Archana Verma
-
విన్నపాలు వినవలె..!
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజన ప్రక్రియలో భాగంగా ఉద్యోగుల పంపిణీపై ఏర్పా టైన కమల్నాథన్ కమిటీ రెండో రోజైన శనివారం కూడా ఇరు ప్రాంతాలకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అయింది. విభజనకు అనుసరించాల్సిన మార్గదర్శకాల రూపకల్పనలో భాగంగా వారి అభిప్రాయాలను తెలుసుకుంది. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని తెలంగాణ సంఘాల ప్రతినిధులు మరోసారి స్పష్టం చేశారు. సర్వీస్ రిజిస్టర్లో పేర్కొన్న వివరాల ప్రకారం స్థానికతను నిర్ధారించాలని కోరారు. జనాభా నిష్పత్తిలో కాకుండా జిల్లాల నిష్పత్తిలో ఉద్యోగుల పంపిణీ జరగాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆప్షన్స్ ఆధారంగానే విభజన జరగాలని, ఉద్యోగుల మనోభావాలకు విరుద్ధంగా మార్గదర్శకాలు ఉండకూడదని సీమాంధ్ర సంఘాల నేతలు వాదించారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరిగితేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని, లేదంటే ప్రత్యేక రాష్ట్రంలో కూడా సీమాంధ్ర ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉండిపోయే అవకాశముందని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం పేర్కొంది. తాము ఆప్షన్లకు వ్యతిరేకమని తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర స్థాయి పోస్టే అయినప్పటికీ డిప్యూటీ కలెక్టర్లుగా నియమితులైన వారిని జోన్ల ఆధారంగా స్థానికతను నిర్ధారించి సొంత రాష్ట్రాలకే కేటాయించాలని తెలంగాణ తహశీల్దార్ల సంఘం పేర్కొంది. హెచ్ఎండీఏ పరిధిలోని మండలాలకు తహశీల్దార్లను కాకుండా.. ఆ పోస్టులను అప్గ్రేడ్ చేసి డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం నియమించిందని, ఇప్పుడు ఈ పోస్టులను రాష్ట్ర స్థాయి పోస్టులుగా పరిగణిస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని వాదించింది. ఈ వాదనతో కమల్నాథన్ ఏకీభవించారు. అవసరమైన కొందరికి మాత్రమే ఆప్షన్ ఇవ్వాలని, మిగతా వారిని స్థానికత ఆధారంగానే పంచాలని తెలంగాణ ఇంజనీర్ల జేఏసీ తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లనూ కమల్నాథన్ కమిటీ పరిధిలో చేర్చాలని, స్థానికతనే పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ గిరిజన ఉద్యోగుల సమాఖ్య కోరింది. స్థానికతనే పరిగణించాలంటూ తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం నేతలు కమల్నాథన్కు వినతిపత్రం సమర్పించారు. ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో దాదాపు 500 మంది స్థానికేతరులు డిప్యుటేషన్ వచ్చి 5, 6 జోన్లలో అక్రమంగా పనిచేస్తున్నారని తెలంగాణ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం ఫిర్యాదు చేసింది. విద్యాభ్యాసం ఆధారంగా స్థానికతను నిర్ధారించి ఆయా ఉద్యోగులను సొంత రాష్ట్రాలకు తరలించాలని, రాష్ర్ట స్థాయి పోస్టుల్లో ఉన్న ప్రిన్సిపాళ్లను కూడా వారి వారి జోన్లకు పంపించాలని విజ్ఞప్తి చేసింది. కాగా, రిజర్వేషన్ నిబంధనల మేరకు రెండు రాష్ట్రాల్లోని పోస్టుల సంఖ్యను స్పష్టంగా పేర్కొనాలని, అందుకు తగినట్లే ఎస్సీ, ఎస్టీల ప్రాధాన్యత కల్పించాలని సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఆప్షన్స్ మేరకే ఉద్యోగులను విభజించాలని సీమాంధ్ర గెజిటెడ్ అధికారుల సంఘం విన్నవించింది. ఇక విద్యుత్ ఉద్యోగులందరికీ ఆప్షన్ ఇవ్వాలని, తెలంగాణ ఆప్షన్ ఇచ్చిన సీమాంధ్ర ఉద్యోగులకు హెచ్ఎండీఏ పరిధిలోనే పోస్టింగ్ ఇచ్చే విధంగా చట్టాన్ని సవరించాలని సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ అభిప్రాయపడింది. పదేళ్లు ఉమ్మడి రాజధాని అయినందున ఆ తర్వాత ఆప్షన్ మార్చుకునే అవకాశాన్ని ఇరు రాష్ట్రాల్లో కల్పించాలని సూచించింది. -
జూన్ రెండుకల్లా ఉద్యోగుల విభజన పూర్తి చేస్తాం
న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజనపై కసరత్తు ప్రారంభమైంది. ఈ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఏర్పాటైన కమల్నాథన్ కమిటీ గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతితో కలసి డీవోపీటీ అధికారులతో సమావేశమైంది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వాధికారులు అర్చనావర్మ, కె.కిప్జెన్, ఎస్.నాయక్, ప్రతాప్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్, జీఏడీ ముఖ్య కార్యదర్శి ఎస్కే సిన్హా తదితరులు పాల్గొన్నారు. రెండు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో.. ఉద్యోగుల విభజనపై అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఎలా ఉండాలనే అంశం మీదే చర్చ సాగింది. రెండు వారాల్లో మార్గదర్శకాలు రూపొందిస్తామని కమల్నాథన్ పేర్కొన్నారు. ఉద్యోగుల విభజనపై విధి విధానాలు ఎలా ఉండాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు.స్థానికతనా లేక మరింకేమైనా అంశాలను ఆధారం చేసుకోవాలా అన్న దానిపై చర్చించినట్లు కమల్ నాథన్ తెలిపారు. దీనిపై మరోసారి సమావేశమవుతామని స్పష్టం చేశారు. జూన్ రెండు కల్లా ఉద్యోగుల విభజన పూర్తి చేస్తామన్నారు. -
ఉద్యోగుల విభజనపై కసరత్తు
-
ఉద్యోగుల విభజనపై కసరత్తు
* సీఎస్తో కమల్నాథన్ కమిటీ భేటీ * మార్గదర్శకాల రూపకల్పనకు తొలి సమావేశం * 2 వారాల్లోనే పూర్తి చేసే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజనపై కసరత్తు ప్రారంభమైంది. ఈ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఏర్పాటైన కమల్నాథన్ కమిటీ గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతితో సమావేశమైంది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వాధికారులు అర్చనావర్మ, కె.కిప్జెన్, ఎస్.నాయక్, ప్రతాప్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్, జీఏడీ ముఖ్య కార్యదర్శి ఎస్కే సిన్హా తదితరులు పాల్గొన్నారు. రెండు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో.. ఉద్యోగుల విభజనపై అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఎలా ఉండాలనే అంశం మీదే చర్చ సాగింది. భేటీ అనంతరం సమావేశం వివరాలను అధికారులు వెల్లడించారు. వాటిలో ముఖ్యాంశాలు ఇవీ.. * మార్గదర్శకాలు ఖరారు, అన్ని శాఖల స్టాఫ్ పాట్రన్ నిర్ధారణ తర్వాతే ఉద్యోగుల విభజన మొదలవుతుంది. పోస్టులను జనా భా నిష్పత్తిలో విభజించిన తర్వాత ఉద్యోగుల కేటాయింపు ప్రారంభమవుతుంది. * కమిటీ సూచనలకు అనుగుణంగా పోస్టుల గణాంకాలపై రెండు మూడు రోజుల్లో అధికారులు నివేదిక రూపొందించనున్నారు. * రాష్ట్రంలో 76 వేల రాష్ట్ర స్థాయి పోస్టులు ఉన్నాయని అధికారుల అంచనా. ప్రస్తుతం ఈ పోస్టుల్లో పనిచేస్తున్న 52 వేల మంది ఉద్యోగుల వివరాలు ప్రభుత్వానికి అందాయి. మరో 4 వేల మంది వివరాలు త్వరలో అందుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. * ఉద్యోగుల విభజనలో అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఖరారు చేయడానికి కమిటీకి నెల రోజుల గడువు ఉంది. అయితే రెండు వారాల్లోనే పని పూర్తి చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కేవలం రాష్ట్ర స్థాయి పోస్టులు, సింగిల్ యూనిట్ (సచివాలయం, రాజ్భవన్, శాసనసభ) ఉద్యోగుల విభజన కమిటీ పరిధిలో ఉంటుంది. అఖిల భారత అధికారుల విభజనతో సంబంధం లేదు. * కమిటీ తదుపరి సమావేశం వచ్చే వారం నిర్వహించవచ్చు. ఉద్యోగ సంఘాలతోనూ కమిటీ భేటీ అయ్యే అవకాశం ఉంది. సొంత జిల్లాలకు వెళ్లడానికి అనుమతించాలి ఓపెన్ కోటా టీచర్లపై పీఆర్టీయూ సాక్షి, హైదరాబాద్: ఓపెన్ కేటగిరీలో ఎంపికైన నాన్ లోకల్ టీచర్లు సొంత జిల్లాలకు వెళ్లడానికి వీలుగా వారికి ఆప్షన్ సౌకర్యం కల్పించాలని పీఆర్టీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు కమల్నాథన్ కమిటీకి సిఫార్సు చేయాలని కోరుతూ పీఆర్టీయూ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఎమ్మెల్సీలు గాదె శ్రీనివాసులు నాయుడు, కె.జనార్దన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్రెడ్డితో కూడిన ప్రతినిధి బృందం గురువారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ను కలసి విజ్ఞప్తి చేసింది. ప్రతినిధి బృందం సమర్పించిన వినతిపత్రంలోని ముఖ్యాంశాలివీ... * ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులను ఒకే యాజమాన్యం కిందకు తీసుకురావాలి. టీచర్లకు పదోన్నతులు కల్పించి.. విద్యాశాఖలోని ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. * రాష్ట్రంలో 3.50 లక్షల మంది ఉపాధ్యాయుల వివరాలను కంప్యూటరీకరించి ఆన్లైన్లో పొందుపరచాలి. * గతేడాది బదిలీ చేసి, ఇంకా రిలీవ్ చేయని ఉపాధ్యాయులను ఈ విద్యాసంవత్సరం ఆఖరు రోజు (లాస్ట్ వర్కింగ్ డే) రిలీవ్ చేయాలి.