Agricultural Bank Accounts
-
రుణాల పంపిణీపై బ్యాంకర్లతో సమీక్ష
వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, పశుపోషణ, పాడి పరిశ్రమ..వంటి విభిన్న విభాగాలకు అందించే రుణాల పంపిణీ పురోగతిని కేంద్రం సమీక్షించింది. కేంద్ర ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి నాగరాజు ఈమేరకు అధికారులతో చర్చించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డ్, రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన బ్యాంకర్ల కమిటీతో సమావేశం నిర్వహించారు.రుణాలతో ఉపాధి అవకాశాలు పెంపుప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నిర్ణయించిన లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నాగరాజు బ్యాంకర్లకు సూచించారు. ఈ రంగాలకు అందించే రుణ పంపిణీని మెరుగుపరచడంలో బ్యాంకులకు సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. వ్యవసాయ వృద్ధి కోసం దాని అనుబంధ రంగాలను ప్రోత్సహించాలన్నారు. దానివల్ల గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. కాబట్టి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో రుణ పంపిణీ పెంచాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్ పంపిణీని నిర్ధారించడానికి ప్రాంతీయ స్థాయి సమావేశాలు నిర్వహించాలని బ్యాంకులను ఆదేశించారు.ఇదీ చదవండి: ట్రంప్-బైడెన్.. ఎవరి హయాంలో భారత్ వృద్ధి ఎంత?రుణ పంపిణీపై ప్రభుత్వం దృష్టిచేపల పెంపకందారులను గుర్తించి వారికి కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ) పథకం ద్వారా లబ్ధి చేకూర్చేందుకు సహకరించాలని చెప్పారు. అందుకోసం రాష్ట్ర విభాగాలు, ఇతర సంఘాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సులువుగా రుణాలు అందించేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని నొక్కి చెప్పారు. -
గోదాములోని సరుకుపై బ్యాంకు లోన్.. లబ్ధిదారులు ఎవరంటే..
ఉద్యోగులకు రుణాలు కావాలంటే నేరుగా పేస్లిప్లు తీసుకెళ్లి అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు బ్యాంకులో ఇచ్చేసి రుణాలు తీసుకుంటారు. అదే రైతులకు రుణాలు కావాలంటే భూమి పట్టా పుస్తకాలు బ్యాంకులో తనఖా పెట్టాల్సి ఉంటుంది. అయితే చాలామందికి వారు పండిస్తున్న పంటభూమికి పట్టాలుండవు. కవులు రైతులు రుణాలు తీసుకోవాలంటే చాలాకష్టంతో కూడుకున్న వ్యవహారం. పంట మార్కెట్కు తరలించి వచ్చినకాడికి తెగనమ్ముకుని ఆ డబ్బును తదుపరి పంట కోసం పెట్టుబడికి ఉపయోగిస్తుండడం ఆనవాయితీగా వస్తుంది. భవిష్యత్తులో సరుకు మంచిధర పలుకుతుందని తెలిసినా అవసరాల కోసం అమ్ముకోక తప్పదు. అలాంటి వారికోసం ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించింది. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఉన్న గోదాముల్లో రైతులు తమ పంటలను స్టోర్ చేసుకుంటే, వీటిపై లోన్లు పొందేందుకు కేంద్రం వీలు కలిపిస్తోంది. ఇందుకు సంబంధించి ఫుడ్ అండ్ కన్జూమర్ అఫైర్స్ మినిస్టర్ పియూష్ గోయల్ సోమవారం ‘ఈ–కిసాన్ ఉపజ్ నిధి’ డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. ఈ విధానం అమల్లోకి వస్తే రైతుల ఆదాయాలు పెరుగుతాయని మంత్రి అన్నారు. వేర్ హౌస్ ఓనర్లు చెల్లించే సెక్యూరిటీ డిపాజిట్లను ఒక శాతానికి తగ్గిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది 3 శాతంగా ఉంది. ఇదీ చదవండి: రిస్క్ అని తెలిసినా అవే అప్పులు చేస్తున్నారు..! ఆందోళనలో ఆర్బీఐ వంట నూనెల దిగుమతులు తగ్గించేలా.. వంట నూనెల దిగుమతులను తగ్గించి, నూనె గింజల ఉత్పత్తిని పెంచేందుకు ఓ మిషన్ లాంచ్ చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అర్జున్ ముండా సోమవారం పేర్కొన్నారు. ఇందుకోసం రూ.11 వేల కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు. దీంతో పాటు అస్సాంలో ఏర్పాటు చేసిన ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఏఆర్ఏ)ను ఆయన ప్రారంభించారు. -
‘‘వెయ్యి’’కుండానే మోసమా..?
సాక్షి, కడప అగ్రికల్చర్ : రైతులను మభ్య పెట్టడం, మోసగించడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. రైతుకు టోకరా వేయడం మరింత సులువన్నది ఆయన భావన. ఐదు సంవత్సరాలుగా ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా, పంట రుణాలపై వడ్డీ రాయితీ ఇవ్వకపోగా, అన్నదాత.. సుఖీభవ పేరిట రూ.1000 ఖాతాలో వేస్తున్నట్లు నమ్మబలుకుతున్నారు. ఈ పథకంలో కొంతమంది రైతుల ఖాతాలకే నిధులు జమ చేశారు. 50 వేల మంది ఖాతాలకు డబ్బులు పడలేదని తెలిసింది. ఎన్నికల వేళ లేని ఆశలు కల్పిస్తూ వంచిస్తున్న ప్రభుత్వ తీరుపై రైతు సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. టీడీపీకి అనుకూలంగా ఉన్నవారికి, ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రమే పథకాలు అందుతున్నాయని.. అందుకే నిన్ను నమ్మం బాబూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. ఏదో చేస్తున్నట్లు భ్రమ కల్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతుకు ఒరిగిందేమీలేదు. ‘అన్నదాత సుఖీభవ’ అంటూ గొప్ప పథకాన్ని తీసుకువచ్చినట్లు టీడీపీ ప్రభుత్వం బిల్డప్ ఇస్తోంది. ఈ పథకం కిందేమైనా రైతులకు పెద్ద ప్రయోజనం ఏమైనా చేకూరుతుందా? అంటే అదీలేదు. జిల్లాలో దాదాపు ఐదు సంవత్సరాలుగా వరుస కరువులతో వ్యవసాయం అతలాకుతలం అయింది. అనావృష్టి, అతివృష్టి, మరో పక్క ప్రకృతి విపత్తులు, అంతు చిక్కని చీడపీడలతో పంటలు తుడిచి పెట్టుకుపోయాయి. నేల తల్లిని నమ్ముకున్న జిల్లా రైతులు ఆర్ధికంగా చితికిపోయారు. బ్యాంకుల నుంచి, బయట ప్రయివేటు వారి వద్ద తీసుకున్న అప్పులు తీర్చే దారిలేక కొంతమంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆసరా కల్పించాల్సిన సర్కారు మాటలతో కాలహరణం చేస్తోంది. 14.35 లక్షల ఎకరాల్లో భూమి...దీనిపై ఆధారపడిన కుటుంబాలు 4.89 లక్షలు జిల్లా వ్యవసాయ, ప్రణాళిక శాఖ లెక్కల ప్రకారం 14.35 లక్షల ఎకరాల భూములున్నాయి. వీటిపై ఆధారపడి 4,89,757 రైతు కుటుంబాలు జీవిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం కింద 3,59,205 కుటుంబాలు అర్హత కలిగినట్లు జిల్లా యంత్రాంగం తేల్చింది. అంటే 1,30,552 కుటుంబాలకు మొండిచేయి చూపినట్టేనని అర్ధమవుతోంది. జిల్లాలో 12 వ్యవసాయ డివిజన్లు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా వర్షాధారంపై ఆధారపడిన భూములే అధికం. జిల్లా వ్యవసాయ, ప్రణాళికశాఖ సంయుక్తంగా సర్వేచేసి 3,24,965 అకౌంట్లు రైతు కుటుంబాలు కలిగిన ఉన్నాయని లెక్కలు కట్టారు. ఫిబ్రవరి 18 నుంచి రైతుల ఖాతాలకు రూ.1000 రియల్ టైం గవర్నెన్స్ సిస్టం (ఆర్టీజీఎస్) ద్వారా బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. బ్యాంకులకు, ఏటీఎంలకు వెళ్లి పరిశీలించుకుంటుండగా నగదు జమకానట్లు చూపుతోందని చాలామంది ఆరోపిస్తున్నారు. ఆదివారం సాయంత్రం వరకు 2,88,077 అకౌంట్లకు ఆన్లైన్ చేయగా, ఇందులో 2,58,416 అకౌంట్లకు నగదు జమ అయిందని, 30,012 అకౌంట్లకు జమ కావాల్సి ఉందని తెలిపారు. మొత్తం 3,24,965 అకౌంట్లలో 48,946 అకౌంట్లకు బ్యాంకుల్లో ఆధార్ అనుసంధానం కాలేదని, ఐఎఫ్ఎస్సీ కోడ్ లేనందున ఆన్లైన్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఆధార్కార్డు, బ్యాంకు ఖాతా, కెవైసీ ఫారత పూర్తి చేసి ఇచ్చినా కూడా మొండిచేయి చూపారని రైతులు దుమ్మెత్తి పోస్తున్నారు. రైతు సాధికార సర్వే సమయంలో కూడా అన్ని పత్రాలు ఇచ్చామని, అయినా నగదు పడిందెక్కడని ప్రశ్నిస్తున్నారు. ఓట్ల కోసమే ఇదంతా.. వ్యతిరేకతను తగ్గించుకోవడానికే సుఖీభవ పథకాన్ని పెట్టి నమ్మబలుకుతోందని రైతు సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. వాస్తవానికి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ పధకం కింద ఏటా రైతులకు పెట్టుబడి సాయంగా రూ.6వేలు అందించాలని నిర్ణయించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం రూ.9వేలు, కేంద్రం ఇచ్చే రూ.6వేలు కలిపి రూ.15వేలు ఇస్తామని ప్రకటించింది. దీంట్లో మొదటి విడతగా కేంద్రం రూ.2వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1000లు ఇప్పుడే జమ చేస్తామని, మిగిలిన మొత్తం ఈ నెలలో ఇస్తామని ప్రకటించింది. దాదాపు 50 వేల మంది రైతుల ఖాతాలకు నగదు పడలేదని తేలిపోయింది. ఇన్ఫుట్ సబ్సిడీ, బీమా, రుణాల వడ్డీ రాయితీలకు ఎగ్గొట్టిన ప్రభుత్వం.. నాలుగున్నరేళ్లుగా ఇన్ఫుట్ సబ్సిడీ, పంటల బీమా, రూ.లక్షలోపు సాగు రుణాలు సకాలానికంటే ముందే చెల్లించగా వచ్చే రుణ రాయితీ ఇప్పటికి రాలేదని రైతులు మండిపడుతున్నారు. న్యాయంగా రావాల్సిన సొమ్ములు ఇవ్వకుంటే కొసరు దేనికని రైతులు, రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. 2012 నుంచి ఇప్పటి వరకు పంటపెట్టుబడి రాయితీ రూ.130 కోట్లు, పంటల బీమా రూ.117 కోట్లు, రుణాల వడ్డీ రాయితీ రూ.400 కోట్లు కలిపి రూ.647కోట్లు రైతులకు అందజేయాల్సి ఉంది. ఈ మొత్తమంతా ప్రభుత్వం ఎగ్గొట్టిందని రైతులు, రైతు సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఇది ఎన్నికల ఎత్తుగడే తెలుగు దేశం ప్రభుత్వం రైతులను ఏనాడో వదిలేసింది. పంటలు నష్టపోయినప్పుడు పట్టించుకోవడం మరచి పోయింది. ఇప్పుడు రైతుల ఓట్లు రాబట్టుకోవడానికి సుఖీభవ పథకం తీసుకువచ్చారు. ఇది ఎన్నికల జిమ్మిక్కే తప్ప రైతులకు మేలు చేయడానికి కాదు. –డేరంగుల రామాంజనేయులు, వేంపల్లె, వేంపల్లె మండలం రైతులను మభ్యపెట్టెందుకే.. ఎన్నికల సమయం దగ్గర పడడంతో రైతుల ఓట్లు బుట్టలో వేసుకోవడానికే తాయిలం. ఐదు సంవత్సరాలుగా రైతుల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు రైతుల అవసరం వచ్చింది కాబట్టి నగదు ఇస్తామంటున్నారు. రైతులను మభ్యపెట్టడానికే ఈ రైతు సుఖీభవ పధకం. –సంబటూరు ప్రసాదరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం ఈ ప్రభుత్వానిది అంతా బూటకమే.. తెలుగు దేశం ప్రభుత్వం అధికారం కోసం ప్రతిసారీ రైతులను ఏదో ఒక విధంగా బోల్తాకొట్టించాలని చూస్తుంది. పది రూపాయలు విధిలించి రైతులను బిక్షగాళ్ల మాదిరిగా చూస్తోంది. ఈ ప్రభుత్వం చేసేవన్నీ బూటకపు పనులే తప్ప రైతులకు మేలు చేసేది ఉండదు. ఇన్పుట్ సబ్సిడీ, వడ్డీ రాయితీ, బీమాను ఎగ్గొట్టింది. –చంద్ర,జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘం(సీపీఐ) -
రుణమో.. రామచంద్రా!
ఖరీఫ్ ప్రారంభమై నెలన్నర రోజులైనా అందని బ్యాంకుల సాయం - ఈ ఏడాది రూ.3,280కోట్ల రుణలక్ష్యం - కొత్తసర్కారు ప్రకటన కోసం ఎదురుచూపు - వరుణుడు కరుణించక నష్టాల్లో అన్నదాత సాక్షి, మహబూబ్నగర్: ఖరీఫ్ సీజన్ ఆరంభమై నెలన్నర గడిచినా బ్యాంకు రుణం అందకపోవడంతోవడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నాడు. వరుణుడు కరుణించకపోవడం.. విత్తిన విత్తు మొలవకపోవడం.. సాగుఖర్చు రెండింతలవడంతో దిక్కుతోచనిస్థితిలో పడ్డాడు. చేతిలో చిల్లిగవ్వలేక రుణమాఫీ అన్న సర్కారు మాట కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నాడు. జిల్లాలో గతేడాది అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల కారణంగా పంటల దిగుబడి కూడా ఆశించినంతగా రాలేదు. ఈ సారైనా అప్పులబాధ నుంచి గట్టెక్కుదామని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పాటు అడపాదడపా రాలిన చినుకులకు పంట సాగుచేద్దామంటే చేతిలో చిల్లిగవ్వలేదు. అయితే ఈ సీజన్లో బ్యాంకు రుణాలు ఇవ్వడం ప్రారంభించలేదు. జిల్లాలో గత ఆర్థిక సంవత్సరం బ్యాంకులు రూ. 3,078కోట్ల వ్యవసాయ, దాని అనుబంధ రుణాలు అందజేశాయి. ఈ క్రమంలో 266 మంది కౌలురైతులకు రూ.97లక్షల రుణం అందింది. రూ.లక్ష లోపు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీచేస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ హామీకి కట్టుబడి ఉన్నామని చెబుతోంది. ఈ క్రమంలో ఖరీఫ్ ప్రారంభమై నెలన్నరరోజులు గడుస్తున్నా.. రుణాలపై నిర్ణయం ఏ నిర్ణయం తీసుకోలేదు. దీనికితోడు ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)కూడా విధివిధానాలను ఖరారు చేయకపోవడంతో బ్యాంకులు అడుగు ముందుకువేయలేకపోతున్నాయి. జిల్లాలో దాదాపు 4,97,073 వ్యవసాయ బ్యాంక్ ఖాతాలు కలిగిన రైతులు రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. చేసేదిలేక తమ వద్ద ఉన్న బంగారాన్ని వడ్డీవ్యాపారుల వద్ద తాకట్టుపెట్టడం లేదా ఉన్న జీవాలను అమ్ముకోవడం ద్వారా సాగుఖర్చులు వెళ్లదీసుకుంటున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రైతులకు రూ.3,280కోట్ల రుణాలివ్వాలని బ్యాంకులు ప్రణాళికను నిర్ధేషించుకున్నాయి. ఇందులో పంటరుణాలు రూ.2803కోట్లు కాగా, టర్మ్లోన్లు రూ.477కోట్లు, అనుబంధ రంగాలకు రూ.176 కోట్లు ఉన్నాయి. నడ్డివిరుస్తున్న వ్యాపారులు వ్యవసాయదారులకు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరుకాకపోవడంతో వడ్డీవ్యాపారులకు పంట పడుతోంది. బంగారు, వెండి నగలను కుదువపెడుతున్న రైతుల వద్ద రూ.100కు రూ.3, రూ.4, రూ.5 వడ్డీని వసూలు చేస్తున్నారు. మరికొందరు రైతులు పంటచేతికొచ్చిన తరువాత చెల్లించేవిధంగా ఎరువులు, విత్తనాలు తెచ్చుకుంటున్నారు. రైతుల అవసరాన్ని గమనించి.. అధిక వడ్డీలు డిమాండ్ చేస్తున్నారు. నూటికి ఐదు నుంచి ఏడు రూపాయల వరకు వడ్డీ వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. వేధిస్తున్న వానదేవుడు..! గత పదేళ్లలో ఎన్నడూ లే నంతంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటివరకు గట్టిగా ఒక్కవాన కురవలేదు. సాధారణ వర్షపాతం కంటే అతి తక్కువగా నమోదైంది. జూన్ చివరి నాటికి సాధారణ వర్షపాతం 71.2 మి.మీ ఉండగా, 48.8 మి.మీ మాత్రమే కురిసింది. సరైనవర్షాలు లేకపోవడంతో పంటలు కూడా అంతంత మాత్రమే సాగయ్యాయి. ఖరీఫ్ సీజన్కు సంబంధించి 7,06,216 హెక్టార్లు సాగుకావల్సి ఉండగా, కేవలం 74,190 హెక్టార్లు మాత్రమే సాగైంది. వర్షాలు లేని కారణంగా మొలకలు చనిపోవడంతో రెండుమూడు సార్లు విత్తులు విత్తుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.