bhavishavani
-
కష్టం లేకపోతే సోమరులవుతారు.. భవిష్యవాణిలో స్వర్ణలత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బోనాల సందర్బంగా నేడు ఉజ్జయిని మహంకాళి ఆలయంలో భవిష్యవాణి కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకుంటానని తెలిపింది.భవిష్యవాణిలో స్వర్ణలత కామెంట్స్ ఇవే..భక్తుల అందరి పూజలు సంతోషంగా పూజలు అందుకున్నాను.భక్తులకు ఎవరికి ఆటంకాలు లేకుండా చూసుకున్నాను.ఏ బోనం అయిన సంతోషంతో ఆనందంగా అందుకుంటానునా సన్నిధికి ఎవరు వచ్చినా సంతోషంగా ఆశీర్వదిస్తాను.కోరిన వరాలు ఇస్తాను.పాడి పంటలు సంవృద్ధిగా ఉంటాయి.కష్టం లేకపోతే సోమరి పోతులుగా తయారువతారు.నా వద్దకు వచ్చేందుకు ఆ మాత్రం కష్టపడాలి కదా.ఎటువంటి ఆపద, వ్యాధులు రాకుండా చూసుకునే భాధ్యత నాదిఎవరు అడ్డుపడిన, రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను.ఐదు వారాలు పప్పు బెల్లం శాకాలు పెట్టాలి.ఎటువంటి సందేహాలు పెట్టుకోకండి.కోరినన్ని వర్షాలు ఉన్నాయి.ఔషధాలు తగ్గించుకొని.. పాడి పంటలు సమృద్ధిగా చేసుకుంటే వ్యాధులు ఉండవు.బలి కార్యక్రమం మీకు తోచినట్టు చేస్తున్నారు సంతోషిస్తున్నాను.బాలింతలకు, గర్భిణీలకు ఎటువంటి ఆటంకాలు రాకుండా దర్శించుకున్న భక్తుల్ని ఇబ్బందులు రాకుండా, సంతోషంగా చూసుకుంటాను. -
ప్రభుత్వంపై, అధికారుల పనితీరుపై జోగిని స్వర్ణలత ఆగ్రహం
-
ఉజ్జయిని మహంకాళి: స్వర్ణలత భవిష్యవాణి
-
ప్రభుత్వంపై, అధికారులపై అమ్మవారి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై, అధికారుల పనితీరుపై జోగిని స్వర్ణలత ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు బోనం సమర్పించామని సంతోష పడుతున్నారు.. కానీ నాది నాకే సమర్పించారని చెప్పారు. బంగారు బోనం సమర్పించినా.. తాను దుఖంతో ఉన్నానని.. తన దర్శనానికి వచ్చే భక్తులు సైతం ఈ ఏడాది దుఃఖంతో వచ్చారని స్వర్ణలత అన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నిర్వహించిన రంగం కార్యక్రమంలో భాగంగా అమ్మవారు స్వర్ణలత ద్వారా భవిష్యవాణి వినిపించారు. తనకు బంగారు బోనం వద్దని.. సంతోష బోనం సమర్పించాలని అమ్మవారు రంగంలో సూచించారు. ‘నా సన్నిధికి వస్తున్న భక్తులు దుఖంతో వస్తున్నారు. దుఖంతోనే పోతున్నారు. ఈ ఏడాది మాత్రం భక్తులు సంతోషంగా లేరు. నా భక్తులు సంతోషంగా ఉన్నారని మీరు మాత్రమే అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. మాటల్లో ఉన్నంతగా చేతల్లో మాత్రం పనులు లేవు. నా బిడ్డలు, అడపడుచులందరు ఎడుపులతో ఉన్నారు. మీరు ప్రజలను ఇబ్బంది పెట్టినా.. నేను మాత్రం ప్రజలను సంతోషంగా చూసుకుంటాను. ప్రజలకు మేలు చేస్తున్నామని అనుకుంటున్నారు.. కానీ కీడు చేస్తున్నారు. ప్రజలందరూ శాపాలు పెడుతున్నారు. నేను ఎప్పుడు శాపం పెట్టలేదు. ప్రజలను సంతోషంగా చూసుకుంటాను. ఆ భాద్యత నాది. నా ఆశీర్వాదం అందరికి ఉంటుంది. నాకు మాత్రమే మొక్కులు సమర్పించడం కాదు. ప్రజలను సంతోషపెట్టండి. వచ్చే రోజుల్లో నా భక్తులకు ఇబ్బందులు కాకుండా చూసుకోండి. నేనెప్పుడూ న్యాయం పక్షాన నిలబడుతా. కోరినన్ని వర్షాలు ఉన్నాయి. వచ్చే రోజుల్లో వర్షాలు కురుస్తాయి. పాడి పంటలు బాగా పండుతాయని’ అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. శ్యామల కామెంట్లపై స్పందించిన తలసాని -
నా గురించి ఆలోచించరేందిరా?
-
రాష్ట్రం ఏర్పడ్డా నా గురించి ఆలోచించరేందిరా?
హైదరాబాద్ : సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు ఉత్సవాల్లో భాగంగా కీలకంగా భావించే 'రంగం' కార్యక్రమం సోమవారం ఉదయం ఉత్కంఠగా సాగింది. మాతంగి ఆలయం ఎదుట జరిగిన ఈ కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. 'తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా నా గురించి ఆలోచించరేందిరా?' అని ప్రశ్నించింది. 'నలుగురికీ అన్నం ముద్ద దొరుకుతుందనుకుంటే.. దోచుకునేటోళ్లు తయారయ్యారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అలాంటోళ్లను శిక్షించేదీ.. ప్రజలను కాపాడేదీ తానేని ఘంటాపథంగా చెప్పింది. తన దగ్గరికి వచ్చే ప్రజలందరికీ ఎలాంటి భారంగానీ, భయాలుగానీ లేకుండా కాపాడుకుంటానని, ఆ బాధ్యత తనదేనని భక్తులకు భరోసా ఇచ్చింది. కాగా భవిష్యవాణి అనంతరం అమ్మవారిని అంబారీపై ఊరేగిస్తున్నారు. అంబారీ ఊరేగింపు తర్వాత అమ్మవారి దర్శనం ప్రారంభం కానుంది. -
ప్రజలకు ఏ కష్టం రానివ్వను....
-
ప్రజలకు ఏ కష్టం రానివ్వను....
సికింద్రాబాద్: ప్రజలకు ఏ కష్టం రానివ్వను...ప్రజలందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది, ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయంలో రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ప్రజలందరికీ ఎలాంటి భారం, భయం లేకుండా చూసుకునే బాధ్యత తనదని ఆమె భవిష్యవాణి ద్వారా తెలిపారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని స్వర్ణలత రంగంలో పేర్కొన్నారు. తన ఆజ్ఞ లేకుండా ఏ పనీ చేయవద్దని సూచించారు. భవిష్యవాణి అనంతరం అమ్మవారిని అంబారీపై ఊరేగించారు. అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిచ్చారు.