amavaasya
-
Mahakumbh : 15 కోట్ల మంది పుణ్యస్నానాలు పూర్తి.. మౌని అమావాస్య అంచనాలివే
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో అత్యంత వైభవంగా కుంభమేళా జరుగుతోంది. దేశ విదేశాల నుండి పర్యాటకులు, భక్తులు మహా కుంభమేళాకు తరలివచ్చి, పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.మహాకుంభమేళాలో మూడవ పుణ్య స్నానం జనవరి 29న అంటే మౌని అమావాస్య రోజున జరగనుంది. ఆ రోజున పుణ్యస్నానం ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్కు తరలివస్తారనే అంచనాలున్నాయి. ఇప్పటివరకు మహా కుంభ స్నానం చేసే వారి సంఖ్య 15 కోట్లు దాటింది. గడచిన 17 రోజుల్లో 15 కోట్లకు పైగా జనం మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేశారు. మకర సంక్రాంతి సందర్భంగా 3.5 కోట్ల మంది భక్తులు, సాధువులు స్నానమాచరించారు.రాబోయే మౌని అమావాస్య సందర్భంగా 8 నుండి 10 కోట్ల మంది ప్రయాగ్రాజ్కు వస్తారనే అంచనాలున్నాయి. 2025 మహా కుంభమేళాకు మొత్తంగా 40 కోట్ల మంది హాజరవుతారనే అంచనాలున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. మౌని అమావాస్య అనంతరం ఫిబ్రవరిలో వసంత పంచమి సందర్భంగా అమృత స్నానం జరగనుంది. మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 26న అంటే మహాశివరాత్రి రోజున చివరి అమృత స్నానంతో ముగియనుంది.ఇది కూడా చదవండి: ఒక్క రోజులో 1.5 కోట్ల మంది పుణ్యస్నానాలు -
Mahakumbh: మౌని అమావాస్యకు ఎందుకంత ప్రత్యేకత?
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకూ కొనసాగనుంది. ఈ సమయంలో కోట్లాదిమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. కుంభమేళా జరిగే రోజుల్లో కొన్ని తిథులను ప్రత్యేకమైనవిగా భావిస్తారు. వాటిలో మౌని అమావాస్య ఒకటి. మాఘ మాసంలో వచ్చే ఈ అమావాస్య నాడు గంగా నదిలో స్నానం చేస్తే, పాపాల నుండి విముక్తి లభిస్తుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. మౌని అమావాస్య జనవరి 29, బుధవారం నాడు వచ్చింది.హిందూ క్యాలెండర్ ప్రకారం మౌని అమావాస్య మాఘ మాసంలో వస్తుంది. అందుకే ఈ అమావాస్యను మాఘ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఆ రోజున ఎవరైనా తమ పెద్దలకు పిండప్రదానం చేస్తే, వారు పితృ దోషం నుండి విముక్తి పొందుతారని పెద్దలు చెబుతుంటారు. ఇదేవిధంగా మౌని అమావాస్య నాడు దానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇప్పుడొచ్చిన మౌని అమావాస్య..మహా కుంభమేళా జరుగుతున్న సమయంలో రావడం విశేషంగా భావిస్తున్నారు. మౌని అమావాస్యనాడు నిశ్శబ్ద ధ్యానం మంచి ఫలితాలను ఇస్తుందని చెబుతుంటారు.మౌనం వలన కలిగే లాభాలను మౌని అమావాస్య గుర్తుచేస్తుంది. మౌనం అంటే బాహ్య మౌనం కాదని, అంతర్గతంగా మౌనంగా ఉండాలని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి. ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి మనిషి మౌన ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉందని మానసికశాస్త్రవేత్తలు కూడా చెబుతుంటారు. తద్వారా మనస్సు ప్రశాంతంగా మారుతుందని, ఏకాగ్రత ఏర్పడుతుందని, కష్టాలను ఎదుర్కొనే ధైర్యం అలవడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మౌనం పాటించడం అనేది సాధకులను ఎంతో ముఖ్యమని, తద్వారా ఆధ్యత్మిక ఎదుగుదల అలవడుతుందని ఆధ్మాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: మళ్లీ గూగుల్ మ్యాప్ బురిడీ.. ఈ సారి ఫ్రెంచ్ పర్యాటకుల వంతు -
అక్టోబర్ నెలలో పండుగలే...పండగలు
రాయచోటి రూరల్: అక్టోబర్ నెల పండుగల వాతావరణంతో నిండిపోనుంది. 1153వ సంవత్సరం తరువాత అంత అరుదైన నెల అక్టోబర్ మళ్లీ ఇప్పుడు వచ్చినట్లు పలువురు వేదపండితులు పేర్కొంటున్నారు. సుమారు 8 శతాబ్దాల తరువాత వచ్చిన అరుదైన నెలగా అక్టోబర్ నిలిచిపోనుంది. నెల ప్రారంభం నుంచే , అంటే 1వ తేదీ నుంచి పండుగలు ప్రారంభం కానున్నాయి. 1వ తేది దేవీశరన్నవరాత్రులు ప్రారంభంతో 9వ తేదీన దుర్గాష్టమి, 11వ తేదీ విజయదశమితో వరుసగా 11రోజులు పండుగలే ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మరో రోజు అధికంగా 12రోజుల పాటు నిర్వహించుకోనున్నారు. ఆ తరువాత 3వ తేదీ ప్రారంభమై, 10రోజుల పాటు 12వ తేదీ వరకు పీర్లపండగ(మొహర్రం) ఉంటుంది. 2వ తేదీ గాంధీ జయంతి, 30వ తేదీ దీపావళి పండుగ నిర్వహించుకోనున్నారు. విచిత్రంగా ఈ నెలలోనే పౌర్ణమి, అమావాస్య రెండూ వచ్చాయి. విద్యార్థులకు దసరా సెలవులు రావడంతో స్వగ్రామాల్లో సందడి వాతావరణం నెలకొననుంది.