Assam assembly election 2016
-
అస్సాం ఎన్నికల బరిలో ‘జెన్ జీ’
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయాలంటే వారసత్వ ఆస్తి అనే పాత పద్ధతులకు అస్సాం ఎన్నికల్లో ‘ఎండ్ కార్డ్’ పడుతోంది. ప్రజలతో అనుబంధం, విద్య, పోరాట పటిమే పెట్టుబడిగా కుర్రకారు రాజకీయ రణరంగంలోకి దూసుకొస్తోంది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు లక్షల మంది యువత తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దాంతో పార్టీలు యువతకు గాలం వేస్తున్నాయి.34 ఏళ్ల లోపు నవతరానికి, విద్యావంతులకు మునుపెన్నడూ లేని విధంగా టికెట్లు కేటాయించాయి. వాళ్లు పక్కా గ్రౌండ్ వర్క్, సమస్యలపై అవగాహనతో రంగంలోకి దిగుతున్నారు. అసెంబ్లీ అడుగుపెట్టి ప్రజా గళం వినిపించాలని ఈ యువ అభ్యర్థులు ఉవ్విళ్లూరుతున్నారు. వీరంతా విద్యార్థి ఉద్యమాలు, సామాజిక సేవ నుంచి వచ్చిన, క్షేత్రస్థాయి అనుభవమున్న వారే...!తేయాకు తోటల నుంచిరాజోర్ దళ్ పార్టీ తరఫున మార్గెరీటా నియోజ కవర్గం నుంచి బరిలో ఉన్న రాహుల్ ఛెత్రీ తేయాకు తోటల్లో పనిచేసిన కుటుంబం నుంచి వచ్చారు. విద్యార్థి ఉద్యమాల ద్వారా నాయకుడిగా ఎదిగారు. దిబ్రూగఢ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న రాహుల్ నిరుద్యోగం, విద్య, మౌలిక సదుపాయాల కల్పనను ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు.విద్యార్థి రాజకీయాలతోఅల్గాపూర్–కట్లిచెర్రా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జుబేర్ అనామ్ మజుందార్ పోటీ చేస్తున్నారు. ఆయన తొలుత విద్యార్థి సంఘాల్లో పనిచేశారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. చురుకైన, దూకుడైన నాయకుడిగా పేరుగాంచారు. ప్రజలకు చేరువ కావడానికి డిజిటల్ మాధ్యమంలో ప్రచారం చేస్తున్నారు.మధ్యతరగతి ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ తిన్సుకియా అభ్యర్థిగా డేవిడ్ టి.ఫుకాన్ను నిలబెట్టింది. మేనేజ్మెంట్ విద్యను అభ్యసించిన ఫుకాన్ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు. మధ్యతరగతి ప్రజల ప్రతినిధిగా గుర్తింపు పొందారు. పరిశ్రమలు, తేయాకు తోటల కార్మికుల సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల అభివృద్ధే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు.గిరిజన గొంతుకగా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించి, జిల్లా అటానమస్ కౌన్సిల్లో చురుగ్గా పనిచేసిన 36 ఏళ్ల రూపాలీ లాంగ్థాసా గిరిజన సమాజంలో కొత్త తరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రాంతీయ అభివృద్ధి, సాంస్కృతిక గుర్తింపునకు ప్రాముఖ్యం ఇస్తున్నారు. హాఫ్లాంగ్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి ఉన్నారు.గ్లోబల్ అనుభవంతో సెంట్రల్ గౌహతి నుంచి అస్సాం జాతీయ పరిషత్ అభ్యర్థిగా కుంకీ చౌదరి బరిలో ఉన్నారు. ఈసారి పోటీలో ఉన్న అభ్యర్థులందరిలోనూ అతి పిన్న వయస్కురాలిగా నిలిచారు. లండన్లో మాస్టర్స్ చేసిన ఆమె కార్పొరేట్ కెరీర్ను వదిలి స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కుంకీ చౌదరి విస్తృతంగా పనిచేశారు.కార్యకర్త నుంచిగోల్పారా వెస్ట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పవిత్ర రాభా పోటీ చేస్తున్నారు. విద్యార్థి రాజకీయాలతో ప్రస్థానం ప్రారంభించి, యువమోర్చాలో కీలక పాత్ర పోషించి సంస్థాగతంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్థానిక అభివృద్ధి, ఉపాధి కల్పనే ప్రధాన ఎజెండాగా ఆయన ముందుకెళ్తున్నారు.మంచి కెరీర్ వదిలేసిమరియానీ నియోజకవర్గం నుంచి రైజోర్ దళ్ అభ్యర్థిగా డాక్టర్ జ్ఞానశ్రీ బోరా పోటీ చేస్తున్నారు. కెమిస్ట్రీలో పీహెచ్డీ చేసిన ఆమె సురక్షితమైన కెరీర్ను వదిలేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. నిరుద్యోగం, మెరుగైన ఆరోగ్య సేవలు, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలను ప్రధాన అస్త్రాలుగా మలుచుకున్నారు.చదవండి: మాయోంగ్ గ్రామానికి నేతల క్యూ.. ఎందుకో తెలుసా? -
'మార్పు కోసమే మాకు ఓటేశారు'
గువాహటి: ఈశాన్య భారతంలో తొలిసారిగా కమలం వికసించింది. అసోంలో బీజేపీ తొలిసారిగా అధికారాన్ని చేజిక్కించుకోనుంది. అసోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాషాయ పార్టీ మెజార్టీ స్థానాలు గెల్చుకుంది. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు అస్సాం ప్రజలు ముగింపు పలికారు. హస్తం పార్టీ ఘోర పరాజయం దిశగా కదులుతోంది. మార్పు కోసమే ప్రజలు తమ పార్టీకి ఓటు వేశారని బీజేపీ నేత రాంమాధవ్ తెలిపారు. అస్సాంలో తమకు 49 శాతం ఓట్లు వచ్చాయని వెల్లడించారు. అస్సాంలో బీజేపీ విజయంలో కీలకపాత్ర పోషించిన హిమంత బిశ్వ శర్మ విజయం సాధించారు. అస్సాం బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. -
మన్మోహన్ సింగ్ చెప్పింది నిజమే: మోదీ
రహా(అసోం): కాంగ్రెస్ హాయాంలో కుంభకోణాలకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శారదా చిట్ ఫండ్ కుంభకోణం గురించి ఆయన ప్రస్తావించారు. తాము జన ధన్ యోజన పథకం ప్రారంభించడంతో భవిష్యత్ లో చిట్ ఫంఢ్ మోసాలు తగ్గుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉచితంగా బ్యాంకు ఖాతాలు తెరవడంతో ప్రజలు తమ డబ్బును బ్యాంకుల్లో దాచుకుంటున్నారని, చిట్ ఫండ్స్ అవసరం వారికి లేదని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. 'ఏం చేశామనేది మనం చేసిన పనే చెబుతుంది. కాంగ్రెస్ హాయాంలో జరిగిన పనుల గురించే ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నాం. మన్మోహన్ సింగ్ చెప్పింది నిజమే' అంటూ చురక అందించారు. త్రీడీ ఎజెండాతో అభివృద్ధి సాధిస్తామని మోదీ అన్నారు. అభివృద్ధి(డెవలప్ మెంట్), వేగంగా అభివృద్ధి(స్పీడీ డెవలప్ మెంట్), అన్నివిధాలా అభివృద్ధి(ఆల్ రౌండ్ డెవలప్ మెంట్) ఎజెండాతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. -
'2 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం'
కమల్ పూర్: ప్రధాని నరేంద్ర మోదీ బిహార్ లో విస్తృతంగా ప్రచారం చేసినా బీజేపీ విజయం దక్కలేదని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. మోదీ 30 ఎన్నికల సభల్లో పాల్గొన్నారని, ప్రజలు ఆయన చెప్పిందతా విని తమ ఓట్లు ద్వారా తీర్పు వెలువరించారని చెప్పారు. అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కమల్ పూర్ లో జరిగిన సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఛత్తీస్ గఢ్ సీఎం తనయుడు బ్లాక్ మనీ కలిగివున్నాడని ఆరోపణలు వచ్చినా మోదీ స్పందించలేదని విమర్శించారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదని దుయ్యబట్టారు. ఈ ధనమంతా ప్రభుత్వ ఖజానాలో ములుగుతోందని తెలిపారు. అసోంలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి అధికారం కట్టబడితే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీయిచ్చారు. 2 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని వాగ్దానం చేశారు. సంవత్సరాదాయం రూ.2 లక్షల్లోపు ఉన్నవారికి ఉచిత వైద్యం అందిస్తామని మాటయిచ్చారు. -
'ఆకలితో అలమటిస్తుంటే నినాదాలా?'
గువాహటి: తనకు బీజేపీ ఎంపీ టిక్కెట్ ఆఫర్ చేసినా తిరస్కరించానని బాలీవుడ్ ఐటమ్ గాళ్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా-అథవాలే(ఆర్పీఐ-ఏ) నాయకురాలు రాఖీ సావంత్ వెల్లడించింది. 2014 సాధారణ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి లోక్ సభ టిక్కెట్ ఇస్తానంటే తిరస్కరించానని చెప్పింది. అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేసేందుకు గువాహటికి వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడింది. ఈ నెల 11న జరగనున్న అసోంలో ఎన్నికల్లో తమ పార్టీ తరపున 21 స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేయనున్నారని చెప్పింది. దళిత హక్కుల కోసం పోరాడుతున్నానని.. కాంగ్రెస్, బీజేపీలు పేదలకు చేసింది ఏమీ లేదని విమర్శించింది. ప్రజలు పేదరికంతో అలమటిస్తుంటే 'భారత్ మాతాకి జై' అని ఎలా నినదిస్తారని సూటిగా ప్రశ్నించింది. అసోంలో నివాసం ఏర్పచుకోవాలనుకుంటున్నానని, ఇక్కడి నుంచే పోరాటం చేయాలనుకుంటున్నట్టు రాఖీ సావంత్ తెలిపింది.


