breaking news
Bangladeshi girl
-
రూ. 12 వేల కోట్ల డ్రగ్స్ సీజ్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం శివారులో కొంతకాలంగా భారీ స్థాయిలో సాగుతున్న డ్రగ్స్ తయారీ రాకెట్ గుట్టురట్టయింది. రసాయన కర్మాగారం మాటున డ్రగ్ మాఫియా నడుపుతున్న డ్రగ్స్ ఫ్యాక్టరీపై మహారాష్ట్ర క్రైం బ్రాంచి పోలీసుశాఖ మెరుపుదాడి చేసింది. ఏకంగా రూ. 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ తయారీ ముడిపదార్థాలను స్వాధీనం చేసుకుంది. చర్లపల్లి పారిశ్రామికవాడలోని నవోదయ కాలనీలో ఉన్న వాగ్దేవి ల్యాబ్స్ కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం సోదాలు చేపట్టి 5.968 కిలోల నిషేధిత మెఫిడ్రోన్ (ఎండీ) మాదకద్రవ్యంతోపాటు 35,500 లీటర్ల ఇతర రసాయనాలు, 19 పెట్టెల్లోని 950 కిలోల మిౖథెలిన్ డైక్లోరైడ్ (ఎండీసీ) పొడి, ఎండీ తయారీకి వాడే ఇతర రసాయనాలను పట్టుకుంది. అలాగే వాగ్దేవి ల్యాబ్స్ నిర్వాహకుడు శ్రీనివాస్ విజయ్ వోలేటి, అతనితో కలిసి పనిచేస్తున్న తానాజీ పండరినాథ్ పటా్వరీలను అరెస్టు చేసింది. ఈ మేరకు మహారాష్ట్రకు చెందిన మిరా–భయందర్, వసాయ్–విరార్ (ఎంబీవీవీ) పోలీసు కమిషనరేట్ సీపీ నికేత్ కౌషిక్ శనివారం స్థానిక మీడియాకు వెల్లడించారు. నెల రోజులుగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్లో చర్లపల్లిలో పట్టుబడిన ఇద్దరితో సహా మొత్తం 13 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల్లో ఒక బంగ్లాదేశీ యువతి సైతం ఉన్నట్లు చెప్పారు. నిందితుల నుంచి 27 మొబైల్ ఫోన్లు, మూడు కార్లు, ఒక టూవీలర్ స్వా«దీనం చేసుకున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా డ్రగ్స్ నెట్వర్క్కు, అంతర్జాతీ యంగా డ్రగ్ నెట్వర్క్లకు సైతం హైదరాబాద్ శివారులో తయారయ్యే ఎండీ డ్రగ్ సరఫరా అవుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామన్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. ముంబైలో లింకులతో..హైదరాబాద్లో వెలుగులోకి.. ఈ కేసును థానే జిల్లాలోని ఎంబీవీవీ పోలీసులు చిన్న లింక్ ద్వారా వెలుగులోకి తెచ్చారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మిరా రోడ్ ఈస్ట్లోని నివసించే బంగ్లాదేశీ యువతి ఫాతిమా మురాద్õÙక్ అలియాస్ మొల్లా (23) మెఫిడ్రోన్ (ఎండీ) డ్రగ్ను విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఆగస్టు 8న కాశీమిరా బస్టాప్ దగ్గర ఫాతిమాను అదుపులోకి తీసుకొని ఆమె నుంచి 105 గ్రాముల ఎండీ డ్రగ్ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఈ డ్రగ్ను తాను హైదరాబాద్ నుంచి కొన్నట్లు నిందితురాలు పేర్కొనడంతో ఆమె ఇచ్చిన సమాచారం ప్రకారం డ్రగ్ నెట్వర్క్లోని మరో 10 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకున్న అక్కడి పోలీసులు.. హైదరాబాద్ శివారులోని చర్లపల్లి ప్రాంతంలో ఉన్న ఒక ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారవుతున్నట్లు నిర్ధారణకు వచ్చి ఆపరేషన్ చేపట్టారు. కెమికల్ ఫ్యాక్టరీ ముసుగులో డ్రగ్స్ తయారీ దందా.. భారీగా డ్రగ్స్ తయారీ దందాకు తెరతీసిన శ్రీనివాస్ విజయ్ వోలేటికి రెండు కంపెనీలు ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. వాటిల్లో వాగ్దేవి ల్యాబ్ను నవోదయ కాలనీలో 2020లో ప్రారంభించారు. కోవిడ్ సంబంధిత మందులు ఇందులో తయారవుతున్నాయి. అలాగే 2015లో నాచారంలో వాగ్దేవి ఇన్నోసైన్స్ పేరిట ఆర్ అండ్ డీ సంస్థను ఏర్పాటు చేశారు. అయితే కెమికల్ ఫ్యాక్టరీ పేరిట బయటికి చూపుతూ లోపల డగ్స్ తయారీ దందాకు నిర్వాహకులు తెరతీసినట్లు తెలిసింది. కట్టెల లోడ్ వాహనాల్లో.. కట్టెల లోడ్ వాహనాల్లో ముడి సరుకుతోపాటు తయారు చేసిన డ్రగ్స్ను శ్రీనివాస్ విజయ్ వోలేటి తరలించే వాడని సమాచారం. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం గోడౌన్ కోసమని చర్లపల్లి, నవోదయనగర్ ప్లాట్ యజమానిని సంప్రదించి అద్దెకు తీసుకొని వాగ్దేవి ల్యాబ్ను ప్రారంభించారు. కంపెనీలో ఎప్పుడూ ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు మినహా మరెవరు కనిపించే వారు కాదని.. ఉదయమంతా గేటు మూసేసి ఉండేదని చుట్టుపక్కల కంపెనీల వారు పేర్కొన్నారు. రాత్రిళ్లు డ్రమ్ముల్లో రసాయనాలు, కట్టెల లోడ్ల వాహనాలు వచ్చేవని చెప్పారు. అప్పుడప్పుడూ ఘాటైన వాసనలు వచ్చినా రసాయన సంస్థలో ఇది మామూలే కదా అనుకునేవారమని చెప్పుకొచ్చారు. కాగా, స్థల యజమానికి ఏడాదిగా అద్దె కూడా చెల్లించట్లేదని తెలిసింది. -
అమ్మాయిల కొరత.. దొడ్డిదారి పడుతున్న చైనా యువత
పెళ్లికి యువతుల కొరతతో చైనాలో యువకులు దొడ్డిదారి పడుతున్నారు. అక్రమ మార్గంలో వధువులను వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో పొరుగు దేశం బంగ్లాదేశ్ నుంచి సంబంధాలు తెచ్చుకుంటున్నారు. అయితే ఈ పరిణామాలను చైనా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.ఢాకా/బీజింగ్: సరిహద్దు అవతల నుంచి అమ్మాయిలతో వివాహాలను గుర్తించిన అధికారులు.. అప్రమత్తంగా ఉండాలని చైనా యువతకు సూచిస్తున్నారు. ఇలాంటి వివాహాలు చట్టప్రకారం చెల్లవని, పైగా మానవ అక్రమ రవాణా(Human Trafficking) కింద తీవ్ర నేరంగా పరిగణిస్తామని హెచ్చరించింది. అదే సమయంలో దేశ భద్రతకు సంబంధించిన ముప్పు కూడా వాటిల్లే అవకాశం ఉండడంతో ఇలాంటి స్కామ్లకు దూరంగా ఉండాలంటోంది. మరీ ముఖ్యంగా ఆన్లైన్ మ్యాట్రిమోనీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని బంగ్లాదేశ్లోని చైనా రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్(Global Times) కథనం ప్రకారం.. అక్కడి షార్ట్ వీడియో ప్లాట్ఫారమ్లలో క్రాస్-బార్డర్ డేటింగ్ వ్యవహారం నడుస్తోంది. తద్వారా వధువులను చైనా యువకులను ఎంచుకుంటున్నారని తేలింది. అయితే బయటి దేశాల నుంచి భార్యలను తెచ్చుకోవాలనుకునే ప్రయత్నాలు(foreign wife) మంచివికావని, మరీ ముఖ్యమంగా బంగ్లాదేశీ యువతుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆ అడ్వైజరీ సూచించింది. బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం.. యువతలు అక్రమ రవాణాను తీవ్ర నేరంగా పరిగణించి కఠిన శిక్షలు విధిస్తారు. ఇదిలా ఉంటే చైనాలో వధువ కొరత అక్కడి యువతను వెంటాడుతోంది. అందుకు అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణం. ఓ అంచనా ప్రకారం.. మూడు కోట్ల మందికి అమ్మాయిలే దొరకడం లేదట. మరోవైపు.. వివాహాల పేరుతో బంగ్లాదేశ్ నుంచి మహిళలను చైనాకు కొన్ని ముఠాలు అక్రమ రవాణా చేస్తూ వ్యభిచార కూపంలోకి దించుతున్నాయి. ఈ పరిణామాలను తీవ్రంగా భావించిన అక్కడి ప్రభుత్వం.. వాటిని కట్టడి చేయడానికి చర్యలకు ఉపక్రమించింది.మరోవైపు.. గతంలో బంగ్లాదేశ్ నుంచి భారత్కు కూడా ఇదే తరహాలో అమ్మాయిల అక్రమ రవాణా నెట్వర్క్ నడించింది. 2021లో టిక్టాక్ ద్వారా బాధితులకు గాలం వేసి వ్యభిచారంలోకి లాగిన 11 మందితో కూడిన ముఠాను ఢాకా పోలీసులు అరెస్ట్ చేశారు. -
తెలంగాణ అబ్బాయి బంగ్లాదేశ్ అమ్మాయి పెళ్లితో ఒక్కటయ్యారు
నిజామాబాద్ జిల్లా: వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన గుమ్మల హరీష్కు, బంగ్లాదేశ్కు చెందిన రోషి (రోషిణి) అనే అమ్మాయితో ఆదివారం వెంకటాపూర్ గ్రామంలోని వేంకటేశ్వర ఆలయంలో వివాహం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గుమ్మల హరీష్ ఐదేళ్ల క్రితం ఉపాధికోసం జోర్డాన్ దేశానికి వెళ్లాడు. అక్కడికే ఉపాధికోసం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రిషి అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇరువురు ఇష్టపడి నాలుగేళ్ల కింద జోర్డాన్లోనే పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల కింద హరీష్ ఇంటికి వచ్చాడు. కోవిడ్ వల్ల తిరిగి జోర్డాన్ వెళ్లలేకపోయాడు. పాస్పోర్డు రెన్యూవల్ ఉండడం, కోవిడ్ పరిస్థితుల వల్ల అమ్మాయి కూడా వేల్పూర్కు రాలేకపోయింది. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడంతో నెలరోజుల కింద రోషి వేల్పూర్లోని హరీష్ వద్దకు చేరింది. దీంతో తమ సమక్షంలో పెళ్లి జరిపాలని హరీష్ తల్లిదండ్రులు గుమ్మల యాదగిరి, కమల, బంధువులు నిర్ణయించారు. ఆదివారం మంచి ముహూర్తం ఉండడంతో మండలంలోని వెంకటాపూర్ వేంకటేశ్వర ఆలయంలో వేదమంత్రాల సాక్షిగా కుటుంబీకులు, బంధుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. -
గుజరాత్లో బంగ్లాదేశ్ అమ్మాయిపై దారుణం
రాజ్కోట్: గుజరాత్తో బంగ్లాదేశ్కు చెందిన 14 ఏళ్ల బాలికను కామంధులు చిత్రహింసలు పెట్టారు. వారం రోజుల పాటు బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలిని బంధువులే.. పశ్చిమబెంగాల్లోని బొంగా గ్రామానికి చెందిన సాయి అనే ఏజెంట్కు అమ్మేశారు. అక్కడి నుంచి ఆ అమ్మాయిని గుజరాత్లోని జునాగఢ్ జిల్లాకు పంపారు. అహ్మదాబాద్కు తర్వాత మంగ్రోల్కు చేరుకుంది. అహ్మదాబాద్లో ఏడుగురు దుండగులు ఆమెపై దారుణానికి పాల్పడ్డారు. ఆ తర్వాత మంగ్రోల్కు తీసుకెళ్లి 14 మంది నరకం చూపించారు. మంగ్రోల్ బస్ స్టేషన్ వద్ద బాధితురాలు ఏడుస్తూ ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించగా భాష సమస్య వల్ల సాధ్యం కాలేదు. ఆ అమ్మాయిని పోలీసు స్టేషన్కు తీసుకెళ్లగా జరిగిన దారుణం గురించి చెప్పింది. -
ఎన్జీవో హోంలో లైంగిక వేధింపులు
ఎన్జీవో హోంలో తనను లైంగికంగా వేధించారంటూ బంగ్లాదేశ్కు చెందిన ఓ బాలిక ఫిర్యాదు చేసింది. దాంతో ఈ కేసు విచారణకు జిల్లా కలెక్టర్ ఎ. బాబు ఓ టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటుచేశారు. దాంతోపాటు.. బంగ్లాదేశ్ హైకమిషనర్కు లేఖ రాశారు. టాస్క్ఫోర్స్ నివేదిక అందగానే దోషులపై క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు. లైంగిక వేదింపుల ఆరోపణపై నగర కమిషనర్కు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ఫిర్యాదు పంపుతున్నట్లు చెప్పారు. ఓ స్వచ్ఛంద సంస్థ గత మూడు నెలలుగా ఆ బంగ్లాదేశీ బాలికను అనధికారికంగా తమ ఆధీనంలో ఉంచుకుంది. వాళ్లే తనను లైంగికంగా వేధించారని ఆ బాలిక తెలిపింది. అయితే.. ఈ వేధింపులపై పోలీసులు మాత్రం ఇంతవరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదు.