breaking news
ASEAN countries
-
బలమైన, ఐక్య ఆసియాన్
న్యూఢిల్లీ: అర్ధవంతమైన, దృఢమైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా కృషి చేయాలని ఆసియాన్, భారత్ నిర్ణయించాయి. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వాణిజ్యం, ప్రాంతీయ భద్రతకు సంబంధించి తలెత్తిన ఇబ్బందుల పరిష్కారానికి అన్వేషించాలని అంగీకరించాయి. గురువారం ఢిల్లీలో జరిగిన ఆసియాన్ విదేశాంగ మంత్రుల భేటీలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రారంభోపన్యాసం చేశారు. యుద్ధం ప్రభావం ఆహారం, ఇంధన భద్రత, వినియోగవస్తువులు, ఎరువుల ధరల పెరుగుదలతోపాటు రవాణా, సరఫరా గొలుసుపై పడిందన్నారు. వాణిజ్యం, అనుసంధానత, రక్షణ, టీకా ఉత్పత్తి, ఇంధనం వంటి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని భారత్– ఆసియాన్ తీర్మానించాయి. ఆసియాన్–భారత్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ (ఏఐటీఐజీఏ)పై సమీక్ష జరపాలని నిర్ణయించాయి. 10 దేశాలతో కూడిన ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య(ఆసియాన్)తో సంబంధాలకు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఈ సమావేశానికి సింగపూర్, బ్రూనై, ఇండోనేసియా, కాంబోడియా, మలేసియా, వియత్నాం దేశాల విదేశాంగ మంత్రులు వారు ప్రధాని మోదీతోనూ సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. ఏడీపీని విస్తరించాలి: మోదీ న్యూఢిల్లీ: ఆకాంక్ష జిల్లాల పథకం(ఏడీపీ)ను బ్లాకులు, నగరాల్లో కూడా అమలు చేయాలని ప్రధాని మోదీ కోరారు. అవి స్ఫూర్తిదాయ జిల్లాలుగా మారాలని ఆకాంక్షించారు. ‘‘దేశ వ్యాప్తంగా 112 వెనకబడ్డ జిల్లాల్లో కేంద్రం 2018 నుంచి అమలు చేస్తున్న ఈ పథకం ఎంతో విజయవంతమైంది’’ అన్నారు. హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో జరుగుతున్న రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల భేటీలో ప్రధాని గురువారం మాట్లాడారు. టీచర్లు డిజిటల్ టెక్నాలజీ, మొబైల్ యాప్లతో విద్యాబోధనను బలోపేతం చేయాలన్నారు. రిటైర్డ్ టీచర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఉపాధ్యాయ శిక్షణ కోసం ప్రత్యేకంగా టీవీ చానల్ అవసరం ఉందని చెప్పారు. -
‘ఆసియాన్’ ఐక్యత మాకు ముఖ్యం
న్యూఢిల్లీ: 10 కీలక దేశాలతో కూడిన ‘ఆసియాన్’ ఐక్యతకు భారత్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆసియాన్ దేశాల మధ్య ఐక్యత తమకు చాలా ముఖ్యమని చెప్పారు. ఆయన గురువారం కూటమి దేశాల శిఖరాగ్ర సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కోవిడ్–19 మహమ్మారి వల్ల మనం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నామని గుర్తుచేశారు. ఈ ప్రతికూల సమయం భారత్– ఆసియాన్ స్నేహానికి ఒక పరీక్ష లాంటిదేనని అన్నారు. పరస్పర సహకారం భవిష్యత్తులో మన సంబంధాలను బలోపేతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్, ఆసియాన్ మధ్య వేలాది సంవత్సరాలుగా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయని, ఇందుకు చరిత్రనే సాక్షి అని గుర్తుచేశారు. పురాతన సంబంధ బాంధవ్యాలను మనం పంచుకుంటున్న విలువలు, సంప్రదాయాలు, సంస్కృతులు, భాషలు, రచనలు, ఆహారం, నిర్మాణ శాస్త్రం వంటివి ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. భారత్– ఆసియాన్ భాగస్వామ్యానికి వచ్చే ఏడాది 30 ఏళ్లు నిండుతాయని మోదీ తెలిపారు. అలాగే స్వతంత్ర భారతదేశానికి 75 ఏళ్లు పూర్తవుతాయన్నారు. ఈ ముఖ్యమైన సందర్భాలను పురస్కరించుకొని 2022ను ‘భారత్– ఆసియాన్ ఫ్రెండ్షిప్ ఇయర్’గా పరిగణిస్తూ వేడుకలు జరుపుకుంటామని అన్నారు. ఆసియాన్ కూటమితో బంధాలను బలోపేతం చేసుకొనేందుకు భారత్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. 2021లో ఆసియాన్కు విజయవంతంగా నాయకత్వం వహించిన బ్రూనై సుల్తాన్కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ‘ఆసియాన్’కూటమిలో బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయ్లాండ్, వియత్నాం సభ్య దేశాలుగా ఉన్నాయి. భారత్తో సహా అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా ఈ కూటమితో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నాయి. నేటి నుంచి మోదీ ఇటలీ, యూకే పర్యటన వాటికన్లో పోప్ ఫ్రాన్సిస్తో సమావేశం ఇటలీలోని రోమ్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లపై, యూకేలోని గ్లాస్గోలో వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాల అధినేతలతో చర్చించబోతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇటలీ, యూకే పర్యటనకు ముందు ఆయన గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మోదీ ఈ నెల 29 నుంచి 31 దాకా రోమ్లో, నవంబర్ 1 నుంచి 2 వరకూ గ్లాస్గోలో పర్యటించనున్నారు. రోమ్లో జి–20 శిఖరాగ్ర సదస్సులో, గ్లాస్గోలో కాప్–26 దేశాల అధినేతల సదస్సులో పాలుపంచుకుంటారు. ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాఘీ ఆహ్వానం మేరకు రోమ్తోపాటు వాటికన్ సిటీతో పోప్ ఫ్రాన్సిస్తో సమావేశమవుతానని మోదీ వెల్లడించారు. 16వ జి–20 సదస్సులో పాల్గొంటానని చెప్పారు. భాగస్వామ్య దేశాల అధినేతలతో సమావేశమై, భారత్తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తానని పేర్కొన్నారు. గ్లాస్గోలో రెండు రోజులపాటు జరిగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ(కాప్) సదస్సుకు 120 దేశాల అధ్యక్షులు, ప్రతినిధులు హాజరవుతారన్నారు. -
‘ఆర్సీఈపీ’పై సంతకాలు
సింగపూర్: ప్రపంచంలోనే అతిపెద్దదైన వాణిజ్య ఒప్పందంపై చైనా సహా 15 ఆసియా పసిఫిక్ దేశాలు ఆదివారం సంతకాలు చేశాయి. ప్రపంచ ఆర్థిక రంగంలో దాదాపు మూడో వంతుకు ప్రాతినిధ్యం వహించే ఈ ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం(రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్– ఆర్సీఈపీ)’లో భారత్ భాగస్వామిగా లేదు. ఆర్సీఈపీపై సభ్య దేశాల మధ్య గత ఎనిమిదేళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. ఆగ్నేయాసియా దేశాల నేతలు, వారి ప్రాంతీయ భాగస్వాముల మధ్య జరిగిన వార్షిక సదస్సు కోవిడ్–19 ముప్పు కారణంగా ఈ సంవత్సరం వర్చువల్గా జరిగింది. సంతకాలు జరిగిన రెండేళ్లలోపు సభ్య దేశాలన్నీ ఈ ఒప్పందాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తరువాత ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం సభ్య దేశాలు అత్యధిక రంగాల్లో వాణిజ్య పన్నులను క్రమంగా తగ్గించాల్సి ఉంటుంది. చైనా ప్రాబల్యం అధికంగా ఉండే ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చల నుంచి భారత్ గత సంవత్సరం వైదొలగింది. వాణిజ్య పన్నుల తగ్గింపు వల్ల భారతీయ మార్కెట్ దిగుమతులతో పోటెత్తుతుందని, అది దేశీయ ఉత్పత్తులకు హానికరమవుతుందన్న ఆందోళనలతో భారత్ ఆ నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్ ఈ ఒప్పందంలో చేరేందుకు ఇంకా అవకాశాలున్నాయని సభ్య దేశాలు పేర్కొన్నాయి. ఆర్సీఈపీకి ప్రతిపాదన మొదట 2012లో వచ్చింది. ప్రస్తుతం చైనా, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్, సింగపూర్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. కోవిడ్ కారణంగా ఆర్సీఈపీ సభ్య దేశాలే కాకుండా దాదాపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయని ప్రస్తుత వర్చువల్ సదస్సు ఆతిథ్య దేశం వియత్నాం ప్రధానమంత్రి గ్యుయెన్ జువాన్ పేర్కొన్నారు. బహుముఖ వాణిజ్య విధానానికి ‘ఆసియాన్’ నాయకత్వం వహిస్తోందన్న సందేశాన్ని ఈ ఒప్పందం ఇస్తోందన్నారు. సమీప భవిష్యత్తులో ఈ ఒప్పందంలో భారత్ కూడా భాగస్వామిగా చేరుతుందన్న విశ్వాసం ఉందని సింగపూర్ పీఎం లీ సీన్ లూంగ్ అన్నారు. భారత్ చేరికతో ఆసియాలో ప్రాంతీయ సహకారం, సమగ్రతకు సంపూర్ణ రూపం చేకూరుతుందన్నారు. ఆర్సీఈపీ ప్రయోజనాలను ప్రజలు అర్థం చేసుకుని, ఈ ఒప్పందాన్ని వారు ప్రోత్సహించేలా చూడాలని సభ్యదేశాలను ఆయన కోరారు. ఎనిమిదేళ్ల కఠోర కృషి అనంతరం ఈ ఒప్పందానికి తుది రూపు వచ్చిందని మలేసియా వాణిజ్య మంత్రి మొహ్మద్ అజ్మీన్ అలీ వ్యాఖ్యానించారు. ఈ ఆసియాన్ వర్చువల్ సదస్సు నాలుగు రోజుల పాటు జరిగింది. సౌత్ చైనా సీపై చైనా ఆధిపత్యాన్ని ఆసియాన్లోని అత్యధిక దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. -
గణతంత్ర దినోత్సవ అతిథిలు.. వీరే!?
మనీలా : దూకుడు మీదున్న చైనాకు ముకుతాడు వేసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎవరూ ఊహించని వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. చైనాకు చుట్టూ ఉండే.. 10 ఆసియాన్దేశాధి నేతలను 2018 గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథులుగా రావాలని ఆహ్వానించారు. రిపబ్లిక్ డే పరేడ్లో చేసే సైనిక, విన్యాసాలు, ఆయుధ ప్రదర్శనలను ప్రత్యేకంగా తిలకించాలని ఆసియాన్ నేతలను మోదీ ప్రత్యేకంగా కోరారు. మనీలాలో జరిగిన 15న ఆసియా సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఆసియాన్ దేశాల శాంతియుత అభివృద్ధికి, ప్రాంతీయ రక్షణకు, నిబంధనల ఆధారంగా పనిచేసేందుకు భారత్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 25న న్యూఢిల్లీలో జరిగే ఆసియాన్ ప్రత్యేక సదస్సులో మన బంధం మరింత ధృఢపడాలని మోదీ ఆకాంక్షను వ్యక్తం చేశారు. భారతదేశ 69వ గణతంత్ర దినోత్సవాలకు 125 కోట్ల భారతీయులు ఆసియాన్ అధినేతలకు స్వాగతం పలుకుతున్నారని ఆయన చెప్పారు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంచేయాలని మోదీ పిలుపునిచ్చారు. అసియాన్ అధినేతలంతా రిపబ్లిక్ డే ఉత్సవాలకు రానున్న నేపథ్యంలో భారీగా ద్వైపాక్షిక, మిలటరీ, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. 2015 రిపబ్లిక్ డే ఉత్సవాలకు అప్పటి అమెరకా అధ్యక్షుడు బరాక్ ఒబామా, 2016లో ఫ్రాన్ష అధ్యక్షుడు ఫ్రాన్సిస్ హోలాండో, 2017లో యూఏఈ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ జియాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 2018ల గణతంత్ర దినోత్సవాలకు ఆసియాన్ దేశాలైన ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, కాంబోడియా, లావోస్, మయన్మార్, వియాత్నాం దేశాధినేతలు హాజరుకానున్నారు. -
ఉద్యోగాన్వేషణకు... ఆగ్నేయాసియా
టాప్ స్టోరీ: ఫారిన్ ఎడ్యుకేషన్ అన్నా..విదేశాల్లో ఉద్యోగం అన్నా మన యువతలో ఎనలేని ఆసక్తి. డిగ్రీ పట్టా చేతికి అందగానే విద్య, ఉద్యోగం అంటూ విదేశాల వైపు చూసేవారెందరో ఉన్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా అమెరికా, ఐరోపా దేశాల్లో అనిశ్చితి నెలకొన్న సమయంలో కూడా.. అవకాశాల కల్పనలో ఆ దేశాలకు దీటుగా నిలిచాయి ఆసియాన్ దేశాలు. స్వేచ్ఛా వ్యాపారం, ప్రపంచీకరణ ఫలితంగా ఆసియాన్ దేశాల స్వరూపమే మారిపోయింది. పెరుగుతున్న వాణిజ్యం, ఊపందుకున్న వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరం ఏర్పడింది. అవకాశాలు ఎక్కడ ఉన్నా ఇట్టే పసిగట్టే భాగ్యనగర యువత.. తమ కెరీర్కు గమ్యంగా ఆగ్నేయాసియా దేశాలను ఎంచుకుంటున్నారు. ఆయా దేశాల్లో వాలిపోతున్న యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆసియాన్ దేశాలకు వెళ్లేవారు తమ కెరీర్ను విజయవంతం చేసుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలు.. అసోసియేషన్ ఆఫ్ సౌత్ఈస్ట్ ఏషియన్ నేషన్స్కు సంక్షిప్త రూపం..ఆసియాన్ (అఉఊ). సింగపూర్, మలేషియా, థాయ్లాండ్, ఇండోనేషియా, ఫిలిఫ్పైన్స్, వియత్నాంలను ఆసియాన్ దేశాలుగా వ్యవహరిస్తారు. ఈ ఆగ్నేయాసియా దేశాల్లో కెరీర్ను ప్రారంభించాలంటే.. డిగ్రీలు, ప్రతిభను మాత్రమే నమ్ముకుంటే సరిపోదు. ఎందుకంటే మనతో పోల్చితే పూర్తి భిన్నమైన వాతావరణం, వివిధ దేశాల ప్రజలతో గ్లోబల్ విలేజ్ను తలపించే నేపథ్యం, సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసే అక్కడి సమాజం వంటి అంశాలపై పూర్తి అవగాహన ఉండాలి. అక్కడి పరిస్థితులపై క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. పలు కీలక అంశాలపై అవగాహన పెంచుకోవాలి. హైరింగ్ ట్రెండ్: సింగపూర్, మలేషియా, థాయ్లాండ్, ఇండోనేషియా, ఫిలిఫ్పైన్స్, వియత్నాం వంటి ఆసియాన్ దేశాల్లో గ్లోబలై జేషన్ ఫలితంగా అక్కడి వ్యాపార ముఖచిత్రమే మారిపో యింది. ప్రపంచంలో ఎనిమిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆసియాన్ అవతరించింది. ఈ దేశాల జీడీపీ వృద్ధి 2.3 ట్రిలియన్ యూఎస్ డాలర్లకు చేరుకుంది. అదే క్రమంలో వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయి. డిమాండ్ వీటికే: ఆగ్నేయాసియా దేశాల్లో టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, డిజిటల్ మీడియా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సర్వీస్ సెక్టార్ వంటి రంగాల్లో జోరుగా హైరింగ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఉదాహరణకు సింగపూర్ను తీసుకుంటే.. అక్కడి మ్యాన్పవర్ మినిస్ట్రీ అంచనా మేరకు పది ఉద్యోగాల్లో ఆరు విదేశీయులకే దక్కాయి. మలేషియాలో ఫైనాన్స్, టెక్నాలజీ రంగాలు ముందంజలో ఉంటున్నాయి. కారణాలు: ప్రపంచంలో అధిక శాతం కంపెనీలు ఆగ్నేయాసియా బాట పట్టాయి. దీనికి కారణం అక్కడి ప్రభుత్వాలు కల్పిస్తున్న ఆకర్షణీయమైన రాయితీలే. ఈ క్రమంలో చాలా కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసు కుంటున్నాయి. ఫలితంగా సంబంధిత వ్యవహారాల నిర్వహణ కోసం పెద్ద ఎత్తున మానవ వనరుల అవసరం ఏర్పడుతోంది. రెట్టింపు సిబ్బంది కావాలి: పర్యాటక, హోటళ్ల రంగాల్లో ఆగ్నేయాసియా దేశాలు ముందంజలో నిలుస్తున్నాయి. ఆయా దేశాల్లో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద హోటల్ వ్యవస్థ ఉంది. అక్కడి ప్రముఖ హోటళ్లు త్వరలో 47 కొత్త హోటళ్లను ప్రారంభించాలని ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. అంటే ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బంది కంటే రెట్టింపు సిబ్బంది కావల్సి ఉంటుంది. సంస్కృతికి పెద్ద పీట: ఆగ్నేయాసియా దేశాలకు ఉపాధి కోసం వెళ్లే విద్యార్థులు మొట్టమొదటగా అవగాహన పెంచుకోవాల్సిన కీలక అంశం.. ఆయా దేశాల సంస్కృతి, సంప్రదాయాలు. ఎందుకంటే అక్కడి ప్రజలు వాటికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. కాబట్టి ప్రయాణానికి ముందే అక్కడి సంస్కృతి సంప్రదాయాలపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలి. వాటిని గౌరవించడం నేర్చుకోవాలి. దాంతో కంపెనీలో పని చేసే సహచరులతో స్నేహసంబంధాలు ఏర్పడతాయి. వివిధ మాధ్యమాలు, ఇంటర్నెట్, పుస్తకాల ద్వారా ఆయా దేశాలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలి. వీలైతే అక్కడ స్థిరపడిన భారతీయుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పదజాలం: మరో కీలకాంశం.. భాష. ఆయా దేశాల్లో స్థానికంగా మాట్లాడే భాషపై అవగాహన కలిగి ఉండటం. అక్కడి ప్రజలు తమ సంభాషణలో భాగంగా తరుచుగా ఉపయోగించే కొన్ని పదాలను తెలుసుకోవాలి. ఉదాహరణకు మలేషియాలో ప్రజలు ఏ విషయాలకు నేరుగా కాదు లేదా నో (ూౌ) అని చెప్పరు. అటువంటి సందర్భం ఎదురైతే సున్నితంగా ‘ఐ విల్ ట్రై (ఐ ఠీజీ ్టటడ )’ అంటారు. కాబట్టి అలాంటి పదాలపై అవగాహన పెంచుకోవాలి. సమయ పాలన: ఆగ్నేయాసియా ప్రజలు అత్యంత ప్రాముఖ్యాన్నిచ్చే అంశాల్లో సమయ పాలన ఒకటి. దీన్నిబట్టి ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. ప్రజలు సంబంధ బాంధవ్యాలకు కూడా ఎక్కువ విలువనిస్తారు. ఒకరితో ఒకరు స్నేహం పెంచుకోవడానికి తరుచుగా కలుసుకోవడం కీలకమని భావిస్తుంటారు. ఇతరులతో వ్యవహారాలను నిర్వహిం చేటప్పుడు ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. ఆహార అలవాట్లు: మరో అంశం.. ఆహార అలవాట్లు. పూర్తిగా మన దేశానికి భిన్నమైన వంటకాలు అక్కడ కనిపిస్తాయి. ఆయా దేశాల్లో ఎక్కువగా ఉపయోగించే ఆహారం, సంబంధిత అలవాట్లను క్షుణ్నంగా తెలుసుకోవడం మంచిది. అక్కడ ఆహారం తీసుకోవడానికి ఎక్కువగా చాప్ స్టిక్స్ వినియోగిస్తారు. కాబట్టి వాటి వినియోగంపై అవగాహన పెంచుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. కార్యాలయాల్లో.. కార్యాలయాల్లో హుందాగా ప్రవర్తించాలి. సందర్భానుసారంగా హావభావాల ప్రకటన ఉండాలి. చొరవగా కలివిడిగా అందరితో మంచి సంబంధాలను కలిగి ఉండడం కెరీర్లో రాణించడానికి దోహదం చేస్తుంది. అక్కడికి చేరుకున్నాక ఫ్రెండ్స్, కుటుంబ, సహచరుల, సంబంధిత అసోసియేషన్ల ఫోన్ నెంబర్లు, చిరునామా, ఈ-మెయిల్ తదితర వివరాలను దగ్గర ఉంచుకోవాలి. మీ చదువు, నైపుణ్యం, పరిజ్ఞానానికి అనువైన ఉద్యోగాలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కోసారి మనం ప్రాముఖ్యం ఇవ్వని చిన్న ఉద్యోగం కూడా లభించవచ్చు. అటువంటి వాటిని తిరస్కరించకుండా అనుభవం పెంచుకునే దిశగా వాటిని ఉపయోగించుకోవాలి. కమ్యూనికేషన్ కీలకం: భావ ప్రసరణలో కీలకం కమ్యూనికేషన్. ఇద్దరు వ్యక్తులు లేదా సమూహాల మధ్య జరిగే వ్యవహారాలను ప్రభావవంతంగా నిర్వహించేందుకు కమ్యూనికేషన్ దోహద పడుతుంది. ఈ విషయంలో మన దేశానికి, అక్కడి దేశాల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా గమనించాలి. మరీ చిన్నగా లేదా బిగ్గరగా, అరుస్తూ మాట్లాడడాన్ని కూడా సింగపూర్ వాసులు హర్షించరు. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ సంభాషించడం అలవాటు చేసుకోవాలి. మిగతా దేశాల ప్రజలు మాట్లాడే తీరుపైనా అవగాహన పెంచుకోవాలి. ఇంటర్వ్యూలో వ్యక్తిగతం మన దేశంతో పోల్చితే ఇంటర్వ్యూ చేసే విధానం కూడా కొంచెం భిన్నంగా ఉంటుంది. ఆయా దేశాల్లోని చాలా మంది రిక్రూటర్లు ఇంటర్వ్యూలో భాగంగా వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఎక్కడ నివసిస్తున్నారు? ఎంత అద్దె చెల్లిస్తున్నారు? ఎక్కడ చదువుకున్నారు? ఎంత వరకు చదువుకున్నారు? వంటి వ్యక్తిగత అంశాలను లోతుగా తెలుసుకునే ప్రశ్నలను వేస్తుంటారు. ఇలాంటి ప్రశ్నలకు, ఉద్యోగానికి సంబంధం ఉండకపోవచ్చు, అయితే, కొత్త వారి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి, స్నేహాన్ని పెంచుకోవడానికి, సుహృద్భావ వాతావరణం సృష్టించడానికి, చక్కటి సంబంధాలను నెలకొల్పే క్రమంలో మాత్రమే వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తుంటారు. అవకాశాలు వీరికే: ఆసియాన్ దేశాల్లో అందుబాటులోకి వస్తున్న అవకాశాలను అందుకోవాలంటే ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, మార్కెటింగ్, హెచ్ఆర్, ఆపరేషన్స్, హోటల్ మేనేజ్మెంట్, కామర్స్, జర్నలిజం, డిజిటల్ మీడియా, ఫైనాన్స్ విభాగాల్లో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. వేతనాలు అధికమే: హోదా, అనుభవాన్ని బట్టి వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, థాయ్లాండ్లలో భారత్లో లభించే వేతనాల కంటే 25 నుంచి 30 శాతం అధికంగా వేతనాలను చెల్లిస్తున్నారు. సమాచారం ఎలా? జాబ్ పోర్టల్స్, వివిధ సంస్థలు నిర్వహించే కెరీర్-నెట్ వర్కింగ్ ఈవెంట్ల ద్వారా ఉద్యోగావకాశాల గురించి తెలుసుకోవచ్చు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లను కూడా ఇందుకు వినియోగించుకోవచ్చు. గుర్తుంచుకోండి సమయ పాలన, వృత్తిపరమైన అంశాల్లో నిబద్ధతతో వ్యవహరించాలి. కంపెనీల నియమాలు/ ఉద్యోగ ఒప్పందాన్ని అతిక్రమించరాదు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. నేరుగా సంప్రదింపులు (డెరైక్ట్ కమ్యూనికేషన్) ప్రశంసనీయం కాదు. విభిన్న అవకాశాలకు.. ఆగ్నేయాసియా దేశాలు ఆగ్నేయాసియా దేశాలు చేపడుతున్న ఆర్థిక సంస్కరణలు, పరిశ్రమల విస్తరణ వంటి చర్యల కారణంగా ఇప్పుడు ఆ దేశాలు విదేశీ ఉద్యోగార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. ప్రధానంగా సింగపూర్, మలేషియా, థాయ్లాండ్ వంటి దేశాల్లో హాస్పిటాలిటీ, టూరిజం, హెల్త్కేర్, బీపీఓ విభాగాల్లో పలు ఉద్యోగాలు ఉన్నాయి. ఇండోనేషియా, థాయ్లాండ్ వంటి దేశాల్లో టీచింగ్ విభాగంలో మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఆయా దేశాలకు వెళ్లాలనుకునే ఔత్సాహికులు సరైన ప్రణాళికతో వ్యవహరించాలి. తాము చేరదలచుకున్న సంస్థ, రంగాలకు సంబంధించి ఆయా దేశాల్లో ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తుపై సంపూర్ణ అవగాహనతో ఉండాలి. ఇలా అయితే ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. - ఎం. సింధు, క్లయింట్ రిలేషన్ మేనేజర్, మాన్స్టర్ ఇండియా డాట్ కామ్ జాబ్ సెర్చ్ ఇంజిన్స్ ద్వారా అవగాహన ఇటీవలి కాలంలో ఆగ్నేయాసియా దేశాలు ఉద్యోగాల రీత్యా మన అభ్యర్థులకు చక్కటి గమ్యాలుగా నిలుస్తున్నాయి. అభ్యర్థులు ఆన్లైన్ జాబ్ సెర్చ్ ఇంజిన్స్, కన్సల్టెన్సీల ద్వారా ఆయా దేశాల్లో అందుబాటులో ఉన్న అవకాశాలను అన్వేషించొచ్చు. తమ అర్హతలకు తగిన ఉద్యోగాలపై అవగాహన పొంది దరఖాస్తు చేసుకోవచ్చు. పారిశ్రామిక సంస్థల్లో క్షేత్ర స్థాయిలో పని చేసేందుకు డిప్లొమా నుంచి.. మిడిల్ లెవల్ మేనేజ్మెంట్ పోస్ట్ల కోసం మాస్టర్స్ డిగ్రీ వరకు ప్రతి ఒక్కరికీ అనువైన ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఆయా అవకాశాలపై కన్సల్టెన్సీలను సంప్రదించే ముందు సదరు కన్సల్టెన్సీ విశ్వసనీయత గురించి తెలుసుకున్నాకే ముందుకు సాగాలి. - టి.ఎస్. విశ్వనాథ్, విసు గ్లోబల్ కన్సల్టింగ్స్