change issue
-
జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన మార్పులు ఇవే..
కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం. ఈ రోజు జనవరి 1, 2025 నుంచి దేశవ్యాప్తంగా కొన్ని అంశాల్లో మార్పులు అమలు అవుతున్నాయి. ఈపీఎఫ్ఓ, యూఎస్ వీసా, ఎల్పీజీ సిలిండర్ ధరలు, కార్ల ధరలు, రేషన్ కార్డులకు కేవైసీ నమోదు చేయడం వంటి వాటిలో మార్పులు వచ్చాయి. ఈమేరకు ఇప్పటికే ఆయా విభాగాలు ప్రకటనలు విడుదల చేశాయి. అందులో కొన్ని ముఖ్యమైన వాటి వివరాలు తెలుసుకుందాం.ఎల్పీజీ సిలిండర్ ధరలుజనవరి 1, 2025 నుంచి ప్రధాన నగరాల్లో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు తగ్గాయి. మారిన ధరలు కింది విధంగా ఉన్నాయి.ఢిల్లీ: రూ.1,804 (రూ.14.5 తగ్గింది)ముంబై: రూ.1,756 (రూ.15 తగ్గుదల)కోల్కతా: రూ.1,911 (రూ.16 తగ్గింది)చెన్నై: రూ.1,966 (రూ.14.5 తగ్గింది)14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర స్థిరంగా ఢిల్లీలో రూ.803, కోల్కతాలో రూ.829, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50గా ఉంది.కార్ల ధరలుమారుతి సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా, బీఎండబ్ల్యూ(BMW) వంటి ప్రధాన ఆటో కంపెనీలు కార్ల ధరలను 3% వరకు పెంచాయి.రేషన్ కార్డులకు ఈ-కేవైసీరేషన్ కార్డుదారులకు ఈ-కేవైసీ(e-KYC) తప్పనిసరి. 2024 డిసెంబర్ 31లోగా ఈ-కేవైసీ పూర్తి చేయని రేషన్కార్డులు రద్దవుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.పెన్షన్ ఉపసంహరణ నిబంధనలుపెన్షనర్లు అదనంగా ఎలాంటి ధ్రువీకరణ అవసరం లేకుండా ఏదైనా బ్యాంకు నుంచి పెన్షన్ను ఉపసంహరించుకోవడానికి ఈపీఎఫ్ఓ అనుమతించింది.ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్డ్రాసులభంగా పీఎఫ్(PF) ఖాతాలోని నగదును ఉపసంహరించుకోవడానికి ఏటీఎం కార్డు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది.ఇదీ చదవండి: ఏడాది మొదటిరోజు తులం బంగారం ఎంతంటే..యూపీఐ పరిమితి పెంపుయూపీఐ 123పే కింద ఫీచర్ ఫోన్ యూజర్లకు చెల్లింపు పరిమితిని రూ.10,000కు కేంద్రం పెంచింది. ఇది గతంలో రూ.5,000గా ఉండేది. జనవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తున్నట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది.యూఎస్ వీసా రూల్స్నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా(Visa) దరఖాస్తుదారులు జనవరి 1 నుంచి ఒకసారి ఉచితంగా అపాయింట్మెంట్ను రీషెడ్యూల్ చేసుకోవచ్చు. -
మన రాజ్యాంగానికి కొత్త ప్రమాదం
భారత ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి చేసే ఏ ప్రయత్నమైనా ప్రమాదకరమే. అణచివేతకు గురైన, పీడిత వర్గాల ప్రజలు ఇంతకాలం పొందుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ దీంతో కోల్పోతారు. కులవ్యవస్థ, అంటరానితనం, ఆదిమతత్వం కారణంగానే భారతదేశంలో 1950కి ముందు సార్వత్రిక విద్య అనే భావనే ఉనికిలో లేదు. ప్రస్తుత రాజ్యాంగాన్ని అమలుపరచడం వల్లే పీడిత ప్రజలు అంతవరకు తమకు తెలీని ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకున్నారు. కాబట్టి ఏ రాజకీయ, సైద్ధాంతిక భావజాలం ఉన్న నాయకులైనా సరే... ఈ రాజ్యాంగాన్ని వెనక్కు నెట్టడాన్ని మనం ఎన్నటికీ అనుమతించకూడదు. భారత రాజ్యాంగం నిరవధికంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రెండు వ్యతిరేక రంగాల్లో పోరాటాన్ని ప్రారంభించారు. ఒకటి: బీజేపీ గద్దె దిగేంత వరకూ వారితో పోరా డుతూ ఉంటానన్నారు. రెండు: ఆరెస్సెస్, బీజేపీ వ్యతిరేకించిన 1950 నాటి రాజ్యాంగం స్థానంలో కొత్త రాజ్యాంగాన్ని ఆయన కోరు కున్నారు. పూర్తిగా విరుద్ధమైన రెండు యుద్ధరంగాలను అయన ఏక కాలంలో ఎందుకు ప్రారంభించినట్లు అనేది అసలు ప్రశ్న. ఆర్ఎస్ఎస్ మూలాలు సనాతన బ్రాహ్మణవాద ఆధ్యాత్మిక వ్యవస్థలో పాతుకుని ఉన్నాయి కాబట్టి దాన్నుంచి భారత రాజ్యాం గానికి ప్రమాదం ఉండేదనీ, ఇప్పటికీ ఉంటోందనీ మనకు తెలుసు. డాక్టర్ అంబేడ్కర్ నేతృత్వంలోని డ్రాఫ్ట్ కమిటీ ముసాయిదా రచనా ప్రక్రియను రూపొందించడం ప్రారంభించినప్పటి నుంచి కూడా ఆరెస్సెస్ సిద్ధాంతకర్తలు, దాని సంస్థాపక నాయకులు... రాజ్యాంగ సభ భావనను అంగీకరించేవారు కాదు. భారతీయతపై వారి భావన కానీ, వారు సమ్మతిస్తున్న తరహా రాజ్యాంగం కానీ... వర్ణ కుల వ్యవస్థను బలపరుస్తాయి. భారతీయ కమ్యూనిస్టులు కూడా రాజ్యాంగసభ ఏర్పాటును తోసిపుచ్చి ప్రజాస్వామిక రాజ్యాంగ ముసాయిదాను వ్యతిరేకించడానికి ప్రయత్నించారు. అది ఒక బూర్జువా రాజ్యాంగ రచనకు ప్రయత్నమని వారి భావం. అదృష్ట వశాత్తూ వీరు కూడా తమ ప్రయత్నంలో విఫలమయ్యారు. చివరకు 1950 జనవరి 26న ప్రస్తుత రాజ్యాంగం ఉనికిలోకి వచ్చింది. రాజ్యాంగంలోని కొన్ని సెక్షన్లను మాత్రమే కాకుండా మొత్తం రాజ్యాంగాన్నే సమీక్షించడానికి అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వం లోని నాటి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం జస్టిస్ వెంకటాచలయ్య నేతృత్వంలో ఒక సమీక్షా కమిటీని ఏర్పర్చింది. కేవలం రాజ్యాంగాన్ని సవరించడం కాకుండా మారుతున్న సమాజ అవసరాలకు అను గుణంగా దాన్ని మార్చాలన్నదే నాటి ప్రభుత్వ ఉద్దేశం. కానీ ఆ ప్రయ త్నాన్ని దేశంలోని పలు వర్గాల ప్రజలు తిరస్కరించారు. దీంతో రాజ్యాంగ సమీక్షా కమిటీ సహజంగానే మరుగున పడిపోయింది. (చదవండి: కాంగ్రెస్కు చన్నీ చూపిన బాట) తగని వైఖరి ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కె. చంద్రశేఖర రావు కేంద్ర బడ్జెట్ గురించి ఫిబ్రవరి 1న మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను మాత్రమే కాకుండా ప్రస్తుత రాజ్యాంగాన్ని కూడా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కొందరు మీడియా వ్యక్తులు దీన్ని పెద్దగా పట్టించుకోనప్పుడు, ఈ అంశంపై తాను చాలా సీరియస్గా ఉన్నట్లు నొక్కి చెప్పారు. ‘మొత్తం రాజ్యాంగాన్ని మార్చడంపై చర్చిద్దాం. మనకు ఇప్పుడు కొత్త రాజ్యాంగం కావాలి’ అన్నారు. ఒక చిన్న ప్రాంతీయ పార్టీ నేతకు దేశానికి కొత్త రాజ్యాంగం కావాలి అనే ప్లాన్ ఉంటే దాన్ని ఎవరైనా పట్టించుకోవలసిన అవసరం లేదు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దీని గురించి మాట్లాడటమే కలవరపెడుతోంది. వాస్తవానికి కేసీఆర్లో అనేక రకాలుగా హిందుత్వ ఆలోచనా విధానం గూడుకట్టుకుని ఉంది. స్వతహాగా ఆయన మతావేశపరుడు. యాగాలు, యజ్ఞాలు, క్రతువులు, ఆలయాలపై మెండుగా ఖర్చు పెడ తారు. వైష్ణవ పీఠాధిపతి చిన జీయర్ని సకల వేళల్లో అనుసరిస్తారు. యాదగిరి ఆలయ పునరుద్ధరణకు రూ. 130 కోట్లు ఖర్చు పెట్టారు. పూర్తిగా మతపరమైన విశ్వాసాలతో కూడిన వ్యక్తిత్వం కాబట్టే ఇలా రాజ్యాంగ వ్యతిరేక ప్రకటనలకు కేసీఆర్ పాల్పడు తున్నారు. బీజేపీపై కేసీఆర్ చేస్తున్న పెనుదాడి తెలంగాణ మనోభావాలను తిరిగి ప్రేరేపిస్తుంది కాబట్టి ఇది ఆయనకు లబ్ధి చేకూర్చవచ్చు. కానీ ఆయన ప్రదర్శిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక వైఖరి అటు తెలంగాణ ప్రజలకు గానీ, ఇటు తన సొంత ప్రయోజనానికి గానీ ఏమాత్రం సమ్మతమైనది కాదు. ఎందుకంటే రాజ్యాంగం పట్ల వ్యతిరేకత అనేది నేరుగా ఆరెస్సెస్, బీజేపీతో ముడిపడి ఉన్న విషయం. ఇలాంటి పాలకులను, వ్యక్తులను సంస్కరించడమే భారత రాజ్యాంగ విధి. ఒక వ్యక్తిగా ఇలాంటి అభిప్రాయాలు కలిగి ఉండే హక్కు కేసీఆర్కు లేదని చెప్పలేం. కానీ రాజ్యాంగం ముందు ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అదే రాజ్యాంగాన్ని మార్చడానికి ఉద్యమాన్ని ప్రారంభించకూడదు. భారత స్వాతంత్య్రం కోసం మన దేశ నిర్మాతలు సంవత్సరాల కొద్దీ జైళ్లలో గడిపారు. వారు రాజ్యాంగ ముసాయిదాను రచించిన రాజ్యంగ సభలో భాగమయ్యారు. దేశం చారిత్రకంగా ఎదుర్కొన్న ప్రతి కీలక సమస్యపై సుదీర్ఘ చర్చ జరిపిన తర్వాతే వీరు రాజ్యాంగ ముసాయిదాను రచించారు. ఇన్నేళ్ల తర్వాత ప్రతి ముఖ్యమంత్రీ లేక మంత్రీ, దేశానికి సర్వశక్తులూ కల్పించిన భారత రాజ్యాంగాన్నే రద్దు చేయాలని మాట్లాడితే దేశం కల్లోలంలో కూరుకుపోక తప్పదు. రేపు ప్రధానమంత్రి, ఆయన మంత్రివర్గ సభ్యులు కూడా ప్రజాస్వామిక వ్యవస్థను సంస్థాగతం చేసిన రాజ్యాంగాన్ని త్యజించడం లేదా రద్దు చేయడం గురించి మాట్లాడటం మొదలెడితే, భారతదేశం ధ్వంసమై పోతుంది. ప్రస్తుత పాలకులను నాటి స్వాతంత్య్ర వీరులు, వారి త్యాగాలతో ఏమాత్రం సరిపోల్చలేమనే చెప్పాలి. (చదవండి: మూడో ఫ్రంట్ మనగలిగేనా?) గణరాజ్య వ్యవస్థ ఆచరణీయమేనా? మరో సందర్భంలో ఆరెస్సెస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్, ప్రాచీన గణరాజ్య వ్యవస్థలో ఉత్తమమైన ప్రజాస్వామ్యం ఉండేదని సూచించారు. ఇది జాతీయవాద ప్రచారంలో బాగా వ్యాప్తిలో ఉన్న కొత్త భ్రమ మాత్రమే. పైగా మనది వలసవాద రాజ్యాంగ నమూనా అంటూ చాలాసార్లు పరోక్షంగా వ్యాఖ్యానాలు చేశారు. ప్రాచీన గణ రాజ్యాలు చిన్న చిన్న గిరిజన విభాగాలు. స్థానిక విభాగాల స్థాయిలో గిరిజన సమానత్వ పంపిణీ పద్ధతిలో నడిచేవి. దీనికి చక్కటి ఉదా హరణ వజ్జియన్ గిరిజన గణరాజ్య ప్రజాస్వామ్యం. బుద్ధుడి జీవిత కాలంలోనే ఇది ఉనికిలో ఉండేది. మగధ రాజ్య ఆక్రమణ నుంచి బుద్ధుడు దీన్ని కాపాడాడు. ఇలాంటి గణరాజ్య ప్రజాస్వామ్యాన్ని ఆధునిక భారత రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగానూ పోల్చి చూడలేం (నా పుస్తకం ‘గాడ్ యాజ్ పొలిటికల్ ఫిలాసపర్ – బుద్ధాస్ ఛాలెంజ్ టు బ్రాహ్మిణిజం’లో నేను గతంలోనే దీన్ని చర్చించాను). మన రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని ప్రయోగమని చెప్పాలి. పైగా జనాభా అధికంగా ఉన్న ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఇంతటి బృహత్తర రాజ్యాంగం ఉనికిలో లేదు. ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని రద్దు చేయడానికి చేసే ఏ ప్రయత్నమైనా ప్రమాదకరమే. అణచివేతకు గురైన, పీడిత వర్గాల ప్రజలు ఇంత కాలం పొందుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ దీంతో కోల్పోతారు. కుల వ్యవస్థ, అంటరానితనం, ఆదిమతత్వం కారణంగానే భారత దేశంలో 1950కి ముందు సార్వత్రిక విద్య అనే భావనే ఉనికిలో లేదు. ప్రస్తుత రాజ్యాంగాన్ని అమలుపరచడం వల్లే పీడిత ప్రజలు అంతవరకు తమకు తెలీని ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేతృత్వంలో భారత రాజ్యాంగ ముసాయిదా పూర్తి కావడం, దాన్ని మన దేశ నిర్మాతలు ఆమోదించినందుకు మనం ఎంతో అదృష్టవంతులం. కేసీఆర్ వంటి అధికార తృష్ణ కలిగిన నేతలు, హిందుత్వ భావజాలం ప్రభావంతో వ్యవహరిస్తున్నవారు లేక మరే ఇతర సైద్ధాంతిక దృక్పథం కలిగినవారైనా సరే ఈ రాజ్యాంగాన్ని వెనక్కు నెట్టడాన్ని మనం ఎన్నటికీ అనుమతించకూడదు. (చదవండి: పరాయీకరణ దిశలో మేడారం జాతర) ఒక దశలో నేను కూడా రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య రద్దు కోసం పనిచేస్తున్న వామపక్ష భావజాల శక్తుల్లో భాగంగా ఉండేవాడిని. అయితే చాలా త్వరగానే నేను వాస్తవం గుర్తించి, ‘నేను హిందువు నెట్లయిత’ పుస్తకాన్ని రచించిన 1980లలోనే, అలాంటి వామపక్ష శక్తులనుంచి బయటపడ్డాను. అందుకు నేను చాలా అదృష్టవంతుడిని. ఆ విధంగా రాజకీయ స్వీయ విధ్వంసక సైద్ధాంతిక క్రమం నుంచి నేను బయటపడ్డాను. అమెరికన్ రాజ్యాంగం వందల సంవత్సరా లుగా పనిచేస్తున్న విధంగా భారత రాజ్యాంగం కూడా నిరవధికంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగంపై కేసీఆర్ అభిప్రాయాలను తెలంగాణ ప్రజలు మొత్తంగా తిరస్కరించినం దుకూ, ప్రతిపక్ష పార్టీలు, సామాజిక సంస్థలు అలాంటి ఆలోచననే ఖండించినందుకూ నేనెంతో సంతోషపడుతున్నాను. - ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
చిల్లర దాడి
దొడ్డబళ్లాపురం: కేవలం ఆరు రూపాయల చిల్లర కోసం ఒక ప్రయాణికుడు కండక్టర్పై దాడికి పాల్పడిన ఘటన విజయపుర జిల్లా ఇండి తాలూకాలో చోటుచేసుకుంది. సులేమాన్ అనే ప్రయాణికుడు గురువారం తాంబా గ్రామంలో కేఎస్ ఆర్టీసీ బస్సు ఎక్కాడు. చిల్లరలేకపోవడంతో కండక్టర్ ఇన్నూసాబ్ ఉస్మాన్సాబ్ టిక్కెట్ వెనుక రూ.6 చిల్లర రాసి ఇచ్చాడు. బస్సు గమ్యస్థలానికి వచ్చినా కండక్టర్ చిల్లర ఇవ్వలేదన్న కోపంతో సులేమాన్ గొడవపడ్డాడు. చివరకు డిపోకు వెళ్లి చిల్లర డబ్బు తీసుకున్నాడు. శుక్రవారం బస్సు తాంబా గ్రామానికి రాగా సులేమాన్ సదరు కండక్టర్పై ఇనుపరాడ్తో తలపై బాదాడు. దీంతో కండక్టర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు స్పందించి బాధితుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఆర్టీసీలో నగదు రహితం!
బస్స్టేషన్ (విజయవాడ సెంట్రల్) : ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్కు, ప్రయాణికులకు మధ్య తలెత్తుతున్న చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రయోగాత్మకంగా బస్సుల్లో క్యాష్లెస్ విధానం అమలు చేసేందుకు యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. సిటీ క్యాష్ సంస్థ ద్వారా క్యాష్ లెస్ విధానాన్ని ఆర్టీసీ బస్సుల్లో అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ విధానంపై ప్రయాణికుల్లో అవగాహన కల్పించేందుకు ఇటీవల ట్రయిల్రన్ నిర్వహించారు. నగదు రహిత లావాదేవీలు ప్రయాణికుడు ఆర్టీసీ నుంచి రూ.30కి కార్డు కొనుగోలు చేస్తాడు. దీన్ని తమ ప్రయాణాలకు అవసరమైన మేర నగదుతో రీచార్జ్ చేయించుకుంటారు. కార్డుతో బస్సు ఎక్కిన ప్రయాణికుడు కండక్టర్కు అందించగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసే స్వైప్ మిషన్ ద్వారా టికెట్టుకు తగిన నగదు కోట్ చేస్తాడు. తద్వారా టికెట్టును ప్రయాణికుడికి ఇస్తారు. ఈ ప్రకారం అమలు జరిగితే బస్సుల్లో నగదు రహిత లావాదేవీలు కొనసాగుతాయి. ఆ కార్డు తిరిగి ఆర్టీసీకి అప్పగిస్తే కార్డు కొనుగోలు చేసిన నగదు తిరిగి ఇస్తారు. ఐదు రోజులుగా ట్రయిల్రన్.. తొలిసారిగా కృష్ణా రీజియన్లో ఈ క్యాష్లెస్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ఆర్టీసీ అధికారులు గవర్నర్పేట–2, విద్యాధరపురం డిపోల్లో పరిశీలన చేశారు. విజయవాడ–పామర్రు రూట్లో సిటీక్యాష్ సిబ్బంది, కండక్టర్, డ్రైవర్లతో బస్సులో ప్రయాణించి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. దీనిపై ఆర్టీసీ అధికారులు సిబ్బంది అభిప్రాయాలు తెలుసుకోగా, ఈ విధానం సానుకూలంగా ఉందని తెలిసింది. ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తే అమలు క్యాష్లెస్ విధానంపై ప్రయాణికుల నుంచి అనుకూల స్పందన వస్తే అమలు చేస్తాం. ప్రస్తుతం నిర్వహించిన రూట్ సర్వేలో స్పందన బాగుంది. ఈ విధానం నగరంలో అమలు చేయాలంటే సాహసమనే చెప్పాలి. సిటీక్యాష్ సంస్థ నుంచి ఆర్టీసీ కార్డులు కొనుగోలు చేసి ప్రయాణికులకు విక్రయిస్తుంది. – పీవీ రామారావు, ఆర్ఏం, కృష్ణా రీజియన్ -
నేతల ‘నోటు’మాట
కాలు కదపకుండా వైట్ చేసేస్తున్నారు వాణిజ్య బ్యాంకులకు, మద్యం దుకాణాలకు టార్గెట్లు అన్నవరం సత్తెన్ననూ వదలడం లేదు ‘పచ్చ’ నేతల నోట్ల దందా... సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘శతకోటి దర్రిదాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి ’పచ్చ’ నేతలు సవాలక్ష దారులు వెతుకుతున్నారు. పెద్దనోట్ల రద్దుతో దేశమంతా అల్లాడిపోతుంటే తునిలో అధికార పార్టీ ముఖ్యనేత మాత్రం కాలుకదపకుండా అక్రమార్జనను సక్రమం చేసుకుంటున్నారు. సామాన్యుడు బ్యాంకు వద్ద రెండు గంటలు క్యూలో నిలుచున్నా రూ.2000లు డ్రా చేసుకోవడం గగనమైపోతోంది. అటువంటిది అధికారాన్ని అడ్డంపెట్టుకుని కాలుమీద కాలేసుకుని పక్కా ప్రణాళికతో ఒక తెలుగు తమ్ముడు నల్లడబ్బును తెల్ల డబ్బుగా మార్చేసుకుంటున్నాడు. నోట్ల మారకం కోసం బ్యాంకులు, మద్యం దుకాణాలే కాదు చివరకు పుణ్య క్షేత్రాన్ని కూడా విడిచిపెట్ట లేదు. జిల్లాలో పలు ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా ఇదే పనిలో ఉన్నా, హవా అంతా తునిలో ముఖ్య నేతదేనంటున్నారు. జిల్లాలో పలు నియోజకవర్గాల్లో పెద్ద నోట్లు తీసుకుని కమీష¯ŒS ప్రాతిపదికన కొత్త నోట్లు మారకం జరుగుతోంది. బ్యాంకులకు ఇలా... తుని పరిసర ప్రాంతాల్లోని బ్యాంకులు, మద్యం దుకాణాలు, వడ్డీ వ్యాపారులను బెదిరింపులతో కరెన్సీ మార్పిడి చేసుకుంటున్నారు. బ్యాంకులకైతే ఒక లెక్క, మద్యం దుకాణాలకైతే మరో లెక్కగా నడుస్తోంది. తుని పట్టణం లో వాణిజ్య బ్యాంకు బ్రాంచీలు 24 వరకు ఉన్నాయి. ఇంతవరకు రైతులకు, నిరుద్యోగులకు రుణాలు ఇవ్వాల ని బ్యాంకులకు ప్రభుత్వం లక్ష్యాలు నిర్థేశించడం చూ శాం. కానీ అక్కడ మాత్రం నల్లడబ్బు తెల్లడబ్బుగా మా ర్చుకునేందుకు బ్యాంకుల వారీగా టార్గెట్లు పెట్టడం విమర్శలకు తావిస్తోంది. బ్యాంకులో నల్లధనాన్ని మా ర్చుకోవడానికి అక్కడ రెండు పద్ధతులు అనుసరిస్తున్నా రు. ఎంపిక చేసిన 40 మంది తమ అనుచరులను ప్రతి రోజూ బ్యాంకుకు పంపించడం ... పద్ధతి ప్రకారం అం దరితోపాటు వారు కూడా ఆధార్కార్డు జిరాక్సుతో క్యూ లై¯ŒSలోనే వెళతారు. పాత నోట్లు తీసుకుని జమ చేస్తారు. అందరితో సమానంగానే తిరిగి తలో ఒక రూ.4000లు డ్రా చేస్తారు. ఆ రకంగా ఒక్కో బ్యాంకులో లక్షన్నర మా రకం జరుపుతున్నారని లెక్క. రెండో పద్ధతిలో సాయంత్రం నాలుగు గంటల సమయంలో తమ అనుచరులకు గంపగుత్తగా ఆధార్ జిరాక్సు పత్రాలు ఇచ్చి పంపిస్తా రు. ఉదయం నుంచి ఖాతాదారులకు సర్థుబాటు (రూ.4000లు అడిగితే రూ.2000లు) చేస్తూ వచ్చిన దానిలో బ్యాలె¯Œ్స చూసుకుని ఈ ఆధార్ కార్డులకు సరిపడా మొత్తం ఆ ముఖ్యనేత అనుచరులకు ఇచ్చి తీరాల్సిందే. ఈ రకంగా సర్థుబాటు చేయడం తలకు మించిన భారంగా మారింది. అలాఅని ఆ సామ్రాజ్యంలో కాదనే ధైర్యం లేక సిబ్బంది గుండెలు బాదుకుంటున్నారు. మద్యం దుకాణాలకు ఇలా... మద్యం దుకాణాలకు కూడా రోజువారీ టార్గెట్లు నిర్దేశించారు. ఒక్కో దుకాణం నుంచి ప్రతి రోజు రూ.80 వేలు నుంచి రూ.లక్ష విలువైన వంద నోట్లు ఇచ్చి తీరాల్సిందే. అందుకే తుని పరిసర ప్రాంతాల్లోని మద్యం దుకాణాల్లో వంద నోట్లు తప్పనిసరి చేసేశారంటున్నారు. తమ్ముళ్ల దందా విషయం తెలియక ప్రతి రోజు వంద నోట్లు ఎక్కడి నుంచి తీసుకువస్తామని మందుబాబులు దుకాణ నిర్వాహకులతో గొడవకు దిగుతున్నారు. తుని పరిసర ప్రాంతాల్లో 20 మద్యం దుకాణాల ద్వారా సుమారు రూ.20 లక్షలు మార్చేస్తున్నారంటున్నారు. ఎంఆర్పీ కంటే రూ.5లు పెంచి అమ్ముకునేందుకు లక్షలు సమర్పించుకుంటున్నా ఇప్పుడు కూడా ఇదేం దందా అని నిర్వాహకులు లబోదిబోమని ఒకరి గోడు మరొకరు చెప్పుకోవడం తప్ప చేయగలిగిందేమి ఉందని కిమ్మనడం లేదు. చివరకు బడా ఫైనా¯Œ్స వ్యాపారులను కూడా తమ్ముళ్లు విడిచిపెట్టడం లేదు. భవిష్యత్తులో ఐ.టి. సంబంధ ఇబ్బందులొస్తే అప్పుడు మా అవసరం రాదా అంటూ పరోక్ష బెదిరింపులకు దిగుతున్నారని తెలియవవచ్చింది. ఈ క్రమంలో వారి ద్వారా కూడా బ్లాక్ను వైట్ చేసుకుంటున్నారంటున్నారు. సత్తెన్ననూ వదలడం లేదు... చివరకు అన్నవరం సత్తెన్నను కూడా విడిచిపెట్ట లేదు. కార్తిక మాసం కూడా వారికి కలిసి వచ్చింది. ఈ మాసంలో ఇరుగు, పొరుగు రాష్ట్రాల నుంచి లక్షల్లో వచ్చిన భక్తులు స్వామివారికి అదే స్థాయిలో లక్షలు కురిపించారు. కొండపై ప్రధానంగా లక్షలు కురిపించేది సన్నిధి కౌంటర్. పిల్లల అన్నప్రాసన మొదలు వాహన పూజ, రూ.2000లు వ్రతాల వరకు అన్నింటికీ అదే కౌంటర్. ఆ కౌంటర్లో కార్తిక మాసంలో నిత్యం సుమారుగా రూ.30, నుంచి రూ,40లక్షలు వచ్చింది. ఆ కౌంటర్తోపాటు కొండపైన తన అనుచరుల వ్యాపారాల ద్వారా నోట్ల మార్పిడి చేసుకున్నారని అత్యంత విశ్వసనీయ సమాచారం. నిబంధనలను అతిక్రమిస్తేప్రజలు తిరగబడతారు నాయకులు చెప్పినట్లుగా వ్యవహరిస్తే ప్రజలు బ్యాంకులపై తిరగబడతారు. నాయకులు చెప్పినట్టుగా బ్యాంక్ అధికారులు నడుచుకోవడం మంచి పద్ధతి కాదు. సామాన్యుడు రూ.రెండువేలు కోసం గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నారు. బెదిరింపులకు భయపడకండి, ప్రజలు మీకు అండగా ఉంటారు. అటువంటిది నాయకులు సిఫార్సులతో నగదు మార్పిడి చేస్తే ప్రజలతో కలిసి మేం కూడా తిరుగుబాటు చేయాల్సి ఉంటుంది. – దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే, తుని