The creation of Telangana state
-
టీఎంయూ ధూంధాం..
♦ ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఘనవిజయం ♦ 27 డిపోల్లో విజయకేతనం సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ఘన విజయం సాధించింది. నగరంలోని అన్ని డిపోల్లో సమీప ప్రత్యర్థి కార్మిక సంఘాలు ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్లపై స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. దీంతో ఆర్టీసీ టీఎంయూ వర్గాల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. వీఎస్టీ వద్ద ఉన్న సంఘం కార్యాలయం వద్ద కార్మికులు, యూనియన్ నాయకులు పెద్దఎత్తున సంబరాలు జరుపుకొన్నారు. బాణాసంచా పేల్చారు. మిఠాయీలు పంచుకొని ఒకరికొకరు అభినందనలు తెలుపుకొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన మొట్టమొదటి ఎన్నికలు కావడంతో అన్ని సంఘాలు ప్రతిష్టాత్మకంగానే భావించాయి. మొత్తం 10 కార్మిక సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ చేయగా అధికార టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘమైన టీఎంయూకే ఆర్టీసీ కార్మికులు పట్టం కట్టారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్లోని 28 డిపోల్లో మెజారిటీ డిపోలను టీఎంయూ కైవసం చేసుకొంది. అన్ని డిపోలు, ఆర్టీసీ కార్యాలయాల్లో పని చేస్తున్న సుమారు 21 వేల మందికి పైగా కార్మికుల్లో 97 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. తెలంగాణ మజ్దూర్ యూనియన్, టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, తెలంగాణ ఆర్టీసీ బహుజన కార్మిక సంఘం తదితర పది కార్మిక సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీకి నిలిచాయి. 27 డిపోల్లో టీఎంయూ గెలుపు గ్రేటర్ హైదరాబాద్లో 28 డిపోల్లో 27 డిపోలను టీఎంయూ దక్కించుకుంది. ఒక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) డిపో మాత్రమే ఎంప్లాయీస్ యూనియన్ గెలుచుకుంది. మిగతా ముషీరాబాద్–1, ముషీరాబాద్–2, మహేశ్వరం, చెంగిచెర్ల, హయత్నగర్, కంటోన్మెంట్, బర్కత్పురా, బండ్లగూడ, బీహెచ్ఈఎల్, ఉప్పల్, దిల్సుఖ్నగర్, కంటోన్మెంట్, హకీంపేట్, కుషాయిగూడ, ఫలక్నుమా, మెహదీపట్నం, రాజేంద్రనగర్, రాణిగంజ్–1, రాణిగంజ్–2,ఇబ్రహీంపట్నం, మిధాని, జీడిమెట్ల, మియాపూర్–1, మియాపూర్–2, మేడ్చల్, కూకట్పల్లి, పటాన్చెరు డిపోల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ గెలిచింది. అన్ని చోట్ల ఎంప్లాయీస్ యూనియన్పైన విజయం సాధించింది. అప్పుడు స్నేహితులు...ఇప్పుడు ప్రత్యర్థులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కలిసి పనిచేసిన టీఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్లు రాష్ట్ర విభజనకు ముందు జరిగిన ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. తమ ప్రత్యర్థి అయిన ఎన్ఎంయూపైన ఉమ్మడిగా విజయం సాధించాయి. గుర్తింపు సంఘం ప్రతినిధులుగా రెండు సంఘాల ప్రతినిధులు ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రెండు సంఘాలు విడిపోయి ప్రత్యర్థులుగా నిలిచాయి. టీఎంయూ ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పొటీ చేయగా, ఎంప్లాయీస్ యూనియన్ మాత్రం ఎస్డబ్ల్యూఎఫ్, ఇతర కార్మిక సంఘాలను కలుపుకొని ఎన్నికల్లో నిలిచింది. అయినప్పటికీ ఎంప్లాయీస్ యూనియన్ ఈ ఎన్నికల్లో ఒక్క డిపోకు మాత్రమే పరిమితం కావలసి వచ్చింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న టీఎంయూవైపే కార్మికులు మొగ్గు చూపారు. -
మరో 24 ఆకాశ హర్మ్యాలు..
శరవేగంగా బహుళ అంతస్తుల నిర్మాణం ఏడాదిలో పెరిగిన రియల్ ఎస్టేట్ మళ్లీ పుంజుకుంటున్న స్థిరాస్తి రంగం సిటీ బ్యూరో: హైదరాబాద్ మహానగరంలో స్థిరాస్తి రంగం మళ్లీ పుంజుకుంటోంది. మరికొన్ని ఆకాశహర్మ్యాలు రాబోతున్నాయి. సుమారు 16 బహుళ అంతస్తుల నివాస సముదాయాలు, ఎనిమిది వాణిజ్య సముదాయాలు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం కొంతకాలంగా స్తబ్దతగా ఉండిపోయిన రియల్ ఎస్టేట్ రంగం తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికరణకు విదేశీ పెట్టుబడుల ఆహ్వానం, ఐటీ కంపెనీల నిర్మాణం, తదితర నిర్ణయాలతో తిరిగి జీవం పోసుకుంటుంది. నగర శివారులోని ఆదిభట్లలో టాటా ఏరోస్పెస్, టీసీఎస్ ఐటీ పరిశ్రమ నిర్మాణం, ముచ్చర్ల ఫార్మాసిటీ, రాచకొండ చిత్రనగరి నిర్మాణం తదితర ప్రకటనలు స్థిరాస్తి రంగంలో కదలికలు తెచ్చాయి. నగరానికి నాలుగు వైపులు పారిశ్రామిక అభివృద్ధి బీజం పడటంతో భూములకు, ఫ్లాట్లకు డిమాండ్ పెరిగిపోయింది. దీంతో కొత్త కొత్త నిర్మాణ సంస్థలు నగరానికి తరలి వస్తున్నాయి. జీహెచ్ఎంసీకి బహుళ అంతస్తుల భవనాల నిర్మాణ అనుమతుల కోసం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చి పడుతున్నాయి. నాలుగు మాసాల్లోనే సుమారు 9,807 దరఖాస్తుల అందినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు గతేడాది కాలంలో రిజిస్ట్రేషన్ల దస్తావేజుల సంఖ్య బాగా పెరిగింది.సుమారు 3,19,579 దస్తావేజుల నమోదైనట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కొత్తగా నిర్మించే బహుళ అంతస్తుల భవన సముదాయాలు, యూనిట్లు (ఫ్లాట్స్) 1) జీ+7, ఆశోక్ నగర్, లింగంపల్లి, హైదరాబాద్. 9 2) జీ+14, ఖాజా గుడా , శేరిలింగంపల్లి 165 3) జీ+8 (నాలుగు బ్లాక్స్) నల్లగండ్ల, శేరిలింగంపల్లి 261 4) జీ+19(2 బ్లాక్) కూకట్పల్లి, బాలనగర్ 374 5) జీ+35 (7 టవర్స్) రాయదుర్గం, శేరిలింగంపల్లి 1760 6) జీ+13,(6 బ్లాక్స్) మాదాపూర్, శేరిలింగంపల్లి 298 7) జీ+15 (2 బ్లాక్స్) ఫతేనగర్, బాలనగర్ 576 8) జీ+12 (7 బ్లాక్హ్), గోపనపల్లి, శేరిలింగంపల్లి 760 9) జీ+7 ఖాజాగూడ, శేరిలింగంపల్లి 73 10) జీ+9 (4టైప్స్) ఖానామెట్, శేరిలింగంపల్లి 76 11) జీ+3 (4బ్లాక్స్) నల్లగండ్ల, శేరిలింగంపల్లి 92 12) జీ+14(3 టవర్స్)రాజ్భవన్ రోడ్, సొమాజిగూడ. 141 13) జీ+9 (3బ్లాక్హ్) నానక్రామ్గూడ , శేరిలింగంపల్లి 176 14) జీ+23 (3 బ్లాక్హ్) షేక్పేట, టౌలిచౌకి, హైదరాబాద్ 506 15) జీ+31 (3 బ్లాక్ ) నానక్ రామ్గూడ 564 16) జీ+31 (4 టవర్స్), మూసాపేట, కూకట్పల్లి 2398 వాణిజ్య భవన సముదాయాలు 1) జీ+ మూసాపేట,బాలనగర్, కూకట్పల్లి 2) జీ+6 గచ్చి బౌలి, శేరిలింగంపల్లి, 3) జీ+8, కుత్బుల్లాపూర్, 4) జీ+జీ+21(2 టవర్స్) పన మక్తా 5) జీ+13 టౌలిచౌకి 6) జీ+11 గచ్చిబౌలీ, శేరిలింగంపల్లి, 7) జీ+11 నానక్రామ్గూడ , శేరిలింగంపల్లి, 8) జీ+4 మౌలాలీ, మల్కాజిగిరి