Top Stories
ప్రధాన వార్తలు

‘మోదీ జీ.. ఎవరి సత్తా ఏంటో ఎన్నికల్లో చూస్కుందాం’
కోల్కతా: ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమబెంగాల్ పర్యటనలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ఒక అవినీతి ప్రభుత్వమని, హింసాత్మక ప్రభుత్వమని ప్రధాని మోదీ ఘాటుగా విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ ప్రజలు.. మమతా బెనర్జీ ప్రభుత్వం అరాచకాలపై కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటూ మోదీ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ లో ప్రభుత్వాన్ని మార్చాల్సిన సమయం ఆసన్నమైందని కూడా ప్రజల భావనగా ఉందని మోదీ తెలిపారు.దీనికి సీఎం మమతా బెనర్జీ తనదైన శైలిలో జవాబిచ్చారు. తాను ప్రధాని మోదీ తరహాలో వ్యాఖ్యానించలేనంటూనే వచ్చే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందన్నారు. రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో అనేది తేలుతుందని మోదీకి సవాల్ విసిరారు. మోదీ వ్యాఖ్యలపై కౌంటర్ రిప్లై ఇచ్చిన మమతా.. ‘ ఎన్నికలు రానివ్వండి. చూద్దాం.. ఎవరి సత్తా ఏమిటో తేలుతుంది. ప్రజలు ఎవరు పక్షాన ఉన్నారో చూద్దాం. మా వెంట, మా పార్టీ వెంట రాష్ట్ర ప్రజలు ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నా. ఎవరి సత్తా ఏమిటో ఎన్నికల్లో చూస్కుందాం’ అని మోదీకి మమతా సవాల్ విసిరారు.ఈరోజు(గురువారం) ప్రధాని మోదీ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని అలీపుర్దౌర్ బహిరంగ సభలో మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని తూర్పార బట్టారు. పశ్చిమ బెంగాల్ ఎక్కడ చూసినా అవినీతి, అల్లర్లు, హింస ఇవే కనిపిస్తున్నాయంటూ విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం కూడా లేదు. వచ్చే ఏప్రిల్ నెలలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆర్బీఐ వార్షిక నివేదిక: భారత్ జీడీపీ వృద్ధి ఇలా..
భారత్ ఇటీవలే జపాన్ను అధిగమించి.. ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇక మన ముందు ఉన్న లక్ష్యం జర్మనీని అధిగమించడమే. ఈ తరుణంలో 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) వచ్చే ఆర్ధిక సంవత్సరంలో దేశ ఆర్ధిక వ్యవస్థ ఎలా ఉంటుందనే విషయాన్ని'2024-2025 వార్షిక నివేదిక'లో వెల్లడించింది.2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. అంతే కాకుండా.. దేశ ఆర్థిక వ్యవస్థ.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని.. తద్వారా స్థిరమైన వృద్ధి సాధ్యమవుతుందని నివేదికలో వెల్లడించింది.మార్కెట్ అస్థిరతలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య విచ్ఛిన్నం, సరఫరా గొలుసుల అంతరాయాలు, వాతావరణ ప్రేరిత అనిశ్చితులు మొదలైనవన్నీ ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్బీఐ పేర్కొంది. అయితే ఆర్థిక ఏకీకరణ మార్గంలో ప్రభుత్వం నిరంతరం మూలధనంపై దృష్టి పెట్టడం, వినియోగదారులు & వ్యాపార ఆశావాదాన్ని బలోపేతం చేయడం, బలమైన స్థూల ఆర్థిక ప్రాథమిక అంశాలన్నీ సజావుగా ముందుకు సాగితే.. 2025-26లో భారత ఆర్థిక వ్యవస్థ దృక్పథం ఆశాజనకంగానే ఉందని స్పష్టం చేసింది.2025-26లో వ్యవసాయ రంగానికి అవకాశాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ఎక్కువగా ఉండటం మాత్రమే కాకుండా.. ఉత్పాదకతను పెంచే ప్రభుత్వ విధానాలు కూడా అని ఆర్బీఐ పేర్కొంది. 2025-26 కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి వివిధ కొత్త చొరవలను ప్రకటించారని కూడా వెల్లడించింది.ఇదీ చదవండి: ఇక భారత్ టార్గెట్ జర్మనీ: 2027 నాటికి..టారిఫ్ విధానాలలో మార్పులు ఆర్థిక మార్కెట్లలో అప్పుడప్పుడు అస్థిరతలకు దారితీయవచ్చు. అయితే ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ మిషన్.. మేక్ ఇన్ ఇండియా వంటివి తయారీ రంగాన్ని మరింత బలపరుస్తాయి. తద్వారా.. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.భారత్ ఇప్పటికే అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. ఇందులో యూఎస్ఏ మాత్రమే కాకుండా.. ఒమన్, పెరూ, ఈయూ మొదలైన దేశాలు ఉన్నాయి. ఈ వాణిజ్య ఒప్పందాలు ఆర్ధిక వృద్ధికి దోహదపడతాయి. 2024-25లో దేశంలో అనేక ఆర్ధిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ.. ఆర్ధిక వ్యవస్థ బలంగానే ఉందని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. డిజిటల్ చెల్లింపులు కూడా దేశంలో అధికంగా ఉన్నాయి. మొత్తం మీద భారత్ ఆర్ధిక వ్యవస్థలో పురోగతి ఉంటుందని ఆర్బీఐ వెల్లడించింది.वर्ष 2024-25 के लिए वार्षिक रिपोर्ट Annual Report for the Year 2024-255thhttps://t.co/vTNI6w2xnz pic.twitter.com/rqo7ZV6HnD— ReserveBankOfIndia (@RBI) May 29, 2025

వైఎస్ రాజారెడ్డి శత జయంతి.. నిర్మలా శిశు భవన్కు వైఎస్ జగన్ దంపతులు
సాక్షి, విజయవాడ: నేడు దివంగత మహానేత వైఎస్సార్ తండ్రి, దివంగత వైఎస్ రాజారెడ్డి శత జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ రాజారెడ్డి శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.వైఎస్ రాజారెడ్డి జయంతి నేపథ్యంలో సతీసమేతంగా వైఎస్ జగన్ గురువారం.. విజయవాడలోని నిర్మల శిశు భవన్కు విచ్చేశారు. ఈ సందర్బంగా నిర్మల శిశు భవన్లో ఉన్న పిల్లలతో వైఎస్ జగన్, భారతి దంపతులు ముచ్చటించారు. వారితో సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సోదరి వైఎస్ విమలారెడ్డి కూడా పాల్గొన్నారు. అంతకుముందు.. పార్టీ అధినేత విజయవాడకు వస్తున్నారన్న విషయం తెలిసి వైఎస్సార్సీపీ పార్టీశ్రేణులు అక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసి వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు.మరోవైపు.. పులివెందులలో రాజారెడ్డి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో వైఎస్ విజయమ్మ సహా కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.తన తాత వైఎస్ రాజారెడ్డి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్.. శిశు భవన్లో దివ్యంగ చిన్నారులతో గడిపిన వీడియో, ఫోటోలను ఎక్స్లో షేర్ చేశారు. Cherishing and honouring the 100th anniversary of my late grandfather's memory. pic.twitter.com/CS6IyD08pi— YS Jagan Mohan Reddy (@ysjagan) May 29, 2025

‘గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే.. యుద్ధాన్ని గెలుస్తాడు’
మేడ్చల్ జిల్లా: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్కు కాంగ్రెస్ పూర్తి మద్దతిస్తే, యుద్ధం ఆపేసినప్పుడు అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు(గురువారం) మేడ్చల్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. ప్రధాని మోదీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే.. యుద్ధాన్ని గెలవగలడు అంటూ ప్రధాని మోదీని విమర్శించారు.‘ఉగ్రదాడి తర్వాత కేంద్రానికి పూర్తిగా మద్దతిచ్చాం. యుద్ధాన్ని ఆపాలనుకున్నప్పుడు అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదు?, మన భూభాగాన్ని చైనా ఆక్రమిస్తుంటే మోదీ ఏం చేస్తున్నారు?, అమెరికా ఒత్తిడికి తలొగ్గి యుద్ధం ఆపేశారా?, మన పౌరులపై తూటాలు పేల్చిన దేశాన్ని తుడిచేయాలని ప్రధానిని కోరాం.పాక్ ను ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేయాలని కోరాం. భారత్ను బెదిరించడానికి ట్రంప్ ప్రకటన చేయడం బాధాకరం. యుద్ధాన్ని విరమించినప్పుడు మోదీ అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదు. గతంలో అమెరికా బెదిరింపులను ఇందిరాగాంధీ పట్టించుకోలేదు. అప్పట్లో పాక్ను ఓడించి బంగ్లాదేశ్ను ఏర్పాటు చేశారు. గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే.. యుద్ధాన్ని గెలవగలడు. పాక్ను ఓడించాలంటే ఇందిరాగాంధీ బాటలో మోదీ నడవాలి. ఇదే విషయాన్ని రాహుల్గాంధీ చెప్తే విమర్శిస్తున్నారు’ అంటూ సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇది చదవండి: ‘మోదీ జీ.. ఎవరి సత్తా ఏంటో ఎన్నికల్లో చూస్కుందాం’

భారత ఆటగాడిని అవమానించిన పాక్ టెన్నిస్ ప్లేయర్.. వైరల్ వీడియో
పాకిస్తాన్ టెన్నిస్ ప్లేయర్ ఒకరు భారత ఆటగాడిని అవమానించాడు. భారత్ చేతిలో ఓటమిని తట్టుకోలేక ఓవరాక్షన్ చేశాడు. మ్యాచ్ పూర్తయ్యాక షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వెళ్లిన భారత ఆటగాడి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. కోపంతో ఊగిపోతూ కరచాలనం చేసేందుకు నిరాకరించాడు. కజకిస్థాన్ వేదికగా జరిగిన ఏసియా-ఓసియానియా జూనియర్ డేవిడ్ కప్ (అండర్-16) టెన్నిస్ టోర్నీమెంట్లో ఇది జరిగింది. India defeats Pakistan 2-0 in Junior Davis CupLook at the Pakistan player's attitude on handshake after loosing, Pathetic Stuff! 😡 pic.twitter.com/8twsAbDqPd— India Insights 🇮🇳 (@India_insights0) May 27, 2025ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. పాక్ ఆటగాడి ప్రవర్తనను భారత క్రీడాభిమానులు ఖండిస్తున్నారు. క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించాడని మండిపడుతున్నారు. పాక్ ఆటగాళ్ల నుంచి ఇంతకంటే గొప్ప ప్రవర్తన ఆశించలేమంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. భారత్-పాక్ మధ్య యుద్దం తర్వాత జరిగిన ఘటన కావడంతో భారత అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.కాగా, జూనియర్ డేవిడ్ కప్ టెన్నిస్ టోర్నీలో 11వ స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్స్ మ్యాచ్లో భారత్ పాక్ను 2-0 తేడాతో చిత్తుగా ఓడించింది. సింగిల్స్ మ్యాచ్ల్లో భారత ఆటగాళ్లు ప్రకాశ్ సర్రన్, తవిశ్ పహ్వా వరుస సెట్లలో పాక్ ఆటగాళ్లును ఓడించారు.

మహానాడు ఎఫెక్ట్.. బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తెలుగు దేశం పార్టీ మహానాడు(TDP Mahanadu) కార్యక్రమం మాటేమోగానీ.. జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు జనాల్ని తరలించలేక, సభకు వచ్చినవాళ్లను నిలువరించలేక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. తొలిరెండు రోజులు ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడం, నేతలు మాట్లాడుతుండగానే మధ్యలో జనాలు వెళ్లిపోవడాన్ని సాక్షి హైలైట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మూడోరోజు మహానాడు బహిరంగ సభనైనా జనంతో నింపేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. మహానాడు సభ కోసం ఆర్టీసీ నుంచి భారీగా టీడీపీ బస్సులను వినియోగించుకుంటోంది. చాలా గ్రామాలకు ఉదయమే బస్సులు చేరుకుని జనాల్ని తరలిస్తున్నాయి. దీంతో డిపోల్లో బస్సుల్లేక.. సరిపడా బస్సుల్లేక గమ్యస్థానాలకు చేరేందుకు ప్రయాణికులు అగచాట్లు పడుతున్నారు. చాలా బస్టాండుల్లో బస్సుల్లేవ్ అనే బోర్డులు సైతం దర్శనమిస్తుండడం గమనార్హం. నంద్యాల జిల్లా నుంచి, శ్రీశైలం నుంచి మహానాడు కోసం బస్సులు తరలించారు. ఆత్మకూరు డిపోలో బస్సుల్లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు.. కడప మహానాడు (Kadapa Mahanadu)ను ఎలాగైనా ‘సక్సెస్’ చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి జనసేకరణ చేపట్టింది. అన్నమయ్య జిల్లాలో మహానాడు కోసం ఓబులవారిపల్లి హరిజన వాడ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే.. అది బలవంతపు తరలింపు అని ఇప్పుడు తేలింది. డ్వాక్రా మహిళలు మహానాడుకు కచ్చితంగా రావాలని, సమావేశానికి రాకపోతే లోన్లు ఇవ్వమంటూ బెదిరించిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది.మహానాడు కారణంగా చివరకు పోలీసులు(AP Police) సైతం పడుతున్న కష్టాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయించుకుంది టీడీపీ. అయితే కనీసం తిండి కూడా పెట్టడం లేదంటూ ఓ ఎస్సై పడిన ఆవేదన వీడియో రూపేణా బయటకు వచ్చింది. మహానాడులో రకరకాల రుచులతో భోజనాలు ఘనంగా పెడుతున్నారంటూ టీడీపీ అనుకూల మీడియా ఎంతలా ప్రచారం చేసుకుందో తెలిసిందే. కానీ, తాము ఏ పూట వెళ్లినా తమకు తిండి మాత్రం దొరకడం లేదని ఆయన అక్కడికి వచ్చిన వాళ్లకు చెప్పుకుంటూ వాపోయారు. ఇదీ చదవండి: మహానాడులో ఎన్టీఆర్ స్పీచ్.. నవ్వుకున్న టీడీపీ కార్యకర్తలు

కన్నడ భాషపై కమల్ కామెంట్స్.. పోలీసులకు ఫిర్యాదు!
కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వివాదానికి దారి తీశాయి. థగ్ లైఫ్ సినిమా ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలపై కన్నడ నాయకులతో పాటు పలువురు మండిపడుతున్నారు. కమల్ హసన్ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కన్నడ భాషను ఉద్దేశించిన కమల్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు తాను మాత్రం క్షమాపణ చెప్పేది లేదని కమల్ కౌంటరిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే కమల్ హాసన్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని కర్ణాటక రక్షణ వేదిక బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బెంగళూరులోని ఆర్టీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన కన్నడిగుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా.. తమిళులకు, మాకు విష బీజాలు నాటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమిళ సినిమా విడుదలైన ప్రతిసారీ కన్నడిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. కాగా.. థగ్ లైఫ్ ఆడియో లాంచ్ సందర్భంగా తమిళం నుంచే కన్నడ పుట్టిందని కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదానికి కారణమయ్యాయి. అయితే ఈ ఫిర్యాదుపై ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.కాగా.. కమల్ హాసన్ వ్యాఖ్యలతో అనేక కన్నడిగుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. బెళగావి, మైసూరు, హుబ్బళ్లి, బెంగళూరుతో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో కమల్కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. బెళగావి మరికొన్ని ప్రదేశాలలో కార్యకర్తలు కమల్ పోస్టర్లను తగలబెట్టి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రంలో ఆయన సినిమా థగ్ లైఫ్ ప్రదర్శనను అడ్డుకుంటామని కూడా బెదిరించారు.

ప్రపంచం మొత్తం నేనెందుకు ఫేమసో తెలుసా.. పాక్ ర్యాలీలో ఉగ్రవాది
ఇస్లామాబాద్: మిని స్విట్జర్లాండ్గా పేర్కొందిన పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడి వెనుక మాస్టర్ మైండ్ లష్కరే తోయిబా కమాండర్ సయిఫుల్లా కసూరి హస్తం ఉన్నట్లు తేలింది. సైఫుల్లా కసూరి మరోవెరో కాదు లష్కరే తోయిబా చీఫ్,భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ కొడుకే.పాకిస్తాన్ తన అణు పరీక్షల వార్షిక స్మారకోత్సమైన యూమ్-ఎ-తక్బీర్ను పురస్కరించుకుని పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ (PMML) నిర్వహించిన ఈ ర్యాలీలో రాజకీయ నాయకులే కాదు సయిఫుల్లా కసూరి, ఇతర మోస్ట్ వాంటెండ్ టెర్రరిస్టులు సైతం పాల్గొన్నారు.Lashkar-e-Taiba (LeT) chief Hafiz Saeed's son with Pak Punjab Assembly MLAs openly inciting violence against India.Does anyone need more proof that Pakistan is a rogue state ? pic.twitter.com/NCtLXJTtxd— Zubair Alvi (@Alvi_Zubair45) May 29, 2025పంజాబ్ ప్రావిన్స్లోని కసూర్లో జరిగిన ర్యాలీలో కసూరి మాట్లాడుతూ,‘పహల్గామ్ ఉగ్ర దాడి సూత్రదారి నేనేనని అందరూ నన్ను నిందిస్తున్నారు. ఇప్పుడు నా పేరు ప్రపంచం మొత్తం మార్మోగుతోంది’ అంటూ భారత్కు వ్యతిరేకంగా స్లోగన్లు వినిపించారు.ఈ ర్యాలీలో భారతదేశ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో 32వ స్థానంలో ఉన్న తల్హా సయీద్ సైతం ఉన్నారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. పహల్గాం ఉగ్రదాడిపై భారత్ ఆపరేషన్ సిందూర్తో పాక్ను చావుదెబ్బ తీసింది. పాకిస్తాన్లో ఉగ్రమూకలకు ట్రైనింగ్ ఇచ్చే సెంటర్లను భూస్తాపింతం జరిగింది. ఆపరేషన్ సిందూర్లో హతమైన హై-ప్రొఫైల్ ఉగ్రవాదుల్లో ముదస్సిర్ అహ్మద్ ఒకరు.తాజాగా, కసూర్ ర్యాలీలో మాట్లాడిన సైఫుల్లా కసూరి పంజాబ్ ప్రావిన్స్లోని అల్హాఅబాద్లో ఆస్పత్రులు, భవనాలు నిర్మిస్తామని చెప్పడం గమనార్హం.

కేటీఆర్పై విరుచుకుపడ్డ కవిత.. నాతో పెట్టుకోవద్దు..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో ఉన్న కోవర్టులే తనను ఓడించారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఇంటి ఆడ బిడ్డపైనే పేయిడ్ వార్తలు రాయిస్తున్నారు. లేఖ ఎవరు బయటపెట్టారో చెప్పమంటే నాపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో కేటీఆర్ను టార్గెట్ చేసి విమర్శలు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు చేయాలి.. కేవలం ట్వీట్లకే పరిమితం అయితే ఎలా? అని ప్రశ్నించారు. తనది బీఆర్ఎస్ పార్టీనే. కొత్త పార్టీలు ఎందుకు?. ఉన్న పార్టీని, కేసీఆర్ను కాపాడుకుంటే సరిపోతుంది. లీక్ వీరులను బయట పెట్టండి అంటే గ్రీక్ వీరులు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత తాజాగా చిట్చాట్లో మాట్లాడుతూ.. ఏది ఉన్నా నేను సూటిగానే మాట్లాడతాను. వెన్నుపోటు రాజకీయాలు చేయను. నేను కేసీఆర్ లాగే నేను ఏదైనా సూటిగానే మాట్లాడతాను. తిక్క తిక్కగానే ఉంటాను. పార్టీని నడిపించే సత్తా మీకు లేదు.. నాకు నీతులు చెబుతున్నారా?. వరంగల్ మీటింగ్ సక్సెస్ అయ్యిందని చెప్పుకుంటున్న వాళ్లను చూసి జనం నవ్వుకుంటున్నారు. ఏమైనా ఉంటే.. పార్టీ ఫోరమ్ లోపల మాట్లాడాలి అన్నారు. నేను బయటే మాట్లాడతాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ సోయితో పరిపాలన జరగట్లేదు అని అన్నారు. నాకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదు.. ఏది ఉన్నా నేను ముక్కు సూటిగానే మాట్లాడతాను.ట్వీట్లకే పరిమితం అయితే ఎలా?..అంతర్గత విషయాలపై లేఖ రాస్తే ఎందుకు బయటపెట్టారు. నేను రాసిన లేఖను ఎవరు బయటపెట్టారు. బీఆర్ఎస్లో నాకు ఒకే నాయకుడు కేసీఆర్.. నాకు ఇంకెవరూ నాయకులు లేరు. పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని నేను అంగీరించను. వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు చేయాలి.. కేవలం ట్వీట్లకే పరిమితం అయితే ఎలా?. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన చేసే కార్యచరణ చేయనివ్వండి. నాది బీఆర్ఎస్ పార్టీనే. కొత్త పార్టీలు ఎందుకు?. ఉన్న పార్టీని, కేసీఆర్ను కాపాడుకుంటే సరిపోతుంది. నేను కాంగ్రెస్తో 2013లోనే మాట్లాడాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడలేదు. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని సెటైర్లు వేశారు. బీజేపీ వాళ్లు కట్టిన ఆసుపత్రి ఓపెనింగ్కి వెళ్ళిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని అన్నారు. నేను అసలే మంచి దాన్ని కాదు..డబ్బులు ఇచ్చి నాపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. నన్ను అరెస్ట్ చేసే సమయంలో కేసీఆర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అని అడిగితే కేసీఆర్ వద్దని చెప్పినట్టు తెలిపారు. పార్టీ చేయలేని పనులను జాగృతి తరఫున నేను చేసి చూపించాను. కేసీఆర్ తప్ప ఇప్పుడు నన్ను విమర్శిస్తున్న వారు ఏం చేశారో చెప్పాలి. నేను ఎప్పుడూ పదవులు అడగలేదు. కేసీఆరే నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. పార్టీ నడిపించే సత్తా లేదు.. నాకు నీతులు చెబుతున్నారా అని మండిపడ్డారు. నేను కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ కోసం పోరాటం చేశాను. నేను మంచి దాన్ని కాదు.. నాతో పెట్టుకోవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్లాన్.. అలాగే, పార్టీ చేసే పనులు నేను సగం చేస్తున్నాను. అందుకే తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది. కేసీఆర్కి కాళేశ్వరం నోటీసులు ఇస్తే.. పార్టీ పరంగా ఏం చేశారు?. తెలంగాణ తల్లి విగ్రహం మారిస్తే.. ఈ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది?. అదానీ టీ షర్ట్స్ వేసుకొని హంగామా చేసి వదిలేశారు.పార్టీ కోసం కేసీఆర్కు వంద లేఖలైనా రాస్తాను. నేను 25 ఏళ్ల నుంచి కేసీఆర్కు లేఖలు రాస్తున్నాను. ప్రతీసారి లేఖలు చూడగానే కేసీఆర్ వాటిని చించేస్తారు.. కానీ, ఈసారి ఏమైందో లేఖ బయటకు వచ్చింది. అలాంటి లేఖను ఎందుకు బయట పెట్టారు. నేను జైలులో ఉన్న సమయంలో బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ, నేను బీజేపీలో కలపవద్దని చెప్పాను. వందకు 101 శాతం బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్రయత్నం జరుగుతోంది. నేను పార్టీలో ఉంటే బీఆర్ఎస్.. బీజేపీలో కలిసే అవకాశం ఉండదు. నేను ఉంటే అది కుదరని పని.. అందుకే నన్ను కేసీఆర్కు దూరం చేయాలని చూస్తున్నారు. నేను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను. ఇవాళ తెలంగాణ వ్యతిరేకులు పనిచేస్తున్నారు. అది అడ్డుకునే ప్రయత్నం పార్టీ చేయట్లేదు. కేసీఆర్ను ఎప్పుడు కలిసేది ఇప్పుడు చెప్పలేను.. డెడ్లైన్ అంటూ ఏమీ లేదు’ అని చెప్పుకొచ్చారు.

గైడో, డ్రైవరో కాదు నా భర్త.. మహిళ అసహనం : బై డిఫాల్ట్ భర్తలందరూ డ్రైవర్లేగా!
సాధారణంగా ఒక యువతి, యువకుడు కనిపించగానే వాళ్లిద్దరూ, భార్యాభర్తలనో లేదా లవర్స్ అనో అనేసుకుంటారు చాలామంది. అయితే పోలిష్ మహిళ ఇతను నా భర్త మొర్రో మొత్తుకుంటోంది. అదేంటో తెలుసుకుందాం రండి!పోలెండ్ దేశానికి చెందిన గాబ్రియెలా డూడా (Gabriela Duda) ఉత్తర ప్రదేశ్కు చెందిన హార్దిక్ వర్మా (Hardik Varma)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2023 నవంబర్ 29న ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాలో హిందూ ఆచారాల ప్రకారం సాంప్రదాయ బద్ధంగా వీరు పెళ్లి చేసుకున్నారు. భారతదేశంలోని పలు ప్రదేశాల్లో, ఇతర దేశాల్లో ప్రయాణం చేస్తూ, భారతీయ సంస్కృతిని తెలుసుకుంటూ , అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. అయితే ఏంటి.. అనుకుంటున్నారా? ఈ పయనంలో తమ కెదురవుతున్న ఒక వింత అనుభవాన్ని గురించి సోషల్మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది. కంటెంట్ క్రియేటర్ అయిన గాబ్రియేలా భర్త హార్దిక్ వర్మతో కలిసి టూరిస్టులుగా ఆనందంగా గడుపుతున్న క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటంది. ఇద్దరూ అనేక ప్రదేశాల్లో పర్యటిస్తున్న క్రమంలో ప్రజలు తన భర్తను తన టూర్ గైడ్ లేదా డ్రైవర్గా తరచుగా తప్పుగా భావిస్తుంటారు అంటూ అసహనం వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Gabriela & Hardik Varma | Travel & Indian Culture (@hardikandgabi) "భారతదేశంలో కొత్త ప్రదేశానికి వచ్చినప్పుడల్లా అత్యంత ఇబ్బందికరమైన క్షణం. ఎప్పుడో ఒకసారి జరిగేదికాదు. ప్రతీ షాపు వాడు, లేదా ఆటో/టాక్సీ డ్రైవర్ హార్దిక్ నా టూర్ గైడ్ అని అనుకుంటారు. అవునబ్బా కొన్నిసార్లు అతను నా నా డ్రైవర్ కూడా.. అయితే ఏంటి’’ ప్రశ్నించింది. ఏ అమ్మాయైనా డ్రైవర్ చేతులు పట్టుకుని తిరుగుతుందా? లేదంటే, తన టూర్ గైడ్తో వేల ఫోటోలు తీసుకుంటుంది, లిప్ లాప్ ఇస్తుంది... ఆ మాత్రం అర్థం చేసుకోలేరా అంటూ చికాకు పడింది. అంతేకాదు తన భర్తతో వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో నాలుగు లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. అయితే ఆమె అసహనంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. "గైడ్ అని పిలవడంలో తప్పేముంది’’, ‘‘మీ మోటార్ లాగా మీరు మళ్లీ గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలి’’, నిజం చెప్పాలంటే.. ఆయన అలాగే కనిపిస్తున్నాడు.. నీట్గా షేవ్ చేసుకుంటే బెటర్’’, ‘‘ పెళ్లాం పిల్లలకు, భర్తలందరూ బై డిఫాల్ట్ టూర్ గైడ్లు, డ్రైవర్లే ఇలా రకరకాల కమెంట్లు, జోక్స్ వెల్లువెత్తాయి."నేను నా భార్యపిల్లలతో కలిసి నా స్వస్థలాన్ని సందర్శించినప్పుడు నాకు కూడా అదే జరిగింది. కొంతమంది స్థానికులు నన్ను వారి టూర్ గైడ్ అని అనుకున్నారు" అని మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు.
గద్దర్ అవార్డ్స్ లో సత్తా చాటిన ఆహా ఓటీటీ మూవీస్
‘మోదీ జీ.. ఎవరి సత్తా ఏంటో ఎన్నికల్లో చూస్కుందాం’
కన్నడ భాషపై కమల్ కామెంట్స్.. పోలీసులకు ఫిర్యాదు!
వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు
Yamudu Teaser: అమ్మాయిల మిస్సింగ్తో యముడికి ఉన్న సంబంధం ఏంటి?
కవిత ఏం మాట్లాడిందో తెలీదు: సబితా
ఐక్యూ నియో 10 స్మార్ట్ఫోన్: ధర ఎంతంటే?
Heat : మహిళల్లో పెరుగుతున్న యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు (UTI)
దీపిక తొలగింపు.. పరేష్ రావల్ కంపు... ఈ బాలీవుడ్కేమైంది?
ప్రపంచం మొత్తం నేనెందుకు ఫేమసో తెలుసా.. పాక్ ర్యాలీలో ఉగ్రవాది
రిషబ్ పంత్కు భారీ షాకిచ్చిన బీసీసీఐ
Mahanadu: మహానాడు.. మాకెందుకయ్యా?
NTR Jayanthi : ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ. ఎన్టీఆర్, కల్యాణ్రామ్ నివాళి (చిత్రాలు)
కథ మొత్తం చెప్పినా భయపడను.. సందీప్ రెడ్డి వంగా కౌంటర్
ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)
సభ సూపర్ సక్సెస్ మీదే దృష్టి పెట్టకుండా.. ‘సూపర్ సిక్స్’ను కూడా చూడండి!!
టూ ఇన్ వన్! ముందు జాగ్రత్త చర్యగా కారును అలా డిజైన్ చేయించుకున్నా..!
జైలర్-2లో విలన్గా తెలుగు అగ్ర హీరో
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్..
జబర్దస్త్ ఐశ్వర్య నూతన గృహప్రవేశ వేడుక (ఫొటోలు)
నడిరోడ్డుపై పట్టపగలే దళిత, ముస్లిం యువకులపై రెడ్బుక్ కర్కశత్వం
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వృత్తి, వ్యాపారాలలో పురోగతి
కరీంనగర్లో దరఖాస్తు.. మహబూబ్నగర్లో మంజూరు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు.. వ్యాపారాలు లాభిస్తాయి
ప్రముఖ సీరియల్ నటుడు కన్నుమూత
సాక్షి కార్టూన్ 27-05-2025
సందీప్ వంగాకు దీపిక ఇన్ డైరెక్ట్ కౌంటర్?
కన్నప్ప చిత్రం హార్డ్డ్రైవ్తో యువతి పరార్
అడ్రస్ ఆధార్.. ప్రభుత్వం కొత్త కసరత్తు!
ఈ రాశి వారికి రుణాలు తీరతాయి.. ఆప్తులతో సఖ్యత
గద్దర్ అవార్డ్స్ లో సత్తా చాటిన ఆహా ఓటీటీ మూవీస్
‘మోదీ జీ.. ఎవరి సత్తా ఏంటో ఎన్నికల్లో చూస్కుందాం’
కన్నడ భాషపై కమల్ కామెంట్స్.. పోలీసులకు ఫిర్యాదు!
వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు
Yamudu Teaser: అమ్మాయిల మిస్సింగ్తో యముడికి ఉన్న సంబంధం ఏంటి?
కవిత ఏం మాట్లాడిందో తెలీదు: సబితా
ఐక్యూ నియో 10 స్మార్ట్ఫోన్: ధర ఎంతంటే?
Heat : మహిళల్లో పెరుగుతున్న యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు (UTI)
దీపిక తొలగింపు.. పరేష్ రావల్ కంపు... ఈ బాలీవుడ్కేమైంది?
ప్రపంచం మొత్తం నేనెందుకు ఫేమసో తెలుసా.. పాక్ ర్యాలీలో ఉగ్రవాది
రిషబ్ పంత్కు భారీ షాకిచ్చిన బీసీసీఐ
Mahanadu: మహానాడు.. మాకెందుకయ్యా?
కథ మొత్తం చెప్పినా భయపడను.. సందీప్ రెడ్డి వంగా కౌంటర్
సభ సూపర్ సక్సెస్ మీదే దృష్టి పెట్టకుండా.. ‘సూపర్ సిక్స్’ను కూడా చూడండి!!
టూ ఇన్ వన్! ముందు జాగ్రత్త చర్యగా కారును అలా డిజైన్ చేయించుకున్నా..!
జైలర్-2లో విలన్గా తెలుగు అగ్ర హీరో
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్..
నడిరోడ్డుపై పట్టపగలే దళిత, ముస్లిం యువకులపై రెడ్బుక్ కర్కశత్వం
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వృత్తి, వ్యాపారాలలో పురోగతి
కరీంనగర్లో దరఖాస్తు.. మహబూబ్నగర్లో మంజూరు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు.. వ్యాపారాలు లాభిస్తాయి
ప్రముఖ సీరియల్ నటుడు కన్నుమూత
సాక్షి కార్టూన్ 27-05-2025
సందీప్ వంగాకు దీపిక ఇన్ డైరెక్ట్ కౌంటర్?
కన్నప్ప చిత్రం హార్డ్డ్రైవ్తో యువతి పరార్
అడ్రస్ ఆధార్.. ప్రభుత్వం కొత్త కసరత్తు!
ఈ రాశి వారికి రుణాలు తీరతాయి.. ఆప్తులతో సఖ్యత
పులివెందుల: అర్ధరాత్రంతా హైడ్రామా
మళ్లీ దొరికిపోయిన రష్మిక.. తానే హింట్ ఇచ్చిందిగా!
దళిత, మైనార్టీల ఆత్మగౌరవంపై బాబు సర్కార్ ‘బూటు’ దెబ్బ
సినిమా

'గద్దర్ అవార్డ్స్' ప్రకటించిన తెలంగాణ.. ఉత్తమ నటుడిగా 'అల్లు అర్జున్'
తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి గద్దర్ అవార్డులను (Gaddar Awards) ప్రకటించింది. తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీ ఛైర్మన్ నటి జయసుధ (Jayasudha), ఎఫ్డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు (Dil Raju) తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అవార్డ్స్ కోసం ఎంపికైనా వారి జాబితాను విడుదల చేశారు. 2014 నుంచి 2023 వరకు సెన్సార్ అయిన చిత్రాలను అవార్డ్స్ కోసం ఎంపిక చేశారు. అయితే, ప్రస్తుతం 2024 ఏడాదికి సంబంధించి అన్ని విభాగాల్లో అవార్డ్స్ అందుకున్న వారి వివరాలు ప్రకటించారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం నుంచి చలన చిత్ర అవార్డులను ఇస్తున్నట్టు దిల్ రాజు గుర్తుచేశారు. చిత్ర పరిశ్రమలోని నటీనటులతో పాటు టెక్నికల్ టీమ్, ఫీచర్ ఫిల్మ్, జాతీయ సమైక్యత చిత్రం, బాలల చలన చిత్ర విభాగం, హెరిటేజ్, చరిత్రపై తీసే చిత్రాలకు పురస్కారాలు అందజేశారు. గద్దర్ అవార్డుల కోసం అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు వస్తే.. వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్ వంటి తదితర విభాగాల్లో 76 దరఖాస్తులు వచ్చాయి. 2024 విజేతలు ఉత్తమ చిత్రం : కల్కీ 2898ఉత్తమ రెండో చిత్రం : పోటేల్ఉత్తమ మూడో చిత్రం: లక్కీ భాస్కర్ఉత్తమ బాలల చిత్రం : 35- చిన్న కథకాదుఉత్తమ ప్రజాదరణ చిత్రం - ఆయ్హిస్టరీ ఫీచర్ విభాగంలో ఉత్తమ హెరిటేజ్ చిత్రం- రజాకార్ ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప 2)ఉత్తమ నటి: నివేధా థామస్ ( 35 చిన్న కథ కాదు)ఉత్తమ దర్శకుడు: నాగ అశ్విన్ (కల్కి 2898 ఏ.డీ)ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ : యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)ఉత్తమ సంగీత దర్శకుడు :భీమ్స్ (రజాకార్)ఉత్తమ సహాయ నటుడు : ఎస్జే సూర్య (సరిపోదా శనివారం)ఉత్తమ సహాయ నటి: శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ : చంద్రశేఖర్ (గ్యాంగ్స్టర్ )ఉత్తమ కొరియోగ్రాఫర్ : గణేష్ ఆచార్య (దేవర)ఉత్తమ కమెడియన్: సత్య, వెన్నెల కిశోర్ (మత్తువదలరా 2)ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ : సిద్ శ్రీరామ్ (ఊరుపేరు భైరవకోన)ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్: శ్రేయ ఘోషాల్ (పుష్ప2/ సూసేకి అగ్గిరవ్వ)ఉత్తమ కథా రచయిత- శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత- వెంకి అట్లూరి (లక్కీ భాస్కర్)ఉత్తమ గేయ రచయిత- చంద్రబోస్ (రాజూ యాదవ్)ఉత్తమ సినిమాటోగ్రాఫర్- విశ్వనాథ్రెడ్డి (గామి)ఉత్తమ బాలనటులు- మాస్టర్ అరుణ్ దేవ్, బేబీ హారిక (35 చిన్న కథ కాదు)ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: నితిన్ జిహానీ చౌదరీ (కల్కి)ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: నల్ల శ్రీను (రజాకార్)ఉత్తమ కాస్టూమ్ డిజైనర్: అర్చనా రావు, అజయ్ కుమార్ (కల్కి) బెస్ట్ బుక్ ఆన్ సినిమా - మన సినిమా ఫస్ట్ రీల్ (రెంటాల జయదేవ్)స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ విజేతలు దుల్కర్ సల్మాన్: లక్కీ భాస్కర్అనన్య నాగళ్ల: పొట్టేల్దర్శకులు సూజిత్, సందీప్ (క) నిర్మాతలు ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ (రాజూ యాదవ్)స్పెషల్ జ్యూరీ : ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)

కాజోల్ హారర్ మూవీ.. వెన్నులో వణుకు పుట్టించేలా ట్రైలర్!
బాలీవుడ్ భామ కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం మా(Maa Movie). ఈ సినిమాకు విశాల్ రేవంతి ఫూరియా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై అజయ్ దేవగన్, జ్యోతి శాంతా సుబ్బరాయన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే ఈ మూవీ హారర్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో దెయ్యం సీన్స్ ఆడియన్స్కు వెన్నులో వణుకు పుట్టేలా ఉన్నయి. ట్రైలర్ ఆద్యంతం ఆడియన్స్లో అత్యంత ఉత్కంఠ పెంచేలా ఉంది. దెయ్యం బారిన పడిన తన కుమార్తెను కాపాడుకునేందుకు ఓ తల్లి చేసిన యుద్ధమే ఈ కథ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో తనూజ దేవ్గణ్, రోనిత్రాయ్, సుభద్ర సేన్గుప్త, ఇంద్రనీల్, జితిన్ జ్యోతి గులాటీ పాత్రలు పోషించారు. ఈ చిత్రం జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది.

'కేరళ క్రైమ్ ఫైల్స్ 2' ఆసక్తిగా తెలుగు ట్రైలర్
మలయాళంలో తెరకెక్కిన 'కేరళ క్రైమ్ ఫైల్స్: ది సెర్చ్ ఫర్ సీపీవో అంబిలి రాజు' (kerala crime files season 2) ట్రైలర్ విడుదలైంది. తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. 2023లో జియో హాట్స్టార్ వేదికగా 'కేరళ క్రైమ్ ఫైల్స్' వెబ్ సిరీస్కు సీక్వెల్గా దర్శకుడు అహ్మద్ కబీర్ తెరకెక్కించాడు. పార్ట్ 1లో ఒక్క మర్డర్ కేసుకు సంబంధించి చూపించి ఆపై పోలీసుల విచారణ సమయంలో మీడియా ఫోకస్, రాజకీయ జోక్యం అనేవి లేకుండా కథ చెప్పాడు. అలాంటి కేసును పోలీసులు సవాలుగా తీసుకుని ఎలా పూర్తి చేస్తారనేది చాలా ఆసక్తిగా చెప్పాడు. అప్పుడు ఓటీటీలో మంచి ఆదరణ రావడంతో మేకర్స్ సీక్వెల్ను ప్లాన్ చేశారు. ఇప్పుడు పార్ట్2 కూడా క్రైమ్ కథాంశంతోనే నిర్మించారు. అజు వర్గీస్, లాల్,నివాస్ వాలిక్కున్ను, జిన్జ్ షాన్, శ్రీజిత్ వంటి వారు ఇందులో నటించారు. త్వరలో విడుదల కానున్నట్లు ప్రకటించారు.

ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హారర్ చిత్రాలకు ఓటీటీలో మంచి ఆదరణ ఉంటుంది. థియేటర్స్లో ఆడని చిత్రాలు కూడా ఓటీటీలో హిట్ అవుతున్నాయి. అందుకే పలు ఓటీటీ సంస్థలు హారర్ చిత్రాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాయి. ఇక హారర్ థ్రిల్లర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించడంతో ఆహా ముందుంటుంది. ఇప్పటికే పలు తమిళ, మలయాళ హారర్ చిత్రలను తెలుగులో ప్రేక్షకుల ముందుకు తెచ్చిన ఆహా..మరోసారి బ్లాక్ బస్టర్ హారర్ చిత్రంతో అలరించేందుకు రెడీ అయింది. తమిళ్ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ "డీమన్"(Demon ) నేటి(మే 29) నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. రమేశ్ పళనీవేల్ దర్శకత్వంలో, నిర్మాత ఆర్. సోమసుందరం నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం, భవాని మీడియా ద్వారా Aha ఓటీటీలో ప్రసారం కానుంది. సచిన్ మణి , అబర్నతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో, సురుతి పేరియసామి, కుంకి అశ్విన్, రవీనా కీలక పాత్రల్లో అదరగొట్టారు. హారర్, సస్పెన్స్, ట్విస్ట్ లతో కూడిన కథనంతో డీమన్ ప్రేక్షకులను ఉర్రూతలూగించబోతున్నది. ఊహించని మలుపుతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. చిత్రానికి రోనీ రాఫెల్ అందించిన సంగీతం, ఆర్.ఎస్. ఆనందకుమార్ చేసిన ఛాయాగ్రహణం, రవికుమార్ ఎం. చేసిన ఎడిటింగ్ మరింత అద్భుతంగా తీర్చిదిద్దాయి.
న్యూస్ పాడ్కాస్ట్

మహానాడు నాటకం, చంద్రబాబు పాలన పచ్చిబూటకం... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఆంధ్రప్రదేశ్లో ఎకరం వంద రూపాయలకే మెడికల్ కాలేజీ లీజు... నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను బేరం పెట్టిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్లో దళిత, మైనారిటీ యువకులపై పోలీసుల బహిరంగ దాడి

ఆంధ్రప్రదేశ్లో సోలార్ విద్యుత్తు ప్లాంట్ పేరుతో రైతుల భూములు స్వాహా.... బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు తీసుకోవడానికి ప్రైవేట్ కంపెనీ ఎత్తుగడలు

అమరావతి నిర్మాణ పనుల్లో ముడుపుల దందా... భారీగా పెంచేసిన అంచనా వ్యయంపై ఇంజినీరింగ్ నిపుణుల విస్మయం.. ముఖ్య నేత జేబుల్లోకి కమీషన్ల సొమ్ము చేరుతున్నట్లు ఆరోపణలు

ఈశాన్య రాష్ట్రాల్లో అసాధారణ అభివృద్ధి జరుగుతోంది... అక్కడ పెట్టుబడులకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి... ‘రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

చంద్రబాబుదే మద్యం కుంభకోణం... గత ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అబద్ధపు వాంగ్మూలాలతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్... మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు సహా 27 మంది మృతి... ఇది అసాధారణ విజయం అంటూ స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ

హామీలు నెరవేర్చలేకే రెడ్బుక్ కుట్రలు... బరితెగించి తప్పుడు కేసులతో ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

సహ నిందితుల వాంగ్మూలం ఆధారమా?. బెయిల్ సమయంలో వారి వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోవడమా?
క్రీడలు

క్వాలిఫయర్-1.. ఆర్సీబీకి అదిరిపోయే న్యూస్
ఐపీఎల్-2025 క్వాలిఫయర్-1కు సర్వసిద్దమైంది. చంఢీగడ్లోని ముల్లాన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇరు జట్లు సమ ఉజ్జీలగా ఉండడంతో గెలుపు ఎవరిదో క్రికెట్ నిపుణులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. ఈ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి గుడ్న్యూస్ అందినట్లు తెలుస్తోంది.హాజిల్ వుడ్ రీ ఎంట్రీ?గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉన్న జోష్ హాజిల్వుడ్ తిరిగి ఆర్సీబీ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. భుజం నొప్పితో బాధపడుతున్న ఈ ఆసీస్ స్పీడ్ స్టార్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. రొమిరియో షెఫర్డ్ స్దానంలో ప్లేయింగ్ ఎలెవన్లోకి హాజిల్వుడ్ రానున్నట్లు ఆర్సీబీ వర్గాలు వెల్లడించాయి.హాజిల్వుడ్ తిరిగొస్తే బెంగళూరు బౌలింగ్ విభాగం మరింత పటిష్టం కానుంది. ఇప్పటికే భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారా వంటి స్పీడ్ స్టార్లు ఆర్సీబీ జట్టులో ఉన్నారు. మరోవైపు గత రెండు మ్యాచ్లలో ఇంప్టాక్ ప్లేయర్గా బరిలోకి దిగిన ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్ సైతం ఈ మ్యాచ్కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాడు. అయితే విధ్వంసకర ఆటగాడు టిమ్ డేవిడ్ మాత్రం ఈ మ్యాచ్లో కూడా ఆడేది అనుమానమే. డేవిడ్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. అతడు కోలుకోవడానికి మరి కొంత సమయం పడుతోంది.పంజాబ్తో మ్యాచ్కు ఆర్సీబీ తుది జట్టు(అంచనా)ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజిత్ పాటిదార్(కెప్టెన్), లివింగ్స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, యశ్ దయాల్, జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారాచదవండి: ENG vs IND: 'శ్రేయస్ ఏమి తప్పు చేశాడు.. కావాలనే ఎంపిక చేయలేదు'

వరల్డ్ బౌలింగ్ లీగ్లో కోహ్లి పెట్టుబడి..
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి... వరల్డ్ బౌలింగ్ లీగ్ (డబ్ల్యూబీఎల్)లో అడుగు పెడుతున్నాడు. ఇప్పటికే పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టిన కోహ్లి... డబ్ల్యూబీఎల్లో వ్యూహాత్మక పెట్టుబడిదారుడిగా మారాడు. డబ్ల్యూబీఎల్లో భాగంగా ఇటీవల తొలి జట్టు ఓఎమ్జీ ఫ్రాంచైజీని ప్రకటించింది.ఇప్పుడు తాజాగా క్రికెట్ సూపర్ స్టార్ కోహ్లి భాగస్వామ్యాన్ని బహిర్గతం చేసింది. ‘నేను 11 ఏళ్ల వయసులో బౌలింగ్ చేయడం ప్రారంభించా. 12 ఏళ్ల వయసు నుంచి బంతిని తిప్పేందుకు ప్రయతి్నస్తున్నా. ఈ లీగ్లో భాగస్వామి కావడం ఆనందంగా ఉంది. వ్యాపారాభివృద్ధి కోణంలోనూ ఇది మంచి అడుగు అనుకుంటున్నా. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొత్త క్రీడలను ప్రోత్సహించాల్సిందే. ఈ1 సిరీస్లో మా జట్టు పురోగతి చూస్తే ముచ్చటేస్తోంది. డబ్ల్యూబీఎల్ వ్యూహాత్మక పెట్టుబడి దారుడిగా, సహ యజమానిగా ఉండడం ఉత్సాహాన్నిస్తోంది’అని విరాట్ కోహ్లి వెల్లడించాడు.

'శ్రేయస్ ఏమి తప్పు చేశాడు.. కావాలనే ఎంపిక చేయలేదు'
ఐపీఎల్-2025 సీజన్ ముగిసిన వెంటనే భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఇంగ్లీష్ జట్టుతో టీమిండియా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత టెస్టు కెప్టెన్గా రోహిత్ శర్మ స్ధానంలో శుబ్మన్ గిల్ ఎంపికయ్యాడు. అదేవిధంగా టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్గా శుబ్మన్ గిల్ నియమితుడయ్యాడు. అయితే ఈ జట్టులో అద్బుతమైన ఫామ్లో ఉన్న మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.శ్రేయస్ అయ్యర్ స్థానంలో యువ ఆటగాడు సాయి సుదర్శన్కు సెలక్టర్లు చోటిచ్చారు. తాజాగా సెలక్టర్ల నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సుదర్శన్ బదులుగా అనుభవం ఉన్న అయ్యర్కు ఛాన్స్ ఇవ్వాల్సందని కైఫ్ అభిప్రాయపడ్డాడు."సాయి సుదర్శన్ ఒక అద్బుతమైన ఆటగాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఐపీఎల్ సీజన్లో బాగా రాణించడంతో అతడిని టెస్టు జట్టులోకి తీసుకున్నారు. అదే సమయంలో శ్రేయస్ అయ్యర్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. గత కొంతకాలంగా మూడు ఫార్మాట్లలోనూ అతడు నిలకడగా రాణిస్తున్నాడు. వన్డే ప్రపంచ కప్-2023, ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అయ్యర్ దాదాపు 550 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్లో కూడా అద్బుతంగా ఆడుతున్నాడు. కెప్టెన్గా అతడు విజయవంతమయ్యాడు. సుదర్శన్ను వైట్ క్రికెట్ ప్రదర్శన ఆధారంగా టెస్టు జట్టులోకి తీసుకున్నప్పుడు, మరి అయ్యర్ విషయంలో ఏమైందని" సెలక్టర్లపై కైఫ్ మండిపడ్డాడు.ఇంగ్లండ్ టూర్కు భారత జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేడా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుదంర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్

సిక్స్ బాదాడని బ్యాటర్ను కొట్టిన బౌలర్! వీడియో వైరల్
మిర్పూర్ వేదికగా దక్షిణాఫ్రికా-ఈ, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్లో వివాదం చెలరేగింది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ షెప్టో తులి జెంటల్మేన్ గేమ్కు మాయని మచ్చ తీసుకొచ్చేలా ప్రవర్తించాడు. క్రికెట్లో చిన్న చిన్న గొడవలు సాధారణంగా మనం చూస్తూ ఉంటాము.కానీ ఈ యువ బౌలర్ తులి మాత్రం ప్రత్యర్ధి బ్యాటర్ సిక్స్ బాదడని దాడికి దిగాడు. బంగ్లా ఇన్నింగ్స్ 105వ ఓవర్ వేసిన తులి బౌలింగ్లో తొలి బంతిని రిపోన్ మోండోల్ స్ట్రైయిట్గా సిక్సర్ బాదాడు. దీంతో సహనాన్ని కోల్పోయిన సఫారీ బౌలర్.. రిపోన్తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో అతడి వద్దకు వెళ్లి చేయి చేసుకున్నాడు.రిపోన్ కూడా తిరగబడడంతో గొడం పెద్దదైంది. ఇద్దరు ఆటగాళ్ళు ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో అంపైర్లు, సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో గొడవసద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. క్రిక్ ఇనో ఫో రిపోర్ట్ ప్రకారం.. ఈ ఇద్దరి ఆటగాళ్లపై మ్యాచ్ రిఫరీ క్రికెట్ సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులకు తన నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరిపై వారి క్రికెట్ బోర్డు సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశముంది.I have never seen such an incident in the history of cricket. A direct fight. What a shameful incident of cricket happened between the talented bowler Shepo Ntuli of South Africa and Ripon Mondal of Bangladesh. This is extreme. #BANevsSAe #CricketTwitter #Bangladesh #SouthAfrica pic.twitter.com/3CbMTHwUEA— Monirul Ibna Rabjal 🇧🇩🇪🇺 (@to2monirul) May 28, 2025
బిజినెస్

సిక్ లీవ్ పెట్టి కూర్గ్లో ఎంజాయ్... ఎలా దొరికాడో చూడండి..
సాధారణంగా వీకెండ్ ఎప్పడొస్తుందా అని ఉద్యోగులు ఎదురు చూస్తుంటారు. ఆ వీకెండ్కు ముందో.. వెనకో మరో సెలవు తోడైతే ఎక్కడికైనా ట్రిప్ వేసి ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ కొందరైతే ఇందుకోసం సిక్ లీవ్లను దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాగే బెంగళూరుకు చెందిన ఓ ఉద్యోగి కూడా ఎక్కువ రోజులు వారాంతాన్ని ఆస్వాదించేందుకు సిక్ లీవ్ పేరుతో నాటకమాడాడు. కానీ దొరికిపోయాడు. అతను ఎలా దొరికిపోయాడు.. ఆ తర్వాత ఏమైంది.. చదవండి...తన వీకెండ్ ట్రిప్ గురించి ఓ రెడిట్ యూజర్ ఇటీవల ఒక పోస్ట్ పెట్టాడు. ఒంట్లో బాగోలేదని చెప్పి శుక్రవారం సిక్ లీవ్ పెట్టి స్నేహితులతో కలిసి కూర్గ్ వెళ్లాడు. అక్కడ వీకెండ్ అంతా ఎంజాయ్ చేసి సోమవారం ఏమీ తెలియనట్టుగా తిరిగి విధుల్లో చేరాడు. కానీ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన ఓ వీడియో అతన్ని పట్టించింది. ‘గత నెలలో శుక్రవారం సెలవు పెట్టి కూర్గ్ వెళ్లాను. కడుపులో ఇన్ఫెక్షన్ (స్టమక్ ఫ్లూ) అని మా మేనేజర్కు చెప్పాను. అక్కడ హోమ్ స్టేలో ఓ వ్యక్తి డ్యాన్స్ చేసిన వీడియో రీల్ వైరల్ అయింది. అందులో బ్యాక్గ్రౌండ్లో నేనున్నాను. అలా దొరికిపోయాను’ అంటూ చెప్పుకొచ్చాడు.తర్వాత ఏమైందంటే..‘సోమవారం మా స్కిప్ లెవల్ మేనేజర్ ఓ రీల్ లింక్ పంపించారు. ‘ఇప్పుడు నీ కడుపులో ఇన్ఫెక్షన్ బాగైందనుకుంటాను’ అని దానికి జోడించారు. సిక్ లీవ్ ఫేక్ చేసి అలా దొరికిపోయాను. దేవుడి దయ వల్ల ఉద్యోగం పోలేదు. కానీ అప్పటి నుండి ఒక్క వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్వెస్ట్ కూడా అప్రూవ్ చేయలేదు. ఇప్పుడు ఆయన నన్ను నమ్మడం లేదు' అని ఆ పోస్టులో పేర్కొన్నారు. వైరల్గా మారిన ఈ రెడిట్ పోస్ట్కు యూజర్లు విశేషంగా ప్రతిస్పందించారు. ‘భలే నవ్వు తెప్పిస్తోంది’.. అని ఒకరు కామెంట్ చేయగా ‘వెంటనే ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేయాలి’ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు.

‘రూ.50 లక్షలు సంపాదించాను.. ఏం చేయాలి..?’
నా వయస్సు 55 సంవత్సరాలు. నేను వివిధ పెట్టుబడి మార్గాల ద్వారా రూ.50 లక్షలు సంపాదించాను. బ్యాంకు డిపాజిట్ రేట్లు పడిపోవడం, మార్కెట్లు అస్థిరంగా ఉన్నందున ఈ నిధులను పెట్టుబడి పెట్టడానికి సురక్షితమైన మార్గం ఏమిటి? ఈ ఏకమొత్తం ద్వారా కనీసం ఐదేళ్లలో ఎంత సంపాదిస్తాను? దినేశ్, విజయవాడమీ వయసురీత్యా సంపద భద్రంగా ఉండాలంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం మేలు. అయితే ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడిని సృష్టించడానికి ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది కొంత రిస్క్తో కూడిన అంశమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ వయసు, ఐదేళ్ల టైమ్ పరిధిని దృష్టిలో ఉంచుకుని, కొంత రిస్క్ తీసుకోవడానికి అంగీకరిస్తే ఈక్విటీలో 25-30% రాబడితో ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ (హైబ్రిడ్ ఫండ్స్) లో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణించవచ్చు. తక్కువ అస్థిరతతో ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను పొందేందుకు ఈ ఫండ్లు సహాయపడతాయి. ఈక్విటీ పొదుపు ఫండ్లను పన్ను ప్రయోజనాల కోసం పరిశీలించవచ్చు.ఇదీ చదవండి: కోటీశ్వరుల స్వర్గధామంవీటన్నింటికంటే ముందు మీ వయసురీత్యా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు ఆరోగ్యబీమా పథకం తీసుకోనట్లయితే వెంటనే ఆర్థిక సలహాదారున్ని సంప్రదించి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే ఏదైనా అనుకోని అనారోగ్య సమస్యలు తలెత్తితే మీ సంపద అంతా హరించుకుపోతుంది.

ఇళ్ల కొనుగోళ్లపై ఆసక్తి ఎక్కడ ఎక్కువంటే..
దేశవ్యాప్తంగా ఆస్తుల కొనుగోళ్లపై ఆసక్తి పెరుగుతోందని నైట్ ఫ్రాంక్ తెలిపింది. ఇటీవల సంస్థ నిర్వహించిన ‘బియాండ్ బ్రిక్స్-ది పల్స్ ఆఫ్ హోమ్ బైయింగ్’ సర్వేలో భాగంగా దేశంలో ఇళ్ల కొనుగోలుపై విభిన్న వర్గాల ప్రజల ఆసక్తులు ఎలా ఉన్నాయో తెలియజేసింది. చెన్నై (86 శాతం), ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (85 శాతం), అహ్మదాబాద్ (83 శాతం) ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సర్వేలో పేర్కొంది.సర్వేలోని వివరాల ప్రకారం ఢిల్లీ-ఎన్సీఆర్లోని గృహ కొనుగోలుదారులు నిర్మాణంలో ఉన్న ఆస్తుల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. బెంగళూరులో ఆ ఆస్తుల పెట్టుబడులపై దృష్టి సారిస్తున్నారు. ఇళ్ల కొనుగోళ్లకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అంశాల్లో ఆరోగ్య సదుపాయాలు, విద్యా సౌకర్యాల అందుబాటుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ అంశంలో హైదరాబాద్ (81 శాతం), కోల్కతా (80 శాతం) దీర్ఘకాలిక భద్రతా కారణాల దృష్ట్యా బలమైన కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు.ఇదీ చదవండి: కోటీశ్వరుల స్వర్గధామందేశంలోని టాప్ 8 టైర్-1 నగరాల్లోని 1,629 మంది పట్టణ గృహ కొనుగోలుదారుల నుంచి వివరాలు సేకరించి ఈమేరకు నివేదిక రూపొందించారు. ఈ సర్వేలో మిలీనియల్స్, అధిక ఆదాయ వ్యక్తులు అత్యంత చురుకైన కొనుగోలుదారులుగా ఉన్నారని తేలింది. నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ మాట్లాడుతూ.. కొవిడ్19 అనంతర కాలంలో నివాస డిమాండ్ గణనీయంగా పెరిగిందని అన్నారు. ఆర్బీఐ రెపో రేటు తగ్గింపు, స్టాంప్ డ్యూటీ రిబేట్లు వంటివి కొనుగోలుదారులకు కలిసి వస్తున్నాయని తెలిపారు. మారుతున్న జీవనశైలి, యువ కొనుగోలుదారుల్లో పెరిగిన ఆర్థిక సామర్థ్యం భారత రెసిడెన్షియల్ మార్కెట్ను పెంచుతోందని చెప్పారు.

మైక్రోసాఫ్ట్, యోటా జట్టు.. ఏఐ వినియోగానికి మరింత జోరు
న్యూఢిల్లీ: భారత్లో కృత్రిమ మేథని (ఏఐ) మరింతగా వినియోగంలోకి తెచ్చే దిశగా మైక్రోసాఫ్ట్, యోటా డేటా సర్వీసెస్ చేతులు కలిపాయి. ఈ ఒప్పందం ప్రకారం యోటా ఏఐ క్లౌడ్ ప్లాట్ఫాం అయిన శక్తి క్లౌడ్లో మైక్రోసాఫ్ట్ తమ అజూర్ ఏఐ సర్వీసులను అందుబాటులోకి తెస్తుంది.దీంతో డెవలపర్లు, స్టార్టప్లు, కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇండియాఏఐ మిషన్లో భాగమైన సంస్థలకు అధునాతన సేవలు అందుబాటులోకి వస్తాయి. దేశీయంగా కృత్రిమ మేథ సామర్థ్యాలను పెంపొందించడం, నవకల్పనలను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాలను పటిష్టపర్చడం ద్వారా ఇండియాఏఐ మిషన్ లక్ష్యాల సాధనకు కూడా మైక్రోసాఫ్ట్–యోటా భాగస్వామ్యం తోడ్పడనుంది.👉ఇదీ చదవండి: టీసీఎస్లో భారీగా ఏఐ ఏజెంట్లు..ఇండియాఏఐ మిషన్ అనేది దేశంలోని కృత్రిమ మేధ వ్యవస్థను బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ చొరవ. ఏఐ ఇన్నోవేషన్ ను ప్రోత్సహించడం, స్వదేశీ ఏఐ మోడళ్లను అభివృద్ధి చేయడం, పటిష్టమైన ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను సృష్టించడం ఈ మిషన్ లక్ష్యం. దేశీ ఏఐ మోడల్స్ను రూపొందించడానికి సంబంధించి 2025 మే నాటికి ఇండియాఏఐ మిషన్కు 500 పైగా ప్రతిపాదనలు వచ్చాయి.
ఫ్యామిలీ

Tripuranthakam భూలోక కైలాస క్షేత్రం : త్రిపురాంతకేశ్వరాలయం
శ్రీశైల(Srisailam) పుణ్యక్షేత్రం కంటే అతి పురాతనమైందిగా ప్రసిద్ధి చెందిన మహా శైవధామమే త్రిపురాంతకం (Tripuranthakam). త్రిపురాంతకేశ్వరస్వామి, బాలా త్రిపుర సుందరి అమ్మవార్లు కొలువు దీరిన ఈ క్షేత్రం ప్రశాంతతకు పుట్టినిల్లుగా, ప్రకృతి అందాలకు నెలవుగా విరాజిల్లుతోంది. అలాంటి ఈ క్షేత్రం ప్రకాశం, కర్నూలు జిల్లాల సరిహద్దుల్లో ఉంది. ఓ అద్వితీయమైన ఆధ్యాత్మికానుభూతిని సొంతం చేసే త్రిపురాంతకంలో ప్రధాన ఆలయం త్రిపురాంత కేశ్వరస్వామి వారి ఆలయం. శ్రీశైల ద్వారాలలో ప్రథమం, ప్రధానమైనదిగా ఉన్న ఈ క్షేత్రం శ్రీశైల క్షేత్రానికి తూర్పుద్వారంగా విరాజిల్లుతోంది. శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారికి అధిష్ఠాన దేవత అయిన బాలాత్రిపురసుందరి కూడా ఈ క్షేత్రంలోనే కొలువుదీరి ఉంది.కుమారగిరి పర్వతంపై ఉన్న ఈ ఆలయం ప్రకృతి అందాలకు, ప్రశాంతతకు నెలవు. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి మెట్లతోపాటు ఘాట్రోడ్డు సదుపాయం ఉంది. ఆలయానికి వెళ్లే మార్గంలో వందలకొద్దీ శివలింగాలు దర్శనమిచ్చి ఇది భూలోక కైలాసమా అనే అనుభూతిని భక్తులకు కలిగిస్తాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయం శ్రీచక్రంపై నిర్మితమైంది. మది పులకించే సుందర మండపాలు, శిల్పాలు, మందిరాలతో ఈ ఆలయం అలరారుతుంది.పురాణగాథ: విఘ్నేశ్వరునికి విఘ్నాధిపత్యం ఇచ్చిన తర్వాత కుమారస్వామి మనసు కలతచెంది కైలాసం వీడాడని, అలా కైలాసం వీడిన కుమారస్వామి త్రిపురాంతకానికి సమీపం లో గల కొండపై తపస్సు చేశాడట. అతని తపస్సుకు మెచ్చిన పార్వతీపరమేశ్వరులు ఆనాటినుంచి అక్కడ కొలువై ఉంటామని వరమిచ్చారని ఇక్కడ స్థలపురాణ కథనం. దీనివల్లే ఈ క్షేత్రానికి కుమారగిరి అని పేరు వచ్చినట్టు తెలుస్తుంది.త్రిపురాసుర సంహారం జరిగిన క్షేత్రంత్రిపురాసుర సంహారం ఈ క్షేత్రంలోనే జరగడంవల్ల దీనికి త్రిపురాంతకమనే పేరు వచ్చింది. త్రిపురాంతకం సిద్ధ క్షేత్రం. అనేక యోగులు, సిద్ధులు తాంత్రికులకు ఆవాస భూమిగా ఉన్నది ఈ క్షేత్రం. అలాంటి మహిమగల ఈ దేవాలయ ధ్వజస్తంభాన్ని చూసినా పాపాలు పటాపంచలౌతాయని, త్రిపురాంతక నామ స్మరణం ముక్తిదాయకం అనిపార్వతీదేవికి స్వయంగా ఆ పరమ శివుడే చెప్పాడని అంటారు. ఇక్కడ కొలువుదీరిన మహాదేవుడు త్రిపురాంతకేశ్వరస్వామిగా నీరాజనాలను అందుకుంటున్నాడు. అణువణువు శివ నామస్మరణంతో మారుమోగే ఈ ఆలయ గర్భాలయంలో త్రిపురాంతకేశ్వరస్వామి లింగరూపంలో దర్శనమిస్తాడు.నాలుగు వైపులా నాలుగు ప్రధాన ద్వారాలుఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు ప్రధాన ద్వారాలున్నాయి. నాలుగు వైపులా కొండ పైకి మెట్ల మార్గాలున్నాయి. ప్రధానాలయం శ్రీ చక్రాకారంలో నిర్మించబడింది. శివాలయం ఈ ఆకారంలో నిర్మించటం చాలా అరుదు. అలాంటి అరుదైన దేవాలయం ఇది. శ్రీ చక్రం శివ యోర్వపుః’’అంటే శివపార్వతుల శరీరమే శ్రీ చక్రం. స్వామి ఉగ్రరూపం కనుక తూర్పుగ్రామాలు తగలబడి పోయాయట. అందుకే ఆ ద్వారాన్ని మూసేశారు. పక్కగా ఉన్న దారిగుండా వెళ్లి దర్శనం చేసుకోవాలి. అమ్మవారు పార్వతీమాత. ఆలయ ప్రాంగణంలో అపరాధీశ్వర స్వామి, లక్ష్మీ చెన్నకేశవస్వామి, చంద్రమౌళీశ్వరస్వామి, కుమారస్వామి, నగరేశ్వర స్వామి మందిరాలు దర్శనమిస్తాయి. ఆలయంలో ఒకపక్క అగస్త్య మహాముని నిర్మించాడని చెప్పబడుతున్న బిల్వ మార్గమొకటి ఉంది. దీనిని చీకటిగుహగా పిలుస్తారు. శ్రీశైల క్షేత్రానికి ఈ మార్గంగుండానే వెళ్లేవారని ప్రతీతి. ఇక్కడే ఉన్న మండపంలో అలనాటి శాసనాలు దర్శనమిస్తాయి. ఇక్కడే మరోపక్క గణపతి మండపం ఉంది. దీనికి సమీపంలోనే నవగ్రహాలయం ఉంది. ఇంకా ఈ ఆలయంలో విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, శృంగి, భృంగి, నందీశ్వరుడితోపాటు అనేక శివలింగాలు దర్శనమిస్తాయి.బాలా త్రిపుర సుందరీ ఆలయంత్రిపురాంతకేశ్వరస్వామి వారి ఆలయానికి కింద చెరువులో బాలాత్రిపురసుందరి మాత ఆలయం ఉంది. బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలో వృశ్చికేశ్వరాలయం, ΄ాపనాశనం దర్శనమిస్తాయి. ఇవి దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటికి కొంచెం ముందుకు వెళితే కదంబ వనం ఉంది. ఉజ్జయిని, కోల్కతా, కాశీలలో తప్ప మరెక్కడా ఈ కదంబ వృక్షాలు కనిపించవని చెబుతారు. అమ్మవారు కదంబ వనవాసిని కావడంవల్లనే ఇక్కడిలా కదంబవనం ఉందని భక్తులు చెబుతారు.త్రిపురాసుర సంహారంలో త్రిలోచనునికి వింటికి (విల్లు) త్రిపురసుందరి ధనువై రాక్షస సంహారం చేసింది. అక్కడే ఆదిపరాశక్తి అనుగ్రహం కొరకు చేసిన చిదగ్ని హోమగుండంలో, బాలత్రిపుర సుందరి అంతర్లీనం కావడం జరిగింది.శివతేజోమయం త్రిపురాంతక క్షేత్రంఈ క్షేత్రాన్ని సందర్శించి అమ్మవారిని, స్వామివారిని పూజిస్తే సకలైశ్వర్యాలు సిద్ధించడమే కాకుండా శివ కైవల్య ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. భూలోక కైలాసంగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో కోటికి పైగా శివలింగాలు, నూటికి పైగా జలాశయాలున్నాయని చెబుతారు. ప్రతి సోమ, శుక్రవారాలలో విశేష ఉత్సవాలు మహా శివరాత్రి నాడు కల్యాణోత్సవం వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు శ్రావణ మాసంలోప్రత్యేక ఉత్సవాలు కార్తీకంలో అభిషేకాలు సంతర్పణలు జరుగుతాయి.ఎక్కడ ఉంది: ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నుండి మార్కాపురం మీదుగా అలాగే గుంటూరు నుండి శ్రీశైలం వెళ్లు మార్గంలో ఈ త్రిపురాంతకం వెళ్లవచ్చును. – డి.వి.ఆర్

సాధుత్వానిదే పైచేయి
సత్వ రజ స్తమో గుణాలు సృష్టిలో ప్రధానంగా కనబడుతుంటాయి. సాధుత్వం సత్వగుణా నికీ, రాజసం రజోగుణానికీ, అజ్ఞానం తమో గుణానికీ ప్రతీకలు. అయితే సాధుత్వమే అన్నింటి కన్నా ఉత్తమం. అందుకు ఈ కథ ప్రతీక: ఉత్తర భారత దేశంలో ఒక సాధువు నదీతీరంలో ఆకులూ, అలములూ తింటూ తిరుగుతూ ఉంటాడు. విదేశీయుడైన ఒక రాజు ఆయన్ని చూసి జాలితో తన దేశం వస్తే కూడు, గూడు, గుడ్డతో పాటు సకల సౌకర్యాలూ సమకూర్చుతానని చెబు తాడు. దానికి సాధువు ఏమాత్రం ప్రలోభపడ కుండా ప్రశాంతంగా చిరునవ్వుతో ఆ ప్రతిపా దనను తిరస్కరించాడు. దీంతో రాజు అహం దెబ్బతిన్నది. అధికారం, ధనం, దర్పం ఉన్నవాడు కనుక క్రోధాంధుడయ్యాడు. తనకు తీరని అవమానం, తిరస్కారం కలిగినట్టు భావించి కోపంతో ‘ఇదిగో చంపేస్తా’నంటూ కత్తి పైకెత్తాడు. సాధువు ప్రసన్న వదనంతో ‘రాజా! అలాగే చంపుదువులే! కాని ఈ శరీరం నేను కాదే! దీనికి భిన్నంగా ఉన్న ఆత్మను చంపలేవు. అది ఆనంద స్వరూపం, నిత్యం, సత్యం. దాన్ని నేనెప్పుడూ అనుభవిస్తూ అదే నేనుగా అభేదంగా ఉంటున్నా. ఆత్మశక్తి నీవెరుగవు. దాన్ని నీవు జయించలేవు. ఈ శక్తి నీలోను, నీ కత్తిలోను, కనబడే ప్రతి వస్తువులోను అంతటా వ్యాపించి ఉంది. నీవు కూడా అదే అయి నప్పుడు, వేరే మరొకటి లేనప్పుడు, నీవు చంపగలిగింది ఏది?’ అని ప్రశ్నించాడు. రాజు పశ్చాత్తాపంతో క్షమించవలసిందిగా ప్రాధేయ పడ్డాడు. సాధువు వెంటనే అనుగ్రహించాడు. చూచారా! జ్ఞానసంపన్నులయిన సాధువుల ముందు కామక్రోధాల రాజసం ఏమైపోయిందో!

నైవేద్య ఫలాలు: దేవుడికి ఎలాంటి నైవేద్యం సమర్పించడం మంచిదంటే..
భగవంతుడికి ప్రతిఒక్కరూ తమ శక్తిమేర నైవేద్యాలు సమర్పిస్తారు. అయితే ఎలాంటి నైవేద్యం సమర్పిస్తే సత్వరం మన కోరికలు తీరుతాయో సవివరంగా తెలుసుకుందామా..!.కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం ) – భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి.అరటి పండు – భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండుని గుజ్జుగా చేసి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యం గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.నేరేడు పండు – శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరోగ్య వంతులు అవుతారు.ద్రాక్ష పండు – భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది.మామిడి పండు – దేవుడికి మామిడి పండుని నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యంగా పెట్టి అందరికి పంచి ఆ తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు.అంజూర పండు – భగవంతుడికి నైవేద్యం పెట్టిన అన్జురాపండును అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు.సపోటా పండు – సపోట పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంబంధ విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి.యాపిల్ పండు – భగవంతుడికి యపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్య్రం తొలగి ధనవంతులు అవుతారు.కమలా పండు – భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచి΄ోయిన పనులు సజావుగా పూర్తి అవుతాయి.పనసపండు – పనసపండుని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనం, రోగవిముక్తి కలిగి సుఖంగా ఉంటారు. (చదవండి: Rohini Karte 2025: ఈ సమ్మర్లో రోహిణి కార్తె లేనట్టేనా..? ఆ టైంలోనే రోళ్లు పగిలేలా ఎండలు పెరగడానికి రీజన్)

అందాల తారలు.. అందమైన హృదయాలు..
అందాన్ని దాటి అద్భుతమైన హృదయాన్ని చూడగలిగితే స్ఫూర్తినిచ్చే మనసులెన్నో, మనుషులెందరో..! దీనికి నిదర్శనంగా నిలిచింది నగరంలో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ వేదిక. రాష్ట్ర ప్రభుత్వం, మిస్ వరల్డ్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నగరంలో నిర్వహించిన హార్ట్ ఆఫ్ గోల్డ్ చారిటీ ఈవెంట్ దీనికి నిదర్శనంగా నిలిచింది. ప్రభుత్వ బాలసదన్ అనాథ పిల్లలకు సహకారం అందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఈ అనాథ చిన్నారులకు మేమున్నామంటూ పలకరించారు. ఒడిలో కూర్చోబెట్టుకుని ఆ చిన్నారుల చిట్టి పొట్టి పలుకులను ఆస్వాదించారు. (చదవండి: క'రెంట్' ట్రెండ్..అద్దెకు అ'డ్రెస్'..! ప్రీ వెడ్డింగ్ షూట్స్ నుంచి రీల్స్ వరకు..)వారితో ఆడారు, పాడారు, గుండెకు హత్తుకుని ఆతీ్మయత పంచారు. తారలు దిగివచ్చిన వేళ అంటూ సాగిన ఈ కార్యక్రమంలో దృష్టి లోపం ఉన్న, హెచ్ఐవీతో జీవిస్తున్న పలువురు చిన్నారులు కష్టాలను మర్చిపోయి మధుర స్మృతులను పొందారు. సిస్టర్ సిస్టర్ ఈ తెలుగు పాటకు అలా స్టెప్ వేయొద్దు, నన్ను చూడు ఇలా వెయ్యు అంటూ పసితనాన్ని, స్వచ్ఛతను మిస్ తారలకు చూపించారు. కార్యక్రమంలో మాజీ మిస్ వరల్డ్ క్రిస్టీనాతో పాటు మిస్ ఇండియా నందిని గుప్తా, వివిధ దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు పాల్గొన్నారు. (చదవండి: నందిని గెలిస్తే..నంబర్ వన్ మనమే..! అత్యధిక టైటిల్స్ గెలిచిన ఏకైక దేశంగా..)
ఫొటోలు


అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్ పెళ్లి ఎప్పుడంటే! (ఫొటోలు)


వైఎస్ రాజారెడ్డి శత జయంతి.. దివ్యాంగ చిన్నారులతో వైఎస్ జగన్ (ఫొటోలు)


కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు (ఫొటోలు)


#GaddarAwards2024 : గద్దర్ అవార్డులు-2024 (ఫొటోలు)


Miss world 2025 : ఆల్ ది బెస్ట్ మిస్ ఇండియా నందిని గుప్తా (ఫోటోలు)


ట్రంప్ చెప్పేదొకటి.. చేసేదొకటి! మస్క్కు మండింది (చిత్రాలు)


విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)


'సీతా పయనం' మూవీ టీజర్ విడుదల వేడుక (ఫొటోలు)


అనాథ పిల్లలతో ఆడి, పాడిన సుందరీమణులు..సెల్ఫీలు, వీడియోలు (ఫొటోలు)


జబర్దస్త్ ఐశ్వర్య నూతన గృహప్రవేశ వేడుక (ఫొటోలు)
అంతర్జాతీయం

కాటుక రంగులోకి కడలి!
ఆ చల్లని సముద్రగర్భం.. అంటూ సాగే దాశరథి పాట వినే ఉంటారు. ఇప్పుడు ఆ నల్లని సముద్రం అని కూడా పాడుకోవాలేమో. ప్రపంచవ్యాప్తంగా భూమినంతటినీ చుట్టేసిన సాగరజలం నెమ్మదిగా నీలి రంగు నుంచి నలుపు వర్ణంలోకి మారిపోతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ధరణిపై దాదాపు 71 శాతం ఉపరితలాన్ని సముద్రజలాలే కప్పేస్తున్నాయి. అంటే భూమిపై దాదాపు 36.1 కోట్ల చదరపు కిలోమీటర్ల మేర సముద్రనీరే ఉంది. ఇందులో 21 శాతం అంటే 7 కోట్ల చదరపు కిలోమీటర్ల సముద్రజలాలు గతంలో ఎన్నడూలేనంతగా కొత్తగా నల్లగా మారిపోయాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ మార్పు కేవలం గత 20 సంవత్సరాల్లో జరిగిందని గణాంకాలు స్పష్టంచేశాయి. సంబంధిత వివరాలు గ్లోబల్ చేంజ్ బయోలజీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. సముద్రజలాలు నలుపు రంగులోకి మారడంతో సూర్యరశ్శి సాగర జలాల్లోకి సులభంగా చొచ్చుకెళ్లడం సాధ్యపడట్లేదు. దీంతో సముద్ర ఉపరితల జలాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. కాంతిమయ పరిస్థితులే 90 శాతం సముద్రజీవుల మనుగడకు ప్రాణాధారం. సూర్యరశ్శి సముద్ర ఉపరితల జలాలపై కొంతమేరకే పరిమితమైతే ఎన్నో రకాల సముద్రజీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ఇంగ్లండ్లోని ప్లైమౌత్ విశ్వవిద్యాలయం, ప్లైమౌత్ మెరైన్ లేబొరేటరీలోని అధ్యయనకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 2003 ఏడాది నుంచి 2022 ఏడాది దాకా అంతర్జాతీయంగా పలు ఉపగ్రహాల నుంచి సేకరించిన డేటాను సంఖ్యాశాస్త్ర నమూనాలతో సరిపోల్చి ఈ విపరిణామాన్ని కనుగొన్నారు. వేడినిచ్చే సూర్యకాంతితోపాటు చల్లని వెలుతురునిచ్చే చంద్రకాంతి సైతం పరోక్షంగా సముద్రజీవుల జీవవైవిధ్యాన్ని కాపాడుతుంది. లోతైన సముద్రజలాలతోపాటు తీరం వెంట జీవుల ఉనికికీ ఈ రెండు కాంతులూ ముఖ్యమే. భారీగా తగ్గిన కాంతి లోతు అలజడులు లేని, ప్రశాంతంగా ఉన్న సముద్రజలాల్లో తేటగా ఉన్న సందర్భాల్లో సూర్యకాంతి చాలాలోతుదాకా వెళ్లగలదు. కానీ గత 20 ఏళ్లలో గమనిస్తే ఆఫ్రికా ఖండం అంత పరిమాణంలో అంటే 9 శాతం సముద్రజలాల్లో సూర్యకాంతి చొచ్చుకెళ్లే ప్రాంతాలు బాగా తగ్గిపోయాయి. ఇక్కడ గతంతో పోలిస్తే సూర్యకాంతి 50 మీటర్లు తక్కువలోతుకే వెళ్లగల్గుతోంది. మరో 2.6 శాతం సముద్రజలాల్లో సూర్యకాంతి వెళ్లగలిగే లోతు ఏకంగా 100 మీటర్లు తగ్గిపోయింది. అయితే ఒక 10 శాతం సముద్రజలాల్లో మాత్రం గతంలో కంటే ఎక్కువ లోతులకు సూర్యకాంతి చొరబడగల్గుతోంది. సూర్యకాంతిలోనే మనగలిగే సముద్రజీవులు చాలా ఉంటాయి. ఎన్నో రకాల జలచరాల ఉనికి, పునరుత్పత్తి, ఆహారానికి ప్రత్యక్షంగా సూర్యకాంతి అత్యావశ్యకం. ‘‘కొన్ని చోట్ల సూర్యకాంతి లభ్యత తగ్గిపోవడంతో వేరే చోట్లకు జీవులు వలసపోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇది ఆయా జీవావరణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది’’అని ప్లైమౌత్ విశ్వవిద్యాలయంలోని సముద్ర సంరక్షణ విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ థామస్ డెవిస్ చెప్పారు.నల్లగా ఎందుకు మారుతోంది?పర్యావరణానికి సంబంధించి ఎన్ని దేశాల్లో ఎన్నెన్నో కఠిన చట్టాలున్నా అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను ఆయా సంస్థలు గుట్టుచప్పుడుకాకుండా నేరుగా నదుల్లో పారబోస్తున్నాయి. గరళంగా మారిన నదీజలాలు నేరుగా సముద్రాల్లో కలుస్తున్నాయి. వీటికి వ్యవసాయ వ్యర్థాలూ తోడవుతున్నాయి. వీటితో పోషణ సంబంధ మూలకాలు సముద్రంలోకి పోటెత్తుతున్నాయి. ఈ పోషకాలను సంగ్రహించిన నాచు వంటి అతిసూక్ష్మ మొక్కలు సముద్ర ఉపరితల జలాలపై ఏపుగా పెరుగుతున్నాయి. గనుల తవ్వకం తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలను వర్షపు నీరు నదుల ద్వారా సముద్రాల్లోకి కొట్టుకొచ్చేలా చేస్తోంది. ఇవికాక సూర్యకిరణాలను అడ్డుకునే జీవజాలం సముద్రఉపరితలంపై మరింతగా పేరుకుపోతోంది. ఇవన్నీ కలగలిసి సాగరాలను కాంతిహీనం చేస్తున్నాయి. అలా అవి నల్లరంగులోకి మారిపోతున్నాయి. శైశవాల పెరుగుదల, భూతాపోన్నతి కారణంగా అధికమవుతున్న సముద్రజలాల ఉపరితల ఉష్ణోగ్రత సైతం తమ వంతుగా ఈ దుష్ప్రభావానికి ఆజ్యం పోస్తున్నాయి.మత్స్య పరిశ్రమకూ పెనుముప్పు లోతైన సముద్రాల వద్ద సూర్యకాంతి తగ్గిపోయి ఆహార లభ్యత కృశించిపోవడంతో దిక్కులేక పలు రకాల జలచరాలు తీరాలకు చేరి అక్కడి జీవులతో కలిసి ఆహారం కోసం పోటీపడుతున్నాయి. దీంతో ఆయా జీవుల ఆహార వనరుల కొరత ఏర్పడుతుంది. సముద్రచేపలు, రొయ్యలు, ఇతర జలచరాల లభ్యత తగ్గిపోయే వీలుంది. దీని ప్రభావం భవిష్యత్తులో అన్ని సముద్రతీర దేశాల మత్స్య పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. ‘‘లోతైన సముద్ర ప్రాంతాల్లో సూర్యకాంతి చొచ్చుకుపోయే సామర్థ్యం మరో 50 మీటర్లు తగ్గిపోతే అక్కడి జీవులు తమ ఆవాసాలను సముద్రతీరాలకు మార్చుకుంటాయి. అప్పుడు యావత్ సాగర జీవావరణ వ్యవస్థలో శాశ్వత మార్పులు సంభవించే ప్రమాదం దాపురిస్తుంది’’అని ప్లైమౌత్ మెరైన్ లే»ొరేటరీలో ప్రొఫెసర్ టిమ్ స్మిత్ విశ్లేíÙంచారు. ‘‘సముద్రాల్లో సూర్యకిరణాలు లోపలికి వెళ్లలేకపోతే మనకొచ్చే నష్టమేమీ లేదని నింపాదిగా కూర్చునే కాలం కాదిది. ప్రభుత్వాలు తక్షణం మేల్కొనాలి. సముద్రాల్లోకి చేరే నదీజలాలు వీలైనంత వరకు పారిశ్రామిక వ్యర్థాలకు ఆవాసంగా మారకుండా చూసుకోవాలి. మురుగునీటి శుద్ధి కర్మాగారాల వ్యవస్థను మరింత పటిష్టంగా అమలుచేయాలి. వ్యర్థాల పారబోతపై పరిశ్రమలపై భారీ జరిమానాలు విధించాలి’’అని ఆయన అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్

హమాస్ నేత సిన్వార్ హతం
డెయిర్ అల్ బాలాహ్ (గాజా స్ట్రిప్): గాజాలో హమాస్కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ సాయుధ సంస్థ సీనియర్ నాయకుడు మొహమ్మద్ సిన్వార్ ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హతమయ్యారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ బుధవారం పార్లమెంట్లో ఈ మేరకు ప్రకటించారు. హమాస్కు గతంలో అత్యంత కీలక నేతగా నిలిచిన యాహ్యా సిన్వార్ తమ్ముడే మొహమ్మద్. యాహ్యా గతేడాది ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించారు. 🚨 | JUST IN: Israeli PM Benjamin Netanyahu CONFIRMS the elimination of 3 top Hamas leaders -- Mohammed Deif, Yahya Sinwar, and Mohammed Sinwar.Terrorism isn't managed it’s erased.This is what real leadership looks like when evil shows its face. 🇮🇱🔥 pic.twitter.com/h1PsuLBarY— Hank™ (@HANKonX) May 28, 20252023 అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ శివారు గ్రామాలపై హమాస్ మెరుపుదాడి ఘటన సూత్రధారుల్లో యాహ్యా ఒకరని ఇజ్రాయెల్ ఆరోపించడం తెల్సిందే. యాహ్యా అనంతరం ఆయన బాధ్యతలను మొహమ్మదే చూసుకుంటున్నారు. సిన్వార్ సొంతపట్టణమైన ఖాన్ యూనిస్పై మే 13న ఇజ్రాయెల్ భారీగా బాంబు దాడులు చేసింది. ‘‘వాటి ధాటికి స్థానిక యూరోపియన్ ఆస్పత్రి భూగర్భంలోని హమాస్ కమాండ్ సెంటర్ నాశనమైంది. అందులో ఉన్న సిన్వార్ చనిపోయాడు’’ అని సైన్యం చెబుతోంది. సిన్వార్ మరణాన్ని హమాస్ ధ్రువీకరించలేదు. అయితే మే 13 నాటి దాడిలో ఆరుగురు చనిపోయారని, 40 మంది గాయపడ్డారని గాజా ప్రభుత్వం అప్పుడే ప్రకటించింది.

Rachel Gupta: అందాల రాణికి బిగ్ షాక్
మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 రాచెల్ గుప్తాకు బిగ్ షాక్ తగిలింది. ఆమె తన టైటిల్ను వదులుకుంటున్నట్లు ప్రకటన చేసింది. అయితే ఈలోపు నిర్వాహకులే ఆమెను టైటిల్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు.న్యూఢిల్లీ/బ్యాంకాక్: ఇండియన్ మోడల్ రాచెల్ గుప్తా(Rachel Gupta) ఇన్స్టాగ్రామ్లో సంచలన పోస్ట్ చేశారు. విషపూరితమైన వాతావరణంలో తాను ఇంతకాలం ఉన్నానని, ఇక మౌనంగా భరించడం తన వల్ల కాదని, రాజీనామా నిర్ణయం కష్టమే అయినా తప్పట్లేదని, ఇంతకాలం తనకు మద్దతుగా నిలిచిన వాళ్లను నిరుత్సాహపరుస్తున్నందుకు క్షమించాలని ఓ పోస్ట్ చేశారు. ‘‘‘వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయి’’ అంటూ త్వరలో ఓ వీడియో ద్వారా పూర్తి వివరాలను వెల్లడిస్తానని అన్నారామె.అయితే ఈలోపు మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ (MGI) నిర్వాహకులు ఆమె పోస్టునకు పూర్తి విరుద్ధంగా స్పందించారు. గుప్తాను అధికారికంగా తొలగిస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఆమె తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేశారని, సొంత వ్యవహారాలకు ప్రాధాన్యం ఇచ్చారని, గ్వాటెమాలా అధికారిక పర్యటనకు నిరాకరించార’’ని పేర్కొంది. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 టైటిల్ను తొలగిస్తున్నామని, 30 రోజుల్లో కిరీటం తమ కార్యాలయంలో అప్పగించాలని ఆమెను ఆదేశించారు. నిబంధనల ప్రకారం.. ఫిలిప్పీన్స్కి చెందిన సీజే ఓపియాజాకు కిరీటం వెళ్లే అవకాశాలు ఉన్నాయిపంజాబ్ జలంధర్కు చెందిన 21 ఏళ్ల రాచెల్ గుప్తా కిందటి ఏడాది ఆగష్టులో మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్ దక్కించుకుంది. ఆపై అక్టోబర్ 25వ తేదీ బ్యాంకాక్లో జరిగిన పోటీల్లో 70 దేశాలకు చెందిన అందెగత్తెలను వెనక్కినెట్టి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ టైటిల్ను గెల్చుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సుందరిగా ఘనతకెక్కింది. ఇదీ చదవండి: తప్పతాగాడు.. టేబుల్ ఎక్కి నన్ను డ్యాన్స్ చేయమన్నాడు

‘నన్ను చంపి.. ఇక్కడే పాతిపెట్టండి’.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు!
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. గతేడాది బంగ్లాదేశ్లో విద్యార్థుల నిరసనలు తీవ్రం కావడంతో రాజీనామా చేసే ‘నన్ను కాల్చి చంపేయండి. ఈ గణబంధన్లోనే పాతి పెట్టండి’ అని ఆర్మీతో హసీనా అన్నట్లు తాజాగా వెల్లడైంది. దీంతో, ఆమె వ్యాఖ్యలపై కొత్త చర్చ మొదలైంది.వివరాల ప్రకారం.. గతేడాది బంగ్లాలో రాజకీయ అస్థిరత నెలకొన్న విషయం తెలిసిందే. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విద్యార్థుల నిరసనతో అప్రమత్తమైన ఆర్మీ.. ప్రధాని పదవికి రాజీనామా చేయాలని షేక్ హసీనాకు సూచించింది. ఆ సమయంలో వారితో హసీనా..‘నన్ను కాల్చి చంపేయండి.. ఇక్కడే ఈ గణబంధన్లోనే పాతి పెట్టండి’ అని అన్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్లో జరిగిన విచారణ సందర్భంగా చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తాజుల్ ఇస్లాం వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం కొత్త చర్చకు దారి తీశాయి. బంగ్లాదేశ్లో రాజకీయం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఇదిలా ఉండగా.. బంగ్లాలో వేలాది మంది నిరసనకారులు ఆందోళన కారణంగా ప్రజా ఉద్యమానికి జడసి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వీడారు. ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వయిజర్గా నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టారు. "Shoot me, bury me here, in Ganabhaban". These were the words of deposed Bangladeshi Prime Minister Sheikh Hasina on the fateful morning of August 5, 2024, as army officers asked her to resign amid violent student protests. Hasina eventually fled to India hours before protesters… pic.twitter.com/JzfwBtHUMp— India Today Global (@ITGGlobal) May 28, 2025
జాతీయం

క్షమాపణలు చెప్పను: కమల్ హాసన్
కన్నడ భాష వివాదం నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందించారు. తన వ్యాఖ్యలు ప్రేమతో చేసినవేనని, ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణలు చెప్పబోనంటూ స్పష్టం చేశారాయన. బుధవారం థగ్ లైఫ్ ఈవెంట్లో ఈ అంశంపై ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో తనను విమర్శించిన నేతలకూ ఆయన చురకలంటించారు. ‘‘ఈ ఇష్యూపై గందరగోళం నెలకొంది. అందుకే స్పష్టత ఇవ్వదల్చుకున్నా. చాలామంది చరిత్రకారులు(రాజకీయ నాయకులను ఉద్దేశించి ఎద్దేవా చేస్తూ..) నాకు భాష చరిత్ర గురించి పాఠాలు బోధిస్తున్నారు. కానీ, నాతో సహా రాజకీయ నాయకులెవరికీ భాష వ్యవహారంపై మాట్లాడే అర్హత లేదు. తమిళనాడు అరుదైన రాష్ట్రం. తమిళంతో పాటు మీనన్, రెడ్డి, అయ్యంగార్ ముఖ్యమంత్రులయ్యారు. చాలా కాలం కిందట కర్ణాటక నుంచి వచ్చి తమిళనాడుకు సీఎం అయిన వ్యక్తి నుంచి నాకు సమస్య ఎదురైంది. ఆ సమయంలో కర్ణాటక నాకు మద్దతు ఇచ్చింది. ఎక్కడికీ వెళ్లొద్దు.. ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకోండి అంటూ కన్నడ ప్రజలు ప్రేమ చూపించారు. కాబట్టి ఇప్పుడు కూడా థగ్ లైఫ్, కమల్ హాసన్ను ప్రజలే చూసుకుంటారు.#WATCH | Thiruvananthapuram, Kerala: On his recent remarks where he said, 'Kannada was born out of Tamil', MNM President and actor Kamal Haasan says, "... What I said was said out of love and a lot of historians have taught me language history. I didn't mean anything. Tamil Nadu… pic.twitter.com/YjW8qAUIB3— ANI (@ANI) May 28, 2025భాషా వ్యవహారం చాలా లోతైన అంశం. నాతో సహా ఏ రాజకీయ నాయకుడికి దాని గురించి మాట్లాడే అర్హత లేదు. కాబట్టి ఈ చర్చను భాషా నిపుణులు, చరిత్రకారులు, పురావస్తు శాఖ వాళ్లకు వదిలేయండి. శివన్న, ఆయన తండ్రి మీద ప్రేమతో ఒక కుటుంబ సభ్యుడిగా మాట్లాడిందే తప్ప అందులో మరే ఉద్దేశం లేదు. ప్రేమతోనే మాట్లాడినప్పుడు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. కాబట్టి ఆ పని చేయను’’ అని కమల్ అన్నారు. ఇటీవల చెన్నైలో తన చిత్రం థగ్ లైఫ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. కన్నడకు తమిళ భాష జన్మనిచ్చిందని శివరాజ్ కుమార్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై కన్నడ సంఘాల నాయకులు ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదు చేశారు. ‘కన్నడ- కస్తూరి’ అనే విషయాన్ని ఆ నటుడు మర్చిపోయినట్లు ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. రెండున్నర వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న భాషను కమల్ మర్చిపోయినట్లు ఉందని సీనియరు నటుడు జగ్గేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ నటించిన ‘థగ్ లైఫ్’ చిత్ర ప్రదర్శనను కర్ణాటకలో అడ్డుకుంటామని వివిధ సంఘాల నాయకులు ప్రకటించారు. ఆయనపై నిషేధం విధిస్తామని కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి ప్రతినిధులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ సీఎం యడియూరప్ప, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బి.వై.విజయేంద్ర, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి, కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు నారాయణ గౌడ తదితరులు కమల్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు.

Shashi Tharoor: లక్ష్మణ రేఖ దాటినా.. అనూహ్య మద్దతు
గత కొంత కాలంగా బీజేపీ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్(Shashi Tharoor).. ఎల్వోసీపై తాజాగా చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే తీవ్ర దుమారం రేపాయి. సొంత పార్టీ నేతలు ఆయన్ని తిట్టిపోస్తుంటే.. అనూహ్యంగా బీజేపీ నేతల నుంచి ఆయనకు మద్దతు లభిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.పార్టీ వైఖరికి భిన్నంగా శశి థరూర్(Shashi Tharoor) మాట్లాడుతున్నారని, ఒకరకంగా ఆయన ‘లక్ష్మణరేఖ’ను దాటారని పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారంటూ తాజాగా పీటీఐ వార్తాసంస్థ వెల్లడించింది. ఈ వివాదంలో కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ శశి థరూర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ప్రియమైన శశి థరూర్.. మిమ్మల్ని బీజేపీ సూపర్ అధికార ప్రతినిధిగా నియమించేలా ప్రధాని మోదీని ఒప్పించగలిగితే ఎంతో బాగుండేది. మీరు భారత్కు తిరిగి వచ్చేలోగానే మిమ్మల్ని విదేశాంగ మంత్రిగా ప్రకటించగలిగితే ఇంకా బాగుండేది. మోదీ ప్రధానమంత్రి కాక పూర్వం భారత్ ఆధీనరేఖను దాటిపోలేదని మీరన్నారు. తద్వారా కాంగ్రెస్ భవ్యచరిత్రను అప్రతిష్ఠపాలు చేశారు’’ అని ఉదిత్రాజ్ అన్నారు. ‘‘1965లో భారత్ పాకిస్థాన్లోని లాహోర్ సెక్టారులో పలుప్రాంతాల్లోకి చొచ్చుకుపోయింది. 1971లో భారత్ పాకిస్థాన్ను రెండుగా విడగొట్టింది. కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉండగా అనేక సర్జికల్ స్ట్రైక్లు(Surgical Strikes) నిర్వహించారు. అయితే ఆ విజయాల నుంచి రాజకీయ ప్రయోజనం పొందేందుకు అప్పట్లో డప్పు వాయించుకోలేదు’’ అని ఉదిత్రాజ్ పోస్ట్ చేశారు.My dear @ShashiTharoor Alas ! I could prevail upon PM Modi to declare you as super spokesperson of BJP , even declaring as foreign minister before landing in India . How could you denigrate the golden history of Congress by saying that before PM Modi , India never crossed LOC… https://t.co/c88b8rX2bq— Dr. Udit Raj (@Dr_Uditraj) May 28, 2025కాంగ్రెస్ నేత పవన్ఖేరా స్పందిస్తూ.. యూపీఏ హ యాంలో పాకిస్థాన్ మీద పలుమార్లు సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించామని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ స్వయంగా చెప్పిన వీడియోను శశి థరూర్కు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ అనేవి మోదీ ప్రధాని అయిన తర్వాతనే ప్రారంభం కాలేదని, గతంలోనూ అనేకసార్లు జరిగాయని, అయితే, దేశభద్రతకు సంబంధించిన అటువంటి సున్నిత సమాచారాన్ని తాము ఎన్నడూ రాజకీయ ప్రచారానికి వాడుకోలేదని అన్నారాయన.థరూర్ ఏమన్నారంటే.. ఐదు దేశాల్లో పర్యటిస్తున్న అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న శశి థరూర్ పనామాలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ గతంలో ఉగ్రదాడులను భారత్ భరిస్తూ వచ్చిందని, కానీ, ఇటీవలి కాలంలో మాత్రం దెబ్బకు దెబ్బ తీస్తోందని పేర్కొన్నారు. మోదీ హయాంలో జరిగిన ఉరీ(2016), పుల్వా మా, పహల్గాం ఉగ్రదాడులను ప్రస్తావిస్తూ.. ఈ దాడుల అనంతరం పాకిస్థాన్లోకి వెళ్లి మరీ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామని ప్రసంగించారు. బీజేపీ మద్దతుగా.. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, పాకిస్థాన్పై భారత వైఖరిని వివిధ దేశాలకు స్పష్టం చేసేందుకు కేంద్రం పంపిన అఖిలపక్ష పార్టీల ప్రతినిధి బృందంలో శశి థరూర్ సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్ ఆయన్ని పక్కనపెట్టినప్పటికీ.. కేంద్రం ఆయనకు అందులో చోటు ఇవ్వడం గమనార్హం. అయితే.. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే థరూర్పై దాడి జరుగుతోందని, దేశం కన్నా గాంధీ కుటుంబమే కాంగ్రెస్కు ముఖ్యమని బీజేపీ విమర్శించింది. అసలు కాంగ్రెస్ ఎవరికి మద్దతిస్తోంది? దేశం కోసం మాట్లాడటం ఆ పార్టీలో నిషేధమా? అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఏం కావాలి. వారికి దేశం పట్ల నిజంగా ఎంత శ్రద్ధ ఉంది?. భారత ఎంపీలు విదేశాలకు వెళ్లి భారత్కు, ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడాలని కోరుకుంటోందా?. రాజకీయ వైరాగ్యానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది’’ అని కిరణ్ రిజిజు ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. మరోవైపు.. What does the Congress party want & How much they really care for the country? Should the Indian MPs go to foreign nation and speak against India and its Prime Minister? There’s limit to political desperation! https://t.co/JiuYqpW2tN— Kiren Rijiju (@KirenRijiju) May 28, 2025బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా థరూర్కు మద్దతు పలికారు. "శశి థరూర్ గాంధీ కుటుంబానికి కాకుండా, దేశానికి ప్రథమ స్థానం ఇచ్చారు కాబట్టే ఆయనపై కాంగ్రెస్ దాడి చేస్తోంది. పార్టీ ప్రయోజనాల కన్నా జాతీయ ప్రయోజనాల గురించి, ఓటు బ్యాంకు రాజకీయాల కంటే జాతీయ విధానానికి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టే ఆయన లక్ష్యంగా మారారు" అని పూనావాలా పేర్కొన్నారు. "పాకిస్థాన్కు క్లీన్ చిట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎక్కువ ఆసక్తి చూపుతోంది. నేడు కాంగ్రెస్, పాకిస్థాన్ డీజీలా మాట్లాడుతూ సొంత నేతపైనే విమర్శలు చేస్తోంది" అని పూనావాలా ఘాటుగా వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: చీకటి ఆ కుటుంబాన్ని చిమ్మ చీకట్లోకి నెట్టేసింది!

‘పహల్గామ్’ ఎఫెక్ట్: అక్రమ నివాసితుల ఏరివేత
న్యూఢిల్లీ: భారత్లో అక్రమంగా తలదాచుకుంటున్న విదేశీయులపై ప్రభుత్వం నిఘా మరింతగా పెంచింది. జమ్ముకశ్మీర్(Jammu and Kashmir)లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన అనంతరం ఈ చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చి భారత్లో నివాసం కొనసాగిస్తున్న వారిపై సంబంధిత అధికారులు ఓ కన్నేసి ఉంచారు. వీరి చర్యలను గమనిస్తూ, నిందితులుగా తేలినవారిపై కొరఢా ఝుళిపిస్తున్నారు.మరోవైపు బంగ్లాదేశ్లో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి పరిస్థితుల్లో పలువులు బంగ్లాదేశీయులు అక్రమంగా భారత్కు తరలివచ్చి, ఇక్కడ తలదాచుకుంటున్నారు. గడచిన 6 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న 770 మంది బంగ్లాదేశీయులను వారి దేశానికి తరలించారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది మృతి చెందిన విషయం విదితమే. నాటి నుంచి ఇప్పటివరకూ పోలీసులు రాజధాని వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో 470 మంది బంగ్లాదేశ్ వలసదారులను, మరో 50 విదేశీయులను గుర్తించారు, వారిలో బంగ్లాదేశకు చెందిన వారిని అగర్తలాకు విమానంలో తరలించి, భారత భూ సరిహద్దు ద్వారా బంగ్లాదేశ్కు పంపించారు.బంగ్లాదేశ్(Bangladesh) నుంచి అక్రమంగా వచ్చిన వలసదారులను, రోహింగ్యాలను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ధృవీకరణ ప్రక్రియ చేపట్టాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించిందని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 2024, నవంబర్ 15, 2025 ఏప్రిల్ 20 మధ్య కాలంలో 220 మంది అక్రమ వలసదారులను, 30 మంది గడువు దాటి దేశంలోనే ఉంటున్న విదేశీయులను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారని సమాచారం. కాగా ‘పహల్గామ్’ ఘటన తర్వాత కొంత అత్యవసర పరిస్థితి ఏర్పడిందని, వెరిఫికేషన్ డ్రైవ్లు నిర్వహించి, బంగ్లాదేశ్ వలసదారులను, రోహింగ్యాలను అదుపులోకి తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు అందాయని పోలీసులు తెలిపారు. మరోవైపు బంగ్లాదేశ్, మయన్మార్ నుండి వచ్చిన అక్రమ వలసదారుల ఆధారాలను ధృవీకరించడానికి రాష్ట్రాలకు 30 రోజుల గడువు ఇచ్చారు. వారి పత్రాలు ధృవీకరణ పొందకపోతే వారిపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్రమ వలసదారుకు సౌకర్యాలు కల్పించి, వారు భారత్లో స్థిరపడటానికి ఏర్పాట్లు చేసిన వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశాయి.ఇది కూడా చదవండి: పాక్కు దమ్ము లేదు.. అందుకే ఉగ్రవాదులను పంపుతోంది: ప్రధాని మోదీ

ఒక్క చేత్తో చప్పట్లు కొట్టలేం
న్యూఢిల్లీ: ఒక్క చేత్తో చప్పట్లు కొట్టలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అత్యాచారానికి గురైనట్లు చెబుతున్న 40 ఏళ్ల మహిళ చిన్నపిల్ల కాదని పేర్కొంది. ఆమె అంగీకారంతోనే లైంగిక చర్య జరిగిట్లు పరోక్షంగా వెల్లడించింది. అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 23 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కు న్యాయస్థానం బుధవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అతడిని అరెస్టు చేసి, జైల్లో పెట్టి తొమ్మిది నెలలు గడుస్తున్నా పోలీసులు అభియోగాలు నమోదు చేయలేదని, అందుకే మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది. ఆ మహిళ ఆ యువకుడిని ఇష్టపూర్వకంగానే కలిస్తే అతడిపై రేప్ కేసు ఎలా నమోదు చేస్తారని ఢిల్లీ పోలీసులను జస్టిస్ బి.బి.నాగరత్న, జస్టిస్ సతీశ్చంద్ర శర్మతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఆమె అతడితో ఏడుసార్లు జమ్మూకశ్మీర్కు వెళ్లిందని, అతడిపై సెక్షన్ కింద 376 కింద కేసు పెట్టడం సరైంది కాదని పేర్కొంది. ఈ కేసులో సదరు మహిళ దుస్తుల వ్యాపారం చేస్తున్నారు. తమ దుస్తుల బ్రాండ్ ప్రచారం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన యువకుడిని సంప్రదించారు. క్రమంగా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తనను మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఆ మహిళ ఫిర్యాదు చేయగా, ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేశారు. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని యువకుడు కోరగా, ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దాంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు. సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. అయితే, బెయిల్పై బయట ఉన్నప్పుడు ఈ మహిళను కలవొద్దని షరతు విధించింది.
ఎన్ఆర్ఐ

అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణహత్య, షాకింగ్ రీజన్!
అమెరికాలోని టెక్సాస్లోని ఆస్టిన్లో ఒక పబ్లిక్ బస్సులో హెల్త్ స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు దారుణ హత్య విషాదాన్ని నింపింది. భారత సంతతి కి వ్యాపారవేత్త అక్షయ్ గుప్తా (30)ని తోటి భారతీయుడే పొడిచి చంపాడు. బస్సులో ప్రయాణిస్తున్న ఆయనపై అనూహ్యంతా కత్తితో విరుచుకు పడ్డాడు. దీంతో అక్షయ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.అక్షయ్ గుప్తా మే 14వ తేదీన ఆస్టిన్లోని ఒక బస్సులో ప్రయాణిస్తుండగా, బస్సు వెనుక సీట్లో కూర్చుని ఉన్నట్టుండి ఎటాక్ చేశాడు. వేట కొడవలి లాంటి కత్తాడో పొడిచి పారిపోయాడు. నిందితుడిని 31 ఏళ్ల దీపక్ కండేల్గా గురించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అక్షయ్ గుప్తాను వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది..గుప్తా సంఘటన స్థలంలోనే మరణించినట్లు ఆస్టిన్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది.అక్షయ్ గుప్తాకు, నిందితుడు దీపక్ కండేల్కు మధ్య ఎలాంటి ఘర్షణ కానీ, వాగ్వాదం కానీ జరగలేదనేది సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలుస్తోందని పోలీసులు తెలిపారు. అప్పటివరకు కామ్గా కూర్చున్న నిందుతుడు వేటకత్తితో బాధితుపై దాడి చేశాడన్నారు. ఫుటేజీ ఆధారంగా నిందితుడు కండేల్ను గుర్తించి అరెస్టు చేశారు. అతనిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.దీపక్ నేర చరిత్రస్థానిక మీడికా కథనం ప్రకారం, కాండెల్కు 2016 నుండి నేర చరిత్ర ఉంది. తీవ్రమైన నేరాలు సహా విస్తృతమైన అరెస్టు చరిత్ర ఉందని, కానీ ఎప్పుడూ విచారణ జరగలేదు. ప్రాసిక్యూటర్లు అతనిపై అనేకసార్లు కేసు నమోదు చేయడానికి నిరాకరించారని కోర్టు రికార్డుల ద్వారా తెలుస్తోంది. గతంలో 12 సార్లు అరెస్ట్ అయినట్టు సమాచారం. హత్యకు షాకింగ్ రీజన్అక్షయ్పై ఎటాక్ చేసిన కాండెల్ ఇతర ప్రయాణీకులతో కలిసి వాహనం నుండి దిగి వెళ్ళిపోయాడు. వెంటనే పెట్రోల్ అధికారులు కాండెల్ను పట్టుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తన మామను పోలి ఉండటం వల్ల గుప్తాను పొడిచి చంపినట్లు నిందితుడు అంగీకరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

వైఎస్సార్సీపీ గ్లోబల్ కనెక్ట్ సమావేశంలో ఆలూరు సాంబశివారెడ్డి
వైఎస్సార్సీపీపై అసత్య ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాను అడ్డుకుంటూ.. సోషల్ మీడియా ద్వారా వాస్తవాలను ప్రజలకు తెలియజేద్దామని ఆ పార్టీ ఎన్నారై గ్లోబల్ వింగ్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఆక్లాండ్ (న్యూజిలాండ్)లోని మౌంట్ రోస్కిల్ వార్ మెమోరియల్ హాల్లో గ్లోబల్ కనెక్ట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నారై సోషల్ మీడియా పోస్టింగ్లు.. ఇప్పుడు ప్రజలకు నిజం చెప్పే ఆయుధాలన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్పడంతో పాటు.. వైఎస్ జగన్ అందించిన సుపరిపాలన, నాయకత్వాన్ని ప్రపంచానికి తెలియజేయాలని సూచించారు. నిజం మాట్లాడే గొంతులుగా, అభివృద్ధిని ప్రదర్శించే వేదికలుగా ఎన్నారైలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ యెద్దుల, బుజ్జె బాబు నెల్లూరి, సమంత్ డేగపూడి, విజయ్ అల్లా, బాల శౌర్య, రాజా రెడ్డి, గీతారెడ్డి, సంకీర్త్ రెడ్డి, రమేశ్ పానాటి, జిమ్మీ, బాలవేణు బీరం, కృష్ణారెడ్డి, జగదీశ్వరరెడ్డి, రఘునాథరెడ్డి, గోవర్ధన్ మల్లెల తదితరులు పాల్గొన్నారు.మరిన్ని NRI వార్తల కోం ఇక్కడ క్లిక్ చేయండిచదవండి: మెట్రోలో ఇన్ఫ్లూయెన్సర్ సందడి మాములుగా లేదు! వీడియో వైరల్

యూకేలో ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకలు
లండన్: ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకల్లో భాగంగా బ్రిటన్ పార్లమెంట్ హాలులో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.. హౌస్ ఆఫ్ లార్డ్స్ గా పిలువబడే యూకే పార్లమెంట్ ఎగువ సభలో రోహాంప్టన్ విశ్వవిద్యాలయ చాన్సలర్, యూకే మాజీ మంత్రి బారోనెస్ వర్మ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిపారు.. ఈ కార్యక్రమానికి చిలీ, బెలిజ్ జపాన్ తదితర దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు, రాయబారులు, దౌత్యవేత్తలు హాజరయ్యారు.ఈ సందర్బంగా వివిధ దేశాలకు చెందిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ కళారూపాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా భారత్కు చెందిన కళాకారులు ప్రార్థన నృత్యం, మోహినీ అట్టం, కరగట్టం, మిథిలా, జిజియా నృత్యం, గోవా సాంగ్స్ తో అలరించారు. దీనిలో భాగంగా భారత మాజీ రాయభారి అభయకుమార్ రాసిన ఆన్ ఎర్త్ గీతానికి హైదరాబాద్కు చెందిన రాగసుధ వింజమూరి భరతనాట్యం ప్రదర్శించారు. ఇక చిలీ సంప్రదాయ నృత్యాన్ని డేనియల్ పెరెజ్ మున్స్టర్ ఆధ్వర్యంలో ఆ దేశ రాయబార కార్యాలయం అధికారులు ప్రదర్శించారు. దీనిలోభాగంగా బారోనెస్ వర్మ ప్రసంగిస్తూ.. సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడంతో పాటు, అందులో శాంతిని పెంపొందించడానికి దోహద పడే అంశాల గురించి ప్రస్తావించారు. ఇందుకు వివిధ దేశాలకు చెందిన భిన్న సంస్కృతులను ఏకతాటిపై తీసుకురావడానికి చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు. ఇది ప్రస్తుత సమాజంలో ఆహ్వానించదగ్గ పరిణామమని ఆమె స్పష్టం చేశారు.

డాక్టర్ సతీష్కు లైఫ్టైమ్ అచీవ్మెంట్ ఇన్ గ్లోబల్ హెల్త్ లీడర్షిప్ అవార్డు
ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ సతీష్ కత్తులకు మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇన్ గ్లోబల్ హెల్త్ లీడర్షిప్ అవార్డు-2025 వరించింది. అమెరికాలో గ్లోబల్ హెల్త్కేర్ లీడర్స్ ఫౌండేషన్ వార్షిక లీడర్షిప్ గాలా 2025 నిర్వహించింది. ఇందులో భాగంగా డాక్టర్ సతీష్ కత్తుల సేవలను గుర్తించిన గ్లోబల్ హెల్త్కేర్ లీడర్స్ ఫౌండేషన్ ఆయనకు లైఫ్టైమ్ అచీవ్మెంట్ ఇన్ గ్లోబల్ హెల్త్ లీడర్షిప్ 2025 అవార్డును ప్రదానం చేసి సత్కరించింది.తన సేవలను గుర్తించి అవార్డును బహూకరించడం పట్ల డాక్టర్ సతీష్ కత్తుల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ తరపున చేస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. డాక్టర్ సతీష్ కత్తుల తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు. 30 ఏళ్లుగా ఆయన అమెరికాలో వైద్య సేవలందిస్తున్నారు. డేటన్, ఒహియోలో నివసిస్తున్న డాక్టర్ సతీష్ కత్తుల ప్రఖ్యాత హెమటాలజిస్ట్, ఆంకాలజిస్ట్. 2024- 2025 సంవత్సరానికి గాను అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్- AAPI కి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. జూలై 2024లో AAPI అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఆయన భారత్లో మూడు ప్రధాన ప్రపంచ ఆరోగ్య సంరక్షణ సమావేశాలకు నాయకత్వం వహించారు. AAPI నిర్వహించిన అనేక అంతర్జాతీయ ఆరోగ్య శిఖరాగ్ర సమావేశాలలో ఆంకాలజీ ట్రాక్స్కు అధ్యక్షత వహించారు.డాక్టర్ సతీష్ కత్తుల ఇటీవల జీవనశైలి మార్పులు, టీకాల ద్వారా క్యాన్సర్ నివారణపై దృష్టి సారించిన “స్టాప్ 3 అండ్ స్టార్ట్ 3” అనే పరివర్తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన నాయకత్వంలో, AAPI విద్య, స్క్రీనింగ్ మరియు రోగనిరోధకతలో సమగ్ర ప్రయత్నాల ద్వారా గర్భాశయ క్యాన్సర్ను ఎదుర్కోవడానికి గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్ -GAIMS తో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది.
క్రైమ్

అప్పులు తీర్చేందుకు సూడో నక్సల్ అవతారమెత్తి..
హైదరాబాద్: పారిశ్రామిక వేత్త కూన రవీందర్ గౌడ్ను బెదిరించి రూ. 50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో జీడిమెట్ల పోలీసులు ఇద్దరు సూడో నక్సలైట్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాడు. బుధవారం జీడిమెట్ల పోలీస్స్టేషన్లో బాలానగర్ ఏసీపీ పింగళి నరేష్ రెడ్డి, ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ డీఐ కనకయ్యలతో కలిసి వివరాలు వెల్లడించారు. విజయవాడ, గన్నవరానికి చెందిన యర్రంశెట్టి రాజు అక్కడ చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లివచ్చాడు. వ్యసనాలకు బానిసైన అతను అప్పులు చేసి జల్సా చేశాడు. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తుండటంతో ఎలాగైనా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.ఈ నేపథ్యంలో షాపూర్నగర్లో తాను నివాసం ఉంటున్న ఇంటి యజమాని కూన రవీందర్గౌడ్ను బెదిరించి డబ్బు లాగాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా గన్నవరానికి చెందిన తన స్నేహితుడు కందురెల్లి రాజు(24)ను నగరానికి రప్పించుకున్నాడు. ఈనెల 21న రాత్రి పథకం ప్రకారం కందురెల్లి రాజును కూన రవీందర్గౌడ్ ఇంటికి పంపించాడు. స్నేహితుడు చెప్పినట్లుగానే అతను మెయిన్ గేట్లోనుంచి ఇంట్లోకి ప్రవేశించాడు. మొదటి అంతస్తులోకి వెళ్లి కిందికి వచ్చాడు. అక్కడ ఉన్న తులసి మొక్కను పీకేశాడు. అనంతరం ఎర్రరంగు టవల్లో ఓ లేఖను ఉంచి కారుపై పెట్టి వెళ్లిపోయాడు. మర్నాడు ఉదయం రవీందర్గౌడ్ కారుపై ఉన్న లేఖను చదివిన రవీందర్ గౌడ్ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును సవాల్ తీసుకున్న పోలీసులు ఏసీపీ నరేష్ రెడ్డి నేతృత్వంలో జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్, డీఐ కనకయ్య, ఎస్సై ప్రేమ్సాగర్ రంగంలోకి దిగారు. దాదాపు 500 సీసీ కెమరాలను పరిశీలించి రవాందర్గౌడ్ ఇంట్లో అద్దెకు ఉంటున్న యర్రంశెట్టి రాజును నిందితుడిగా గుర్తించారు.దీంతో యర్రంశెట్టి రాజు, అతని స్నేహితుడు కందురెల్లి రాజులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. వారి నుంచి 13నాటు బాంబులు, 4 సెల్ఫోన్లు, ఒక బెదిరింపు ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఈ కేసును చేదించిన ఇన్స్పెక్టర్ మల్లే‹Ù, డీఐ కనకయ్య, ఎస్సై ప్రేమ్సాగర్, పీసీలు నరేష్, రవినాయక్, వెంకటే‹Ùలను ఏసీపీ అభినందించి రివార్డులు అందజేశారు. కాగా నాటు బాంబులు ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

దత్తత పేరుతో శిశువుల విక్రయం
సూర్యాపేట టౌన్: ఇతర రాష్ట్రాల నుంచి శిశువులను అక్రమంగా తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారు. సూర్యాపేటకు చెందిన భార్యాభర్తలు నక్క యాదగిరి, ఉమారాణితోపాటు మరో 11 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు బుధవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె.నరసింహ మీడియాకు వెల్లడించారు. ముంబై, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి కొన్ని ముఠాల ద్వారా శిశువులను తీసుకొచ్చి ఒక్కో శిశువును రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వీరు ఇప్పటివరకు టేకుమట్లలో ముగ్గురు మగశిశువులను, సూర్యాపేట పట్టణంలో ఇద్దరు ఆడ శిశువులను, పెన్పహాడ్లో ఒక మగ శిశువు, ఉప్పలపహాడ్లో ఇద్దరు మగ శిశువులు, తిప్పర్తి మండలం చిన్న సూరారం గ్రామంలో ఒక ఆడశిశువు, హైదరాబాద్లో ఒక మగ శిశువును విక్రయించినట్టు గుర్తించారు. పిల్లలందరినీ రక్షించి నల్లగొండ జిల్లా కేంద్రంలోని బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. అరెస్టయినవారిలో నక్క యాదగిరి, ఉమారాణి, కోరె నాగేంద్రకుమార్, కొట్టె రామలక్ష్మి, పిల్ల పావని, గరికముక్కు విజయలక్ష్మి, ఆముదాలపల్లి సత్యమణి, నాగర్కర్నూల్కు చెందిన ముడావత్ రాజు, హైదరాబాద్కు చెందిన ఎండి.షాహానా, ఇస్తా శోభారాణి, సబావత్ శ్రీనివాస్, ఏర్పుల సునీత, రాజస్తాన్కు చెందిన ఖాన్ షాహీనా ఉన్నారు. ఈ ముఠాపై గతంలో మేడిపల్లి, మునగాల, మంగళగిరి, జనగామ, ముంబైలో కేసులు ఉన్నాయని ఎస్పీ చెప్పారు. శిశువుల విక్రయం ఇలా.. యాదగిరి, ఉమారాణి దంపతులు వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఇతర రాష్ట్రాల నుంచి శిశువులను తీసుకొచ్చి విజయవాడకు చెందిన కోరె నాగేంద్రకుమార్ మధ్యవర్తిత్వంతో దత్తత పేరుతో విక్రయిస్తున్నారు. సూర్యాపేట మండలం టేకుమట్లకు చెందిన అంజయ్య, నాగయ్య పిల్లల కోసం నక్క యాదగిరిని సంప్రదించారు. వారికి 15 రోజుల మగ శిశువును విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. వీరిపై నిఘా పెట్టిన సీసీఎస్ పోలీసులు శిశువును అప్పగించే సమయంలో అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా సూర్యాపేట హైటెక్ బస్టాండ్లో మరో 11 మంది ముఠా ఉన్నట్టు తేలింది. దీంతో వెంటనే వారిని అరెస్టు చేశారు. కొనుగోలుచేసిన వారినుంచి శిశువులను పోలీసులు తీసుకురావటంతో వారంతా సూర్యాపేట పట్టణ పోలీస్స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పిల్లలను ఇవ్వకపోతే స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

అమ్మా లే అమ్మా.. ఎందుకిలా చేశావ్ అనుప్రియా..
తిరువళ్లూరు: ప్రిడ్జి నుంచి ఐస్క్రీమ్ కిందపడిందన్న కారణంతో అత్త మందలించింది. దీంతో, మనస్తాపానికి గురైన కోడలు.. ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని పుళల్ సమీపంలో జరిగింది.వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా సెంగుడ్రం సమీపంలోని మెండియమ్మన్ నగర్ ప్రాంతానికి చెందిన అశ్విన్రాజ్ అదే ప్రాంతానికి చెందిన అనుప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రెండున్నరేళ్ల కిందట వీరిద్దరికీ వివాహం జరిగింది. వీరికి ఏడాది వయస్సు ఉన్న కొడుకు ఉన్నాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఉన్న ప్రిడ్జిని అనుప్రియ తెరవగా, అందులో నుంచి ఐస్క్రీమ్ కిందపడింది. దీంతో అనుప్రియను ఆమె అత్త చిత్ర మందలించింది.అత్త మందలింపుతో మనస్తాపం చెందిన అనుప్రియ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బంధువులు ఉరికి వేలాడుతున్న వివాహితను కిందకు దింపి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, మహిళను పరిశీలించిన వైద్యులు అప్పటికే అనుప్రియ మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై పుళల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

ప్రాణం తీసిన మైక్రో ఫైనాన్స్ అప్పులు!
పలమనేరు: కేవలం ఆధార్ కార్డుతో అప్పులిచ్చి అధిక వడ్డీలతో జనం రక్తాన్ని తాగుతున్న మైక్రోఫైనాన్స్ దాష్టీకానికి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బలయ్యాడు. వాటిని కట్టేందుకు మరిన్ని అప్పులు చేసినా ప్రయోజనం లేకపోవడంతో తండ్రి సమాధి సాక్షిగా చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయతీ మాదిగబండ గ్రామంలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. తలారి గంగప్ప కుమారుడు తలారి మోహన్ (43) ఉన్న 40 సెంట్ల స్థలంలో వ్యవసాయం, ఖాళీ సమయంలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో అవసరాల నిమిత్తం కొన్ని ప్రైవేటు మైక్రో ఫైనాన్స్ కంపెనీలనుంచి రుణం తీసుకున్నాడు. అధిక వడ్డీలతో వీటిని చెల్లించలేకపోవడం, పైగా వారినుంచి ఒత్తిళ్లు ఎదురవడంతో మంగళవారం పొలానికెళ్లి తండ్రి సమాధి వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య, డిగ్రీ, ఇంటర్ చదివే ఇద్దరు కొడుకులున్నారు.
వీడియోలు


మావోయిస్టు కుంజమ్ హిడ్మా అరెస్ట్


వంశీ ఆరోగ్యంపై హైకోర్టు కీలక ఆదేశాలు


తెలుగు టాప్ డైరెక్టర్స్ తో వెంకటేష్ వరుస సినిమాలు


మానవత్వం చాటుకున్న YSRCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి


రాజమౌళి-మహేష్ బాబు సినిమాని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరో..!


వైఎస్ రాజారెడ్డి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జగన్..


వెళ్లిపోకండయ్యా.. బతిమాలుకుంటున్న బాబు


మహానాడు ఎఫెక్ట్.. డిపోల్లో బస్సులు లేక ప్రయాణికుల అగచాట్లు


శ్రేయాస్ ఎవరో నాకు తెలీదు.. గంభీర్ నోటి దురద


7 సార్లు పాకిస్తాన్ కు.. కాంగ్రెస్ మాజీ మంత్రి PA అరెస్ట్