Advertisement
BSNL ap circle
-
జియోకి భారీ డామేజ్ 25 లక్షల మంది BSNLకి పోర్ట్?
-
ఆదాయ వృద్ధిలో బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ టాప్
విశాఖపట్నం : ఆదాయ వృద్ధిలో దేశంలోనే బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్(రెండు తెలుగు రాష్ట్రాలు) నంబర్ వన్ స్థానంలో ఉందని ఆ సంస్థ ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ పీవీ మురళీధర్ తెలిపారు. విశాఖలోని బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో 8 శాతం వృద్ధి రేటు సాధించగలిగామని చెప్పారు. దేశంలోనే ఏపీ టెలికాం నంబర్ వన్ స్థాయికి ఎదిగిందన్నారు. సెల్యూలర్ విభాగంలో 10 శాతం, బ్రాడ్బ్యాండ్లో 5 శాతం వృద్ధి రేటు సాధించామన్నారు. రూ.160 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలిపారు. 17 లక్షల కనెక్షన్లతో మంచి రెవెన్యూ సాధించగలిగామని చెప్పారు. డేటా విషయానికొస్తే ఐదు శాతం పెరిగిందన్నారు. ఈ ఏడాది చివరికి 4జీ సేవల్లో అడుగుపెట్టనున్నట్టు తెలిపారు. ఫైబర్ నెట్వర్క్ విస్తరించనున్నట్టు చెప్పారు. -
ఊరూరా ఇంటర్నెట్
* బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ సీజీఎం మురళీధర్ సాక్షి, హైదరాబాద్: ఊరూరా ఇంటర్నెట్ ఏర్పాటు చేసేందుకు బీఎస్ఎన్ఎల్ నడుం బిగించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 21,265 గ్రామాలను హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్తో అనుసంధానించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా మక్లూర్ బీఎస్ఎన్ఎల్ బ్లాక్ పరిధిలో 5 గ్రామ పంచాయతీలకు, ఏపీలోని పరవాడ బ్లాక్ పరిధిలో హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ మిగతా పంచాయతీల కోసం ప్రత్యేకంగా ఆప్టికల్ ఫైబర్ లైన్లను ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధించిన వివరాలను బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ సీజీఎం మురళీధర్ మంగళవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. కేంద్రం ప్రతిపాదించిన డిజిటల్ ఇండియాలో భాగంగా తెలంగాణ పరిధిలో 8,779 పంచాయతీలు, ఏపీ పరిధిలో 12,876 పంచాయతీలకు హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కలగనుందని తెలిపారు. ల్యాండ్లైన్ వ్యవస్థను ఆధునికీకరించేందుకు చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. అలాగే, రెండు రాష్ట్రాల్లో రూ.198 కోట్లతో కొత్త ప్రాజెక్టును చేపట్టనున్నట్లు వివరించారు. 3 జీ టవర్లను 1,450కు పెంచనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 79 పర్యాటక ప్రాంతాల్లో 5జీ వైఫ్ సేవలు అందుబాటులో ఉంచామన్నారు. వీటిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి వైఫై హాట్స్పాట్లుగా మరో 93 ప్రాంతాలను గుర్తిం చామన్నారు. కాగా, అమూల్య పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించిన్నట్లు వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా ఏ నెట్వర్క్కైనా లోకల్/ఎస్టీడీల కాల్ రేటు సెకనుకు ఒక పైసాగా ఉంటుందని, రాత్రి 9 నుంచి ఉదయం ఏడు వరకు నిమిషానికి 20 పైసలుగా ఉంటుందని చెప్పారు. అలాగే, రూ.200 పైబడిన విలువైన టాప్ అప్ ఓచర్లకు ఫుల్ టాక్టైం ఇస్తామని ప్రకటించారు.