aravind yadav
-
ఏపీ భవన్ ఓఎస్డీగా అరవింద్ నియామకం
ఢిల్లీ: ఏపీ భవన్ మీడియా వ్యవహారాల ఓఎస్డీగా సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ యాదవ్ నియామకం అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారిక జీవో విడుదల చేశారు. మీడియా రంగంలో 24 ఏళ్లుగా విశేష సేవలందించిన అరవింద్ యాదవ్ ఇక మీదట ఏపీ భవన్ కేంద్రంగా విధులు నిర్వర్తించనున్నారు. ఆయన తెలుగు, ఇంగ్లీష్, హిందీ మీడియా సంస్థలలోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు. జాతీయ మీడియా సంస్థలు ఆజ్ తక్, ఐబిఎన్ 7లో దక్షిణ భారత వ్యవహారాల పాత్రికేయుడిగా పని చేశారు. టీవీ9, సాక్షి, యువర్ స్టోరీ మీడియాల్లోనూ కీలక బాధ్యతలు చేపట్టారు. అరవింద్ పలు హిందీ పుస్తకాలను రచించారు. -
అంజన్కుమార్ యాదవ్ కుమారుడి అరెస్ట్
-
అంజన్కుమార్ యాదవ్ కుమారుడి అరెస్ట్
హైదరాబాద్: పరారీలో ఉన్న ఎంపీ అంజన్కుమార్ యాదవ్ కుమారుడు అరవింద్ యాదవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుస్సేనీఆలం పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ వంశీపై దాడి చేసిన ఉదంతంలో అరవింద్ యాదవ్ నిందితుడిగా ఉన్నారు. ఆదివారం రాత్రి కానిస్టేబుల్పై అరవింద్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్లో నడిరోడ్డుపై హోలీ ఆడుతూ కానిస్టేబుల్పై దాడి చేశాడు. దీంతో అతడిపై విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం, విధులకు ఆటంకం కలిగించడంపై సెక్షన్ 332, భయబ్రాంతులకు గురిచేయడంపై సెక్షన్ 506 కింద కేసులు నమోదు చేశారు. కాగా, కానిస్టేబుల్ వంశీపై ఎంపీ కుమారుడు దాడికి పాల్పడడాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై.గోపిరెడ్డి, నగర అధ్యక్షుడు ఎన్.శంకర్రెడ్డి తీవ్రంగా ఖండించారు. వంశీని వారు సోమవారం పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు. -
సుపుత్రుల వీరంగం...
తమ చేష్టలతో ఇద్దరు నేతల పుత్రరత్నాలు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఒకరు మద్యం మత్తులో వీరంగం వేస్తే.... మరొకరు ఏకంగా కానిస్టేబుల్పైనే దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సుపుత్రుడు అరవింద్ యాదవ్కు కోపం వచ్చింది. దాంతో నన్నే ప్రశ్నిస్తావా అంటూ కానిస్టేబుల్పై చేయి చేసుకుని తండ్రి అధికార దర్పాన్ని కుమారుడు ప్రదర్శించాడు. పాత బస్తీలోని హుస్సేనిఆలంలో హోలీ వేడుకలు నిర్వహించారు. అరవింద్ యాదవ్- కామదహన్ కార్యక్రమంలో పాల్గొని ట్రాఫిక్ను పూర్తిగా నిలిపివేయడంతో బందోబస్తులో ఉన్న ట్రాఫిక్ను క్రమబద్దీకరించేందుకు యత్నించాడు. అయితే రోడ్డుపై హోలీ ఆడవద్దని చెప్పినందుకు వంశీ అనే కానిస్టేబుల్పై అరవింద్ యాదవ్ దాడి చేసి చితక్కొట్టాడు. గాయాలపాలైన వంశీ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుని.. హుస్సేన్ ఆలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అరవింద్ యాదవ్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అంజన్కుమార్యాదవ్ తన కుమారుడుని కేసులో నుంచి తప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో తన కుమారుడి తప్పేమీ లేదంటూ వెనకేసుకు రావటం విశేషం. ఈ సంఘటన మరవకముందే మారో మాజీ మంత్రి కుమారుడు రవితేజ శంషాబాద్ విమానాశ్రయంలో తప్పతాగి తన స్నేహితులతో కలిసి హల్చల్ చేశాడు. మద్యం మత్తులో హంగామా సృష్టించారు. తప్పతాగి బార్ సిబ్బంది, పుష్పక్ బస్ డిపో కౌంటర్పై దాడికి పాల్పడ్డారు. తన స్నేహితుడు ఇంద్రజిత్తో కలిసి రవితేజ రచ్చ చేశాడు. ఎయిర్పోర్టు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చట్ట ప్రకారం రవితేజపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, ఒకవేళ ఒత్తిళ్లు వచ్చినా లొంగేది లేదని పోలీసులు తెలిపారు. ఇక తండ్రుల పరపతిని అడ్డం పెట్టుకొని నేతాశ్రీల తనయుడులు రెచ్చిపోవటం గతంలోనూ జరిగాయి కూడా. అవకాశం దొరికినప్పుడల్లా రాజకీయ నేతల కుమారుల వీరంగం వేస్తుండటం ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు తమ పుత్రుల అత్యుత్సాహంతో నేతలు కంగారు పడుతున్నారు. ఎన్నికల వేళ తమ కుమారులు రెచ్చిపోతుండడంతో గాభరా పడుతున్నారు. ఇక తండ్రులు తమ వెనక కొండంత అండగా ఉండటంతో పుత్నరత్నాలు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. -
ఎంపీ తనయుడిపై కేసు నమోదు
హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అరవింద్ యాదవ్పై కేసు నమోదు అయ్యింది. కానిస్టేబుల్పై దాడి చేసిన కేసులో అతనిపై హుస్సేన్ ఆలం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే రోడ్డుపై హోలీ ఆడవద్దని చెప్పినందుకు ఓ కానిస్టేబుల్పై దాడి చేసి చితక్కొట్టాడు. అరవింద్ యాదవ్- కామదహన్ కార్యక్రమంలో పాల్గొని ట్రాఫిక్ను పూర్తిగా నిలిపివేయడంతో బందోబస్తులో ఉన్న కానిస్టేబుల్ వంశీ ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నించాడు. అంతలో ఆగ్రహించిన ఎంపీ తనయుడు...కానిస్టేబుల్ వంశీపై దాడి చేశాడు. గాయాలపాలైన వంశీ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుని.. హుస్సేన్ ఆలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అరవింద్ యాదవ్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అంజన్కుమార్యాదవ్ తన కుమారుడుని కేసులో నుంచి తప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అరవింద్ యాదవ్ స్నేహితులను, ఇతర అనుచరులనైనా కేసులో ఇరికించి, ప్రధాన నిందితుడైన అరవింద్ను కేసు నుంచి బయటపడేసేందుకు తన పలుకుబడిని ఉపయోగిస్తున్నట్లు సమాచారం.