breaking news
Brendan taylor
-
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన జింబాబ్వే ప్లేయర్
39 ఏళ్ల జింబాబ్వే (Zimbabwe) వెటరన్ ప్లేయర్ బ్రెండన్ టేలర్ (Brendan Taylor) లేటు వయసులోనూ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్కప్ ఆఫ్రికా రీజియనల్ క్వాలిఫయర్లో (ICC Mens T20 World Cup Africa Regional Final 2025) బోట్స్వానాపై (Botswana) 46 శతక్కొట్టాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 54 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేసి రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగాడు.ఈ మ్యాచ్లో టేలర్ మరో 11 పరుగులు చేసుంటే టీ20ల్లో జింబాబ్వే తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేవాడు. అయితే అనూహ్యంగా అతను 123 పరుగుల వద్ద రిటైర్డ్ ఔట్గా తప్పుకున్నాడు. ఈ రికార్డు జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా పేరిట ఉంది. రజా 2024లో గాంబియాపై 133 పరుగులు చేశాడు. గత 21 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న టేలర్.. ఐసీసీ నిషేధం ముగించుకుని మూడేళ్ల తర్వాత ఇటీవలే రీఎంట్రీ ఇచ్చాడు.బోట్స్వానాతో మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. బ్రెండన్ టేలర్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్లో బ్రియాన్ బెన్నెట్ (33 బంతుల్లో 65) కూడా అర్ద సెంచరీతో మెరిశాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో బోట్స్వానా ఆది నుంచే చేతులెత్తేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి కేవలం 89 పరుగులకే చేసింది. ఫలితంగా జింబాబ్వే 170 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. గత టీ20 వరల్డ్కప్కు (2024) అర్హత సాధించని జింబాబ్వే.. ఈసారి (2026) ఎలాగైనా వరల్డ్కప్ బెర్త్ దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ జట్టు 2022లో తమ చివరి ఐసీసీ టోర్నీ ఆడింది.చదవండి: Asia cup 2025 Final: సరికొత్త సంప్రదాయం -
జింబాబ్వే జట్టు ప్రకటన.. నాలుగేళ్ల తర్వాత స్టార్ ప్లేయర్ రీ ఎంట్రీ
స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్కు 16 మంది సభ్యుల కూడిన జట్టును జింబాబ్వే క్రికెట్ బోర్డు ప్రకటించింది. సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ బ్రెండన్ టేలర్ నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి జింబాబ్వే టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు.అవినీతి ఆరోపణల కేసులో మూడున్నరేళ్ల ఐసీసీ నిషేధాన్ని పూర్తి చేసుకున్న అతడు.. ఇటీవలే టెస్టు, వన్డే ఫార్మాట్లోకి తిరిగిచ్చాడు. ఇప్పుడు అతడు అనుభవం దృష్ట్యా టీ20 జట్టులో కూడా చోటిచ్చారు. ఇక అతడితో లంకతో వన్డే సిరీస్లో అదరగొట్టిన స్టార్ ఆల్రౌండర్ సీన్ విలియమ్స్కు సైతం అవకాశమిచ్చారు.ఈ జట్టుకు సికిందర్ రజా నాయకత్వం వహించాడు. అదేవిధంగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ ట్రైసిరీస్లో విఫలమైన న్యూమాన్ న్యామ్హురి, వెస్లీ మాధవెరె, విన్సెంట్ మసెకేసాలపై సెలక్టర్లు వేటు వేశారు. అదేవిధంగా ఈ జట్టులో బ్రియాన్ బెన్నట్, రియాన్ బర్ల్కు సైతం ఛాన్స్ లభించింది. సికిందర్ రజాతో పాటు వెల్లింగ్టన్ మసకడ్జా జింబాబ్వే జట్టు ఫ్రంట్ లైన్ స్పిన్నర్గా బంతి పంచుకోనున్నాడు. ఈ మూడు మ్యాచ్ల సిరీస్ సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం అన్ని మ్యాచ్లు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే జరగనున్నాయి. కాగా ఇప్పటికే రెండు మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-0 తేడాతో లంకేయులు క్లీన్ స్వీప్ చేశారు.శ్రీలంకతో టీ20 సిరీస్కు జింబాబ్వే జట్టు ఇదే..సికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, బ్రాడ్ ఎవాన్స్, ట్రెవర్ గ్వాండు, క్లైవ్ మదాండే, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజరబానీ,డియోన్ మైయర్స్, రిచర్డ్ నగరావ, బ్రెండన్ టేలర్, సీన్ విలియమ్స్చదవండి: ఆసియాకప్లో లీడింగ్ వికెట్ టేకర్.. మూడేళ్లుగా జట్టుకు దూరం -
చరిత్ర సృష్టించిన జింబాబ్వే ప్లేయర్.. అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘనత
జింబాబ్వే ఆటగాడు బ్రెండన్ టేలర్ ఇటీవలికాలంలో తరుచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అవినీతి ఆరోపణల కేసులో మూడున్నరేళ్ల ఐసీసీ నిషేధాన్ని పూర్తి చేసుకున్న అతడు.. కొద్ది రోజుల కిందటే అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీలో దారుణంగా విఫలమైన బ్రెండన్.. తాజాగా అంతర్జాతీయ క్రికెట్లో ఓ అరుదైన మైలురాయిని తాకి మరోసారి వార్తల్లోకెక్కాడు.ఈసారి అతడు జింబాబ్వే తరఫున చారిత్రక మైలురాయిని అందుకున్న ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఇవాళ (ఆగస్ట్ 31) శ్రీలంకతో జరుగుతున్న వన్డేలో బ్రెండన్ అంతర్జాతీయ క్రికెట్లో 10000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. జింబాబ్వే క్రికెట్ చరిత్రలో బ్రెండన్కు ముందు ఆండీ ఫ్లవర్ (320 ఇన్నింగ్స్ల్లో 11580 పరుగులు), గ్రాంట్ ఫ్లవర్ (337 ఇన్నింగ్స్లోల 10028 పరుగులు) మాత్రమే ఈ ఘనత సాధించారు. జింబాబ్వే ఆల్టైమ్ గ్రేట్ బ్యాటర్లలో ఒకడైన బ్రెండన్ తన కెరీర్లో 320 ఇన్నింగ్స్ల్లో 10000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.ఓవరాల్గా ప్రపంచ క్రికెట్లో ఈ ఘనతను ఓ వంద మాత్రమే సాధించారు. జింబాబ్వే తరఫున అత్యధిక వన్డే సెంచరీలు (11) చేసిన ఆటగాడిగా రికార్డు కలిగిన బ్రెండన్.. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సనత్ జయసూర్య తర్వాత అత్యధిక వన్డే కెరీర్ (21 ఏళ్లు) కలిగిన ఆటగాడిగానూ రికార్డుల్లో ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో బ్రెండన్ టేలర్ 20 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. బెన్ కర్రన్ (79), సికందర్ రజా (59 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. రెండు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి వన్డేలో పర్యాటక శ్రీలంక 7 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. -
అవినీతి కేసులో నిషేధం.. రీఎంట్రీలో చెత్త రికార్డు
అవినీతి కేసులో దాదాపు నాలుగేళ్లు నిషేధాన్ని ఎదుర్కొని శ్రీలంకతో ఇవాళ (ఆగస్ట్ 29) జరుగుతున్న మ్యాచ్తో వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చిన జింబాబ్వే వెటరన్ స్టార్ బ్రెండన్ టేలర్.. తొలి మ్యాచ్లోనే ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో శ్రీలంక నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న క్రమంలో మూడు బంతులు ఆడి డకౌటయ్యాడు. తద్వారా జింబాబ్వే తరఫున వన్డేల్లో అత్యధిక డకౌట్లు అయిన ఆటగాళ్ల జాబితాలో తతెండ టైబు, ప్రాస్పర్ ఉత్సేయతో కలిసి మూడో స్థానంలో నిలిచాడు. టైబు, ఉత్సేయ, బ్రెండన్ వన్డేల్లో తలో 16 సార్లు డకౌట్లయ్యారు. ఈ జాబితాలో గ్రాంట్ ఫ్లవర్ (18) అగ్రస్థానంలో ఉండగా.. ఎల్టన్ చిగుంబర (17) రెండో ప్లేస్లో నిలిచాడు.భారీ అంచనాలతో వన్డేల్లో రీఎంట్రీ ఇచ్చిన బ్రెండన్ తొలి మ్యాచ్లోనే తస్సుమనడంతో జింబాబ్వే అభిమానులు నిరాశకు లోనయ్యారు. ఈ మ్యాచ్లో బ్రెండన్ ఫీల్డింగ్ సమయంలోనూ నిరాశపరిచాడు. మ్యాచ్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే (రెండో ఓవర్) గాయపడి మైదానాన్ని వీడాడు. అయితే గాయం చిన్నదే కావడంతో బ్యాటింగ్కు దిగిన అతడు.. మూడు బంతుల్లోనే పెవిలియన్ బాట పట్టాడు. వికెట్కీపర్ బ్యాటర్ అయిన 39 ఏళ్ల బ్రెండన్కు జింబాబ్వే ఆల్టైమ్ గ్రేట్ వన్డే బ్యాటర్లలో ఒకడిగా పేరుంది. ఇతను 206 వన్డేల్లో 11 సెంచరీలు, 39 అర్ద సెంచరీల సాయంతో 6684 పరుగులు చేశాడు. ఇంతటి ఘనమైన ట్రాక్ రికార్డు కలిగిన ఆటగాడిగాపై సహజంగానే అంచనాలు ఉంటాయి. అయితే ఆ అంచనాలకు బ్రెండన్ నీరుగార్చాడు.శ్రీలంకతో మ్యాచ్లో 299 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే.. తొలి బంతికే బ్రియాన్ బెన్నెట్ (0) వికెట్ కోల్పోయింది. అనంతరం నాలుగో బంతికే బ్రెండన్ టేలర్ కూడా పెవిలియన్కు చేరాడు. దీంతో జింబాబ్వే తొలి ఓవర్లో ఖాతా కూడా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బెన్ కర్రన్, కెప్టెన్ సీన్ విలియమ్స్ అద్భుతమైన అర్ద సెంచరీలు చేసి జింబాబ్వేను ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్కు 118 పరుగులు జోడించారు. 57 పరుగుల వద్ద విలియమ్స్ ఔట్ కాగా.. కర్రన్ (70 నాటౌట్), సికందర్ రజా (7) ఛేదనను కొనసాగిస్తున్నారు. 25.4 ఓవర్ల తర్వాత జింబాబ్వే స్కోర్ 140/3గా ఉంది. లంక బౌలర్లలో అషిత ఫెర్నాండో 2, కమిందు మెండిస్ ఓ వికెట్ తీశారు.అంతకుముందు శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఓపెనర్ పథుమ్ నిస్సంక (92 బంతుల్లో 76; 12 ఫోర్లు) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో రాణించగా.. ఆఖర్లో జనిత్ లియనాగే (47 బంతుల్లో 70 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కమిందు మెండిస్ (36 బంతుల్లో 57; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. -
నాలుగేళ్ల తర్వాత వన్డేల్లోకి రీఎంట్రీ.. 2 ఓవర్లు కూడా ఆడకుండానే..!
స్వదేశంలో శ్రీలంకతో రెండు మ్యాచ్ల వన్డే సిరీస్కు ముందు జింబాబ్వే జట్టుకు రెండు భారీ షాక్లు తగిలాయి. హరారే వేదికగా ఇవాళ (ఆగస్ట్ 29) తొలి వన్డే ప్రారంభం కాగా.. మ్యాచ్ ప్రారంభానికి ముందే కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్, మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికే స్టార్ ప్లేయర్, వికెట్కీపర్ బ్యాటర్ బ్రెండన్ టేలర్ గాయాలపాలయ్యారు. ఎర్విన్ స్థానంలో సీన్ విలియమ్స్ సారథ్య బాధ్యతలు చేపట్టగా.. టేలర్ స్థానంలో క్లైవ్ మదండే వికెట్కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు.దాదాపు నాలుగేళ్ల తర్వాత వన్డేల్లో రీఎంట్రీ ఇచ్చిన టేలర్కు ఆ ఆనందం ఎంతో సేపు నిలబడలేదు. మ్యాచ్ ప్రారంభమైన రెండో ఓవర్లోనే వికెట్కీపింగ్ చేస్తుండగా.. అతడి చేతి వేలికి తీవ్ర గాయమైంది. దీంతో అతను మైదానాన్ని వీడాడు. అవినీతి కేసులో టేలర్ మూడున్నరేళ్ల నిషేధాన్ని ఇటీవలే పూర్తి చేసుకుని అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు తొలి వన్డే ప్రారంభానికి ముందే గాయపడిన రెగ్యులర్ కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్కు జింబాబ్వే క్రికెట్ బోర్డు ప్రత్యామ్నాయాన్ని ప్రకటించలేదు. ఎర్విన్ వన్డే సిరీస్ మొత్తానికే దూరమైనట్లు మాత్రం ప్రకటించింది.మ్యాచ్ విషయానికొస్తే.. జింబాబ్వే-శ్రీలంక మధ్య తొలి వన్డే ఇవాళ మధ్యాహ్నం ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక 36 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. పథుమ్ నిస్సంక (76), నిషాన్ మధుష్క (0), కుసాల్ మెండిస్ (38), సదీర సమరవిక్రమ (35) ఔట్ కాగా.. కెప్టెన్ చరిత్ అసలంక (6), జనిత్ లియనాగే (0) క్రీజ్లో ఉన్నారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, సకందర్ రజా, సీన్ విలియమ్స్ తలో వికెట్ తీశారు. -
జింబాబ్వే ప్లేయర్ వరల్డ్ రికార్డు..
జింబాబ్వే సీనియర్ ఆటగాడు బ్రెండన్ టేలర్ దాదాపు నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశాడు. బులవాయో వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టుతో టేలర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో టేలర్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.21వ శతాబ్దంలో లాంగెస్ట్ టెస్టు క్రికెట్ ఆడిన ప్లేయర్గా టేలర్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. 2004లో జింబాబ్వే తరపున అరంగేట్రం చేసిన బ్రెండన్.. ఇప్పటివరకు 21 ఏళ్ల 93 రోజుల పాటు టెస్టుల్లో కొనసాగాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ పేరిట ఉండేది. ఆండర్సన్ తన కెరీర్లో 21 ఏళ్ల 51 రోజుల పాటు టెస్టు క్రికెట్ ఆడాడు. తాజా మ్యాచ్తో ఆండర్సన్ ఆల్టైమ్ రికార్డును టేలర్ బ్రేక్ చేశాడు. కాగా 39 ఏళ్ల టేలర్పై 2022లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిషేదం విధించింది. ఓ వ్యాపారవేత్త నుండి బహుమతులు తీసుకోవడంతో అతడిపై ఐసీసీ చర్యలకు ఉపక్రమించింది. అయితే ఇప్పుడు ఐసీసీ అతడిపై బ్యాన్ ఎత్తేయడంతో రీఎంట్రీ ఇచ్చాడు.కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో జింబాబ్వే కేవలం 125 పరుగులకే కుప్పకూలింది. కివీస్ పేసర్ మాట్ హెన్రీ 6 వికెట్లు పడగొట్టి జింబాబ్వే పతనాన్ని శాసించాడు. హెన్రీతో పాటు జకారీ ఫౌల్క్స్ 4 వికెట్లు సాధించాడు. ఇక జింబాబ్వే బ్యాటర్లలో బ్రెండన్ టేలర్(44) టాప్ స్కోరర్గా నిలవగా.. తిసాగా(33) రాణించారు. -
39 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాటర్
జింబాబ్వే వెటరన్ బ్యాటర్ బ్రెండన్ టేలర్ 39 ఏళ్ల లేటు వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అవినీతి మరియు డోపింగ్ నిరోధక నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఐసీసీ విధించిన మూడున్నర సంవత్సరాల బ్యాన్ను పూర్తి చేసుకొని జింబాబ్వే టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చాడు. త్వరలో న్యూజిలాండ్తో జరుగబోయే రెండో టెస్ట్ కోసం జింబాబ్వే సెలెక్టర్లు టేలర్ను జట్టులోకి తీసుకున్నారు.2019లో ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త నుంచి 15 వేల యూస్ డాలర్లు ముడుపులు (జింబాబ్వేలో టీ20 లీగ్ లాంచ్ చేసే విషయంలో) తీసుకున్నందుకు గాను, అలాగే నిషేధిత ఉత్ప్రేరకమైన కొకైన్ను వాడినందుకు గాను టేలర్పై 2022 జనవరిలో ఐసీసీ మూడున్నరేళ్ల బ్యాన్ విధించింది. టేలర్ ఇప్పుడు ఆ బ్యాన్ను పూర్తి చేసుకొని త్వరలో జాతీయ జట్టుకు ఆడనున్నాడు.టేలర్ జింబాబ్వేకు ప్రాతినిథ్యం వహించిన గొప్ప క్రికెటర్లలో ఒకరు. వికెట్కీపర్ బ్యాటర్ అయిన అతను మూడు ఫార్మాట్లలో 9938 పరుగులు చేసి జింబాబ్వే తరఫున మూడో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ఉన్నాడు. జింబాబ్వే తరఫున అత్యధిక సెంచరీలు (17) చేసిన బ్యాటర్ టేలరే కావడం విశేషం. టేలర్ తనపై బ్యాన్ విధించక ముందు ఆడిన మూడు ఇన్నింగ్స్ల్లో (టెస్ట్ల్లో) వరుసగా 92, 81, 49 పరుగులు స్కోర్ చేశాడు.ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ ఇవాళే (జులై 30) ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న జింబాబ్వే 46 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసి కష్టాల్లో ఉంది. సిగా (19), క్రెయిగ్ ఎర్విన్ (31) క్రీజ్లో ఉన్నారు. మ్యాట్ హెన్రీ 4 వికెట్లు తీసి జింబాబ్వేను దెబ్బకొట్టాడు. -
జింబాబ్వే క్రికెటర్ బ్రెండన్ టేలర్పై ఐసీసీ నిషేధం
జింబాబ్వే సీనియర్ ఆటగాడు బ్రెండన్ టేలర్పై ఐసీసీ మూడున్నరేళ్లు నిషేధం విధించింది. అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించడంతో పాటు, డ్రగ్స్ తీసుకుని యాంటీ డోపింగ్ కోడ్ ను కూడా అతిక్రమించినట్లు తేలింది. దీంతో ఐసీసీ అతనిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. టేలర్ అన్ని ఫార్మాట్లలో కలిపి జింబాబ్వే తరఫున 2004 నుంచి 2021 వరకు 284 మ్యాచ్ లు ఆడాడు. మొత్తం 9,938 పరుగులు చేశాడు. వాటిలో 17 సెంచరీలు ఉన్నాయి. అయితే గతేడాదే బ్రెండన్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. కాగా బ్రెండన్ టేలర్ ఇటీవలే ఓ లేఖలో సంచలన విషయాలు వెల్లడించాడు. గతంలో ఓ భారత వ్యాపారవేత్త క్రికెట్ లీగ్ పై చర్చించేందుకు భారత్ రావాలని కోరాడని, తాను వెళితే డ్రగ్స్ తో పార్టీ ఇచ్చి, తాను డ్రగ్స్ తీసుకున్నప్పటి వీడియోతో బ్లాక్ మెయిల్ చేశారని టేలర్ లేఖలో తెలిపాడు. ఫిక్సింగ్ కు పాల్పడాలంటూ తనకు 15 వేల డాలర్లు కూడా ఇచ్చారని వెల్లడించాడు. అయితే ఈ సమాచారాన్ని తమతో వెంటనే పంచుకోలేదంటూ ఐసీసీ బ్రెండన్ టేలర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా తన తప్పిదాలను టేలర్ అంగీకరించాడని ఐసీసీ పేర్కొంది. -
ఓ ప్రముఖ భారత వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని బెదిరించాడు..
జింబాబ్వే తరఫున అత్యధిక శతకాలు(17) బాదిన క్రికెటర్గా రికార్డుల్లో నిలిచిన ఆ దేశ మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్, మ్యాచ్ ఫిక్సింగ్కు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించాడు. 2019లో ఓ భారత వ్యాపారవేత్త, తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని బెదిరించాడని, అందుకు అతను 15000 అమెరికన్ డాలర్లు ఆఫర్ చేశాడని ట్విటర్ వేదికగా ఆరోపణలు చేశాడు. నాటి ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా తాను ఆ వ్యక్తి నుంచి కొంత నగదు కూడా తీసుకున్నట్లు అంగీకరించాడు. To my family, friends and supporters. Here is my full statement. Thank you! pic.twitter.com/sVCckD4PMV — Brendan Taylor (@BrendanTaylor86) January 24, 2022 గతేడాది సెప్టెంబర్లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన టేలర్.. 2019లో ఓ ప్రముఖ భారత వ్యాపారవేత్త ఆహ్వానం మేరకు భారత్కు వచ్చానని, ఆ సందర్భంగా ఓ పార్టీలో కొందరు నాకు కొకైన్ ఆఫర్ చేశారని, తాను కొకైన్ సేవిస్తుండగా వీడియోలు తీసి బెదిరించడం మొదలుపెట్టారని, ఈ క్రమంలోనే మ్యాచ్ ఫిక్సింగ్ కూడా చేయమన్నారని సంచలన స్టేట్మెంట్ను విడుదల చేశాడు. ఆ వ్యాపారవేత్త జింబాబ్వేలో టీ20 లీగ్ను లాంచ్ చేస్తామని తనను సంప్రదించాడని, అప్పటికే తమ దేశ క్రికెట్ బోర్డు నుంచి ఆరు నెలలుగా జీతాలు లేవని, తన ఆర్ధిక అవసరాలను ఆసరాగా తీసుకుని సదరు వ్యక్తి తనను ప్రలోభ పెట్టాడని, తాను అంగీకరించకపోయే సరికి బ్లాక్ మెయిలింగ్కు దిగాడని స్టేట్మెంట్ ఇచ్చాడు. గత రెండేళ్లుగా ఈ భారాన్ని మోయలేక మానసికంగా, శారీరకంగా కృంగిపోయానని, అందుకే ఈ స్టేట్మెంట్ను విడుదల చేస్తున్నాని పేర్కొన్నాడు. జింబాబ్వే తరఫున 34 టెస్ట్లు, 205 వన్డేలు, 45 టీ20లు ఆడిన టేలర్.. టెస్ట్ల్లో 6 సెంచరీలు, వన్డేల్లో 11 సెంచరీలు సహా దాదాపు పది వేల పరుగులు చేశాడు. 35 ఏళ్ల ఈ ఆల్రౌండర్.. 2014 ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. కాగా, తనను ఫిక్సింగ్ చేయమన్న ఆ వ్యాపారవేత్త ఎవరనే విషయాన్ని మాత్రం టేలర్ వెల్లడించలేదు. చదవండి: ICC Awards 2021: వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఎవరంటే..! -
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన క్రికెటర్
Zimbabwe's Brendan Taylor Announces Retirement: జింబాబ్వే మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ బ్రెండన్ టేలర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఐర్లాండ్తో నేడు(సెప్టెంబరు 13) జరిగే మూడో వన్డే తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ అని పేర్కొన్నాడు. 17 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశానని, అరంగేట్రం చేసిన నాటి నుంచి జట్టును మెరుగైన స్థితిలో ఉంచేందుకు తన వంతు కృషి చేశానని పేర్కొన్నాడు. బరువెక్కిన హృదయంతో ఈ ప్రకటన చేస్తున్నానంటూ ట్విటర్ వేదికగా టేలర్ ఓ భావోద్వేగ నోట్ షేర్ చేశాడు. తన ఎదుగుదలకు తోడ్పడిన జింబాబ్వే క్రికెట్ మేనేజ్మెంట్, కోచ్లు, అభిమానులు, సహచర ఆటగాళ్లు, తన కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. 2004లో అడుగుపెట్టి.. బ్రెండన్ టేలర్ 2004లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు మొత్తంగా 34 టెస్టులాడిన అతడు... 2320 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్ విషయానికొస్తే... 45 టీ20 మ్యాచ్లు ఆడిన టేలర్.. 118.22 స్ట్రైక్రేటుతో 934 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు అర్ద శతకాలు ఉన్నాయి. ఇక తనెంతగానో ఇష్టపడే వన్డే క్రికెట్లో 204 మ్యాచ్లు ఆడి.. 6677 పరుగులతో సత్తా చాటిన టేలర్.. జింబాబ్వే తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు(11) చేసిన ఆటగాడిగా తన పేరు లిఖించుకున్నాడు. 2011-15 మధ్య జింబాబ్వే టీం కెప్టెన్గా కూడా వ్యవహరించిన టేలర్.. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా మూడో వన్డే ఆడిన అనంతరం ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి అతడు నిష్క్రమించనున్నాడు. చదవండి: IPL 2021 Second Phase: ఇంగ్లీష్ క్రికెటర్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ క్రికెటర్ Forever grateful for the journey. Thank you 🙏 pic.twitter.com/tOsYzoE5eH — Brendan Taylor (@BrendanTaylor86) September 12, 2021 -
‘క్రికెట్కు వీడ్కోలు ఇలా కాదు’
హరారే: జింబాబ్వే జట్టును అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జింబాబ్వే క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ఆ దేశ ప్రభుత్వ జోక్యం మితిమీరినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. సస్పెన్షన్ తక్షణం అమలులోకి వస్తున్నట్లు ప్రకటించింది. ఐసీసీ తీసుకున్న తాజా నిర్ణయంతో జింబాబ్వేకి చెందిన క్రికెట్ జట్లు ఏవీ...ఇక ఐసీసీ నిర్వహించే అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడానికి లేదు. అలాగే జింబాబ్వే క్రికెట్కు అందిస్తున్న నిధుల సాయాన్ని కూడా ఐసీసీ పూర్తిగా నిలిపివేసింది. ఐసీసీ నిర్ణయంతో జింబాబ్వేలో క్రికెట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఐసీసీ నిర్ణయం పట్ల జింబాబ్వే క్రికెటర్లు సికందర్ రజా, బ్రెండన్ టైలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేశారు. ‘ఎలా ఒక నిర్ణయం ఉన్నట్లుండి మమ్మల్ని అపరిచితులుగా, నిరుద్యోగులుగా మారుస్తూ, ఎంతో మంది కెరియర్ని ముగిస్తుంది.. ఎలా ఒక నిర్ణయం ఎన్నో కుటుంబాలపై ప్రభావం చూపిస్తుంది.. అంతర్జాతీయ క్రికెట్కు నేను వీడ్కోలు చెప్పాలనుకున్న పద్దతి ఇది కాదు కదా’ అంటూ సికిందర్ రజా ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. How one decision has made a team , strangers How one decision has made so many people unemployed How one decision effect so many families How one decision has ended so many careers Certainly not how I wanted to say goodbye to international cricket. @ICC pic.twitter.com/lEW02Qakwx — Sikandar Raza (@SRazaB24) July 18, 2019 ‘జింబాబ్వేను సస్పెండ్ చేస్తూ.. ఐసీసీ తీసుకున్న నిర్ణయం హృదయవిదారకమైనది. మా చైర్మన్ ఎంపీ కాదు.. మా జట్టు వెనక ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. వందలాది మంది నిజాయతీ పరులైన ఆటగాళ్లు, ఉద్యోగులు, సహాయక సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్ దీన్నో ఉద్యోగంలా మాత్రమే కాక బాధ్యతగా భావించి జింబాబ్వే క్రికెట్కు అంకితమయ్యారు’ అంటూ బ్రెండన్ టేలర్ ట్వీట్ చేశారు. @ICC It's heartbreaking to hear your verdict and suspend cricket in Zimbabwe. The @ZimbabweSrc has no government back round yet our Chairman is an MP? Hundreds of honest people,players, support staff,ground staff totally devoted to ZC out of a job,just like that. 💔 — Brendan Taylor (@BrendanTaylor86) July 18, 2019 -
క్రికెట్ చరిత్రలో మళ్లీ ఇలా జరగదేమో..!
-
క్రికెట్ చరిత్రలో మళ్లీ ఇలా జరగదేమో..!
షార్జా: క్రికెట్ చరిత్రలో కొన్నిసార్లు అరుదైన సంఘటనలు అవిష్కృతమవుతాయి. మళ్లీ అలాంటి ఫీట్లు జరిగే అవకాశం ఉండకపోవచ్చునని క్రికెట్ విశ్లేషకులు సైతం అఫ్గానిస్తాన్, జింబాబ్వే వన్డే సిరీస్ గురించి అభిప్రాయపడుతున్నారు. ఓ వన్డేలో ఓడితే తర్వాతి వన్డేలో ప్రత్యర్థిపై రెండో జట్టు ప్రతీకారం తీర్చుకుంటుంది. అందులో భాగంగా ఆ మరుసటి వన్డేలో నమోదైన గణాంకాలు మాత్రం క్రికెట్ ప్రేమికులతో పాటు క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి. ఒకే సిరీస్ లో ఇలా జరిగినా.. వరుస వన్డేల్లో ఇలాంటి ఫీట్ కావడం కష్టమే. ఆ వివరాలపై ఓ లుక్కేయండి.. తమ వన్డే క్రికెట్లో రికార్డు విజయాన్ని నమోదు చేసిన అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు మరుసటి వన్డేలో అదే ప్రత్యర్థి జింబాబ్వే చేతిలో అంతే పరుగుల తేడాతో దారుణంగా ఓటమి పాలైంది. రెండో వన్డేలో నెగ్గిన జింబాబ్వే తొలి వన్డే దారుణ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. దీంతో ఐదు వన్డేల సిరీస్ను 1-1తో ఇరుజట్లు సమ ఉజ్జీలుగా ఉన్నాయి. జింబాబ్వే స్టార్ క్రికెటర్ బ్రెండన్ టేలర్ (125; 121 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్భుత శతకంతో చెలరేగడంతో పాటు సికిందర్ రజా (92; 74 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లాడి 5 వికెట్లకు 333 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్ జట్టు జింబాబ్వే బౌలర్లు గ్రేమ్ క్రీమర్ (4/41), చతారా (3/24)లు విజృంభించడంతో 30.1 ఓవర్లకు 179 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్ జట్టులో రహ్మద్ షా (43), దౌలత్ జర్దాన్ (47 నాటౌట్) మాత్రమే ఆ జట్టు 154 పరుగుల తేడాతో దారుణ ఓటమిని చవిచూసింది. తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 5 వికెట్లకు 333 పరుగులు చేయగా, ప్రత్యర్థి జింబాబ్వే జట్టు 34.4 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. రెండో వన్డేలో అదే స్కోర్లు నమోదయ్యాయి. కానీ జట్లే మారాయంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కేవలం ఆలౌటైన జట్టు ఆడిన ఓవర్లలోనే వ్యత్యాసం తప్ప.. ఇతర అన్ని అంశాలు ఒకేలా రిపీట్ కావడం క్రికెట్ చరిత్రలోనే అరుదైనదిగా భావించవచ్చు. తొలి వన్డే: అఫ్గానిస్తాన్: 333/5 జింబాబ్వే: 179 ఆలౌట్ రెండో వన్డే: జింబాబ్వే: 333/5 అఫ్గానిస్తాన్: 179 ఆలౌట్ -
దక్కింది పన్నెండు వేలే!
ఇటీవల ముగిసిన క్రికెట్ ప్రపంచకప్లో తమ జట్టు ఆడిన చివరి లీగ్ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన జింబాబ్వే ఆటగాడు బ్రెండన్ టేలర్(29)ను ఎవరూ అంత ఈజీగా మరిచిపోలేరు. ఇండియాతో జరిగిన తన చివరి మ్యాచ్లో ఒక సూపర్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీతో టేలర్ జాతీయ జట్టునుంచి తప్పుకొన్నాడు. వయసును బట్టి చూసినా, బ్యాటింగ్ ఫామ్ను గమనించినా టేలర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగడం ఆశ్చర్యమే. అయితే, ఇంగ్లండ్లోని నాటింగ్హామ్ క్లబ్లో ఒప్పందం కుదుర్చుకొని ఆ జట్టు తరఫున ఆడటానికి టేలర్ జింబాబ్వే జాతీయజట్టు నుంచి తప్పుకొన్నాడు. జాతీయ జట్టుకు ఆడటానికీ, ఒక క్లబ్కు ఆడటానికీ మధ్య ఎంత తేడా ఉందో వేరే చెప్పనక్కర్లేదు. అయినా ఎందుకు అలా చేశాడంటే, ప్రపంచకప్లో జింబాబ్వే తరఫున ఆడినందుకుగానూ టేలర్కు దక్కిన మొత్తం 12,000 రూపాయలు మాత్రమే! ఈ డబ్బుతో ఎలా బతకాలో అర్థం కాక జాతీయ జట్టుకు వీడ్కోలు పలికానని టేలర్ ప్రకటించాడు! ఈ ఆటగాడు తన బ్యాటింగ్తో వినోదాన్ని పంచగలడు, జట్టును గెలిపించగలడు కాబట్టి టేలర్ తో ఇంగ్లండ్ క్లబ్ ఒప్పందం కుదుర్చుకొంది. దీంతో టేలర్ కు జింబాబ్వేతో పోల్చుకొంటే మంచి పారితోషికమే లభిస్తుంది. ఇలా జింబాబ్వే నుంచి ఇంగ్లండ్ తరలి వెళ్లిన ఆటగాళ్లలో టేలరే కాదు, సీన్ ఇర్విన్. , ముర్రే గుడ్విన్,, ఆండీ ఫ్లవర్ , ఆంటోనీ ఐర్లాండ్ వంటి ఆటగాళ్లు కూడా ఉన్నారు. గమనించదగ్గ అంశం ఏమిటంటే, వీళ్లంతా తెల్లజాతి వాళ్లే! -
వన్డే మ్యాచ్లకు టేలర్ గుడ్బై!
-
ఐర్లాండ్ సంచలనం
చివరి బంతి వరకు జరిగిన ఉత్కంఠ పోరులో ఐర్లాండ్ జట్టు సంచలన విజయాన్ని అందుకుంది. జింబాబ్వే బౌలర్లు పట్టు విడవకుండా పోరాడినా ఫలితం దక్కలేదు. సోమవారం సిల్హెట్ స్టేడియంలో జరిగిన టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ గ్రూప్ ‘బి’ మ్యాచ్లో ఐర్లాండ్ మూడు వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో ఈ మెగా టోర్నీలోని ప్రధాన రౌండ్కు అర్హత సాధించేందుకు తమ మార్గాన్ని సుగమం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. బ్రెండన్ టేలర్ (46 బంతుల్లో 59; 6 ఫోర్లు; 2 సిక్స్), చిగుంబురా (13 బంతుల్లో 22 నాటౌట్; 2 సిక్స్) రాణించారు. 14 పరుగులకే తొలి వికెట్ పడగా ఓపెనర్ మసకద్జా (17 బంతుల్లో 21; 3 ఫోర్లు)తో కలిసి టేలర్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వేగంగా ఆడిన టేలర్ 38 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. చివర్లో చిగుంబురా ధాటిగా ఆడి స్కోరును పెంచాడు. డాక్రెల్, మెక్ బ్రైన్లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఐర్లాండ్ ఏడు వికెట్లు కోల్పోయి 20వ ఓవర్ చివరి బంతికి లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఓపెనర్లు స్టిర్లింగ్ (34 బంతుల్లో 60; 9 ఫోర్లు; 1 సిక్స్), పోర్టర్ఫీల్డ్ (23 బంతుల్లో 31; 3 ఫోర్లు; 1 సిక్స్) ధాటిగా ఆడారు. ఆరో ఓవర్లో వరుసగా నాలుగు ఫోర్లు బాది స్టిర్లింగ్ జోరును ప్రదర్శించాడు. దీంతో 8.2 ఓవర్లలోనే తొలి వికెట్కు 80 పరుగులు జత చేరాయి. స్టిర్లింగ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం లభించింది. చివర్లో ఉత్కంఠ అయితే రెండు వికెట్ల నష్టానికి వంద పరుగులతో పటిష్టంగానే కనిపించిన ఐర్లాండ్ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి తడబడింది. పేసర్ పన్యంగరా (4/37) రెచ్చిపోవడంతో మ్యాచ్లో ఉత్కంఠ ప్రారంభమైంది. 15వ ఓవర్లో తను రెండు వికెట్లు తీశాడు. అప్పటికి 30 బంతుల్లో 35 పరుగులు చేయాల్సి ఉంది. ఈ దశలో బరిలోకి దిగిన కెవిన్ ఓబ్రియాన్ (10 బంతుల్లో 17; 2 ఫోర్లు; 1 సిక్స్) తన సహజశైలిలో ఆడగా 12 బంతుల్లో లక్ష్యం ఏడు పరుగులకు వచ్చింది. చివరి ఓవర్లో నాలుగు పరుగులు రావాల్సి ఉండగా రెండు బంతుల్లో రెండు వికెట్లు పడడంతో ఐర్లాండ్ శిబిరంలో ఆందోళన నెలకొంది. ఇక చివరి బంతికి ఒక్క పరుగు అవసరం. బంతి బ్యాట్స్మన్కు చిక్కకుండా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో నేరుగా వికెట్లను గిరాటేసేందుకు టేలర్ ప్రయత్నించి విఫలమయ్యాడు. విజయానికి కావాల్సిన సింగిల్ను ఐర్లాండ్ సాధించడంతో మ్యాచ్ ముగిసింది.