breaking news
cricket betting mafia
-
జీవితాలే బెట్.. మాఫియా క్రికెట్
ఫోర్ కొడితే చప్పట్లు.. సిక్స్ కొడితే కేకలు.. వికెట్ పడితే అరుపులు.. గెలుపు ఓటములపై ఉత్కంఠ..! ఇవీ సాధారణంగా క్రికెట్ మ్యాచ్లో ఆస్వాదించే అంశాలు.. అయితే, ఇదంతా తెర ముందు దృశ్యం..! మరి తెరవెనుకో..? టాస్కు ముందు.. పరుగు తీస్తే.. ఫోర్ కొడితే.. సిక్స్ బాదితే.. మ్యాచ్లో ఉత్కంఠ పెరుగుతున్న కొద్దీ బెట్టింగ్..! బెట్టింగ్..! అంతగా ఈ మాఫియా వికటాట్టహాసం చేస్తోంది. చివరికి ఏ టీమ్ మ్యాచ్ గెలిచినా ఓడేది మాత్రం కచి్చతంగా పందెం కాసినవారే. అది ఎంతగా అంటే..? బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయి.. అప్పులు అమాంతంగా పెరిగి ఆస్తులు పోతున్నాయి. కొన్నిసార్లు ఒక్క మ్యాచ్ తోనే జీవితం తలకిందులైపోతోంది. సాక్షి, అమరావతి: వేసవి వచ్చిందంటే ఐపీఎల్ (IPL) సందడితో పాటు.. దేశంలో క్రికెట్ బెట్టింగ్ మాఫియా ఇన్నింగ్స్ కూడా మొదలవుతోంది. ఆట పట్ల సగటు భారతీయుడి వ్యామోహమే పెట్టుబడిగా ఊబిలోకి లాగుతోంది. చివరికి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి దిగజారుస్తోంది. డిజిటల్ ఇండియా ఫౌండేషన్ తాజా నివేదిక ప్రకారం ఒక్క ఐపీఎల్ సీజన్లోనే దేశంలో వంద బిలియన్ డాలర్ల (రూ.8,500 కోట్లు పైగా) బెట్టింగ్ దందా సాగుతోంది. గత 17 సీజన్లను విశ్లేషించి ఈ సంస్థ నివేదిక రూపొందించింది. ఏటా బెట్టింగ్ దందా 30 శాతం చొప్పున పెరుగుతోందని తెలిపింది. ప్రస్తుత 18వ సీజన్లో బెట్టింగ్ అత్యంత గరిష్ఠానికి చేరుతుందని అంచనా వేసింది. రూ.10 వేల కోట్ల మార్కు దాటడం ఖాయమని స్పష్టం చేసింది. ఏటా ఐపీఎల్ సీజన్లో 34 కోట్లమంది బెట్టింగ్లో పాల్గొంటున్నారని ఇండియా ఛేంజ్ ఫోరం అనే సంస్థ పేర్కొంది. ప్రధాన బెట్టింగ్ యాప్ల డేటాను విశ్లేషించి ఈ అంచనాకు వచ్చింది.ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఏజెంట్లుదేశంలో వ్యవస్థీకృతమైన మాఫియా పకడ్బందీగా బెట్టింగ్ దందా సాగిస్తోంది. అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఏజెంట్ల వ్యవస్థను నెలకొల్పింది. ప్రత్యేకంగా రూపొందించిన యాప్లు, ఆన్లైన్ ద్వారా పల్లెలకు కూడా ఈ రాకెట్ విస్తరించింది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ లేని ఉత్సుకతను పెంచేలా దందాను నడుపుతోంది. టాస్తో మొదలుపెట్టి.. బంతి బంతికి బెట్టింగ్ నిర్వహిస్తోంది. ఒక్కో పందెం రూ.500 నుంచి రూ.10 వేల వరకు ఉంటోంది. కొన్నేళ్ల క్రితం క్లబ్బులు, పబ్బులు, హోటళ్లు, లాడ్జిలలో ముందుగా డబ్బులు పెట్టి బెట్టింగ్ కాసేవారు. డిజిటల్ చెల్లింపుల యుగంలో బెట్టింగ్ దందా మరింత సులభతరమైంది.అత్యాధునిక టెక్నాలజీ..బెట్టింగ్ మాఫియా 5జీ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్ (Cloud Computing) ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వాడుతూ యాప్లను పకడ్బందీగా నిర్వహిస్తున్నాయి. స్పోర్ట్స్ రాడార్, బెట్ 365 వంటివి మ్యాచ్ల రియల్ టైమ్ డేటా ఫీడ్ను సెకనులో వెయ్యో వంతు (మిల్లీ సెకన్) సమయంలో అప్డేట్ చేస్తున్నాయి. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ టూల్స్తో బెట్టింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. తద్వారా ప్రతి బాల్కు దేశవ్యాప్తంగా అత్యంత వేగంతో భారీగా బెట్టింగులు కాసేలా చేస్తున్నారు.పుట్టుగొడుగుల్లా యాప్లు.. సోషల్ మీడియాతో వలదందా టర్నోవర్కు తగ్గట్టే దేశంలో బెట్టింగ్ యాప్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సోషల్ మీడియా (Social Media) విస్తృతి పెరిగాక బెట్టింగ్ మాఫియా దందాకు అడ్డే లేదు. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, టెలిగ్రామ్లలో బెట్టింగ్ యాప్ల ప్రకటనలు ముంచెత్తుతున్నాయి. మెగాపరి, మోస్ట్బెల్, పరిసేస, పర్ మ్యాచ్, బీసీ డాట్గేమ్, 22 బెట్స్, 10సీ సీఆర్ఐసీ, మెల్బెట్, మేట్బెట్, 1 ఎక్స్బెట్, రాజా బెట్స్, స్టేక్ డాట్కామ్, డఫ్పా బెట్ ఇలా ఎన్నో యాప్ల ప్రకటనలు వరదలా వచ్చి పడుతున్నాయి. కొన్నయితే ఇన్ఫ్లుయెన్సర్లతో వల విసరుతున్నాయి. రూ.100 పెడితే రూ.వేయి ఇస్తాం అంటూ.. కొత్త కస్టమర్లకు రూ.100 నుంచి రూ.500 వరకు డిస్కౌంట్లు ఇస్తూ ఊబిలోకి గుంజుతున్నాయి. ఐపీఎల్ సీజన్లో దాదాపు 75 యాప్లు బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నట్టు డిజిటల్ ఇండియా ఫౌండేషన్ వెల్లడించింది.కమీషనే రూ.వెయ్యి కోట్లుభారీగా డబ్బు రొటేషన్ అవుతుంది తప్ప.. ఐపీఎల్ బెట్టింగ్ల ద్వారా సామాన్యులు డబ్బు సంపాదించిన దాఖలాలు లేవన్నది నిజం. నిర్వాహకులు మాత్రం పందెం మొత్తంపై కనీసం 10 శాతం నుంచి 25 శాతం వరకు కమీషన్ దండుకుంంటున్నారు. ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్ దందా టర్నోవర్ రూ.10 వేల కోట్లు అనుకుంటే యాప్ల నిర్వాహకులు కమీషన్ల రూపంలోనే రూ.వెయ్యి కోట్లు వెనకేస్తున్నారు.అంతా మనోళ్లే.. చూసీ చూడనట్లు పొండిప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ మాఫియా చెలరేగుతోంది. ఎంపిక చేసిన హోటళ్లు, లాడ్జీలు, అపార్టుమెంట్ల కేంద్రంగా చేసుకుని దందా సాగిస్తోంది. టీడీపీ కూటమిలోని కీలక నేతల ప్రధాన అనుచరులే జిల్లాల్లో బెట్టింగ్ దందాకు సూత్రధారులు. ⇒ గుంటూరు, ఎన్టీఆర్, తిరుపతి, వైఎస్సార్ కడప, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి ఎమ్మెల్యేల కార్యాలయాలు బెట్టింగ్ మాఫియాకు అనుకూలంగా పోలీసులపై ఒత్తిడి తెస్తుండడం గమనార్హం.⇒ విజయవాడ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఓ టీడీపీ నేత పోలీసులకు ఫోన్ చేసి ‘అదంతా మనవాళ్లదే’ అని చెప్పడంతో వారు ఏమీ చేయలేకపోతున్నారు. ⇒ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో కూటమి ప్రజాప్రతినిధి సోదరుడే బెట్టింగ్ మాఫియాకు కింగ్ పిన్.⇒ ఏలూరు జిల్లాలో కోడి పందేల నిర్వాహకుడిగా గుర్తింపు పొందిన టీడీపీకి చెందిన సీనియర్ ప్రజాప్రతినిధి వర్గం ప్రస్తుతం బెట్టింగ్ దందాను సాగిస్తోంది.⇒ వైఎస్సార్ కడప జిల్లాలో అత్యంత వివాదాస్పదుడైన కూటమి ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు బెంగళూరులోని బెట్టింగ్ రాకెట్తో మిలాఖత్ అయి.. జిల్లాలో దందా నడుపుతున్నారు. ఈ సీజన్లో రాష్ట్రంలో రూ.500 కోట్ల దందా వీరి లక్ష్యం కావడం గమనార్హం.పందెంరాయుళ్లు కాదు.. బాధితులేక్రికెట్ బెట్టింగ్లో ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, వ్యాపారుల నుంచి మెకానిక్లు, హోటళ్లలో పనిచేసే యువకులు, చిన్నచిన్న పనులు చేసుకునేవారు చివరకు కనీస సంపాదన లేని విద్యార్థులు కూడా బాధితులే. చేతిలోని డబ్బే కాదు.. అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకుని మరీ బజారున పడుతున్నారు. బెట్టింగ్ కోసం కాల్ మనీ రాకెట్ నుంచి అధిక వడ్డీలకు అప్పులు చేసి, తీర్చలేక తీవ్ర అవమానం, ఇబ్బందులు పడుతున్నవారూ భారీగా ఉన్నారు.n మార్చి నెలలో శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలో అన్నదమ్ములు సూర్యనారాయణ, ఉమామహేశ్ రూ.45 లక్షలు కోల్పోయారు. అప్పులు తీర్చలేమని గ్రహించి వేర్వేరుగా ఆత్మహత్యకు యత్నించారు. సూర్యనారాయణ చనిపోగా అపస్మాకర స్థితిలో ఉన్న ఉమామహేశ్ను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.n హైదరాబాద్లో బెట్టింగ్లో డబ్బు పోగొట్టుకుని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.n బిహార్లో వ్యాపారి బెట్టింగ్లో రూ.2 కోట్ల విలువైన విల్లాను కోల్పోయాడు.n కర్ణాటకలో ఓ వ్యక్తి రూ.కోటి నష్టపోగా.. అతడి భార్య తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకుంది.n తమిళనాడు కోయంబత్తూరులో రూ.90 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి జీవితాన్నే బలి తీసుకున్నాడు.బలహీన చట్టాలతో చెలరేగుతున్న మాఫియాదేశంలో జూదం, ఆన్లైన్ బెట్టింగ్లో అధికారికంగా, అనధికారికంగా బరి తెగిస్తున్న మాఫియాను కట్టడి చేసేందుకు సరైన చట్టాలు లేవని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్ను నిషేధించింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల నుంచి నిర్వహణ సాగిస్తున్న మాఫియాకు అడ్డుకట్ట వేయాలంటే కేంద్రమే ఏకీకృత చట్టం చేయాల్సిన అవసరం ఉంది.జూదానికి అడ్డుకట్ట వేసేందుకు దేశంలో ఉన్న చట్టాలు.. వాటి లోపాలు..జూద కార్యకలాపాల నిరోధక చట్టం–1867: బ్రిటీష్ కాలంలో చేసిన ఈ చట్టం జూద గృహాలను నిషేధిస్తోంది. కానీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకంగా చట్టాలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తోంది. దాంతో దేశవ్యాప్తంగా అమలు చేయడం సాధ్యం కావడం లేదు. ఆన్లైన్ జూదాలు, ఇతర అంశాలు కూడా ఈ చట్టం పరిధిలోకి రావు.రాష్ట్రాల ప్రత్యేక చట్టాలు: సిక్కిం, గోవా, నాగాలాండ్ వంటి రాష్ట్రాలు కొన్ని జూదానికి అనుమతిస్తూ ప్రత్యేక చట్టాలు చేశాయి. ఈ రాష్ట్రాల్లో లైసెన్సు తీసుకుని దేశవ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ దందా నడిపిస్తున్నారు. దీంతో కట్టడి చేసేందుకు సాంకేతికంగా అడ్డంకులు ఏర్పడుతున్నాయి.ఐటీ చట్టం 2000: సైబర్ నేరాలను నిరోధించేందుకు ఉద్దేశించినది. దీంతో ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ను నిరోధించడం సాధ్యమా కాదా అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ సైబర్ నేరాల పరిధిలోకి వస్తాయా రావా అని స్పష్టత లేకపోవడమే అందుకు కారణం.బెట్టింగా..!? స్కిల్ గేమా...!?ఆన్లైన్ బెట్టింగ్ అన్నది జూదమా కాదా అన్న అంశంపై దేశంలో ఎన్నో ఏళ్లుగా చర్చ సాగుతోంది. ‘గేమ్ ఆఫ్ స్కిల్’ అన్నది ఒక క్రీడగా భావించాలి తప్ప జూదంగా కాదని ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు వాదిస్తున్నారు. ఆ మేరకు ‘గేమ్ ఆఫ్ స్కిల్’గా పేకాట క్లబ్బులకు అనుమతిస్తూ కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను ఉటంకిస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ స్కిల్ గేమ్ అని వాదిస్తూ తమపై నిషేధం చెల్లదని న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. దాంతో ఆన్లైన్ బెట్టింగ్ను నిరోధించే అంశం న్యాయ వివాదాల్లో చిక్కుకుంది. కఠిన చట్టమే పరిష్కార మార్గం...ఆన్లైన్ బెట్టింగ్ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణం సమగ్ర చట్టాన్ని చేయాల్సిన అవసరం ఉంది. ‘బెట్టింగ్– గ్యాంబ్లింగ్ రెగ్యులేషన్ బిల్లు’ పెండింగులో ఉంది. దీనిపై మరింత న్యాయ సలహాలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ నిర్వచనం, బిల్లులోని అంశాల పరిధి, న్యాయ సమీక్షకు నిలవడంపై మరింత లోతుగా సమాలోచనలు జరపాలని చూస్తోంది. పకడ్బందీ చట్టంతోనే బెట్టింగ్ మాఫియాకు అడ్డుకట్ట సాధ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
క్రికెట్ బెట్టింగ్ మాఫియాలో జనసేన నాయకులు
-
క్రికెట్ బెట్టింగ్ డాన్ అమిత్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ డాన్ అమీత్ గుజరాతీని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న అమిత్.. గత కొన్నేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. అంతేకాదు.. క్రికెట్ బెట్టింగ్తో కోట్ల రూపాయలను కొల్లగొట్టాడు. ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు.. పీటీ వారెంట్పై అమిత్ను పోలీసులు హైదరాబాద్కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఆపై మీడియా ముందు, కోర్టులోనూ ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. దేశ వ్యాప్తంగా బూకీలను ఏర్పాటు చేసి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్స్ కు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు అయ్యింది. దేశవ్యాప్తంగా బుకీలను ఏర్పాటు చేసుకుని బెట్టింగులకు పాల్పడుతున్నాడని అమిత్ గురించి పక్కా ఇన్ఫర్మేషన్ సేకరించారు హైదరాబాద్ పోలీసులు. అంతేకాదు.. క్రికెట్ బెట్టింగుల కోసం వాడే లైవ్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: విశాఖలో ఐపీఎల్ బెట్టింగ్ ముఠాల గుట్టు రట్టు -
ఐపీఎల్ బెట్టింగ్ ముఠాల గుట్టు రట్టు
పెదవాల్తేరు(విశాఖ తూర్పు)/చిత్తూరు అర్బన్: రాష్ట్రంలోని చిత్తూరు, విశాఖల్లో సాగుతున్న భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. చిత్తూరులో తొమ్మిదిమందిని, విశాఖలో ఇద్దరిని అరెస్టు చేసి వారినుంచి బెట్టింగ్ సామగ్రిని, నగదును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఆయా పోలీసు కార్యాలయాల్లో సంబంధిత అధికారులు వివరాలు వెల్లడించారు. క్రికెట్ బెట్టింగ్ ముఠాపై అందిన ఫిర్యాదు మేరకు విశాఖ నగర పోలీస్కమిషనర్ శ్రీకాంత్ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు, మూడో పట్టణ పోలీసులు సంయుక్తంగా ఆర్కే బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం సమీపంలోని మహారాజా టవర్స్ అపార్ట్మెంట్లో ఒక అద్దె ఫ్లాట్పై దాడులు నిర్వహించారు. అక్కడ 16 లైన్ల కమ్యూనికేషన్ వ్యవస్థతో నిర్వహిస్తున్న బెట్టింగ్ ప్రక్రియను చూసి పోలీసులు నివ్వెరపోయారు. భీమవరం ప్రాంతానికి చెందిన రాంబాబు (30), గంజి వీరవెంకట సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు (36)ను అరెస్టు చేశారు. త్రీటౌన్ సీఐ కోరాడ రామారావు దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరులో.. చిత్తూరు డీఎస్పీ సుధాకర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. సంతపేటకు చెందిన టి.శేఖర్, పూతలపట్టు మండలం నొచ్చుపల్లికి చెందిన యుగంధర్బాబు మరికొంతమంది కలిసి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న టూటౌన్ సీఐ యుగంధర్, ఎస్ఐ మల్లికార్జున, సిబ్బందితో కలిసి ఓబనపల్లి సమీపంలోని సివిల్ సప్లయ్ గోదాము వద్ద బెట్టింగ్కు పాల్పడుతున్న 9 మందిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.12.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సంతపేటకు చెందిన శేఖర్(41), రమేష్(46), పాంచాలీపురానికి చెందిన సెంథిల్కుమార్ (38), పాకాల మండలం గాంధీనగర్కు చెందిన నరేంద్ర(30), పూతలపట్టు మండలం నొచ్చుపల్లి గ్రామానికి చెందిన యుగంధర్బాబు(40), కుమార్బాబు(39), బండపల్లికి చెందిన లోకేష్(31), మనోహర్(30), మునిస్వామి(42)పై కేసు నమోదు చేశారు. -
టీ20 మ్యాచ్లు ఉన్నాయంటే చాలు...
క్రికెట్ అంటే ఒకప్పుడు ప్యాషన్.. ఇప్పుడు వ్యసనం.! ప్రధానంగా టీ20 మ్యాచ్లు ఉన్నాయంటే చాలు బెట్టింగ్ జోరుగా సాగుతోంది. దీనిలో ముఖ్యంగా యువతనే ఉంటోంది. ఎక్కడపడితే అక్కడే అడ్డాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. బంతిబంతికి పందెం కాస్తూ రూ.వేలల్లో పోగొట్టుకుంటున్నారు. తద్వారా ఆర్థికంగా చితికిపోతున్నారు. పోలీసులు కూడా వీటిపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో విచ్చలవిడిగా బెట్టింగ్ సాగుతోంది. కామారెడ్డి క్రైం: ప్రస్తుతం క్రికెట్ అంటే ఏస్థాయిలో ఉందో చెప్పనక్కర్లేదు. ప్రధానంగా యువతలోనే క్రికెట్ మోజు వెర్రివెతలు వేస్తోంది. ఆటను ఆటలా చూడలేకపోతున్నారు. యువత బెట్టింగ్ మోజులో పడి పెడదారులు తొక్కుతున్నారు. టీ20 క్రికెట్ మొదలైందంటే చాలు బెట్టింగ్ మాయలో పడి వేలల్లో నష్టపోతున్నారు. చిన్న వయసులో ఎంతోమందికి ఇదొక వ్యసనంగా మారుతోంది. ఈ చర్య ఆందోళనకు గురిచేస్తోంది. ఇదివరకు క్రికెట్ మాచ్ ఉందంటే టీవీల ముందు బైఠాయించి ఇంటికే పరిమితమయ్యేవారు. బెట్టింగ్ల కారణంగా ఇటీవలి కాలంలో అందరూ ప్రత్యేక అడ్డాలు వెతుక్కుంటున్నారు. ఎక్కడపడితే అక్కడే పందాలు కాస్తున్నారు. దీంతో కొందరు యువకులు అప్పులబారిన పడుతున్న సందర్భాలున్నాయి. క్రికెట్పై యువతలో ఉన్న మోజును కొందరు నిర్వాహకులు తప్పుడు మార్గంలో సొమ్ము చేసుకుంటున్నారు. కామారెడ్డిలో ఇటీవల క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయినా కామారెడ్డిలో పదుల సంఖ్యలో బెట్టింగ్ బృందాలున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాలతో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి, ఆర్మూర్, బోధన్ వంటి పట్టణాలు, మండలాల్లోని యువతకు బెట్టింగ్ నిర్వాహకులు గాలం వేస్తున్నారు. అలాంటివారిపై పోలీసు శాఖ నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిఘా పెంచాల్సిందే.. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంపై పోలీసులు మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. బెట్టింగ్తో కలిగే నష్టాలపై సరైన అవగాహన లేక యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఆర్థికంగా సమస్య లు తలెత్తితే ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలోకి వెళ్తున్నా రు. బెట్టింగ్ కారణంగా భవిష్యత్తును పాడు చేసుకో కుండా ఉండాలంటే వారికి విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. బంతి బంతికి బెట్టింగ్.. బెట్టింగ్ వ్యవహారం రకరకాలుగా సాగుతోంది. టీవీలో వచ్చే మ్యాచ్లో ఈరోజు ఎవరు గెలుసారో అనేది మాత్రమే కాకుండా, బంతిబంతికి ఏం జరుగుతుందో అనే విషయంపై బెట్టింగ్ చేస్తున్నారు. బెట్టింగ్ ముఠాలే కాకుండా చాలాచోట్ల యువకులు తామే స్వయంగా గ్రూప్గా ఏర్పడి పందాలు కాస్తున్నారు. ఇది వరకు బెట్టింగ్ నిర్వహించడం అంటే ప్రత్యేకంగా అడ్డాలు ఉండేవి. ఇటీవలి కాలంలో ఎక్కడి పడితే అక్కడే బృందాలుగా కూర్చుని ఫోన్ల ద్వారా నిర్వాహకులతో మాట్లాడుతూ ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. ఈనెల 7న జరిగిన భారత్–న్యూజిల్యాండ్ టీ20 మ్యాచ్పై కూడా జోరుగా బెట్టింగ్ సాగినట్లు సమాచారం. నష్టపోతున్న యువత... జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో ఓ ఇంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. గతంలో బెట్టింగ్లో పాల్గొని నష్టపోయిన ఓ యువకుడు అప్పులు బారిన పడి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఇలాంటి సంఘటనలు ఆయా గ్రామాల్లో మరెన్నో చోటు చేసుకుంటున్నాయి. బెట్టింగ్ కోసం ఇండ్లు, హోటళ్లు, రెస్టారెంట్ వంటి ప్రదేశాల్లో అడ్డాలుగా చేసుకుంటున్నారు. పోలీసుల నిఘా పెరగడంతో ఎప్పటికప్పుడు అడ్డాలు మారుస్తూ బెట్టింగ్ కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై పలుసార్లు పోలీసులు దాడులు చేయగా జిల్లా కేంద్రంలోని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో టీ20 క్రికెట్ మ్యాచ్లు వచ్చే సమయాల్లో క్రికెట్ ఛానళ్లను పెట్టడం లేదు. -
ఆన్లైన్లో వీడియో కలకలం
-
ఆన్లైన్లో వీడియో కలకలం
అహ్మదాబాద్: క్రికెట్ బెట్టింగ్ మాఫియా తనను చంపేస్తామని బెదిరిస్తోందని, సాయం చేయాలని దీపక్ ధాననీ అనే వ్యక్తి ప్రధాని మోదీని, రాజ్కోట్ పోలీసులను అర్ధిస్తున్న వీడియో ఆన్లైన్లో కలకలం రేపుతోంది. ఈ వీడియోను దీపక్ తన సెల్ఫోన్లో రికార్డు చేసిన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ‘రాజ్కోట్లోని బుకీలు, నేరస్తులు నన్ను, నాకుటుంబాన్ని హతమారుస్తామని బెదిరిస్తున్నారు. నేను తీవ్రమైన తప్పు చేశాను. క్రికెట్లో బెట్టింగ్కోసం నా ఇంటిని సైతం అమ్మేశాను. ఇప్పుడు నాదగ్గర ఏమీ లేదు’ అని దీపక్ వాపోయాడు. సదరు బుకీ పేరును వీడియోలో వెల్లడించిన దీపక్ తాను ఇప్పటికే రూ.7 కోట్లు చెల్లించానని, ఇంకా రూ.1.7 కోట్లు బాకీ ఉన్నట్లు తెలిపాడు. ఈ వీడియో వైరల్ కావడంతో రాజ్కోట్ పోలీసులు దీపక్ ఇంటికి రక్షణ కల్పించారు. ఇన్స్పెక్టర్ ఆర్ఆర్ సోలంకీ ఈ ఘటనపై మాట్లాడుతూ దీపక్ క్రికెట్ బుకీగా పనిచేస్తున్నాడని, గతంలోనూ చాలా కేసుల్లో అరెస్టయ్యాడని తెలిపారు.