నారు’’ అని వివరించారు. ట్రంప్ రాకతో అమెరికాలోకి అక్రమ వలసలు 95 శాతానికి పైగా తగ్గిపోయాయన్నారు.ఏమిటీ గ్రీన్కార్డు? పర్మనెంట్ రెసిడెంట్ (శాశ్వస నివాస) కార్డు. గ్రీన్కార్డుగా భారత్లో దాదాపు ఇంటింటికీ పరిచయం. ఇది విదేశీ పౌరులకు అమెరికాలో నివసించేందుకు, పని చేసుకునేందుకు హక్కు కల్పిస్తుంది. అంతేగాక కోరుకున్న కంపెనీలో పని చేయవచ్చు. సొంత వ్యాపారం వంటివీ చేసుకోవచ్చు. గ్రీన్కార్డు పొందిన మూడు నుంచి ఐదేళ్లకు పౌరసత్వం కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నిజానికిది పేరుకే శాశ్వత నివాస కార్డు. వాన్స్ చెప్పినట్టుగా అమెరికాలో శాశ్వతంగా ఉండేందుకు హక్కు కల్పించదు. దీన్ని పదేళ్ల కాలపరిమితితో జారీ చేస్తారు. కొన్ని పరిస్థితుల్లో గ్రీన్కార్డును రద్దు చేయవచ్చు. నేర కార్యకలాపాల్లో పాల్గొన్నా, చాలాకాలం పాటు అమెరికాకు దూరంగా ఉన్నా, వలస నిబంధనలను ఉల్లంఘించినా గ్రీన్కార్డును కోల్పోతారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు దశాబ్దాలుగా గ్రీన్కార్డుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారిలో చాలామందికి కార్డు దక్కాలంటే 50 ఏళ్ల దాకా పట్టొచ్చట. కొన్ని కేటగిరీల వాళ్లకైతే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి గ్రీన్కార్డు రావాలంటే 134 సంవత్సరాలు పడుతుంది! 3.4 కోట్ల మందికి పైగా గ్రీన్కార్డు కోసం ఎదురు చూస్తుండగా వారిలో 11 లక్షల మందికి పైగా భారతీయులే! వీరిలో 4 లక్షల మంది తమ జీవితకాలంలో కార్డును కళ్లజూడలేరన్నది ఇమిగ్రేషన్ నిపుణుల మాట. అమెరికా ఏటా గరిష్టంగా 6.75 లక్షల గ్రీన్కార్డులు మాత్రమే జారీ చేస్తుంది. వాటిలో ఏ దేశానికీ 7 శాతానికి మించి ఇవ్వరాదన్న నిబంధన ఉంది. ఇదే భారతీయులకు పెద్ద అడ్డంకిగా మారింది. ప్రస్తుతం అమెరికాలో గ్రీన్కార్డున్న భారతీయుల సంఖ్య 3 లక్షలకు పైగా ఉంటుంది. గోల్డ్ కార్డు రాకతో... అమెరికాలో శాశ్వత నివాసానికి ట్రంప్ ఇటీవల కొత్తగా గోల్డ్ కార్డు స్కీమును ప్రకటించిన నేపథ్యంలో గ్రీన్కార్డు ప్రాధాన్యతను తగ్గించేలా వాన్స్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘ఇప్పటిదాకా గ్రీన్కార్డుంది. ఇకపై గోల్డ్కార్డు తెస్తున్నాం. గ్రీన్కార్డు ఇచ్చే సదుపాయాలన్నింటినీ ఇదీ ఇస్తుంది. వాటితో అదనంగా అమెరికాలో శాశ్వత నివాసానికి, పౌరసత్వానికి కూడా గోల్డ్కార్డు రాచమార్గం’’ అని ట్రంప్ చెప్పు కొచ్చారు. అమెరికాలోని అత్యున్నత వర్సిటీల్లో చదివే ప్రతిభావంతులు, భారతీయ విద్యా ర్థులు దేశం దాటకుండా ఆపడంలో తమ వలస విధానం విఫలమైందని ఆయన ఆక్షేపించారు. గోల్డ్కార్డుకు 50 లక్షల డాలర్లు (రూ.43.54 కోట్లు) ఫీజుగా నిర్ణయించారు. ‘‘కనీసం కోటి గోల్డ్కార్డులు అమ్మాలన్నది మా లక్ష్యం. తద్వారా వచ్చే ఆదాయంతో అమెరికా అప్పు తీరుస్తాం’’ అని ట్రంప్ ప్రకటించారు. 1990 నుంచి అమల్లో ఉన్న ఈబీ–5 వీసాలను గోల్డకార్డు భర్తీ చేసింది.

పడిపోతున్న సిబిల్!
హిందూపురానికి చెందిన కరీముల్లా ఆర్నెళ్ల క్రితం రూ.లక్ష విలువ చేసే ఫర్నిచర్ను ఓ ప్రైవేటు సంస్థ ద్వారా ప్రతి నెలా రూ.5 వేలు చెల్లించేలా ఒప్పందంపై కొనుగోలు చేశాడు. తొలి నాలుగు నెలలు సజావుగానే ఈఎంఐ చెల్లించాడు. ఆ తర్వాత అతడు చేస్తున్న చిరుద్యోగం కాస్త ఊడిపోయింది. దీంతో కంతులు చెల్లించడంలో జాప్యం నెలకొంది. ఫలితంగా ఆర్నెల్ల తర్వాత చూసుకుంటే ఆయన సిబిల్ స్కోరు ఒక్కసారిగా 300కు పడిపోయింది. పుట్టపర్తికి చెందిన చిరు వ్యాపారి కృష్ణసాయి తన అవసరాల నిమిత్తం ఓ బ్యాంకులో వ్యక్తిగత రుణం తీసుకున్నాడు. అనివార్య కారణాలతో వ్యాపారం తీసేయాల్సి వచ్చింది. దీంతో నెలవారీ కంతులు చెల్లించడంలో ఇబ్బందులు నెలకొని సిబిల్ స్కోరు 200కు పడిపోయింది. ఆ తర్వాత ఎన్ని బ్యాంకుల్లో ప్రయత్నించినా.. కొత్త రుణం ఆయనకు పుట్టలేదు. .... ఇప్పట్లో సిబిల్ స్కోరుకు పెరిగిన ప్రాధాన్యతకు ఈ ఘటనలు ఓ ఉదాహరణ మాత్రమే. ఆర్థిక నియంత్రణ కోల్పోతే భవిష్యత్తు కష్టమని ఆర్థిక నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. సాక్షి, పుట్టపర్తి: ఎవరైనా వ్యక్తి ఆర్థిక చరిత్రకు అద్దం పట్టేది క్రెడిట్ స్కోరు. ఇక్కడ తీసుకున్న లోన్లు.. చెల్లింపుల తీరు.. క్రెడిట్ కార్డుల వినియోగం.. అప్పుల కోసం ఎన్ని సార్లు ప్రయత్నించారు. గతంలో ఏమైనా లోన్లు ఎగ్గొట్టారా.. ఇప్పటికీ ఈఎంఐ కడుతున్నారా.. ఇలా అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఈ క్రెడిట్ రిపోర్టుతో వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణ ఏపాటిదో సులువుగా తెలుసుకోవచ్చు. ఆర్థిక నియంత్రణ క్రమశిక్షణ లేకపోవడం కారణంగా చాలామంది చిరుద్యోగులు, చిరు వ్యాపారులు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. అప్పు చేసి విలాసాలు.. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా మారింది ప్రస్తుతం మధ్య తరగతి ప్రజల పరిస్థితి. తమ చుట్టుపక్కల వారు ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే తమ ఇంట్లోనే ఉండాలనే ఆకాంక్ష తప్పు కాదు. అయితే ఇందు కోసం అప్పు చేసి ఆ తర్వాత రుణాలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి లేని తలనొప్పులు తెచ్చుకుంటున్నారు. చిన్నపాటి లావాదేవీల విషయంగానే సిబిల్ స్కోరు పడిపోయి.. భవిష్యత్తులో బ్యాంకుల ద్వారా రుణాలు పొందే సదుపాయాన్ని కోల్పోతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. మధ్య తరగతి ప్రజల అవసరాలను తెలివిగా ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఆఫర్ల పేరుతో రుణాల ఎర వేసి ఆకట్టుకుంటున్నారు. అయితే రుణం తీసుకునే సమయంలో సరైన ప్లానింగ్ లేకపోవడంతో నెలవారీ కంతులు చెల్లించడంలో జాప్యం చోటు చేసుకుని భారీగా నష్టపోతున్నారు. ఆర్థిక క్రమశిక్షణ, అవగాహన లేకుంటే ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరిగిపోతున్న డిఫాల్టర్లు.. జిల్లా వ్యాప్తంగా రకరకాల ప్రైవేటు సంస్థల ద్వారా రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించలేని స్థితిలో చాలా మంది డిఫాల్టర్లుగా మారిపోతున్నారు. ఇటీవల వీరి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మొబైల్ ఫోన్లు, వాషింగ్ మెషీన్లు, టీవీలు, ఫ్రిజ్లు, ఫర్నిచర్లు... తదితరాలను కొనుగోలు చేసిన వారే ఎక్కువ మంది డిఫాల్టర్లుగా మారినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా సిబిల్ స్కోరు 650 దాటితే ఏవైనా రుణాలొస్తాయి. కానీ తీసుకున్న రుణం సక్రమంగా చెల్లించకపోవడంతో ప్రతి పది మందిలో ఇద్దరు డిఫాల్టర్లుగా మారుతున్నారు. సున్నా వడ్డీతో ఆకర్షిస్తూ.. పలు ఫైనాన్స్ కంపెనీలు జీరో ప్రాసెసింగ్, సున్నా వడ్డీ అంటూ ఇచ్చే ప్రకటనలతో చాలామంది వినియోగదారులు మోసపోతున్నారు. ఎలాంటి వడ్డీ లేకుండా, ప్రాసెసింగ్ ఫీజు లేకుండా వస్తువుకు డబ్బు కట్టి, పది నెలలు మనతో రీపేమెంట్ ఎందుకు చేసుకుంటాయనే లోగుట్టును చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఓ కంపెనీ ఎలాంటి లాభాపేక్ష లేకుండా జీరో ప్రాతిపదికన రుణం ఎందుకు ఇస్తుందనే విషయాన్ని వినియోగదారులు ఆలోచించాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఉంటే ఉత్తమమని సూచిస్తున్నారు. సిబిల్ స్కోరు కీలకం ప్రస్తుత పరిస్థితుల్లో సిబిల్ స్కోరు చాలా కీలకంగా మారింది. చిన్నపాటి అప్పుల సమాచారాన్ని సైతం ఆయా ఫైనాన్స్ సంస్థలు సిబిల్కు తెలియజేస్తాయి. చెల్లింపుల్లో జాప్యం లేదా మొండి బకాయిలు.. ఇలా రకరకాల కారణంగా చాలామందికి సిబిల్ స్కోరు లేక బ్యాంకుల్లో రుణాలు అందడం లేదు. వస్తువు తీసుకున్నాక సకాలంలో చెల్లింపులు చేయకపోతే భవిష్యత్తులో పరపతి లభించడం చాలా కష్టం. – రాధాకృష్ణారెడ్డి, ఆడిటర్, పుట్టపర్తి
మన ఏడు రెస్టారెంట్లు ఆసియాలో బెస్ట్...
కోడిగుడ్లు ఇస్తారా.. ప్లీజ్!
పిల్లలు ఫిర్యాదు చేయగానే... టీచర్ల అరెస్టు కూడదు
సర్కారుపై ఏమాత్రం వెనక్కి తగ్గొద్దు!
సూపర్ సిక్స్ ఇవ్వాలనే ఉంది కానీ.. గత ప్రభుత్వం మమ్మల్ని తిట్టింది... అందుకే ఇవ్వడం లేదు!
ఉక్రెయిన్ సైనికులను దయతలచి వదిలేయండి
పడిపోతున్న సిబిల్!
అనకాపల్లిలో ‘అణు’ విద్యుత్ ప్లాంట్!
యునెస్కో తాత్కాలిక జాబితాలోకి తెలంగాణలోని ముడమాల్ నిలువురాళ్లు
యువత మార్కెట్ సోషల్ మీడియా
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారాలలో లాభాలు
ఎవరూ ఊహించని నిర్ణయం.. రోహిత్ వ్యూహం భేష్: పాక్ దిగ్గజం
IND Vs AUS: ఆసీస్తో సెమీస్.. యువరాజ్, సచిన్ విధ్వంసం! వీడియో వైరల్
‘జీతాల తేడాలొద్దు.. ఉద్యోగులను మనుషుల్లా చూడండి’
భారత్లో స్టార్లింక్ ఇంటర్నెట్ ఛార్జీలు ఇలా..
పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నేనే సీఎం- కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
లే నాన్నా.. అమ్మా, చెల్లి వచ్చాం
ప్రభాస్పై ట్రోలింగ్.. ‘కల్కి’ అంతా ఫేకేనా?
‘దిల్ రూబా’ మూవీ రివ్యూ
ఉన్నదే ఒక్కడు.. మీరు కాస్త నోళ్లు మూయండి: పాక్ మాజీ స్పిన్నర్ ఫైర్
మన ఏడు రెస్టారెంట్లు ఆసియాలో బెస్ట్...
కోడిగుడ్లు ఇస్తారా.. ప్లీజ్!
పిల్లలు ఫిర్యాదు చేయగానే... టీచర్ల అరెస్టు కూడదు
సర్కారుపై ఏమాత్రం వెనక్కి తగ్గొద్దు!
సూపర్ సిక్స్ ఇవ్వాలనే ఉంది కానీ.. గత ప్రభుత్వం మమ్మల్ని తిట్టింది... అందుకే ఇవ్వడం లేదు!
ఉక్రెయిన్ సైనికులను దయతలచి వదిలేయండి
పడిపోతున్న సిబిల్!
అనకాపల్లిలో ‘అణు’ విద్యుత్ ప్లాంట్!
యునెస్కో తాత్కాలిక జాబితాలోకి తెలంగాణలోని ముడమాల్ నిలువురాళ్లు
యువత మార్కెట్ సోషల్ మీడియా
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారాలలో లాభాలు
ఎవరూ ఊహించని నిర్ణయం.. రోహిత్ వ్యూహం భేష్: పాక్ దిగ్గజం
IND Vs AUS: ఆసీస్తో సెమీస్.. యువరాజ్, సచిన్ విధ్వంసం! వీడియో వైరల్
‘జీతాల తేడాలొద్దు.. ఉద్యోగులను మనుషుల్లా చూడండి’
భారత్లో స్టార్లింక్ ఇంటర్నెట్ ఛార్జీలు ఇలా..
పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నేనే సీఎం- కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
లే నాన్నా.. అమ్మా, చెల్లి వచ్చాం
ప్రభాస్పై ట్రోలింగ్.. ‘కల్కి’ అంతా ఫేకేనా?
‘దిల్ రూబా’ మూవీ రివ్యూ
ఉన్నదే ఒక్కడు.. మీరు కాస్త నోళ్లు మూయండి: పాక్ మాజీ స్పిన్నర్ ఫైర్
సినిమా

హోలీ వేడుకల్లో సోనాక్షి సిన్హా.. ఆయన ఎక్కడంటూ నెటిజన్ల ట్రోల్స్!
సినీ తారలంతా హోలీ సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. ఫ్యామిలీతో కలిసి రంగులు చల్లుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలు పంచుకుంటున్నారు. అందరిలాగే బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా సైతం హోలీ పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇవీ చూసిన అభిమానులు ఈ ముద్దుగుమ్మకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.అయితే కొందరు నెటిజన్స్ మాత్రం సోనాక్షిని ట్రోల్ చేశారు. హోలీ వేడుకల్లో మీ భర్త జహీర్ ఇక్బాల్ ఎక్కడ అంటూ ప్రశ్నించారు. అయితే నెటిజన్ల కామెంట్స్కు సోనాక్షి కూడా స్పందించింది. 'నేను ప్రస్తుతం జటాధర మూవీ షూట్లో ఉన్నా.. నా భర్త జహీర్ ముంబయిలో ఉన్నారు.. మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి' అంటూ విమర్శలకు తనదైన స్టైల్లో కౌంటరిచ్చింది.కాగా.. గతేడాది జూన్లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. సోనాక్షి, జహీర్ దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నారు. సల్మాన్ఖాన్ నిర్వహించిన పార్టీలో తొలిసారిగా వీరిద్దరు కలుసుకున్నారు. సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ 'నోట్బుక్'తో అరంగేట్రం చేసిన జహీర్.. సోనాక్షితో కలిసి డబుల్ ఎక్స్ఎల్ చిత్రంలో నటించారు. గతేడాది జూన్ 23, 2024న ముంబయిలో గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి సల్మాన్ ఖాన్, కాజోల్, విద్యాబాలన్ లాంటి అగ్రతారలు హాజరయ్యారు.ఇక సినిమాల విషయానికొస్తే సోనాక్షి సిన్హా ప్రస్తుతం జటాధార చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. సుధీర్బాబు హీరోగా నటిస్తున్న జటాధర సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా జటాధర చిత్రబృందం సోనాక్షి ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. అందులో ఈ బ్యూటీ కళ్లకు కాటుక, చిందరవందరగా ఉన్న జుట్టుతో కనిపించింది. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 14న లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీకి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona)

ప్రభాస్పై ట్రోలింగ్.. ‘కల్కి’ అంతా ఫేకేనా?
ప్రభాస్.. ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ హీరో. అందులో నో డౌట్. ఆయన ప్లాప్ సినిమా కూడా దాదాపు రూ.500 కోట్లు కలెక్షన్స్ని రాబడుతున్నాయి. ఇక హిట్ టాక్ వస్తే ఎలా ఉంటుందో ‘కల్కి’ సినిమానే చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.1180 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అంతేకాదు గతంలో బాలీవుడ్ హీరోల ఖాతాలో ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టాడు ప్రభాస్. దీంతో ప్రభాస్తో పాటు దక్షిణాది హీరోలపై బాలీవుడ్లో అసూయ పెరిగింది. సౌత్ సినిమాలు, హీరోలపై నెగెటివ్ కామెంట్స్ చేయడం ప్రారంభించారు. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయనతో పాటు దక్షిణాది దర్శకులపై కూడా అక్కసు వెల్లగక్కుతున్నారు. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.అంతా ఫేకేనా?నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ (prabhas) హీరోగా నటించిన చిత్రం ‘కల్కి’(Kalki 2898 AD). అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషించారు. గతేడాదిలో రిలీజైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేసింది. ఈ మూవీలోని యాక్షన్ సీక్వెన్స్కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అమితాబ్, ప్రభాస్ల మధ్య జరిగే ఫైట్ సీన్కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అయితే దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ సినిమాలో ప్రభాస్ చేసిన యాక్షన్స్ సీన్స్ అన్ని ఫేకే అని ట్రోల్ చేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ కోసం బాడీ డబుల్స్, డీప్ ఫేక్ టెక్నాలజీని వాడినట్లు వీడియోలు చూపించారు. ప్రభాస్ని వాడుకోవడంలో నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్ ముందు వరుసలో ఉంటారని, ఆయన క్లోజ్ షాట్స్ తీసుకొని 80 శాతం షూటింగ్ డూప్లతోనే కానిస్తారంటూ కామెంట్ చేస్తున్నారు.(చదవండి: వేలంలోయువతి కన్యత్వం.. రూ.18 కోట్లకు కొనుగోలు చేసిన హీరో!)ప్రభాస్ ఒక్కడే కాదుగా.. యాక్షన్ సీక్వెన్స్కి డూప్ని వాడడం ఇండస్ట్రీలో కామన్. స్టార్ హీరోలలో చాలా వరకు యాక్షన్ సీన్లను డూప్తోనే కానిస్తారు. ఈ కల్చర్ బాలీవుడ్ నుంచే మొదలైంది. షారుఖ్, సల్మాన్తో పాటు స్టార్ హీరోలంతా తమ సినిమాల్లోని యాక్షన్ సీన్లకు బాడీ డబుల్స్ని వాడుతారు. ప్రభాస్ కూడా అదే పని చేశాడు. తన సినిమాల్లో బాడీ డబుల్స్ని వాడుతుంటారు. కల్కిలోనూ వాడినట్లు తెలుస్తోంది. ట్రోల్ చేస్తున్న వీడియో ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. తమ హీరోపై అసూయతోనే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. ‘షారుఖ్, సల్మాన్లు అయితే క్లోజ్ షాట్స్ కూడా బాడీ డబుల్స్తోనే చేయిస్తారు’, యాక్షన్ సీన్లకు ప్రభాస్ ఒక్కడే కాదు.. ఎవరైనా డూప్నే’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: ‘దిల్ రూబా’ మూవీ రివ్యూక్షమాపలు చెప్పిన సురేఖవాణి కూతురు సుప్రీత.. ఎందుకంటే?

సెంచరీ కొట్టిన పుష్పరాజ్ .. మేకర్స్ స్పెషల్ వీడియో
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 గతేడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. అమిర్ ఖాన్ దంగల్ తర్వాత (రూ. 2,070 కోట్లు) ఇండియాలోనే రెండో స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, బాహుబలి లాంటి సినిమాల రికార్డులను తుడిచిపెట్టేసింది.అయితే ఈ సినిమా విడుదలై నేటికి 100 రోజులు పూర్తి చేసుకుంది. దీంతో మేకర్స్ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ పుష్ప 2 ది రూల్.. 100 డేస్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ బద్దలు కొడుతూ.. భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా.. ప్రస్తుతం ఈ మూవీ నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.కాగా.. పుష్ప -2 విషయానికి వస్తే 2021లో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించగా.. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఫహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు. 100 DAYS FOR INDIAN CINEMA'S INDUSTRY HIT #Pushpa2TheRule ❤️🔥From wildfire moments on the screen to record-breaking moments at the box office, #Pushpa2 has taken Indian Cinema to the next level 💥💥💥#100DaysofPushpa2TheRule#WildFirePushpa pic.twitter.com/cjJVVTeoUR— Mythri Movie Makers (@MythriOfficial) March 14, 2025

అంబానీ పెళ్లి.. ఆవు కాలికి కూడా వజ్రాలు.. అది మరో ప్రపంచం: కర్దాషియన్స్
అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లిని దేశమంతా చూసింది. ఈ వివాహ వేడుకకు దేశవిదేశాల నుంచి సెలబ్రిటీలు హాజరయ్యారు. ఖర్చుకు వెనుకాడకుండా అంగరంగ వైభవంగా ఈ పెళ్లి జరిపించారు ముఖేశ్ - నీతా అంబానీ. ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో కర్దాషియన్స్ సిస్టర్స్ కూడా ఉన్న విషయం తెలిసిందే! అయితే ఎప్పుడూ పొట్టి బట్టల్లో కనిపించే వారు ఈ పెళ్లిలో మాత్రం భారతీయ సాంప్రదాయానికి తగ్గట్లుగా లంగా ఓణీలో మెరిశారు. అంబానీ ఆతిథ్యం చూసి గుడ్లు తేలేశారు. స్వయంగా వారే ఈ మాట చెప్తున్నారు.మరో ప్రపంచలోకి వెళ్లినట్లే ఉందిద కర్దాషియన్స్ లేటెస్ట్ ఎపిసోడ్లో అనంత్ అంబానీ (Anant Ambani) పెళ్లి గురించి మాట్లాడారు. వేదికను ఎంత అందంగా ముస్తాబు చేశారో అని ఖ్లోయె ఫ్లాష్బ్యాక్లోకి వెళ్లిపోగా.. లక్షలాది పువ్వులు సీలింగ్ నుంచి వేలాడుతూ ముచ్చటగొలిపాయి అని కిమ్ (Kim Kardashian) చెప్పుకొచ్చింది. మా ఎగ్జయిట్మెంట్ను చాలావరకు ఆపుకున్నాం. అదంతా ఒక డిస్నీల్యాండ్ రైడ్లా అనిపించింది. డిస్నీల్యాండ్తో పోల్చడం కూడా చిన్నమాటే అవుతుంది అని ఖ్లోయే (Khloe Kardashian) అభిప్రాయపడింది. మరో ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అనిపించింది అని కిమ్ పేర్కొంది.రిచ్ వెడ్డింగ్వీరిద్దరూ ఇంకా మాట్లాడుతూ.. పెళ్లికూతురు రాధిక మర్చంట్ (Radhika Merchant) నెమలిలా డిజైన్ చేసిన వాహనంపై వచ్చింది. దానికన్నీ విలువైన రత్నాలు పొదిగి ఉన్నాయి. కొన్నిచోట్ల నిజమైన బంగారం పూత పూశారు. ఎక్కడచూసినా అంతా వజ్రాలమయంగానే ఉంది. ఆఖరికి ఆవు కాళ్లకు సైతం వజ్రాలే ఉన్నాయి. అవి పారిపోకుండా ఉండేందుకు సంకెళ్లలాంటివి కాలికి వేశారు. వాటికి వజ్రాలుండటం చూసి ఆశ్చర్యపోయాం. అంబానీ కుటుంబం గోవును భక్తిగా పూజించారు. ఇదొక అత్యంత ధనిక వెడ్డింగ్. అలాగే పెళ్లికి ముందు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టింది అని పేర్కొన్నారు.అలా అంబానీ పెళ్లికి వచ్చాం..ఇక ఇదే ఎపిసోడ్లో కిమ్ కర్దాషియన్.. అంబానీ ఎవరో కూడా తెలీదన్న సంగతి తెలిసిందే! తన స్నేహితురాలు లోరైన్ స్కువార్ట్జ్.. అంబానీ కుటుంబానికి ఆభరణాలు తయారు చేసి పెడుతుందని.. అలా ఆమె చెప్పడం వల్లే అంబానీ గురించి తెలిసిందని పేర్కొంది. పెళ్లికి రావాల్సిందిగా 20 కిలోల బరువైన ఇన్విటేషన్ గిఫ్ట్ బాక్స్ పంపించారని, అది చూసి ఇంప్రెస్ అయిపోయి పెళ్లికి హాజరయ్యామంది. అనంత్-రాధిక 2024 జూలైలో పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by The Kardashians (@kardashianshulu) చదవండి: మద్యానికి బానిసయ్యా.. రోజుకు 9 గంటల నరకం: స్టార్ హీరో చెల్లెలు
న్యూస్ పాడ్కాస్ట్

తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్రెడ్డి సస్పెన్షన్... ‘ఈ సభ నీ సొంతం కాదు’ అన్నందుకు బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్

ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కూటమి ప్రభుత్వ నయవంచనపై తిరుగుబాటు... వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో ‘యువత పోరు’లో కదంతొక్కిన విద్యార్థులు, తల్లితండ్రులు, నిరుద్యోగులు

భారతదేశ కుటుంబంలో మారిషస్ ఒక అంతర్భాగం... ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టీకరణ

కేసీఆర్ను గద్దె దింపిందీ నేనే. నాది సీఎం స్థాయి.. ఆయనది మాజీ సీఎం స్థాయి. తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్లో పాడి రైతుకు కూటమి సర్కారు దగా... ప్రైవేటు డెయిరీలు చెప్పిందే ధర, ఇష్టం వచ్చినంతే కొనుగోలు... లీటర్కు 25 రూపాయల దాకా నష్టపోతున్న రైతులు

వైఎస్ వివేకా కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు కూటమి సర్కారు కుతంత్రం. రంగన్న మరణాన్నీ వాడేసుకుంటున్న వైనం

ఆంధ్రప్రదేశ్లో కోటి మంది డ్వాక్రా మహిళలకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ద్రోహం... స్త్రీనిధి సంస్థ నిధులకు ఎసరు

ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలపై రాజీలేని పోరాటం కొనసాగించాలి... రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో గట్టిగా గళం వినిపించాలి... వైఎస్సార్సీపీ ఎంపీలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం

చంద్రబాబు సర్కారు పాలనలో అంకెల గారడీ, మోసం గ్యారంటీ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఆంధ్రప్రదేశ్లో 17 మంది వీసీల రాజీనామాలపై విచారణకు ఆదేశించండి.. శాసన మండలిలో కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైఎస్సార్సీపీ
క్రీడలు

త్వరలో పాక్లో మరో ఐసీసీ టోర్నీ.. షెడ్యూల్ విడుదల
త్వరలో పాకిస్తాన్ మరో ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. ఏప్రిల్ 9 నుంచి 19 వరకు పాకిస్తాన్లోని లాహోర్లో ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్కప్ క్వాలిఫయర్స్-2025 పోటీలు జరుగనున్నాయి. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ ఇవాళ (మార్చి 14) విడుదల చేసింది.ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. ఇందులో రెండు జట్లు (ఫైనల్కు చేరే జట్లు) ఈ ఏడాది భారత్లో జరిగే వన్డే వరల్డ్కప్కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో పాకిస్తాన్ సహా బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్, థాయ్లాండ్ జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో మొత్తం 15 మ్యాచ్లు జరుగనున్నాయి. డే మ్యాచ్లు ఉదయం 9:30 గంటలకు.. డే అండ్ నైట్ మ్యాచ్లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి.భారత్లో వరల్డ్కప్ఈ ఏడాది అక్టోబర్లో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్కప్ జరుగనుంది. ఈ టోర్నీకి భారత్ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ నేరుగా అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్ ద్వారా మరో రెండు జట్లు పోటీలోకి వస్తాయి.కాగా, పాకిస్తాన్ ఇటీవలే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యమిచ్చింది. 29 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై జరిగిన తొలి ఐసీసీ టోర్నీ ఇది. ఈ టోర్నీలో పాక్ ఘోర పరాభవం ఎదుర్కొంది. సొంతగడ్డపై జరిగిన టోర్నీలో పాక్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా, గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన పాక్కు ఇది పెద్ద అవమానం. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. దుబాయ్లో జరిగిన ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ను చిత్తు చేసి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. భద్రతా కారణాల రిత్యా ఈ టోర్నీలో భారత్ తమ మ్యాచ్లను దుబాయ్లో ఆడింది.షెడ్యూల్ఏప్రిల్ 9- పాక్ వర్సెస్ ఐర్లాండ్, వెస్టిండీస్ వర్సెస్ స్కాట్లాండ్ఏప్రిల్ 10- థాయ్లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ఏప్రిల్ 11- పాక్ వర్సెస్ స్కాట్లాండ్, ఐర్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ఏప్రిల్ 13- స్కాట్లాండ్ వర్సెస్ థాయ్లాండ్, బంగ్లాదేశ్ వర్సెస్ ఐర్లాండ్ఏప్రిల్ 14- వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ఏప్రిల్ 15- థాయ్లాండ్ వర్సెస్ ఐర్లాండ్ఏప్రిల్ 17- బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్, పాక్ వర్సెస్ థాయ్లాండ్ఏప్రిల్ 18- ఐర్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్ఏప్రిల్ 19- పాక్ వర్సెస్ బంగ్లాదేశ్, వెస్టిండీస్ వర్సెస్ థాయ్లాండ్

IPL 2025: హార్దిక్పై నిషేధం.. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా సూర్యకుమార్..?
ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మార్చి 23న జరుగనుంది. ఆ రోజు డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగనుండగా.. ఎంఐ, సీఎస్కే మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తమ కెప్టెన్ సేవలు కోల్పోనుంది. గత సీజన్లో ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్ల్లో స్లో ఓవర్ రేట్తో బౌలింగ్ చేసింది. దీంతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ముంబై కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాకు రూ.30లక్షల జరిమానా విధించడంతో పాటు ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించింది. గత సీజన్లో ముంబై గ్రూప్ దశలోనే వెనుదిరగడంతో హార్దిక్పై నిషేధం సాధ్యం కాలేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025 సీజన్లో తొలి మ్యాచ్లోనే అతను నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది.తొలి మ్యాచ్లో హార్దిక్ గైర్హాజరీలో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ సారధిగా వ్యవహరించే అవకాశం ఉంది. భారత టీ20 జట్టుకు సారధిగా వ్యవహరిస్తుండటంతో ఎంఐ యాజమాన్యం అతనిరే సారథ్య బాధ్యతలు అప్పజెప్పనుందని తెలుస్తుంది. రోహిత్ కెప్టెన్సీపై అయిష్టతను ఇదివరకే తెలియజేశాడు. మరో సీనియర్ బుమ్రా ఆరంభ మ్యాచ్లకు దూరమవుతాడని సమాచారం. ఈ నేపథ్యంలో సీనియర్లలో ఒకరైన సూర్యకుమార్కే తొలి మ్యాచ్లో కెప్టెన్గా వ్యవహరించే అవకాశం రావచ్చు.టీ20ల్లో టీమిండియా కెప్టెన్గా సూర్య కుమార్ యాదవ్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. స్కై సారథ్యంలో భారత్ 18 మ్యాచ్ల్లో కేవలం నాలుగింట మాత్రమే ఓడింది.కాగా, ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ దేశీయ స్టార్లపై ఆధారపడి ఉంది. మెగా వేలానికి ముందు ఆ జట్టు యాజమాన్యం రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాను రీటైన్ చేసుకుంది. మెగా వేలంలోనూ ఆ జట్టు పెద్దగా విదేశీ స్టార్ల కోసం పాకులాడలేదు.విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, కార్బిన్ బాష్, ర్యాన్ రికెల్టన్ లాంటి ఆటగాళ్లు కొత్తగా జట్టులోకి చేర్చుకుంది. ఈసారి జట్టులోకి వచ్చిన ట్రెంట్ బౌల్ట్కు గతంలో ముంబై ఇండియన్స్తో అనుబంధం ఉంది. మెగా వేలంలో దక్కించుకున్న రీస్ టాప్లే గాయం కారణంగా ఈ సీజన్కు దూరమయ్యాడు. దేశీయ పేసర్ దీపక్ చాహర్ను ముంబై సీఎస్కేతో పోటీపడి దక్కించుకుంది.ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్..హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, నమన్ ధిర్, సూర్యకుమార్ యాదవ్, బెవాన్ జాకబ్స్, రాజ్ భవా, విల్ జాక్స్, విజ్ఞేశ్ పుథుర్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, సత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, రాబిన్ మింజ్, కృష్ణణ్ శ్రీజిత్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, రీస్ టాప్లే, కర్ణ్ శర్మ, దీపర్ చాహర్, ముజీబ్ రెహ్మాన్

Axar Patel: ‘ఆర్మ్ బౌలర్’ కప్ అందిస్తాడా?
క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ 18వ సీజన్ రెడీ అవుతోంది. పొట్టి ఫార్మాట్లో క్రికెట్ లవర్స్ను బాగా ఆకట్టుకున్న ఈ మెగా టోర్నమెంట్ మార్చి 22 నుంచి ప్రారంభమవుతోంది. 10 టీమ్లు బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతున్నాయి. ఐపీఎల్ ఆరంభం నుంచి ఉన్న బెంగళూరు రాయల్ చాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు కప్ కొట్టలేకపోయాయి. మధ్యలో వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఇంకా టైటిల్ దక్కించుకోలేదు. కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్న ఈ నాలుగు జట్లు ఈసారైనా ఐపీఎల్ కప్ అందుకుంటాయా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది.న్యూ రోల్లో రాణిస్తాడా?టోర్నమెంట్కు వారం రోజుల ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ టీమ్ కెప్టెన్ (Team Captain) ఎవరనేది ప్రకటించింది. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను కెప్టెన్గా ఎంపిక చేసినట్టు అధికారికంగా వెల్లడించింది. కేఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు తీసుకోవడానికి సుముఖంగా లేకపోవడంతో అక్షర్ పటేల్కు అరుదైన అవకాశం లభించింది. ఇప్పటివరకు ఆల్రౌండర్గా రాణించిన ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కమ్ బ్యాటర్.. జట్టు నాయకుడిగా ఎలాంటి ముద్ర వేస్తాడనేది చూడాలి. ఆటగాడిగా తానేంటో నిరూపించుకున్న అక్షర్ కెప్టెన్గా జట్టును ఎలా నడిపిస్తాడేనన్నది ఆసక్తికరంగా మారింది.పొట్టి ఫార్మాట్లో రాణిస్తూ..గత కొంతకాలంగా పొట్టి ఫార్మాట్లో అక్షర్ పటేల్ (Axar Patel) స్థిరంగా రాణిస్తున్నాడు. టీమిండియాలో అవకాశం వచ్చిన ప్రతిసారీ దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. తాజాగా ముగిసిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలోనూ జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ పొందడమే కాకుండా మెప్పు పొందేలా ఆడాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొంటూ పరుగులు రాబడుతూ జట్టుకు ప్రయోజనకరంగా మారాడు. చాంపియన్స్ ట్రోఫీలో 5 వికెట్లు పడగొట్టడంతో పాటు 109 పరుగులు చేసి తన విలువ చాటుకున్నాడు.ఐపీఎల్లో అదుర్స్2014లో ఐపీఎల్లో అరంగ్రేటం చేసిన అక్షర్ పటేల్ ఇప్పటివరకు 150 మ్యాచ్లు ఆడాడు. 21.47 సగటు, 130.88 స్టైక్ రేటుతో 1653 పరుగులు చేశాడు. గత రెండు సీజన్లలో అద్భుతంగా రాణించాడు. గత ఐపీఎల్లో 235 పరుగులు చేయగా, 2023లో 283 పరుగులు సాధించాడు. ఈ రెండు ఎడిషన్లలోనూ 11 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు మొత్తం 123 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఫీల్డింగ్లోనూ చురుకుదనం ప్రదర్శించాడు. బౌలింగ్కు కాస్త పేస్ జోడించి ‘ఆర్మ్ బాల్’తో నేరుగా వికెట్లపైకి సంధిస్తూ వికెట్లు చేజిక్కించుకోవడం అక్షర్ పటేల్ స్పెషాలిటీ. తన మ్యాజిక్తో ఈ ఐపీఎల్లో ఎలాంటి ఫలితం రాబతాడో చూడాలి మరి.చదవండి: 'అక్షరా'ల అమూల్యం., టీమిండియాలో స్థానం సుస్థిరంక్యాపిటల్స్కు కప్ తెస్తాడా?ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా ఎంపికైన అక్షర్ పటేల్ ముందు ఇప్పుడు పెద్ద లక్షమే ఉంది. ఇప్పటివరకు డీసీ ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. 2020లో దుబాయ్లో జరిగిన టోర్నమెంట్లో ఫైనల్ వరకు చేరుకుని ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైంది. గత సీజన్లో ఆరో స్థానానికి పరిమితమైంది. మరి ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ను (Delhi Capitals) అక్షర్ పటేల్ అంతకంటే మెరుగైన స్థానంలో ఉంచుతాడా, టైటిల్ గెలుస్తాడా అనేది వేచి చూడాల్సిందే.

IPL 2025: కోహ్లీ ఈసారైనా టైటిల్ సాధించేనా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. అయితే ఈ జట్టు ఇంతవరకూ ఒక్కసారి కూడా ట్రోఫీని సాధించలేకపోవడం ఒకింత ఆశ్చర్యకరం. ఎప్పుడూ ఉత్సాహంతో ఉరకలేసే స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ మస్కట్ గా ఉన్న ఈ జట్టుకి ఎందుకో ఇంతవరకు ఐపీఎల్ టైటిల్ అందించలేకపోయాడు.ఐపీఎల్ 2025 ప్రారంభం రోజున (మార్చి 22) కోల్కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్లో గతేడాది టైటిల్ విజేత కోల్కతా నైట్ రైడర్స్ జరిగే మ్యాచ్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తన టైటిల్ వేటను ప్రారంభిస్తుంది. ఒకవేళ అదృష్టం కలిసి రానందువల్ల ఆర్సీబీ ఇంతవరకు టైటిల్ సాధించలేకపోయిందని భావించినట్టయితే, ఈ సీజన్ అందుకు చాల అనుకూలమైనది గా భావించాలి. ఎందుకంటే ఐపిఎల్ సీజన్ 18 స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ఐకానిక్ జెర్సీ నంబర్ 18 తో సరిగ్గా సరిపోతుంది. చాలా కాలంగా జెర్సీ నంబర్ 18 కి పర్యాయపదంగా ఉన్న విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి ఈ సారైనా టైటిల్ సాధించి పెడతాడని అతని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రజత్ పాటిదార్ కి కెప్టెన్సీ బాధ్యతలుఇక జట్టు కూర్పును చూస్తే, దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న 31 ఏళ్ల రజత్ పాటిదార్ కి ఆర్సీబీ ఈసారి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పింది. ఐపీఎల్లో తొలిసారి కెప్టెన్సీ చేపట్టనున్నప్పటికీ, పాటిదార్ 2024-25 సయ్యద్ ముష్తాక్ అలీ టోర్నమెంట్ లో మధ్యప్రదేశ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఇందులో మధ్యప్రదేశ్ జట్టు రన్నరప్గా నిలిచింది. మెగా వేలం ద్వారా గణనీయమైన మార్పులు చేసిన తర్వాత ఆర్సీబీ కొత్త దృక్పథంతో, కొత్త ఉత్సాహంతో ఐపీఎల్-2025లోకి అడుగుపెడుతుంది. గత సీజన్లో ఆర్సీబీ వరుసగా ఆరు మ్యాచ్లను గెలిచి టాప్ నాలుగు స్థానాల్లో నిలిచి ప్లేఆఫ్లకు అర్హత సాధించింది. చివరికి రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఎలిమినేటర్లో పరాజయం చవిచూసింది. ఆర్సీబీ మరోసారి సామర్థ్యంతో నిండిన జట్టును నిర్మించింది. శక్తివంతమైన బ్యాటింగ్ లైనప్, బలీయమైన బౌలింగ్, నాయకత్వ అనుభవం, కలగలిసి ఈ సీజన్ లోనైనా తొలి టైటిల్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఫిల్ సాల్ట్ తో కోహ్లీ ఓపెనింగ్ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ ను ఆర్సీబీ రూ. 11.50 కోట్లకు తీసుకుంది. గత సీజన్లో కేకేఆర్ టైటిల్ గెలుచుకోవడంలో సాల్ట్ కీలక పాత్ర పోషించాడు. 12 మ్యాచ్ల్లో 182.01 అద్భుతమైన స్ట్రైక్ రేట్తో 435 పరుగులు సాధించాడు. గత సీజన్లో ఓపెనర్గా అతను సాధించిన విజయాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఆర్సీబీలో సాల్ట్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఫిల్ సాల్ట్ మరియు విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉన్నందున, జట్టు అసాధారణమైన టాప్ ఆర్డర్ను సమకూర్చుకుంది. మిడిల్ ఆర్డర్లో రజత్ పాటిదార్, లియామ్ లివింగ్స్టోన్ మరియు టిమ్ డేవిడ్ ఉండటం జట్టు లైనప్ను మరింత బలోపేతం అవుతుంది. యావ బ్యాట్స్మన్ జితేష్ శర్మ కీపింగ్ విధులను కూడా నిర్వహిస్తాడు.సీనియర్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ రావడంతో వారి బౌలింగ్ లైనప్కు గణనీయమైన బలాన్నిచ్చింది. ముంబై ఇండియన్స్తో బిడ్డింగ్ యుద్ధం తర్వాత ఆస్ట్రేలియన్ పేసర్ జోష్ హాజిల్వుడ్ సేవలను పొందేందుకు ఆర్సీబీ రూ. 12.50 కోట్లు ఖర్చు చేసింది. ఇంకా లుంగి ఎంగిడి, నువాన్ తుషార వంటి ఫాస్ట్ బౌలర్లను చేర్చుకోవడం వలన ఆర్సీబీ బౌలింగ్ బలీయంగా ఉంది.ఫీల్ సాల్ట్: గత సంవత్సరం కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ సాధించడం లో కీలక పాత్ర పోషించిన సాల్ట్ ఈసారి జట్టులో చేరడంతో ఆర్సీబీ బ్యాటింగ్ మరింత బలోపేతంగా తయారైంది. గత సీజన్లో ఓపెనర్గా అద్భుతంగా రాణించిన సాల్ట్ మళ్ళీ అదే రీతిలో విజృభించి ఆడతాడని ఆర్సీబీ అభిమానులు ఆశిస్తున్నారు. భువనేశ్వర్ కుమార్: ఎంతో అనుభవ్గుణుడైన సీనియర్ బౌలర్ భువనేశ్వర్ జట్టులో చేరడంతో ఆర్సీబీ బౌలింగ్ లైనప్కు గణనీయమైన పదును లభించింది. కొత్త బంతిని స్వింగ్ మరియు డెత్ ఓవర్లలో యార్కర్లను వేసే సామర్థ్యం ఉన్న భువనేశ్వర్ జట్టు బౌలింగ్ కి కీలకం అనడంలో సందేహం లేదు. రజత్ పాటిదార్: ఆర్సీబీ తొలి సారి ఐపీఎల్ టైటిల్ సాధించాల్సిన బృహత్తర బాధ్యత రజత్ పాటిదార్ పై ఉంది. మంచి ఫామ్ తో నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న రజత్ పాటిదార్ జట్టును ముందుండి నడిపించడం ఆర్సీబీకి చాల ముఖ్యం.విరాట్ కోహ్లీ: ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించి మంచి ఫామ్ లో ఉన్న కోహ్లీ కి ఐపీల్ సీజన్ 18 చాల కీలకం. చాలా సంవత్సరాలుగా ఐపీఎల్ ట్రోఫీని గెలవాలనే కోహ్లీ ఆకాంక్ష ఈ సారైనా నెరవేరుతుందేమో చూడాలి.ఆర్సీబీ జట్టు: రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, యష్ దయాల్, జోష్ హాజిల్వుడ్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్స్టోన్, రసిక్ దార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, మనోజ్ భండగే, జాకబ్ బెథెల్, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికర, లుంగి ఎంగిడి, అభినందన్ సింగ్, మోహిత్ రథీ.
బిజినెస్

టాప్ ఐటీ కంపెనీకి కొత్త హెచ్ఆర్ హెడ్..
దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)కు కొత్త హెచ్ఆర్ హెడ్ నియమితులయ్యారు. సుదీప్ కున్నుమాల్కు పదోన్నతి కల్పిస్తూ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (సీహెచ్ఆర్వో)గా టీసీఎస్ నియమించింది. ప్రస్తుత హెచ్ఆర్ అధిపతి మిలింద్ లక్కడ్ పదవీ విరమణ చేస్తున్నారు. మార్చి 14వ తేదీ నుంచి కున్నుమాల్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరిస్తారని ఫైలింగ్లో టీసీఎస్ పేర్కొంది.సుదీప్ కున్నుమాల్ ప్రస్తుతం టీసీఎస్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) విభాగానికి హెచ్ఆర్ ఫంక్షన్ హెడ్గా ఉన్నారు. టాటా గ్రూప్ అనుబంధ సంస్థలో దాదాపు ఆరేళ్ల పాటు సీహెచ్ఆర్ఓ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ప్రస్తుత మిలింద్ లక్కడ్ పదవీ విరమణ తర్వాత సీహెచ్ఆర్ఓ హోదాకు పదోన్నతి పొందారు. 1987లో టీసీఎస్లో ట్రైనీగా చేరిన లక్కడ్ 2006లో మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అధిపతి హోదాతో పాటు 38 ఏళ్ల పాటు పలు బాధ్యతలు నిర్వర్తించారు. 2019 నుంచి సీహెచ్ఆర్వోగా పనిచేస్తున్నారు.సుదీప్ కున్నుమాల్ గురించి..బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) వర్టికల్ కోసం హ్యూమన్ రిసోర్సెస్ ఫంక్షన్కు నేతృత్వం వహిస్తున్న సుదీప్ కున్నుమాల్ 2000 సంవత్సరం నుంచి ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. మదురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. వ్యూహాత్మక హెచ్ఆర్ చొరవలు, సరికొత్త నియామక పరిష్కారాలు, ప్రాసెస్ ఎక్సలెన్స్ ద్వారా సంస్థాగత వృద్ధిని పెంపొందించడంలో నిబద్ధతతో సుదీప్ కెరియర్ సాగిందని టీసీఎస్ పేర్కొంది. ఉత్తర అమెరికా, యూరప్తోపాటు ఆసియా పసిఫిక్ దేశాల్లో ఆయన వివిధ హెచ్ఆర్ లీడర్ షిప్ పొజిషన్లలో పనిచేశారు.ఇదీ చదవండి: జీతాల తేడాలొద్దు.. ఉద్యోగులను మనుషుల్లా చూడండి : ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

ఫ్రీగా ఓయో రూమ్స్లో బస
భారతదేశ ప్రముఖ ఆతిథ్య బ్రాండ్లలో ఒకటైన ఓయో రూమ్స్ వినియోగదారులకు హోలీ సందర్భంగా ఉచిత ఆఫర్ను ప్రకటించింది. ఇండియా క్రికెట్ టీమ్ ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సాధించండం, తర్వాత హోలీ పండుగ నేపథ్యంలో మార్చి 13 నుంచి 18 వరకు ఓయో దేశవ్యాప్తంగా 1,000 ప్రీమియం కంపెనీ సర్వీస్ హోటళ్లలో రోజూ 2,000 ఉచిత స్టేలను అందిస్తున్నట్లు పేర్కొంది. ఈమేరకు సంస్థ వ్యవస్థాపకులు రితేష్ అగర్వాల్ ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించారు.వినియోగదారులు ఈ పరిమిత ఓయో ప్రీమియం ఆతిథ్యాన్ని ఎటువంటి ఖర్చు లేకుండా ఆస్వాధించవచ్చని రితేష్ తెలిపారు. ఓయో యాప్ లేదా వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసేటప్పుడు కూపన్ కోడ్ ‘CHAMPIONS’ అని ఎంటర్ చేయాలని పేర్కొన్నారు. దాంతో కస్టమర్లు తమ కాంప్లిమెంటరీ స్టేను రెడీమ్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ ఆఫర్ ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్(ముందుగా బుక్ చేసుకున్న వారికే వర్తించేలా) ప్రాతిపదికన పని చేస్తుందని స్పష్టం చేశారు.Some wins are bigger than just a trophy. India’s ICC Champions Trophy victory isn’t just about cricket—it’s about the unshakable spirit of a billion people, the collective cheers, the nail-biting finishes, and that electrifying moment when the whole country erupts in joy.And… pic.twitter.com/M0m6KAdHds— Ritesh Agarwal (@riteshagar) March 13, 2025ఇదీ చదవండి: రాత్రిపూట రైళ్లు ఎందుకు వేగంగా నడుస్తాయి?భారత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని అందరూ అస్వాదిస్తున్నారని రితేశ్ తెలిపారు. ఈ నేపథ్యంలో హోలీ తోడవడం వినియోగదారులకు మరింత ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు. ఈ తరుణంలో కంపెనీ కస్టమర్లకు ఉచిత ఆఫర్ ప్రకటించిందని చెప్పారు. ఈ వారాంతంలో మధురమైన జ్ఞాపకాలను సొంతం చేసేందుకు కంపెనీ తోడైందని తెలిపారు. ప్రయాణాలు చేయడం, ప్రియమైనవారిని కలవడం కంటే సంతోషకరమైన క్షణాలు ఏముంటాయన్నారు. అందుకోసం ఓయో రూమ్స్ ‘టౌన్ హౌస్, కలెక్షన్ ఓ’తో సహా 1000కి పైగా ఓయో కంపెనీ సర్వీస్ హోటళ్లలో మార్చి 13-18 వరకు ప్రతిరోజూ ఉచిత బసలను అందిస్తున్నట్లు చెప్పారు.

రాత్రిపూట రైళ్లు ఎందుకు వేగంగా నడుస్తాయి?
కొన్ని రైళ్లు పగలు కంటే రాత్రిపూటే వేగంగా ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుంది కదా. నిత్యం రైలు ప్రయాణం చేస్తున్నవారు ఇది గమనించే ఉంటారు. ఇది ఒక మిస్టరీగా అనిపించినప్పటికీ దీని వెనుక కారణాలు లేకపోలేదు. కొన్ని ఆసక్తికరమైన, ఆచరణాత్మక కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాత్రిపూట రైలు వేగం పెరగడానికి దోహదపడే కీలక అంశాలను తెలియజేస్తున్నారు.ట్రాక్ రద్దీ తగ్గుదలపగటిపూట రైల్వే ట్రాక్లు రద్దీగా ఉంటాయి. ప్యాసింజర్ రైళ్లు, సరుకు రవాణా రైళ్లు, ప్రధాన గేట్ల వద్ద పగలు ప్రజల సంచారం వంటి అంశాలతో రైళ్ల రాకపోకలు ఆలస్యం అవుతుంటాయి. పగలు ఇతర రైళ్ల డైవర్షన్ కోసం కొన్ని రైళ్లను గంటల తరబడి నిలిపేస్తుంటారు. రాత్రిపూట ఈ ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. దాంతో రైళ్లు వేగంగా నడిచేందుకు వీలుంటుంది.తక్కువ స్టాప్లుపగటిపూట ప్యాసింజర్ రైళ్లతో పోలిస్తే రాత్రిపూట రైళ్లు, ముఖ్యంగా సుదూర, సరుకు రవాణా సేవలు అందించే రైళ్లకు తక్కువ స్టాపులను షెడ్యూల్ చేస్తారు. దాంతో అంతరాయాలు లేకుండా రైళ్లు వాటి వేగాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది.డ్రైవర్ విజిబిలిటీనైట్ డ్రైవింగ్లో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, పగలు రద్దీగా ఉండే స్టేషన్లు లేదా రద్దీగా ఉండే క్రాసింగ్లపై లోకోపైలట్లు పెద్దగా దృష్టి కేంద్రీకరించే అవసరం ఉండదు. దాంతో పూర్తిగా డ్రైవింగ్, ట్రాక్పైనే దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. హై పవర్డ్ హెడ్ లైట్స్, ఆధునిక సిగ్నలింగ్ సిస్టమ్స్ వంటి అధునాతన సాంకేతికత సురక్షితమైన, సమర్థవంతమైన కార్యకలాపాలను నిర్ధారిస్తుంది.ఇదీ చదవండి: జియోస్టార్ యూట్యూబ్ కంటెంట్ తొలగింపుషెడ్యుల్లో మార్పులురైల్వే నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచడానికి రాత్రిపూట రైళ్ల షెడ్యుల్ను వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తారు. వేగవంతమైన ప్రయాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా పీక్ అవర్స్లో ప్రాంతాల మధ్య వస్తువులను రవాణా చేసే సరుకు రవాణా రైళ్ల కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తారు.

జియోస్టార్ యూట్యూబ్ కంటెంట్ తొలగింపు
భారత బ్రాడ్కాస్టింగ్, డిజిటల్ స్ట్రీమింగ్ పరిశ్రమలో ప్రముఖ సంస్థగా ఉన్న జియోస్టార్(Jiostar) మే 1, 2025 నాటికి యూట్యూబ్ నుంచి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ను తొలగించే ప్రణాళికలను ప్రకటించింది. పెయిడ్ సబ్స్క్రైబర్ల సంఖ్యను పెంచుకునేందుకు సంస్థ ఈమేరకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. పే-టీవీ(డబ్బు చెల్లిస్తే టీవీ సర్వీసులు అందించడం) డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ నుంచి ఉచిత డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్కు చందాదారుల వలసలను అరికట్టడానికి ఈ వ్యూహాత్మక నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది.జియోస్టార్ ఇకపై ప్రీమియం కంటెంట్ను సబ్స్రిప్షన్ పరిధిలోకి తీసుకురావాలనే వ్యూహానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇలా చేయడం ద్వారా పెయిడ్ సర్వీసులను పెంచుతూ సబ్స్రైబ్లను ప్రోత్సహించేందుకు వీలు అవుతుందని కంపెనీ నమ్ముతుంది. జియోసినిమా, డిస్నీ+ హాట్స్టార్ విలీనంతో ఓటీటీ విభాగంలో జియోస్టార్ కీలకంగా మారింది. ఇది బాలీవుడ్, అంతర్జాతీయ సినిమాలు, ప్రాంతీయ సిరీస్లు, లైవ్ స్పోర్ట్స్తో సహా విభిన్న కంటెంట్ను అందిస్తోంది.బ్రాడ్ కాస్టింగ్ పరిశ్రమపై ప్రభావంయూట్యూబ్ నుంచి కంటెంట్ను తొలగించాలన్న నిర్ణయం బ్రాడ్కాస్టింగ్ పరిశ్రమపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. టాటా ప్లే, ఎయిర్టెల్ డిజిటల్ టీవీ వంటి పే-టీవీ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్లు ఉచితంగా ప్రీమియం కంటెంట్ అందిస్తున్నాయి. క్రమంగా ఈ ప్లాట్ఫామ్లు కూడా ఇదే పంథాను ఎంచుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో తమ సబ్స్క్రైబర్ల సంఖ్యను పెంచుకునే వీలు ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం పే-టీవీ సబ్ స్క్రిప్షన్ల సంఖ్య 8.4 కోట్లుగా ఉంది. ఇది గతంలో ఎక్కువగానే ఉండేది. చందాదారులను నిలుపుకోవడానికి, ఆదాయాన్ని పెంచుకోవడానికి కంపెనీలు విభిన్న మార్గాలను అన్వేషిస్తున్నాయి. భారతదేశంలో టీవీ సబ్ స్క్రిప్షన్ మార్కెట్ విలువ రూ.40,000 కోట్లు ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: పండుగ వేళ పసిడి పరుగు.. తులం ఎంతంటే..సవాళ్లు ఇవే..సబ్స్క్రిప్షన్ ఆధారిత మోడల్పై కంపెనీలు దృష్టి పెట్టడం ఆదాయ వృద్ధికి అవకాశాలను పెంచేవైనప్పటికీ.. ఉచిత కంటెంట్కు అలవాటు పడిన భారతీయ వినియోగదారులు ఎంత మేరకు పెయిడ్ సబ్ స్క్రిప్షన్లకు మారుతారో గమనించాల్సి ఉంటుంది. ఏదేమైనా జియోస్టార్ కంటెంట్ లైబ్రరీ, లైవ్ స్పోర్ట్స్, ప్రాంతీయ కంటెంట్ వంటి ప్రత్యేక సదుపాయాలు వీక్షకులను సబ్స్క్రైబ్ చేసుకునే దిశగా ఆకర్షిస్తుందని కంపెనీ విశ్వసిస్తుంది.
ఫ్యామిలీ

అమ్మ శ్రమలో ఎన్ని రంగులో!
ఉదయాన్నే అమ్మ వేసే ముగ్గు రంగు తెలుపు. చల్లే కళ్లాపి ఆకుపచ్చ. గడపకు రాయాల్సింది పసుపు. నాన్నకు పెట్టాలి గోధుమ రంగు టీ. బాబు షూస్ పాలిష్ చేయాలి కదా నల్లగా. పాపాయికి కట్టాలి ఎర్ర రిబ్బన్. బట్టల సబ్బు రంగు నీలం. వంట గది నిండా మెటాలిక్ కలర్ పాత్రలే. కాటుక, తిలకం కంటే ముందు అమ్మకు అంటేది శ్రమ తాలూకు రంగులే. లోకానికి ఒకటే హోలి. అమ్మకు నిత్యం హోలి. నేడు అమ్మకే చెప్పాలి రంగు రంగుల కృతజ్ఞత.ప్రతి ఒక్కరి జీవితంలో రంగు రంగుల కలలు ఉంటాయి. అయితే స్త్రీలు ఆ రంగుల కలలను అందుకోవడంలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. పరిమితులు ఎదురవుతాయి. వారు ఈ రంగులకు మాత్రమే అర్హులు అనే కనిపించని నియమాలు ఉంటాయి. పరిస్థితి చాలా మారినా స్త్రీ ఏదో ఒకదశలో రాజీ పడాలి. అయితే భారతీయ స్త్రీ ఆ రాజీని ఇష్టంగానే స్వీకరిస్తుంది. ముఖ్యంగా వివాహం అయ్యాక, తల్లిగా మారాక తాను కన్న రంగుల కలలన్నీ తన సంతానానికి ఇచ్చేస్తుంది. భర్త, పిల్లల సంతోషంలో తన సంతోషం వెతుక్కుంటుంది. వారి కేరింగ్ కోసం రోజూ అంతులేని శ్రమ చేస్తుంది. ఆ పనుల్లోనే ఆమెకు రంగుల ప్రపంచం తెలియకుండానే ఎదురవుతుంటుంది. అమ్మకు రంగులు తోడవుతాయి. అవి ఆమెను అంతో ఇంతో ఉత్సాహ పరచడానికి ప్రయత్నిస్తాయి. కావాలంటే గమనించండి.అమ్మ శ్రమలో తెలుపు రంగు అడుగడుగునా ఉంది. ఆమె నిద్ర లేవడమే పాలు పోయించుకోవాలి. ముగ్గు వేయాలి. పిల్లలకు స్కూలుకు సిద్ధం చేసి తెల్లటి పౌడర్ రాయాలి. వెన్న కంటే తెల్లనైన ఇడ్లీల కోసం రాత్రే పిండి గ్రైండర్లో వేసుకోవాలి. తెల్ల యూనిఫామ్ ఉతికి సిద్ధం చేయాలి. తెల్లటి ఉప్పు, పంచదార తాకకుండా ఆమెకు జీవితం గడవదు. మునివేళ్ళకు ఆ తెల్లరంగు పదార్థాలు తాకుతూనే ఉంటాయి. ఎండలో వడియాలూ? టెంకాయ తెచ్చి పగులగొట్టి కొబ్బరి తీయడం ఆమెకు గాక ఇంటిలో ఎవరికీ రాదు. రాత్రిళ్లు అత్తామామలకు పుల్కాల కోసం ఆశీర్వాద్ ఆటాతో చేతులు తెల్లగా చేసుకోవాలి. ఆమే అన్నపూర్ణ. తెల్లటి అన్నం ఆమె చేతి పుణ్యం. ఆ వెంటనే ఆమెకు ఆకుపచ్చ ఎక్కువగా కనపడుతుంటుంది. కూరగాయలన్నీ ఆ రంగువే. ఇంట్లో మొక్కలకు ఆమే నీరు పోయాలి. ఆకుపచ్చ డిష్ వాషర్ను అరగదీసి గిన్నెలు కడిగి కడిగి చేతులు అరగదీసుకోవాలి. హెల్త్ కాన్షియస్నెస్ ఉన్న భర్త రోజూ ఆకుకూరలు ఉండాల్సిందే అంటాడుగాని పొన్నగంటి కూరో, కొయ్య తోటకూరో ఆకులు తుంచి కవర్లో వేయమంటే వేయడు. చేస్తే తప్ప ఆ పని ఎంత పనో తెలియదు.ఎరుపు రంగు అమ్మ పనిలో భాగం. ఇంటికి ఆమె ఎర్రటి జాజుపూతను అలుకుతూ ఉంటే వాకిలి నిండా మోదుగుపూలు రాలినట్లు అనిపిస్తుంది. అమ్మ ఉదయాన్నే స్నానం చేసి, దేవుడి పటాల ముందు నిలిచి అరుణ కిరణం లాంటి ఎర్రటి కుంకుమను వేలికొసతో అందుకొని, నుదుటి మీద దిద్దుకొని, దీపం వెలిగించాకే దేవుడు ఆవులిస్తూ నిద్రలేచేది. అమ్మ మునివేళ్ల మహిమకు సూర్యుడు కూడా ఆమె పాపిట్లో సిందూరమై ఒదిగిపోతాడు. ఎర్రటి ఆవకాయలు, పచ్చళ్లు చేతులను మంట పుట్టించినా అమ్మ చిర్నవ్వు నవ్వుతూనే ఉంటుంది. ఆమె చేయి కోసిన టొమాటోలు ఎన్ని వేలో కదా.అయితే అమ్మకు తనకంటూ కొన్ని రంగులు ఇష్టం. గోరింట పండితే వచ్చే ఎరుపు ఇష్టం.. మల్లెల తెలుపు ఇష్టం... తన ఒంటిపై మెరిసే నగల బంగారు వర్ణం ఇష్టం, మట్టి గాజుల రంగులు ఇష్టం, పట్టీల వెండి వర్ణం ఇష్టం, గోర్ల రంగులు ఇష్టం, కురుల నల్ల రంగు ఇష్టం, తాంబూలపు ఎరుపు ఇష్టం, కొద్దిగా మొహమాట పడినా లిప్స్టిక్ రంగులూ ఇష్టమే. పసుపు ఇంటికీ, అమ్మకూ శుభకరం. పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా పసుపు డబ్బా తీసుకుని అమ్మ పరిగెడుతుంది. తీరిక ఉన్నప్పుడు గడపలకు రాస్తుంది. తను తాగినా తాగకపోయినా పిల్లలకు పాలలో కలిపి ఇస్తుంది. ఇక బ్లూ కలర్ అమ్మకే అంకితం. గ్యాస్ స్టవ్ మీద నీలం రంగు మంట ఆమెను ఎప్పటికీ వదలదు. ఇక జీవితాంతం బట్టల సబ్బు, సర్ఫ్ను వాడుతూ బట్టలు శుభ్రం చేయడమో చేయించడమో చేస్తూనే ఉండాలి. కనీసం హార్పిక్ వేసి టాయిలెట్లు కడగరు ఇంటి సభ్యులు. అదీ అమ్మ చాకిరే. నీలి మందు వేసి తెల్లవి తళతళలాడించడం, ఇస్త్రీ చేయించడం ఆమెకు తప్పదు. బట్టల హోమ్వర్క్లు చేయిస్తే బాల్పాయింట్ పెన్నుల నీలి గుర్తులు ఆమె చేతుల మీద కనిపిస్తాయి. ఇక నలుపు ఆమెకు ఏం తక్కువ. బూజు నుంచి అంట్ల మసి వరకు ఆమెకు ఎదురుపడుతూనే ఉంటుంది.ఇవాళ హోలి. కనీసం ఇవాళ అయినా అమ్మకు విశ్రాంతినిచ్చి ఆమెకు ఇష్టమైన రంగుల్లో ఇష్టమైన బహుమతులు ఇచ్చి థ్యాంక్స్ చెప్పండి.

Holi 2025 - నేచురల్ కలర్స్ ఈజీగా తయారు చేసుకోండిలా!
హోలీ వచ్చిందంటే ఆ సంతోషమే వేరు. సరదాలు, రంగులు కలగలిసిన చక్కటి రంగుల పండుగ హోలీ. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఒకరిపై ఒకరు సంతోషంగా రంగులు జల్లుకుంటూ సంబరంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ హోలీ వెనుక అనే పురాణగాథలున్నాయి. అంతేకాదు పండుగ వేడుకల్లో ఆరోగ్యకరమైన ఆయుర్వేదకర ప్రయోజనాలున్నాయి. వణికించే చలి పులి పారిపోతుంది. వేసవి కాలం వచ్చేస్తుంది. ఈ గాలి మార్పు కారణంగా జ్వరాలు, జలుబూ మేమున్నాం అంటూ వచ్చేస్తాయి. వీటిని అడ్డుకునేందుకే ఔషధగుణాలున్న పువ్వులు, ఆకుల పొడులను నీళ్లలో కలిపి చల్లుకునేందుకు ఈ వేడుక పుట్టిందని పెద్దలు చెబుతారు. కానీ కాలక్రమంలో సహజమైన రంగుల స్థానంలో రసాయనాలుమిళితమైన ప్రమాదక రంగులు వచ్చి చేరాయి. పైగా నాచులర్ కలర్స్తో పోలిస్తే చవగ్గా దొరుకుతాయి. అందుకే ఇంట్లోనే తక్కువగా ఖర్చుతో ఆర్గానిక్గా తయారు చేసుకునే కలర్స్ గురించి తెలుసుకుందాం. తద్వారా అటు ఆరోగ్యాన్ని, ఇటు ప్రకృతిని కాపాడుకున్నవారమవుతాం.పండుగ వేడుక అంటే సంతోషాన్ని మిగిల్చాలి. ఆనందంగా గడిపిన క్షణాలు మనకు లేనిపోని సమస్యల్ని, రోగాలను తీసుకు రావడం కూడదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆ చెట్ల ఆకులతోనూ, పరిసరాలలో ఉన్న ప్రకృతి వనరులతోనూ సహజమైన రంగులు తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా మందారం, బంతి, చేమంతిలా పూలతోపాటు, గోరింటాకుతో పచ్చని రంగు, టొమాటో, క్యారట్లతో ఎరుపు రంగు, బీట్రూట్తో గులాబీ రంగు, పసువు కొమ్ములతో పసుపు రంగులు తయారు చేసుకోవచ్చు. మోదుగుపూల రసాన్ని మర్చిపోతే ఎలా? మోదుగ, మందార పూలను మరిగించిన నీటిలో ఔషధగుణాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు హోలీ పండుగ పూట చలువ చేసే పానీయాలు తాగి, మిఠాయిలు తినడంవల్ల రోగాలు దరి చేరవని అంటారు.పసుపు: బంతి పువ్వులు, నారింజ తొక్కల పొడి, చేమగడ్డ పొడి, పసుపు వంద సమపాళ్లలో తీసుకొని కలుపుకోవాలి.దీనికి కొద్దిగా నిమ్మ రసం వేసి ఒక పెద్ద పాత్రలో బాగా కలిపితే చక్కటి పసుపు రంగు తయారవుతుంది. దీన్ని నీళ్లలో కలుపుకుంటే లిక్విడ్ కలర్గా మారిపోతుంది.ఎరుపు: మందార పువ్వులను శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. వీటిని మెత్తని పొడిగా నూరుకుంటే ఎరుపు రంగు సిద్ధమైనట్లే. ఇది ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే దీనికి కొంచెం బియ్యప్పిండి యాడ్ చేసుకుంటే చాలు.మందారంతోపాటు ఎర్ర చందనం పౌడర్(కొంచెం ఖరీదైనదే)కలిపితే రెడ్ కలర్ తయారవుతుంది. ఎర్ర చందనం శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. తడి, పొడి రూపంలో వాడుకోవచ్చుగోధుమరంగుగోరింటాకు పొడి ఒక భాగం తీసుకుని అందులో నాలుగు పార్ల ఉసిరి పొడిని కలపాలి. తర్వాత ఆ మిశ్ర మాన్ని నీళ్లలో కలిపితే తడి గోధుమ రంగు తయారవుతుంది. పొడి రంగు కోసం ఈ పౌడర్ల మిశ్రమానికి బియ్య ప్పిండిని కలిపితే చాలు.నీలం: జకరండ లేదా బ్లూ, ఊదా గుల్మొహార్ ఎండబెట్టి నీలం రంగును తయారు చేసుకోవచ్చు. అలాగే నీలం రంగు శంఖు పుష్పాలను నీళ్లలో నానబెడితే చక్కటి నీలం రంగు తయారవుతుంది. ఆకుపచ్చ: గోరింటాకు పొడికి సమాన పరిమాణంలో బియ్య కలిపి గ్రీన్ కలర్ తయారు చేసుకోవచ్చు. వేప ఆకుల్ని నీటిలో బాగా మరగబెట్టి చిక్కటి మిశ్రమంగా సిద్దం చేసుకోవచ్చు.కాషాయం: మోదుగ పూలను రాత్రి మొత్తం నీటిలో నానబెట్టాలి. లేదంటే నీటిలో మరగబెడితే పసుపు కాషాయం రంగుల మిశ్రమంతో చక్కటి రంగు తయారవుతుంది. ఆయుర్వేద గుణాలున్న మోదుగ పూలను ఎండబెట్టి నూరుకుంటే పొడిరంగు తయారవుతుంది. గోరింటాకును నూరి నీటిలో కలిపి, కొద్దిసేపు ఉంచి వడబోసుకుంటే ఆరెంజ్ రంగు తయారు చేసుకోవచ్చు. కుంకుమ పువ్వును (ఇది కూడా చాలా ఖరీదైనది) రాత్రంతా నీటిలో నానబెడితే తెల్లారేసరికి కాషాయం రంగు తయారవుతుంది.గులాబీ: హోలీ ఆటలో చాలా ప్రధానమైన గులాల్ గులాబీ రంగులో ఉంటుంది. బీట్ రూట్ (నీటిలో మరగబెట్టి) రసం ద్వారా దీన్ని తయారు చేయొచ్చు. బీట్ రూట్ను ఎండబెట్టి పౌడర్ చేసుకుని దీనికి శెనగ, పిండి, బియ్యం, గోధుమ పిండిని కలుపుకోవచ్చు.

హోలీ అంటే రంగుల పండుగేనా..? కాముని పూర్ణిమ అని ఎందుకంటారు..?
'హోలీ' అంటే రంగులు చల్లుకునే పండుగ కాదు. కానీ ప్రస్తుత కాలంలో రంగుల పండుగగా స్థిరపడింది. ఈ పండుగ మహాభారతకాలం నుంచే వాడుకలో ఉంది. “హోళీక” అను రాక్షస దేవత బ్రహ్మ సృష్టించిన రావణ బ్రహ్మ సోదరి. ఈ హోళికను అందరూ దేవతగా కులదైవంగా పూజించేవారు. సంతానం లేనివారు ఈమెను పూజిస్తే సంతానవంతులవుతారుని ప్రశస్తి. ఈ హాలీ పండుగ నేపథ్యంలో అందుకు సంబంధించి.. ప్రాచుర్యంలో ఉన్న పలు కథనాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.మహాభారతకాలంలో “బృహద్రధుడు” అను ఒకరాజు ఉండేవాడు. ఆ రాజులకు ఇరువురు భార్యలు. వారికి సంతానం లేకపోవుటచే హోళికను పూజించమని చెప్పారట. వారు హోళికారాక్షసి బొమ్మను గోడపై చిత్రించుకుని పూజలు చేశారట. వారు చేసిన పూజలు ఫలించి వారికి ఒక పండు లభించింది. ఇరువురు భార్యలు ఉన్నారు కనుక వారు ఆ పండును రెండు భాగములుగా చేసి భుజించారట. దాంతో వారికి సగం-సగం శరీరభాగాలతో శిశువులు కలిగారట. వారు అలా శిశువులను చూసి తట్టుకొనలేక ఆ రెండు శరీర భాగములు సంధిచేసి (అనగా అతికించి) ఒక్క ఆకారంగా చేశారట. ఆ శరీరమే జరాసంధుడుఎప్పటి నుంచి జరుపుకుంటున్నారంటే..ఈ హోలీ పండుగను సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. 'హోలీ' అంటే 'అగ్నిపునీత' అని అర్థం. ఈ పండుగ ప్రతి ఏడాది ఫాల్గుణమాసం పౌర్ణమిరోజున వస్తుంది. కనుక ఈ పండుగను 'హోళీ', కామునిపున్నమి', 'డోలికో త్సవం' అని రకరకాలుగా పిలుస్తారు. హోలీ అంటే అసలు తత్త్వం మరచిపోయి కాలాను గుణంగా రంగులపండుగగా జరుపుకునే ఆనవాయితీకి ప్రజలందరూ అలవాటుపడ్డారు. కానీ భారతీయ సాంప్రదాయంలో ఈ పండుగ అసలు ప్రాశస్త్యం తెలుసుకుందాం. దీనికి పురాణాల ప్రకారం ఒక కథ బాగా ప్రచారంలో ఉంది. 'హిరణ్యకశివుడు' రాక్షసరాజు, అతని కుమారుడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు కొడుకు విద్య కొరకు ఆచార్యుల వద్దకు పంపుతాడు.కానీ అక్కడ ప్రహ్లాదుడు హరినామ స్మరణతోనే తన తోటి విద్యార్ధులతో విద్యను అభ్యసించుచూ హరిభక్తిలో లీనమవుతాడు. అది తెలిసిన అతని తండ్రి హిరణ్యకశిపుడు తన పుత్రుని బ్రతిమిలాడి, బుజ్జగించి హరిభక్తిని విడనాడమని నచ్చచెప్పి చూస్తాడు. కానీ ప్రహ్లాదుడు హరినామస్మరణే జీవిత పరమార్ధమని చెప్పి తండ్రిమాటను ఖతరు చేయడు. ఇక్కడ హిరణ్యకశిపుడు హరివైరి. కనుక హరిని సేవించే తన కుమారుడిని తనకు శతృవుగా భావించి ప్రహ్లాదుని అంత మొందించాలని నిర్ణయించుకుంటాడు. ఆ ఉద్దేశ్యంతోనే తన సేవకులను పిలిచి పిల్లవాడిని వారికి అప్పగించి ఏనుగులతో తొక్కించడం. లోయలో పడ చేయడం, పాములతో కరిపించడం వంటి దారుణాలు చేయిస్తాడు. కానీ ఆ సమయంలో కూడా హరిభక్తివీడక 'నారాయణ' నామస్మరణచేస్తూ ఉంటాడు ప్రహ్లాదుడు. దీంతో ప్రహ్లదుడికి విష్ణు మహిమ వలన అతనికి ఎటువంటి బాధ కలుగదు.హోళికాదహనం ఎందుకంటే..అది గమనించిన హిరణ్యకశిపుడు తనసోదరి హోళికను పిలిపిలిపిస్తాడు. ఎందుకంటే హోళికకు వరప్రభావం వలన ఆమె వద్ద ఒక శాలువ' ఉంటుంది. ఆ శాలువ ఆమె ఒంటిమీద ఉన్నంతవరకు మంటలు ఆమెను అంటుకోవు. అందువలన హిరణ్యక శిపుడు తన చెల్లితో ఇలా చెబుతాడు."అమ్మా! హోళికా! నీవు నీ మేనల్లుడిని ఒడిలో కూర్చుండబెట్టుకుని చితిమీద కూర్చో! నీవు శాలువా కప్పుకో. నీకు మంటలు అంటవు. ప్రహ్లాదుడు కాలి బూడిదవుతాడు అని చెబుతాడు. ఆమె అన్న చెప్పి నట్లుగా చితి పేర్చుకుని ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చుండ బెట్టుకుని, తాను మాత్రం శాలువాను కప్పుకుని చితికి నిప్పు పెట్టుమంటుంది.అత్త ఒడిలో కూర్చున్న ప్రహ్లాదుడు ఏమీ భయపడకుండా నారాయణనామ స్మరణ చేస్తూ ఉంటాడు. విష్ణువు తన మాయచే హోళిక శరీరంపై ఉన్న శాలువను ప్రహ్లాదుని శరీరం మీదకి వచ్చినట్లు చేస్తాడు. అప్పుడు హోలిక బూడిద అవుతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటకు వస్తాడు. ఆ రోజు హోళిక దహనం కావడంతో..ఈనాటికీ చాలా ప్రదేశాలలో ఊరి మధ్యలో పాత కర్రలతో మంటలు పెట్టి 'హోళికాదహనం' అని జరుపుకుంటారు. రాక్షసుల పరాక్రమం ఆ రోజుతో అంతమైందన్న సంతోషంలో జరుపుకొనే పండుగ ఇది.కాముని పున్నమి అని ఎందుకంటారంటే..మరొకగాథ ప్రకారం.. తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మచే వరం పొంది.. మదగర్వంతో దేవతలను బాధించుతూ ఉండేవాడు. ఆ బాధలు తట్టుకొనలేక దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించగా అప్పుడు విష్ణుమూర్తి ఇలా చెబుతాడు. తారకాసురుడు శివుని కుమారుని చేతిలోనే మరణం పొందేటట్లు వరం పొందాడు. కానీ శివుడేమో విరాగిలా స్మశానాలలో తిరుగుతూ ఉంటాడు. కనుక ఎలా గైనా హిమవంతుని వద్దకు వెళ్ళి ప్రార్ధించి పార్వతిని ఒప్పించి శివకల్యాణం జరిగేటట్లు చూడమని చెబు తాడు.విరాగిగా మారిన శివునిలో కోరికలు కలిగించడానికి అతనివద్దకు మన్మథుడుని పంపుతారు ఋషులు. శివునిపై మన్మథుడు కామమును ప్రేరేపించే పూలబాణం వేయించుతారు. ఆ బాణ ప్రభావం శివునిలో శారీరక వికారమును కలిగించగా.. ఆయన కోపంలో మన్మథుడుని చూశాడు. ఆ సమయానికి మన్మథుడు ఇంకా పూలబాణం చేతిలో పట్టుకునే ఉండటం గమనించి పట్టరాని కోపంతో తన మూడవకన్ను తెరుస్తాడు.ఆ సమయంలో శివుని కంటి నుంచి సూర్యుని కిరణాలలో ఉన్న ఏడురంగుల కాంతితో మిళితమైన ఆ భగభగ మంటలధాటికి మన్మథుడు భస్మమైపోతాడు. అది గమనించిన మన్మథుని భార్య రతీదేవి శివుడిని ప్రార్ధించగా కామదేవుడైన మన్మథుడుని తిరిగి బతికించాడు. కానీ భౌతికంగా కనిపించడని, భౌతికకామం కంటే నిజమైన ఉద్రేకపూరితమయిన ప్రేమ ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే కనిపిస్తాడని తెలియజేస్తాడు. ఆ ఏడురంగుల మంటలకు గుర్తుగా రంగుల పండుగలా ఈ హోలీని జరుపుకుంటారు.రంగులు ఎందుకు పులుముకుంటారంటే..శ్రీ కృష్ణునికి సంబంధించిన మరొక విషయంకూడా ఈ హోలీ పండుగకు సంబంధించింది. బాలకృష్ణుని ఫాల్గుణమాసం పౌర్ణమిరోజునే ఊయలలో వేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. అందువలన పశ్చిమబెంగాల్లో ఈ పండుగరోజున శ్రీకృష్ణుని ప్రతిమను ఊయలలోని వేసి 'డోలోత్సవం' జరుపుతారు. అందుకనే డోలికోత్సవం అనే పేరు కూడా వచ్చింది. ఈ హోలీ పండుగరోజున యవ్వనంలో ఉన్న కృష్ణుడు గోపికలతో రాధతో కలసి రంగురంగుల పువ్వులతో ఆటలాడాడట.కృష్ణుడు పెరిగిన మధుర, బృందావనంలో 16 రోజుల పాటు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. "రంగ పంచమి" రోజున శ్రీకృష్ణునికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు. తల్లి యశోదతో శ్రీకృష్ణుడు తన శరీరం నీలివర్ణం, రాధ శరీరం ఎరుపు వర్ణం గురించి ఫిర్యాదుచేశాడట. అందుకని కృష్ణుని తల్లి యశోద రాధ ముఖానికి రంగులు పూసిందట. అందువలన అందరూ హోళీ పండుగ రోజున రంగులు పులుముకుంటారని పురాణ వచనం.పూరీ జగన్నాధ్ జగన్నాథుడి ఆలయంలో కృష్ణుడు, రాధ విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు జరిపి అత్యంత ఆనందంతో వేడుకలు జరుపుకుంటారు. మహారాష్ట్రలో హోళిక దిష్టిబొమ్మను దహనం చేసి, వీధులలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మంటలు వేస్తారు. కాశ్మీరులో సైనికులు రంగు రంగుల నీళ్ళను చల్లుకుంటూ పండుగను జరుపుకుంటారు. ఒకసారి కృష్ణుడు రాధ గ్రామానికి వచ్చి అక్కడ గోపికలను ఆటపట్టించాడట. అది తప్పుగా భావించిన ఆ గ్రామ ప్రజలు కర్రలతో కృష్ణయ్యను వెంబడించారట. అప్పటినుండి హోళీ పండుగను 'లార్మోర్' అనే పేరుతో జరుపుకుంటారు.కవుల మాట్లలో హోలీ .."విలాసానాం సృష్టికర్రీ హోలికా పూర్ణిమా సదా"కాళిదాస మహాకవి ఈ హోళీ పండుగను వర్ణించుచూ సూర్యకాంతిలోని ఏడురంగుల కలయిక హోళీ అన్నాడట. రంగులు అంటే రాగరంజిత భావానలు అని అర్ధం. అల్లసాని పెద్దన పౌర్ణమి వెన్నెల గురించి ఇలా అన్నాడు-"వెలగడిమి నాడి వెన్నెల అలవడునేగాది బోయెన అమవస నిశితిన్" అంటే పౌర్ణిమనాటి వెన్నెలను విడిచి బెట్టకుండా గాదెలలో దాచి ఉంచి అమావాస్యవరకు కూడా వెలుగునుంచుకోవాలని... అలాగే జీవితంలో పండుగల ద్వారా మనం పొందే ఆనందం, మానసిక ఆనందంగా మలచుకోవాలని పెద్దనగారి ఉద్దేశ్యం. ఏదీఏమైనా మన భారతీయ పండుగలు గొప్ప ఆధ్యాత్మికత తోపాటు ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని అందిస్తాయనడంలో అతిశయోక్తి లేదు కదా..!.(చదవండి: ఎపుడూ వైట్ డ్రెస్సేనా? కలర్ ఫుల్గా, ట్రెండీగా.. ఇలా!)

Holi 2025 : ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు!
హోలీ హోలీల రంగ హోలీ..చమ్మకేళీలహోలీ అంటూ ఎంతో సరదాగా, ఆనందంగా జరుపుకునే రంగుల పండుగ. పిల్లా పెద్దా అంతా హోలీ రంగుల్లో తడిసి ముద్దవుతూ, స్నేహితులతో, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. కానీ ఈ సంబరంలో కొన్ని జాగ్రత్తలు మర్చిపోకూడదు. నిర్లక్ష్యం లేదా అవగాహన లేమి కారణంగా ఎలాంటి అనర్థాలు జరగకుండా ఉండాలంటే, హోలీ ఆడేముందు, ఆడిన తరువాత కొన్ని జాగ్రత్తలు తప్పని సరి. అందుకే ఈ సేఫ్టీ టిప్స్ మీకోసం.హోలీ ఆడే సమయంలో ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే రసాయనమందులకు దూరంగా ఉండాలి. మార్కెట్లో విరివిగా లభించే రంగుల్లో హాని కారక రసాయనాలు ఉంటాయని గమనించాలి. అలాగే వాడి సైడ్ ఎఫెక్ట్లు, జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా చర్మం, కళ్లు సంరక్షణ చాలా అవసరం. చర్మపు సమసయలు, అలెర్జీలు, కంటి సమస్యలు, ముఖ్యంగా పిల్లలకు శ్వాసకోశ సమస్యలు వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. రసాయన రంగుల్లో సీసం, పాదరసం, క్రోమియం, కాడ్మియం, ఆస్బెస్టాస్ వంటి ప్రమాదకర రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి ఉబ్బసం, బ్రోన్కైటిస్ లాంటి వ్యాధులకు దారి తీయవచ్చు అందుకే ముందు జాగ్రత్త అవసరం.సహజరంగులకే ప్రాధాన్యత: ఇంట్లో తయారు చేసుకునే సేంద్రీయ, సహజ రంగులకేప్రాధాన్య ఇవ్వాలి. ఇలా చేయడం అనేక చర్మ సమస్యలు ఇరిటేషన్ ఇతర ప్రమాదాలనుంచి తప్పించు కోవచ్చు. పర్యావరణానికి ఎలాంటి హానీ జరగదు.చదవండి: Holi 2025 : ఎపుడూ వైట్ డ్రెస్సేనా? కలర్ ఫుల్గా, ట్రెండీగా.. ఇలా! పిల్లల్ని ఒక కంట: కంటి భద్రత , ప్రాముఖ్యత గురించి హోలీ ఆడటానికి వెళ్లే ముందే పిల్లలకు అవగాహన కల్పించాలి. ముఖ్యంగా చిన్నపిల్లల చెవుల్లో, ముక్కుల్లో, రంగు నీళ్లు, ఇతర నీళ్లు పోకుండా జాగ్రత్తపడాలి ఒకవేళ పోయినా వెంటనే పొడి గుడ్డతో శుభ్రం చేయాలి. ఎలా ఆడుకుంటున్నదీ ఒక కంట కనిపెడుతూ, వారి సేఫ్టీని పర్యవేక్షించాలి.స్కిన్ అండ్ హెయిర్ : హోలీ ఆడటానికి వెళ్లే ముందు కొబ్బరి నూనెను లేదంటే కొబ్బరి, బాదం, ఆలివ్ నూనె లాంటి ఇతర సహజమైన నూనెను ముఖానికి, శరీరానికి, జుట్టుకు అప్లయ్ చేసుకోండి. పురుషులైతే, గడ్డం, జుట్టుకు బాగా నూనె రాయండి. అలాగే మాయిశ్చరైజర్ను మొత్తం బాడీకి అప్లయ్ చేసుకోవచ్చు.ఇలా చేయడం వల్ల రంగులు ముఖం నుచి పోయే అవకాశం ఉంటుంది. హోలీ రంగులతో రియాక్షన్ ఇచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. పైగా సులభంగా రంగులు క్లీన్ అవుతాయి.దుస్తులు: హోలీ రంగులు ముఖంతో పాటు మీ చేతులు, కాళ్ళ చర్మానికి హాని చేస్తాయి. ఫుల్ స్లీవ్ షర్ట్లు, కుర్తాలు ధరించాలి. నీళ్లలో జారి పడకుండే ఉండేందుకు షూ వేసుకుంటే మంచిది. కళ్లు,చర్మ రక్షణ: గులాల్, ఇతర రంగులు చర్మానికి అంటుకుని ఒక్క పట్టాన వదలవు. దీని స్కిన్కూడా పాడువుతుంది. అలా కాకుండా ఉండాలంటే హోలీ ఆడటానికి ఒక గంట ముందు సన్స్క్రీన్ రాసుకోవాలి. కళ్లల్లో పడకుండా అద్దాలు పెట్టుకోవడం అవసరం. సింథటిక్ రంగులు లేదా వాటర్ బెలూన్లలో ఉండే హానికరమైన రసాయనాలవల్ల కళ్లకు హాని.నీళ్లు ఎక్కువగా తాగడం: ఎండలో తిరగడం వల్ల పిల్లలు డీ హైడ్రేట్ అయిపోతారు. అందుకే నీళ్లు ఎక్కువ తాగాలి రంగు పొడులను పీల్చడం వల్ల తలెత్తే శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.రంగులను ఎలా కడుక్కోవాలి: హోలీ ఆడిన తరువాత రంగులు వదిలించుకోవడం పెద్ద పని. సబ్బుతో లేదా ఫేస్ వాష్తో కడుక్కోవడం లాంటి పొరపాటు అస్సలు చేయొద్దు. రెండు మూడు రోజులలో హోలీ రంగులు క్రమంగా కనిపించకుండా పోతాయి నూనె పూసుకుని, సహజమైన సున్నిపిండితో నలుగు పెట్టుకోవచ్చు. స్నానం తరువాత బాడీలో రసాయన రహిత క్రీమ్స్, మాయిశ్చరైజర్ రాసుకోవాలి.నోట్ : ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఏదైనా అనుకోనిది జరిగితే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. ఎలాంటి అవాంఛనీయ ప్రమాదాలు లేదా గాయాలు లేకుండా హోలీ వేడుక సంతోషంగా జరుపుకుందాం. అందరికీ హ్యాపీ హోలీ.
ఫొటోలు


Ritu Varma: ప్యాలెస్లో మజాకా బ్యూటీ బర్త్డే వేడుకలు (ఫోటోలు)


భర్తతో బుల్లితెర నటి వాసంతి హోలి సెలబ్రేషన్స్ (ఫోటోలు)


డీజే సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ హైదరాబాద్లో హోలీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)


Holi 2025: హోలి సెలబ్రేషన్స్లో బుల్లితెర తారలు (ఫోటోలు)


తల్లితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంయుక్త (ఫోటోలు)


మరింత గ్లామర్గా మారిపోయిన శ్రీముఖి తన అందానికి ఫిదా అయిపోవాల్సిందే!


‘దిల్ రూబా’ మూవీ హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ (ఫొటోలు)


బ్లాక్ శారీలో తళుక్కుమన్న 'హెబ్బా పటేల్' (ఫోటోలు)


ఆమెతో డేటింగ్ నిజమే.. ప్రేయసితో 'అమిర్ ఖాన్' సెలబ్రేషన్స్ : ఫోటోలు


దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు షురూ..(ఫొటోలు)
National View all

మన ఏడు రెస్టారెంట్లు ఆసియాలో బెస్ట్...
ఉత్తమ హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లను గుర్తించడంలో ప్రసిద్ధి చెందిన సంస్థ ‘50 బెస్ట్’ఆవిష్కరించిన ఆసియా ఉత్తమ రెస్టారెం

ప్రశాంతంగా ముగిసిన హోలీ, రంజాన్ ప్రార్థనలు
న్యూఢిల్లీ: దేశమంతటా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి.

ఉద్యోగాల కంటే నిరుద్యోగులు ఎన్నో రెట్లు ఎక్కువ
న్యూఢిల్లీ: దేశంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల కంటే వా

పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమ

Ranya Rao : మరో బిగ్ షాక్.. రన్యారావు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!
బెంగళూరు : కన్నడ నటి రన్యారావు (Ranya Rao)
International View all

మన ఏడు రెస్టారెంట్లు ఆసియాలో బెస్ట్...
ఉత్తమ హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లను గుర్తించడంలో ప్రసిద్ధి చెందిన సంస్థ ‘50 బెస్ట్’ఆవిష్కరించిన ఆసియా ఉత్తమ రెస్టారెం

గ్రీన్ కార్డు శాశ్వత నివాసానికి... హక్కు కాదు: వాన్స్
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా వలస విధానంపై ఇప్పటికే ప్రపంచ

అమెరికాలోనూ నో ట్యాక్స్..! ట్రంప్ భారీ పన్ను ప్రణాళిక
భారత్లో మాదిరిగానే అమెరికాలోనూ ఆదాయపు పన్నుకు సంబంధించి భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.

ఇంజిన్ పేల్చేశారు.. ట్రైన్ కిటికీలు పగలగొట్టారు..!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ లో జాఫర్ ఎక్స్ ప్రెస్ ను బలోచిస్తాన్

రంగులు పులుముకున్న జాబిల్లి.. ఆకాశంలో ఈ సుందర దృశ్యం చూశారా?
ఆకాశంలో ఇవాళ సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ ఏడాదిలో మొదటి గ్రహణం.. అందునా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది.
International View all

కోడిగుడ్లు ఇస్తారా.. ప్లీజ్!
వాషింగ్టన్: అమెరికాలో కోడిగుడ్ల ధరల ఆకాశాన్నంటుతున్నాయి.

ఉక్రెయిన్ సైనికులను దయతలచి వదిలేయండి
వాషింగ్టన్/మాస్కో: ‘‘పాపం ఉక్రెయిన్ సైనికులు!

యునెస్కో తాత్కాలిక జాబితాలోకి తెలంగాణలోని ముడమాల్ నిలువురాళ్లు
న్యూఢిల్లీ: తెలంగాణలోని నారాయణపేట జిల్లా ముడుమాల్లో ఉన్న ని

‘చిప్’ల కోసం ట్రంప్ స్కెచ్
వాషింగ్టన్/తైపీ: సెమీ కండక్టర్ల తయారీలో ద్వీపదేశమైన త

గ్రీన్కార్డులపై బాంబు పేల్చిన జేడీ వాన్స్.. అమెరికా పౌరసత్వం కట్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసార
National View all

పిల్లలు ఫిర్యాదు చేయగానే... టీచర్ల అరెస్టు కూడదు
కొచ్చి: ఉపాధ్యాయులు, ఇతర బోధన సిబ్బందిపై ఫిర్యాదుల విషయంలో త

యునెస్కో తాత్కాలిక జాబితాలోకి తెలంగాణలోని ముడమాల్ నిలువురాళ్లు
న్యూఢిల్లీ: తెలంగాణలోని నారాయణపేట జిల్లా ముడుమాల్లో ఉన్న ని

‘నాటి వారి పాలన కంటే మీ పాలనే అధ్వానంగా ఉంది’
ముంబై: మహారాష్ట్రలో ప్రస్తుత పాలన అధ్వానంగా ఉందని శివస

‘భార్య అలా చేస్తే భర్తకు ఇంతకు మించిన నరకం మరొకటి ఉండదు’ :హైకోర్టు
భోపాల్ : పెళ్లైన మహిళలు, వారి పురుష స్నేహితుల సాన్నిహిత్యంప

మాజీ ఎమ్మెల్యేపై కాల్పులు.. వీడియో వైరల్
బిలాస్పూర్లో కాల్పుల కలకలం రేగింది.
NRI View all

గ్రీన్కార్డులపై బాంబు పేల్చిన జేడీ వాన్స్.. అమెరికా పౌరసత్వం కట్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసార

ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

భారత విద్యార్థుల చూపు.. ఆ దేశాలవైపు!
ఉన్నత విద్య కోసం అగ్ర రాజ్యాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.

సుదీక్ష మిస్సింగ్.. కిడ్నాపైందా?
న్యూఢిల్లీ: కరీబియన్ దేశం డొమినికన్ రిపబ్లిక్లో తెలుగు వి

టీటీఏ (TTA) న్యూయార్క్ చాప్టర్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్గా జయప్రకాష్ ఎంజపురి
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA) న్యూయార్క్ చాప్టర్కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి &
క్రైమ్

పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి..!
కర్ణాటక: జిల్లాలో హనీ ట్రాప్ ఆరోపణలు గుప్పుమన్నాయి. గుబ్బి పట్టణ పంచాయతీ మాజీ అధ్యక్షుడు జీఎన్ అన్నప్పస్వామి ఈ మేరకు ఓ యువతిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారం జిల్లా అంతటా చర్చనీయాంశమైంది. ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం అన్నప్పస్వామికి ఇటీవల ఫేస్బుక్లో నిషా అనే యువతి పరిచయమైంది. దీంతో ఇద్దరి మధ్య స్నేహం పెరిగి తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. అమ్మాయి ఆహ్వానం మేరకు హాసన్, తిపటూరు, దొడ్డబళ్ళాపుర, నెలమంగల ఇలా అనేకచోట్ల కలిశారు. ఆపై యువతి నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్ళి చేసుకోవాలని ఒత్తిడి చేయసాగింది. దీనికి తిరస్కరించడంతో నిషా, ఆమె స్నేహితులతో కలిసి బెదిరింపులకు పాల్పడింది. మనం కలిసి ఉన్న నగ్నచిత్రాలను వైరల్ చేస్తానని హెచ్చరించింది. తనను హనీ ట్రాప్ చేసి రూ. 20 లక్షల డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేస్తోందని అన్నప్పస్వామి చెబుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు.

Banjara Hills: సినీ దర్శకుడిపై కర్రలతో దాడి..
బంజారాహిల్స్: ప్రమాదకరంగా బైక్లపై దూసుకెళ్తున్న యువకులను ఎందుకలా డ్రైవ్ చేస్తున్నారంటూ ప్రశ్నించిన సినీ డైరెక్టర్పై స్కూటరిస్టులు కర్రలతో దాడి చేసి గాయపరిచిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్నెంబర్–5లో నివసించే సినీ దర్శకుడు మీర్జాపురం అశోక్తేజ బుధవారం రాత్రి మాదాపూర్ నుంచి కృష్ణానగర్ వెళ్తుండగా జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–10 నుంచి రెండు బైక్లపై నలుగురు యువకులు మద్యం మత్తులో ర్యాష్ డ్రైవ్ చేస్తూ ఓవర్టేక్ చేస్తూ న్యూసెన్స్కు పాల్పడుతున్నారు. దీనిని గుర్తించిన అశోక్ తేజ ఎందుకలా స్పీడ్గా వెళ్తున్నారని ప్రశ్నించాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు అతడిని చుట్టుముట్టి కర్రలతో దాడి చేశారు. వారి బారినుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినా వదిలిపెట్టలేదు. దీనిని గుర్తించిన వాహనదారులు అక్కడికి చేరుకోవడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. సదరు యువకులు పల్సర్, ఎఫ్జెడ్ బైక్లపై రాత్రిళ్లు ఆవారాగా తిరుగుతూ, దారిన పోయేవారిని వేధిస్తూప్రశ్నస్తే కొడుతూ అందినకాడికి డబ్బులు లాక్కుంటున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Hyderabad: నిద్ర మాత్రలు వేసుకుని కారు డ్రైవింగ్
సుభాష్ నగర్ : మొతాదుకు మించి నిద్ర మాత్రలు వేసుకున్న ఓ వ్యక్తి మితిమీరిన వేగంతో కారు నడుపుతూ మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గుండ్ల పోచంపల్లికి చెందిన అంబు సోమశేఖర్ గురువారం రాత్రి అతివేగంగా కారు నడుపుతూ జగద్గిరిగుట్ట పోలీస్ అవుట్ పోస్ట్ రోడ్డులో ప్రయాణికులను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. అంతటితో ఆపకుండా అతను షాపూర్నగర్ లోని డీసీపీ కార్యాలయం ఎదుట మరి కొందరిని ఢీకొట్టాడు. దీంతో స్థానికులు కారును వెంబడించి ఆపేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీనిని గుర్తించిన జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్సై సందీప్ అతడిని వెంబడించి సూరారంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. కాగా సదరు వ్యక్తి మత్తులో ఉండి తను ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో ఉండటంతో అతడిని సూరారం పోలీసులకు అప్పగించారు. వివరాలు సేకరించిన పోలీసులు అతడిని గుండ్ల పోచంపల్లికి చెందిన అంబు సోమశేఖర్ గుర్తించి అతడి భార్య డాక్టర్ సువర్ణకు సమాచారం అందించారు. తన భర్త వ్యాపార పని నిమిత్తం వివేకానంద నగర్కు వెళ్లాడని, అప్పుడప్పుడు మోతాదుకు మించి స్లీపింగ్ టాబ్లెట్లు తీసుకోవడంతో తను ఏమి చేస్తున్నాడో తెలియని స్థితిలో ఉంటాడని తెలిపింది. పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు.

Hyderabad: పోలీసు అధికారుల బూట్లు, చెప్పులు చోరీ
మలక్పేట: బంగారం, డబ్బులు, బైక్లు, ఇతర విలువైవ వస్తువుల కోసం దొంగతనాలు, దోపిడీ జరగడం సాధారణంగా చూస్తుంటాం. కానీ.. అందుకు భిన్నంగా కొందరు ఆగంతకులు అపార్ట్మెంట్లలో చొరబడి దొరికిన కాడికి చెప్పులు దొంగతనం చేస్తున్నారు. చెప్పులే కదా ఎవరూ పట్టించుకోరు.. లేదా చెప్పులు అమ్ముకుంటే లాభం అనుకున్నారో ఏమో. ముగ్గురు, నలుగురు యువకులు కలిసి ముఠాగా ఏర్పడి చెప్పుల దొంగతనానికి పాల్పడుతున్నారు. వారు చెప్పులు, షూస్ తప్ప ఇతర వస్తువులు ముట్టుకోకపోవడం గమనార్హం.వివరాలు ఇలా ఉన్నాయి.. మలక్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని మూసారంబాగ్ డివిజన్ ఈస్ట్ ప్రశాంత్నగర్లోని మైక్రో హెల్త్కేర్ అపార్ట్మెంట్లో గురువారం తెల్లవారుజామున చెప్పులు చోరీకి గురయ్యాయి. అపార్ట్మెంట్లోని ఆరు పోర్షన్లలో చెప్పులు, బూట్లు పొద్దున వరకే మాయమయ్యాయి. దీంతో అపార్ట్మెంట్వాసులు విస్మయానికి గురయ్యారు. సీసీ ఫుటేజ్లు పరిశీలించగా.. ముగ్గురు యువకులు ఆటోలో వచ్చి చెప్పులను మూట కట్టుకుని ఆటోలో వేసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు రికార్డు అయింది. పోలీసు అధికారి షూ.. చెప్పులు కూడా.. మెక్రో హెల్త్కేర్ లైన్ అపార్ట్మెంట్ వెనుక భాగంలోని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఓ పోలీసు అధికారి షూస్, చెప్పులు కూడా దొంగతనం చేశారు. నాలుగు అపార్ట్మెంట్లలోని చెప్పులు మూట కట్టి ఖాళీగా ఉన్న స్థలంలో పడేశారు. అనంతరం వాటిని తీసుకొచ్చి ఆటోలో వేసుకుని అక్కడినుంచి వెళ్లిపోయారు. చెప్పులు, షూస్ బ్రాండెండ్వే అని, చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అపార్ట్మెంట్ వాసి రవిప్రసాద్ చావ్లా చెప్పారు. నెల రోజుల క్రితం ఇదే తరహాలో.. మైక్రో హెల్త్ కేర్ సంస్థ పక్కనున్న అపార్ట్మెంట్లో కూడా నెల రోజుల క్రితం చెప్పుల దొంగతనం జరిగింది. చోరీపై అపార్ట్మెంట్ నివాసి సయ్యద్ మహబూబ్ బాషా మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపార్ట్మెంట్లోని 6 ఫ్లాట్లలో మొత్తం 30 జతల బూట్లు, 25 జతల చెప్పులు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ పిడమర్తి నరేష్ తెలిపారు.
వీడియోలు


చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి


కాకినాడలో సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు వినూత్న నిరసన


హైదరాబాద్ లో హోలీ ముసుగులో గంజాయి వినియోగం


ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజం


కాశీనాయనక్షేత్రం దాడిపై పవనికి మల్లాది విష్ణు కౌంటర్


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు


SLBC టన్నెల్ సహాయక చర్యల్లో రోబోల వినియోగం


women's day : హంపీ టెంపుల్లోని ఈ సారథుల గురించి తెలుసా?


Meruga Nagarjuna: లోకేశ్ సకల శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు


కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన గూండాల అరాచకం