breaking news
Anjali Pavan
-
తెలుగు సీరియల్ నటి సీమంతం వేడుక
తెలుగు సీరియల్ నటి అంజలికి సీమంతం వేడుకలు సందడిగా జరిగాయి. 'మొగలిరేకులు' సీరియల్తో నటిగా కెరీర్ ప్రారంభించిన ఈమె.. తర్వాత పలు సీరియల్స్తో పాటు సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం షోల్లో ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా రెండోసారి ప్రెగ్నెన్సీని ప్రకటించింది. ఇప్పుడు తనకు సీమంతం జరిగిందని చెబుతూ ఓ వీడియోని పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: త్రిష ఇంట్లో దళపతి విజయ్.. ఆ రూమర్స్ నిజమేనా?)'మొగలిరేకులు'లో నటించి గుర్తింపు తెచ్చుకున్న అంజలి.. దీని తర్వాత రాధా కల్యాణం, దేవత, శివరంజని తదితర సీరియల్స్ చేసింది. వీటితో పాటు మరికొన్నింటిలో నెగిటివ్ పాత్రల్లోనూ నటించింది. అలానే లెజెండ్, ఒక లైలా కోసం సినిమాల్లో నటించిన ఈమె.. 2017లో సంతోష్ పవన్ అనే నటుడిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు చందమామ అనే కూతురు కూడా ఉంది.కొన్నేళ్ల క్రితం సీరియల్స్ పూర్తిగా తగ్గించేసిన అంజలి.. భర్తతో కలిసి యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది. ఎక్కువగా కూతురు చందమామతో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. కొన్నాళ్ల ముందు ప్రెగ్నెన్సీ విషయం చెప్పిన ఈమె.. ఇప్పుడు తనకు గ్రాండ్గా సీమంతం జరిగిన విషయాన్ని వీడియో రూపంలో ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వేడుకకు యాంకర్ స్రవంతితో పాటు అర్జున్ అంబటి, శ్వేతా నాయుడు, యష్మీ తదితరులు వచ్చారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) View this post on Instagram A post shared by Anjali Attota (@anjaliattota) -
బిగ్బాస్ ఆఫర్ రిజెక్ట్ చేసిన సీరియల్ నటి.. ఎందుకంటే?
అంజలి పవన్.. ఈ బుల్లితెర నటి సోషల్ మీడియాలోనూ చాలా ఫేమస్. కూతురు చందమామ అలియాస్ ధన్వికతో ఫోటోషూట్స్ చేయిస్తూ పాపను కూడా పాపులర్ చేసేసింది. ఇకపోతే అంజలి ఈసారి బిగ్బాస్ హౌస్లోకి రానుందని ప్రచారం జరిగింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే చివరి నిమిషంలో వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇవ్వమని యాజమాన్యం కోరడంతో దానికి ఆమె తిరస్కరించినట్లు భోగట్టా! కూతురికి అనారోగ్యంఈ క్రమంలో అసలు అంజలి హౌస్లో అడుగుపెడుతుందా? లేదా? అని ఫ్యాన్స్ గందరగోళంలో పడ్డారు. ఈ అనుమానాలన్నింటికీ తన యూట్యూబ్ వీడియో ద్వారా అంజలి సమాధానం ఇచ్చింది. అందులో ఆమె మాట్లాడుతూ.. 'నా భర్త పవన్కు, కూతురు ధన్వికకు ఆరోగ్యం బాగోలేదు. రెండుమూడునెలలుగా ఈ అనారోగ్య సమస్యలతోనే సతమతమవుతున్నాం. అందుకనే వీడియోలు పెట్టడం లేదు. పరీక్షలు చేయిస్తే ధన్వికి చికెన్ గున్యా అని, పవన్కు టైఫాయిడ్ అని తేలింది.బిగ్బాస్ నుంచి పిలుపువర్షాకాలం కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. బిగ్బాస్ విషయానికి వస్తే గతంలో లాగే ఈ సీజన్ నుంచి కూడా పిలుపు వచ్చింది. వెళ్దామని అనుకున్నాను. కానీ ఇంట్లో వాళ్ల ఆరోగ్యం బాగోలేకపోవడంతో షోకి వెళ్లాలన్న ఆలోచన విరమించుకున్నాను. నా కుటుంబమే నాకు ముఖ్యం కాబట్టి ఇప్పుడైతే బిగ్బాస్కు వెళ్లడం లేదు' అని చెప్పుకొచ్చింది. -
బిగ్బాస్ 8: తెరపైకి కొత్త కంటెస్టెంట్లు.. విచిత్రమేంటంటే?
బిగ్బాస్ షురూ అవుతుందంటే చాలు ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. ఎప్పుడెప్పుడు కొత్త ప్రోమో రిలీజ్ అవుతుందా? ఈసారి ఎవరెవరు వస్తారా? అని సోషల్ మీడియాలో తెగ ఆరా తీస్తుంటారు. గత సీజన్ పుణ్యమా అని జనాల్లో ఈ ఉత్సాహం మళ్లీ కనిపిస్తోంది. మరి ఈసారి ఎలా ఉంటుందనేది రానున్న రోజుల్లో తేలిపోనుంది.వచ్చే వారమే బిగ్బాస్ 8అయితే ఈసారి ఏయే కంటెస్టెంట్లు హౌస్లోకి వెళ్లనున్నారనేదానిపై ఇంతవరకు స్పష్టతర రాలేదు. వారం రోజుల్లో (సెప్టెంబర్ 1న) షో పెట్టుకుని ఇంతవరకు జాబితా ఫైనల్ చేయకపోవడం నిజంగానే విడ్డూరం! బిగ్బాస్ టీమ్ సెలక్ట్ చేసిన లిస్టులో కొందరి పేర్లు ఈపాటికే లీకయ్యాయి. అందులో కొందరైతే చాలామందికి తెలియను కూడా తెలీదు. ఏదేమైనా ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితా ఇదేనంటూ నెట్టింట ఓ లిస్టు వైరలవుతోంది. దీని ప్రకారం.. సీనియర్ నటి సనా హౌస్లోకి రానుందట.ప్రచారంలో కొత్త పేర్లుకమెడియన్ యాదమ్మ రాజు, నటి అంజలి పవన్, యాంకర్ రీతూ చౌదరి, యాంకర్ సౌమ్య రావు, ఏక్నాథ్ హారిక, సింగర్ సాకేత్ కంటెస్టెంట్లుగా దాదాపు కన్ఫార్మ్ అయ్యారట! కృష్ణ ముకుంద మురారీ సీరియల్ ఫేమ్ యష్మి గౌడ కూడా బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టనుందని తెలుస్తోంది. యువసామ్రాట్, హర్షసాయి, విష్ణుప్రియ, బంచిక్ బబ్లూ, సోనియా సింగ్, బెజవాడ బేబక్క పేర్లు వినిపించినా ఇంతవరకు ఫైనల్ కాలేదని భోగట్టా!ఆమె తప్పుకుందా?నటుడు ప్రభాకర్, కిర్రాక్ ఆర్పీ, ఇంద్రనీల్, అనిల్ గీల, బుల్లితెర నటుడు రవితేజ, సెల్వరాజ్, మోడల్ సయ్యద్ రోహన్ అబుల్ పేర్లు వినిపిస్తున్నాయి. గత సీజన్ రన్నరప్ అమర్దీప్ భార్య తేజస్విని గౌడ కూడా షోలోకి వస్తుందని మొదటి నుంచి ప్రచారం జరిగింది. అయితే పారితోషికం దగ్గర చర్చలు విఫలం కావడంతో ఆమె ఈ సీజన్ నుంచి తప్పుకుందట. బహుశా నెక్స్ట్ సీజన్కు వద్దామని ఈసారి సైడ్ అయిపోయిందేమో!చదవండి: Chiranjeevi Birthday: సుప్రీమ్ హీరో.. మెగాస్టార్గా.. -
బిగ్బాస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ? క్లారిటీ ఇచ్చేసిన బుల్లితెర నటి!
బిగ్బాస్ షోలో కంటెస్టెంట్లు వారి ఆటమీద కన్నా పక్కవారి ఆట మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. వాళ్లు చీటింగ్ చేస్తున్నారు, వాళ్లను సపోర్ట్ చేస్తున్నారు, వాళ్లకే ఫేవరిజం చేస్తున్నారు అంటూ పదేపదే ఇతరుల మీద ఏడుస్తూ అనవసర గొడవలకు దిగుతున్నారే తప్ప అసలైన ఆట ఆడటం లేదు. వీళ్లతో షోని నెట్టుకురావడం అయ్యేపని కాదని పసిగట్టిన బిగ్బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలను తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో కెవ్వు కార్తీక్, భోలె షావళి, పూజా మూర్తి, నయని పావని, అంబటి అర్జున్, అంజలి పవన్ హౌస్లోకి వెళ్లనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ చివరికి అంజలి పవన్ హౌస్ నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. అలాగే మరో కొత్త లేడీ కంటెస్టెంట్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనుందని భోగట్టా! ఇదిలా ఉంటే బిగ్బాస్ ఎంట్రీపై అంజలి పవన్ స్పందించింది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. 'బిగ్బాస్కు వెళ్తున్నానా? లేదా? అని చాలామంది అడుగుతున్నారు. బిగ్బాస్ అనగానే అమ్మో అనిపించింది. ఎందుకంటే, నేను ఇల్లు వదిలి ఎక్కువ రోజులు ఉండలేను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ, తర్వాత పవన్.. వీళ్లను వదిలి ఎక్కడికీ వెళ్లలేదు. ధన్విక పుట్టిన తర్వాత తనే నా ప్రపంచమైపోయింది. తను బెంగ పెట్టుకుంటుందో లేదో కానీ నేను మాత్రం బెంగ పెట్టుకుంటాను. పవన్ వెళ్లుంటే బాగుండేది, కానీ నేను వెళ్లాలనేసరికి ఆలోచించాను. ఎన్నిరోజులు అక్కడ ఉంటామో కూడా తెలీదు కాబట్టి.. అది నాకు సెట్ కాదనుకున్నాను. వైల్డ్ కార్ట్ ఎంట్రీకి అడిగారు.. కానీ ఆట మొదలైన నెల రోజుల తర్వాత హౌస్లోకి వెళ్లడం కరెక్టేనా? అక్కడ ఉండగలనా? ఇలా చాలా ప్రశ్నలు లేవనెత్తారు మా ఇంట్లోవాళ్లు. మళ్లీ హౌస్లోకి వెళ్లి నెగెటివ్ అయి వస్తే బాగోదనిపించింది. అందుకే వెళ్లాలా? వద్దా? అని ఆలోచించి వెనకడుగు వేశాను. ఈ సీజన్కు వద్దు అనుకున్నాను. నేను బిగ్బాస్ 7లో పాల్గొనడం లేదు. ఏమైనా ఉంటే తర్వాతి సీజన్లో చూసుకుందాం.. అని చెప్పుకొచ్చింది అంజలి పవన్. చదవండి: డబుల్ షాక్ ఉంటుందా?.. హౌస్లో స్టార్ హీరోల సందడి!