breaking news
ambajipet
-
రిబ్బన్ కటింగ్కి కత్తెర లేదా?.. ఎమ్మెల్యే గిడ్డి అసహనం
సాక్షి, కోనసీమ జిల్లా: అంబాజీపేట మండలంలో క్రీడోత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రీడోత్సవాల కోసం అంబాజీపేట జడ్పీ హైస్కూల్లో అధికారులు అరకొర ఏర్పాట్లు చేశారు. స్కూల్ మేనేజజ్మెంట్ కమిటీకి కనీసం హెచ్ఎంకు కూడా భాగస్వాము లేకుండా క్రీడోత్సవాలు ఏర్పాటు చేయటంపై ఆయన మండిపడ్డారు.కనీసం స్వాగత ఫ్లెక్సీ ఏర్పాటు చేయకపోవడంతో పాటు, రిబ్బన్ కటింగ్కి కత్తెర కూడా సకాలంలో అందచేయలేకపోవడంతో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమకు చెబితే క్రీడోత్సవాల ఏర్పాట్లు తామే చేసుకుంటామంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, క్రీడోత్సవాల ఏర్పాట్లపై ఎంఈవోలను కూటమి నేతలు నిలదీశారు. దీంతో తూతూ మంత్రంగా ప్రారంభించిన ఎమ్మెల్యే గిడ్డి అలిగి వెళ్లిపోయారు. -
కొబ్బరి రైతుకు ఊరట
సాక్షి, అమలాపురం: అంబాజీపేట కొబ్బరి మార్కెట్కు సం‘క్రాంతి’ వెలుగులొచ్చాయి. గడచిన వారం రోజులుగా పచ్చికొబ్బరి, కురిడీ కొబ్బరి ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. దీంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కొబ్బరి ఎగుమతులు జోరందుకున్నాయి. ఉత్తరాదికి ఎగుమతులు పెరగడం.. తమిళనాడులో దిగుబడులు తగ్గడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో 1.77 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు చేస్తున్నారు. ఈ రెండు జిల్లాల మార్కెట్లో కొబ్బరి లావాదేవీలు అంబాజీపేట మార్కెట్లో ధరల ఆధారంగా సాగుతుంటాయి. ప్రస్తుతం అంబాజీపేట మార్కెట్లో పచ్చి కొబ్బరి, వెయ్యికాయల ధర రూ.14,500 నుంచి రూ.15 వేలకు చేరింది.రోజుకు 70 నుంచి 100 లారీల ఎగుమతిగతేడాది అక్టోబర్ నుంచి నవంబర్ వరకూ పచి్చకొబ్బరి వెయ్యి కాయల ధర రికార్డు స్థాయిలో రూ.18,500 వరకు పలికింది. తర్వాత ధర తగ్గినా రూ.14 వేల వద్ద స్థిరంగా ఉంది. వారం రోజుల నుంచి ధర పెరుగుతూ వస్తోంది. దీంతోపాటు కురిడీ కొబ్బరి ధరలు సైతం పెరుగుతున్నాయి. రెండు వారాల క్రితం పాత కాయలలో కురిడీ కొబ్బరి వేయింటికి గండేరా రూ.15 వేలు, గటగట రూ.13,500, కొత్త కాయలలో గండేరా రూ.14 వేలు, గటగట రూ.12,500 ఉండేవి. ఇప్పుడు వాటి ధరలు పెరిగాయి. ప్రస్తుత మార్కెట్లో పాత కురిడీ కొబ్బరి వెయ్యింటికి గండేరా రూ.17,500, గటగట రూ.16,000, కొత్త గండేరా రూ.16,800, గటగటా రూ.15,000 వరకూ పెరిగాయి. ఆయా రకాలకు రూ.రెండు వేల నుంచి రూ.2,500 వరకు పెరిగాయి. దీంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి రోజుకు 70 నుంచి 100 లారీల వరకు కొబ్బరి ఎగుమతి అవుతోందని అంచనా. పెరిగిన వినియోగంసంక్రాంతికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కొబ్బరి వినియోగం కొంత వరకూ పెరగడంతోపాటు స్థానికంగా దిగుబడి తగ్గడం కూడా ధర పెరుగుదలకు కారణం. ఈ సీజన్లో సగటు దిగుబడి ఎకరాకు 1,200 కాయలు కాగా, ప్రస్తుతం 400 కాయలు మాత్రమే దిగుబడిగా వస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటకలో సైతం దిగుబడులు తగ్గడం కూడా రేటు పెరగడానికి కారణమైంది. మూడు నెలల నుంచి పచ్చికాయ ధర అధికంగా ఉండడం వల్ల కూడా కురిడీ కొబ్బరి ధర పెరుగుదలకు కారణమైంది. దిగుబడి తగ్గినా.. సంక్రాంతి సమయంలో కొబ్బరి ధరలు పెరగడం రైతులకు ఊరటనిచ్చే అంశంగా మారింది. -
రైతు సమస్యలపై వైఎస్ఆర్ సీపీ ధర్నా
అంబాజీపేట (తూర్పుగోదావరి జిల్లా): రైతు సమస్యలపై తక్షణమే స్పందించాలని కోరుతూ వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యద ర్శి నిండు కుదిరి మోహన్, వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి మణిరత్నం, నియోజకవర్గ కోఆర్డినేటర్ చిట్బిబాబులు పాల్గొన్నారు. ప్రభుత్వం రైతుల పట్ల నిరంకుశంగా వ్యవహారిస్తోందని, రైతు సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఏ గ్రేడ్గా గుర్తించి, రైతులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్ సీపీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు.