Across the country
-
దేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు (ఫొటోలు)
-
Harsh Vardhan: దేశంలో 5,424 బ్లాక్ ఫంగస్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి సంక్రమణ, కొత్తగా భయాందోళనలకు కారణమైన బ్లాక్ ఫంగస్ తాజా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సోమవారం మంత్రుల బృందం (జీఓఎం) 27వ సమావేశం నిర్వహించారు. దేశంలో బ్లాక్ల్ ఫంగస్ (మ్యూకోర్మైకోసిస్) వ్యాప్తిపై ఈ భేటీలో చర్చ జరిగింది. దేశంలో ఇప్పటివరకు 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 5,424 బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మంత్రుల బృందానికి నివేదించారు. మొత్తం 5,424 కేసులలో 4,556 మంది రోగులకు కోవిడ్–19 ఉందని ఆయన పేర్కొన్నారు. వీరిలో గుజరాత్లో 2,165, మహారాష్ట్రలో 1,188, ఉత్తరప్రదేశ్లో 663, మధ్యప్రదేశ్లో 519, హరియాణాలో 339, ఆంధ్రప్రదేశ్లో 248 కేసులు నమోదయ్యాయి. ఈ రోగులలో మొత్తం 55% మందికి డయాబెటిస్ ఉన్నట్లు గుర్తించామన్నారు. గత వారం బ్లాక్ ఫంగస్ను ఎపిడమిక్ యాక్ట్ కింద నోటిఫై చేసి నమోదైన కేసుల వివరాలు తెలియచేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. దీంతో బ్లాక్ ఫంగస్ను అనేక రాష్ట్రాల్లో అంటువ్యాధిగా ప్రకటించారు. (చదవండి: బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాదు) -
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్డౌన్
-
ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ జోష్
-
రాహూల్ భారతీయుడని యావత్ దేశానికి తెలుసు: ప్రియాంక
-
దేశవ్యాప్తంగా ఎన్నికల్లో భారీగా పట్టుబడ్డ నగదు
-
సర్జికల్ స్ట్రైక్స్-2పై హర్షం వ్యక్తం చేస్తున్న దేశ ప్రజలు
-
ఈ ఏడాది రూ.2,000 కోట్ల వ్యాపారం: లివ్ఫాస్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పవర్ బ్యాకప్ సొల్యూషన్స్ కంపెనీ లివ్ఫాస్ట్ ఈ ఏడాది రూ.2,000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకుంది. 2018లో రూ.949 కోట్ల వ్యాపారం నమోదు చేసినట్టు కంపెనీ సీఈవో గుర్ప్రీత్ సింగ్ భాటియా శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా మార్చికల్లా 25,000 ఔట్లెట్ల ద్వారా ఉత్పత్తులను విక్రయించనున్నట్టు చెప్పారు. ‘కొత్తగా ప్రవేశపెట్టిన మోడళ్లు 25 శాతం వేగంగా చార్జింగ్ అవడమేగాక 25 శాతం అదనపు బ్యాటరీ బ్యాకప్ ఇస్తాయి. 18 రకాల మోడళ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మోడల్నుబట్టి 15 నుంచి 60 నెలల దాకా వారంటీ ఉంది’ అని వివరించారు. -
లోకల్ బ్రాండ్లకు.. ‘పిక్ ఎన్ హుక్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అన్ని వస్తువులనూ విక్రయించే ఈ–కామర్స్ కంపెనీగా ఆరంభమైన హైదరాబాద్ కంపెనీ ‘పిక్ ఎన్ హుక్’... ఇపుడు మిగతా చోట్ల దొరకని విభిన్న ఉత్పత్తుల విక్రయంపై దృష్టిపెట్టింది. తెలంగాణ చేనేత.. నిర్మల్ బొమ్మలు.. గద్వాల, ధర్మవరం, వెంకటగిరి చీరలు, కొండపల్లి బొమ్మల వంటి ప్రత్యేక వస్తువులను దేశవ్యాప్తంగా విక్రయించే ప్రయత్నాలు చేస్తోంది. మార్చి నుంచి ఈ వస్తువులన్నీ అందుబాటులోకి తెస్తున్న సందర్భంగా ‘పిక్ ఎన్ హుక్’ ఫౌండర్ సీఈఓ మోనిష్ పత్తిపాటి ‘సాక్షి’ స్టార్టప్ డైరీతో తన అనుభవాల్ని పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే... ‘‘స్థానికంగా ఉండి, సొంతంగా వ్యాపారం చేయాలన్నదే నా కల. అందుకు తగ్గట్టే నోయిడాలోని అమిటీ యూనివర్సిటీలో బీబీఏ పూర్తి చేశాక 2016లో ‘పిక్ ఎన్ హుక్’ను ఆరంభించాం. రూ.కోటి పెట్టుబడితో మా నాన్నగారు ప్రసాద్ పత్తిపాటి సాయంతో ఆరంభించాం. ఆయనే చైర్మన్గా వెన్నంటి నడిపిస్తున్నారు. అనతికాలంలోనే లక్ష మందికిపైగా కస్టమర్లు వచ్చారు. 1,000కి పైగా వెండర్లు తమ ఉత్పత్తుల్ని మా ప్లాట్ఫామ్పై విక్రయిస్తున్నారు. మంచి ధర.. వేగంగా డెలివరీ అనే రెండంశాలే మా ప్రత్యేకత. ఈ ఏడాది మార్చి నుంచి కొత్త రూపుతో రంగంలోకి దిగుతున్నాం. యాప్తో పాటు వెబ్సైట్కు కూడా మరిన్ని ఫీచర్లు జోడిస్తాం. ఉత్పత్తుల శ్రేణి పెంచుతున్నాం. ఫ్రాడ్ డెలివరీని నిలువరించి క్వాలిటీ చెక్ వ్యవస్థను పటిష్టం చేశాం. తద్వారా ఫిర్యాదులు అర శాతం లోపే ఉంటున్నాయి. ప్రొడక్టుల ధరను సెల్లర్లే నిర్ణయిస్తారు. ఇక నిధుల విషయానికి వస్తే ప్రస్తుతానికి సొంత వనరులే ఖర్చు చేస్తున్నాం. నిధుల సమీకరణ గురించి మార్చి చివరికల్లా ఒక స్పష్టత వస్తుంది. పోటీ ఎంతున్నా ఈ రంగంలో నిలదొక్కుకుంటామన్న ధీమా ఉంది. అందులో భాగంగానే తెలుగు రాష్ట్లాలకు చెందిన ప్రత్యేక ఉత్పత్తుల్ని మా ప్లాట్ఫామ్పైకి తెస్తున్నాం. లోకల్ బ్రాండ్స్ను దేశ, విదేశాల్లో ప్రాచుర్యంలోకి తీసుకు రావాలన్న కృతనిశ్చయంతో ఉన్నాం’’ అని మోనిష్ వివరించారు. -
దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన దీపావళి సంబరాలు
-
దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన దీపావళి సంబరాలు
-
ఇక కార్ల ధరలు మోతే..?
సాక్షి, న్యూఢిల్లీ:భారతదేశంలో డీజిల్ వాహనాలు, ఇతర ఖరీదైన కార్లు త్వరలోనే మరింత ప్రియం కానున్నాయి. కొత్త కార్లపై దేశవ్యాప్తంగా కొత్త ఏకీకృత పన్ను అమలుకు రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. అన్ని రకాల వాహనాలపై వన్ నేషన్-వన్ పర్మిట్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు మంటలు పుట్టిస్తోంటే వాహనదారులకు మరో షాక్ తగిలింది. అలాగే డీజిల్ వాహనాలపై పన్నును 2శాతం పెంచాలని కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వశాఖ ప్రతిపాదించి. విద్యుత్ వాహనాలపై పన్నులు తగ్గించాలని సిఫారసు చేసింది. డీజిల్ వాహనాలపై 2 శాతం వరకు పన్నులు విధించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఓ సర్క్యులర్ జారీ చేసింది. అలాగే శుక్రవారం వరుస ట్వీట్లు చేసింది. తాజా పన్ను ప్రతిపాదనలు అమల్లోకి వస్తే అటు డీజిల్ వాహనాలు, ఇటు ఎస్యూవీల ధరలు కొండెక్కడం ఖాయం. ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నులను మరింత తగ్గించాలని మంత్రిత్వ శాఖ భావిస్తోంది. వాహనాల కోసం ప్రత్యామ్నాయ ఇంధనాన్ని, విద్యుత్ వాహనాల వినియోగానికి ప్రోత్సాహమిచ్చే దిశగా ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నులు తగ్గించాలని కోరింది. ప్రస్తుతం వీటిపై 12శాతం పన్ను ఉంది. దీన్ని మరింత తగ్గిస్తే వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తారని మంత్రిత్వ శాఖ ఆలోచన. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ ప్రతిపాదనల ప్రకారం డీజిల్ వాహనాలపై పన్ను 2శాతం పెరగనుంది. ప్రస్తుతం 4 మీటర్ల కంటే తక్కువ పొడవు, 1.5 లీటర్ల కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం గల డీజిల్ కార్లపై 31శాతం పన్ను ఉంది. తాజా ప్రతిపాదనలతో ఇది 33శాతం కానుంది. దీంతో జీఎస్టీకి ముందు డీజిల్ కార్లపై పన్నులు ఎలా ఉండావో.. మళ్లీ అలాగే ఉండనున్నాయి. కాగా తాజా ప్రతిపాదనలు ఎపుడు అమల్లోకి వచ్చేది అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. 1/4 GoM on Transport deliberates upon One Nation- One Tax and One Nation- One Permit in Guwahati today.@nitin_gadkari @transform_ind @PMOIndia pic.twitter.com/xpspqN1hz8 — MORTHINDIA (@MORTHIndia) April 20, 2018 -
13న దేశవ్యాప్తంగా పెట్రో డీలర్ల సమ్మె సైరన్
-
దేశవ్యాప్తంగా ఘనంగా బక్రీద్ వేడుకలు
-
దేశవ్యాప్తంగా రైట్ టు సర్విసెస్ రావాలి
-
దేశవ్యాప్తంగా వెరైటీ గణేష్ విగ్రహలు
-
రిపబ్లిక్ డే నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్
-
అత్యవసర సేవల కోసం 112
* దేశ వ్యాప్తంగా ఒకే నంబర్ * అన్ని సేవలు దాని పరిధిలోకే సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలన్నీ ఒక్కతాటిపైకి రానున్నాయి. దీని కోసం కేంద్ర హోం శాఖ.. నేషనల్వైడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం(ఎన్ఈఆర్ఎస్) పేరుతో మైక్రో మిషన్ చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే ‘112’ నంబర్ను టెలికం శాఖ కేటాయిం చింది. రాష్ట్రాల్లో అమలులో ఉన్న 100, 108 తదితర ఎమర్జెన్సీ నంబర్లను దీని పరిధిలోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం రాష్ట్రాలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్న కేంద్ర హోం శాఖ వీలైనంత త్వరలో దీన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ఏర్పాటులో భాగంగా దేశవ్యాప్తంగా 36 చోట్ల 24 గంటలూ పని చేసే కంట్రోల్ రూమ్ తరహా కాల్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో సేవలు ప్రస్తుతం కంట్రోల్రూమ్కు ఓ కాల్ వచ్చిన వెంటనే అది ఏ ప్రాంతం నుంచి వస్తోంది అనేది గుర్తించేందుకు కొంత పరిజ్ఞానం పోలీసుల వద్ద ఉంది. ఎన్ఈఆర్ఎస్ అమలుతో మరింత అత్యాధునికమైన పరిజ్ఞానం చేకూరుతుంది. ఇది అందుబాటులోకి వస్తే జీఐఎస్(జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) పరిజ్ఞానంతో కూడిన వీడియో వాల్స్ కంట్రోల్ రూమ్స్లో ఉంటాయి. బాధితులు ఏ ప్రాంతం నుంచి ఫిర్యాదు చేస్తున్నారనేది దీని ద్వారా తక్షణం గుర్తించే అవకాశం ఉంటుంది. రక్షక్, మొబైల్ వాహనాల్లో జీపీఎస్ ఉంటుంది కాబట్టి బాధితుడికి దగ్గరలో ఉన్న వాహనాన్ని వెంటనే పంపిస్తారు. కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి భాగసామ్యం ఎన్ఈఆర్ఎస్ వ్యవస్థ కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి భాగస్వామ్యంతో పని చేయనుంది. మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని కేంద్రం అందిస్తుండగా... వీటిలో పని చేసే సిబ్బంది, పోలీసులకు అవసరమైన వాహనాలు తదితరాలను రాష్ట్రం కేటాయించాల్సి ఉంటుంది. సిబ్బందిని రిక్రూట్మెంట్, ఔట్సోర్సింగ్ ద్వారా ఏర్పాటు చేసుకోనున్నారు. వాహనాలు, ఇతర సౌకర్యాలను కేంద్రం అందించే వివిధ పథకాల కింద సమీకరించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను రాజధాని ప్రాంతమైన విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రాథమికంగానిర్ణయించారు. -
జడ్జీల సంఖ్య, రిటైర్మెంట్ వయస్సు పెంపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మూడు కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయంటూ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో,...హైకోర్టులు, ఇతర దిగువ కోర్టులలో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు సత్వరం చర్యలుతీసుకోవాలని లా కమిషన్ సిఫార్సు చేసింది. హైకోర్టులలో ఖాళీగా ఉన్న 270 జడ్జీల పోస్టులను లా కమిషన్ ప్రస్తావించింది. కేసుల పరిష్కారానికి నిర్దిష్టమైన వ్యవధిని నిర్ణయించాలని స్పష్టంచేసింది. తన సిఫార్సులతో కూడిన నివేదికను లా కమిషన్ సోమవారం న్యాయ శాఖకు సమర్పించింది. దేశంలో ఉన్న 24 హైకోర్టుల న్యాయమూర్తులతో సమానంగా, దిగువ కోర్టుల్లో న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును కూడా 62ఏళ్లకు పెంచాలని, కేసుల విచారణకు హేతుబద్ధమైన కాలవ్యవధిని సత్వరం నిర్ణయించాలని కూడా లా కమిషన్ సూచించింది. జడ్జీల పనితీరు ప్రమాణాలను బే రీజు వేయడానికి కేసు కాలవ్యవధిని ప్రాదిపదికగా వినియోగించాలని కూడా సిఫార్సు చేసింది. దేశంలోని వివిధ కోర్టుల్లో 3.13కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉన్నట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం లోక్సభకు సమర్పించారు. సుప్రీంకోర్టులో 63,843కేసులు, హైకోర్టులలో 44.62లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని ఆయన అన్నారు