Abdul Hassan
-
తుంటరి బకరాకు బెయిల్
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో ఓ కలెక్టర్ గారి తోటలో ప్రవేశించి గలాటా చేసిన మేకకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. కలెక్టర్ హేమంత్ రాత్రే తోటలోకి చొరబడిన కేసులో సోమవారం అరెస్టయిన ఈ బకరాకు.. స్థానిక కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం నాడు ఆ తుంటరి మేకపిల్లను కోర్టు ముందు హాజరు పరిచారు. మేకతో పాటు స్టేషన్లో ఊచలు లెక్కపెడుతున్న యజమాని అబ్దుల్ కూడా కోర్టు తుది నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాడు. తాము నమోదుచేసిన సెక్షన్ల ప్రకారం రెండు నుంచి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని ఎస్సై ఆర్.పి.శ్రీవాస్తవ తెలిపారు. రాజధాని రాయ్పూర్ నుంచి 350 కిలోమీటర్ల దూరంలో నివసించే అబ్దుల్ హసన్కు చెందిన మేక జిల్లా కలెక్టర్ హేమంత్ రాత్రే తోటలో పూలను, కూరగాయలను నాశనం చేసింది. దీనిపై తోటమాలి పలుమార్లు అబ్దుల్ని హెచ్చరించాడు. అయినా గత సోమవారం తోటలోకి చొరబడిన మేక నానా బీభత్సం సృష్టించడంతో తోటమాలి ఫిర్యాదు చేయడం, పోలీసులు సదరు మేకను అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. -
కలెక్టర్ ఇంట్లో మేక హంగామా.. అరెస్ట్
రాయ్ పూర్: జిల్లా కలెక్టర్ ఇంటి గార్డెడ్ లో ప్రవేశించి నానా బీభత్సం చేసిన ఓ మేకను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. మంగళవారం నాడు ఆ మేకను కోర్టులో హాజరు చేయనున్నట్లు సమాచారం. ఈ మేకతో పాటుగా దాని యజమానిని కోర్టులో హాజరు పరచాల్సి ఉందని.. రెండు నుంచి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశాలున్నయని ఎస్సై ఆర్.పి.శ్రీవాస్తవ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. రాజధాని రాయ్ పూర్ నుంచి 350 కిలోమీటర్ల దూరంలో కొరియా అనే ప్రాంతం ఉంది. అబ్దుల్ హసన్ అనే వ్యక్తికి చెందిన మేకపై జిల్లా కలెక్టర్ హేమంత్ రాత్రే తోటమాలి ఫిర్యాదు చేశాడు. మళ్లీ మళ్లీ ఆ మేక తమ తోటలోకి వస్తుందని తోటమాలి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్సై ఆర్.పి.శ్రీవాస్తవ వివరించారు. యజమాని మేకను నియంత్రించలేకపోవడంతో ఇలా జరుగుతుందని తోటమాలి చెప్పాడు. మేకతో పాటుగా నన్ను కూడా... తన మేక మేజిస్ట్రేట్ ఇంటి గోడ దూకి, ఆ ఇంటి గార్డెన్ లోని పూలను, కూరగాయలను చెల్లాచెదురు చేసింది. దీంతో మేకతో సహా తనను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారని మేక యజమాని అబ్దుల్ హసన్ వివరించాడు.