ceasefire again
-
గాజా ఒప్పందం ఆలస్యం!.. హమాస్కు ఇజ్రాయెల్ వార్నింగ్!
జెరుసలేం : గాజాలో శాంతి ఒప్పందం వేళ ఇజ్రాయెల్ సైన్యం హమాస్కు హెచ్చరికలు జారీ చేసింది. ఇచ్చిన మాటకు కట్టుబడడం లేదని, అందుకే తాము గాజాపై దాడుల్ని కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి, రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి మాట్లాడుతూ..హమాస్ చెరలో బంధీలుగా ఉన్న 33 మంది బంధీల జాబితా విడుదల కాలేదు. బంధీల జాబితా మాకు చేరే వరకు కాల్పులు కొనసాగుతాయని చెప్పారు.ఆదివారం ఉదయం నాటికి కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా తన వద్ద ఉన్న బంధీల జాబితాను విడుదల చేయాలి. కానీ అలా చేయలేదు. ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. హమాస్ ఇచ్చిన మాటకు కట్టుబడే వరకు కాల్పుల విరమణ అమలులోకి రాదు అని’ హగరీ చెప్పారంటూ ఓ ఇజ్రాయెల్ సైన్య అధికారి వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అంతకు ముందు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైతం కాల్పుల విరమణపై కీలక వ్యాఖ్యలు చేశారు. బంధీల జాబితా విడుదల చేయనంత వరకు సైనిక దాడులు కొనసాగుతాయని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు తాము బాధ్యులం కాదని సూచించారు. గాజాలో శాంతిపదిహేను నెలలుగా రక్తమోడుతున్న గాజాలో శాంతి నెలకొంది. గత బుధవారం అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్య వర్తిత్వంతో ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరింది. ఒప్పందంలో భాగంగా.. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8.30 గంటలకు కాల్పుల విమరణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. కానీ సాంకేతిక అంశాల్ని కారణంగా చూపిస్తూ బంధీల జాబితాను విడుదల చేయడంలో జాప్యం చేసింది. కాగా, కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ చెరలో ఉన్న 33 మంది బంధీలను విడుదల చేయాలి. ప్రతిఫలంగా ప్రస్తుతం జైళ్లలో మగ్గుతున్న దాదాపు 2,000 మంది పాలస్తీనియన్లను కూడా ఇజ్రాయెల్ విడుదల చేయనుంది. -
సరిహద్దులో పేట్రేగిన పాక్
జమ్మూ / ఆర్నియా / శ్రీనగర్: కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ మరోసారి తూట్లు పొడిచింది.అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంట జమ్మూకశ్మీర్లోని గ్రామాలు, బీఎస్ఎఫ్ ఔట్పోస్టులు లక్ష్యంగా పాక్ రేంజర్లు బుధవారం మోర్టార్లు, భారీ ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆర్ఎస్ పురా, ఆర్నియా, బిష్నాహ్, రామ్గఢ్, సాంబా సెక్టార్లలో కొన్నిచోట్ల మంగళవారం అర్థరాత్రి నుంచే పాక్ బలగాలు కాల్పులు ప్రారంభించాయని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ కాల్పులు క్రమంగా మిగతా సెక్టార్లకూ విస్తరించాయన్నారు. పాక్ కాల్పుల నేపథ్యంలో ప్రజలంతా సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవడంతో ఆర్నియా పట్టణం నిర్మానుష్యంగా మారిపోయిందన్నారు. ఆర్నియా పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 76,000 మందికి పైగా ప్రజలు ప్రాణ భయంతో సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లారన్నారు. మరోవైపు పాక్ కాల్పుల మోతపై బిషన్సింగ్(78) అనే స్థానికుడు స్పందిస్తూ.. ‘1971 తర్వాత ఇంత భారీస్థాయిలో షెల్లింగ్ను నేనెప్పుడూ చూడలేదు. వెంటనే పాకిస్తాన్తో యుద్ధం చేసి ఈ సమస్యలన్నింటిని ఒకేసారి పరిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోదీని మేం డిమాండ్ చేస్తున్నాం’ అని చెప్పారు. మరోవైపు అనంతనాగ్ జిల్లాలో గస్తీలో ఉన్న బలగాలపై ఉగ్రవాదులు గ్రెనేడ్ను విసిరి పరారయ్యారు. ఈ ఘటనలో 10 మంది పౌరులు గాయపడ్డారు. -
పాక్ కాల్పుల్లో 11కు చేరిన మృతులు
జమ్మూ: పాకిస్తాన్ వరుసగా నాలుగోరోజూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ(ఎల్వోసీ)తో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న జమ్మూ, కథువా, సాంబా, పూంచ్, రాజౌరీ ప్రాంతాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడి సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీకే రాయ్ ప్రాణాలు కోల్పోయినట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. దీంతో గత నాలుగు రోజుల్లో పాక్ కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య 11కు చేరుకుందన్నారు. చనిపోయినవారిలో ముగ్గురు ఆర్మీ, ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ఆరుగు రు పౌరులున్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని 40,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. గణతంత్ర వేడుకల వేళ అలజడి సృష్టించేందుకు నలుగురు ఉగ్రవాదులు కశ్మీర్లోకి ప్రవేశించవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. -
మళ్లీ కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్
శ్రీనగర్ : పాకిస్తాన్ మరోసారి కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి 20 బీఎస్ఎఫ్ శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇటీవలి కాలంలో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. ఆదివారం కూడా జమ్మూ జిల్లాలోని ఆర్ఎస్ పురా సెక్టర్లో బీఎస్ఎఫ్ జవాన్లే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. -
PM నవాజ్ది ఒకమాట,పాక్ ఆర్మీది మరో బాట
-
పాక్ కాల్పుల్లో భారతీయ జవాను మృతి
జమ్మూ: పొరుగు దేశమైన పాకిస్థాన్ మరో సారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రణ రేఖ వద్ద పాక్ బలగాలు కాల్పులకు తెరలేపడంతో ఒక భారతీయ జవాను మృతిచెందాడు. ఆక్నూర్ సెక్టార్ లోని పల్లన్ వాలా ప్రాంతంలో పాకిస్తాన్ దళాలు చిన్న సైజు ఆయుధాలతో దాడికి పాల్పడినట్లు మిలటరీ ప్రతినిధి మనీష్ మెహ్తా తెలిపారు. ఆ దాడిని భారతీయ బలగాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయన్నారు. అయితే ఒక జవాను మాత్రం ఆ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడన్నారు. గతేడాది నుంచి పాక్ సైన్యం పలుమార్పు కాల్పుల విరమణ ఒప్పందాన్నిఉల్లంఘిస్తోంది. గతేడాది నుంచి చూస్తే ఇప్పటి వరకూ పాకిస్తాన్ దాదాపు 150 సార్లు కాల్పుల విరమణ ఉల్లఘించింది. -
మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘించిన పాక్
పొరుగు దేశమైన పాకిస్థాన్ మరో సారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ ఆర్ ఎస్ పురా సెక్ట్రర్లోని సరిహద్దు భద్రత దళం లక్ష్యంగా ఔట్ పోస్ట్లపై పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. దాంతో సరిహద్దు భద్రత దళం వెంటనే అప్రమత్తమై... పాక్ సైన్యంపై ఎదురుకాల్పులకు దిగింది. గతేడాది పాక్ సైన్యం 149 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆ కాల్పులలో పలువురు భారతీయ జవాన్లు మృతి చెందగా, పదుల సంఖ్యలో భారత జవాన్లు గాయపడిన విషయం విదితమే. -
మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్
పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్ ఆర్.ఎస్. పురా సెక్టార్లోని భారత జవాన్లు లక్ష్యంగా పిండి ఔట్ పోస్ట్పై పాక్ కాల్పులకు తెగబడింది. భారత జవాన్లు వెంటనే స్పందించి ఎదురుకాల్పులకు దిగిందని ఉన్నతాధికారి వెల్లడించారు. శనివారం ఉదయం ప్రారంభమైన కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. గత నెల 13న భారత్ జవాన్లు లక్ష్యంగా భారత సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. గతేడాది పాక్ సైన్యం 149 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆ కాల్పులలో పలువురు భారతీయ జవాన్లు మృతి చెందగా, పదుల సంఖ్యలో భారత జవాన్లు గాయపడిన విషయం విదితమే.