Danish woman
-
రేప్ కేసులో ఐదుగురికి జీవిత ఖైదు
న్యూఢిల్లీ: డానిష్ మహిళ గ్యాంప్ రేప్ కేసులో అయిదుగురు నిందితులకు జీవితఖైదు విధిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. 2014లో జరిగిన ఈ రేప్ కేసును విచారించిన తిస్ హజారీలోని కోర్టు నిందితులు మహేంద్ర అలియాస్ గంజా(24), మహద్ రాజా(22), రాజు(23), అర్జున్(21), రాజు చక్కా(22)లకు శిక్షను ఖరారుచేసింది. మొత్తం తొమ్మిది మంది డానిష్ మహిళను ఢిల్లీ రైల్వే స్టేషన్ కు దగ్గరలోని డివిజినల్ ఆఫీసర్ క్లబ్ కు సమీపంలో ఎవరూ రాని ప్రదేశానికి తీసుకువెళ్లి రేప్ చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. 55 ఏళ్ల శ్యామ్ లాల్ గత ఫిబ్రవరిలో మరణించాడు. కాగా, మిగిలిన ముగ్గురు మైనర్లు కావడంతో వారిని బాలనేరస్థుల గృహానికి తరలించి విచారిస్తున్నారు. -
డేనిష్ మహిళపై అత్యాచారం: మూడో వ్యక్తి అరెస్టు
దేశ రాజధాని నగరంలో 51 ఏళ్ల డేనిష్ మహిళపై జరిగిన అత్యాచారం కేసులో మూడో నిందితుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అతడిని ఢిల్లీ కోర్టు మూడు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. రాజు సింగ్ (23) అనే వ్యక్తిని గురువారం మధ్యాహ్నం అరెస్టు చేసి, అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సుధాంశు కౌశిక్ ఎదుట హాజరు పరచగా, ఆయన మూడు రోజుల కస్టడీకి పంపారు. మహేందర్ అలియాస్ గంజా, మహ్మద్ రజా అనే ఇద్దరు నిందితులతో రాజు సింగ్ గొడవ పడ్డాడని పోలీసులు తెలిపారు. మొత్తం ఎనిమిది మంది నిందితులలో రాజు ఒకడు. వీళ్లంతా కూడా సంచారజీవులే. జనవరి 14వ తేదీ రాత్రి ఢిల్లీలో ఓ డేనిష్ మహిళ (51)ని వీళ్లు కత్తులు చూపించి బెదిరించి, దోచుకుని, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇప్పటివరకు ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేయగా, మరో ఐదుగురిని ఇంకా పట్టుకోవాల్సి ఉంది. బాధితురాలి నుంచి వారు దొంగిలించిన ఐ ప్యాడ్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఢిల్లీలో మరో కీచకం
డెన్మార్క్ పర్యాటకురాలిపై సామూహిక అత్యాచారం విలువైన వస్తువులు, నగదు దోపిడీ ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు న్యూఢిల్లీ: దేశ రాజధాని మహిళలకు ఏమాత్రం సురక్షితం కాదని మరోసారి రుజువైంది. భారత్ అందాలను చూసి వెళదామని వచ్చిన డెన్మార్క్ మహిళపై కొందరు దుండగులు కీచకానికి తెగబడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి బుధవారం రాత్రి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. డెన్మార్క్కు చెందిన 51 ఏళ్ల మహిళ ఈనెల 1న భారత పర్యటనకు వచ్చింది. ఆగ్రా తదితర ప్రాంతాలను సందర్శించిన తర్వాత సోమవారం ఢిల్లీకి చేరుకుంది. ఆమె మంగళవారం నేషనల్ మ్యూజియంను తిలకించి, సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో కన్నాట్ ప్లేస్ నుంచి పహాడ్గంజ్లోని హోటల్కు వెళుతూ దారి తప్పింది. హోటల్కు చేరుకునేందుకు తోవలో కనిపించిన కొందరు యువకుల సాయం కోరింది. హోటల్ చూపిస్తామంటూ వారు న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుపోయి, కత్తులతో బెదిరించి నగదు, ఐపాడ్, ఫోన్ వంటి విలువైన వస్తువులను, ఆమె వద్దనున్న నగదును దోచుకున్నారు. తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మూడు గంటల తర్వాత నానా తంటాలు పడి హోటల్కు చేరుకున్న ఆమె, జరిగిన సంఘటనను మేనేజర్కు తెలిపారు. ఆయనకు పోలీసులకు ఫోన్ చేయడంతో వారు రాత్రి 8.30 గంటలకు హోటల్కు చేరుకుని, బాధితురాలి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 376 జీ(2) కింద సామూహిక అత్యాచారంతో పాటు దోపిడీ కేసు నమోదు చేసుకున్నారు. ఆరుగురు దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా, బాధితురాలు బుధవారం మధ్యాహ్నం స్వదేశానికి బయలుదేరి వెళ్లింది. స్వదేశంలో వైద్య పరీక్షలు జరిపించుకుని, నివేదిక పంపుతానని, అవసరమైతే సాక్ష్యం చెప్పేందుకు తిరిగి భారత్కు వస్తానని ఆమె చెప్పింది. ఇదిలా ఉండగా, ఈ కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాకు చెందిన మహేందర్ అలియాస్ గంజా (25), రాజా అనే నిందితులను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వారి వద్దనుంచి ఐపాడ్, ఇయర్ప్లగ్, దోచుకున్న సొమ్ముతో కొనుగోలు చేసిన రూ.1200 విలువ చేసే నోకియా మొబైల్ఫోన్, ఒక కళ్లద్దాల కేసు, రూ.1,800 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈనెల 3న పోలండ్ మహిళపై ఒక క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడి, ఢిల్లీలోని నిజాముద్దీన్ స్టేషన్ వద్ద వదిలేసి పరారైన సంగతి తెలిసిందే. లెఫ్టినెంట్ గవర్నర్తో సీఎం కేజ్రీవాల్ భేటీ... డెన్మార్క్ పర్యాటకురాలిపై అత్యాచారం ఘటన వెలుగులోకి రావడంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్జంగ్తో భేటీ అయ్యారు. నగరంలో మహిళలకు భద్రత పెంచేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలుసుకుని, మహిళలపై నేరాల కేసులను సత్వరమే విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కోరనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. -
పాలకులు మారిన పాలన మారదా?
-
డానిష్ మహిళ ఘటనకు కేజ్రీవాల్ బాధ్యత వహించగలరా?
-
ఢిల్లీలో విదేశీ వనితపై గ్యాంగ్ రేప్
-
ఢిల్లీలో విదేశీ వనితపై గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ : మరోసారి దేశ రాజధానిలో అత్యాచార ఘటన కలకలం రేపింది. ఈసారి ఏకంగా విదేశీ మహిళపైనే లైంగికదాడి జరిగింది. మన దేశ పరువును తీసింది. భారత్ చూసేందుకు వచ్చిన 51ఏళ్ల డానిష్ మహిళపై కొందరు ఆకతాయిలు మంగళవారం రాత్రి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తనను రేప్ చేశారని, ఆ తర్వాత డబ్బులు, ఇతర విలువైన వస్తువులు లాగేసుకున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది. బాధితురాలు వారం క్రితం ఇండియాకు వచ్చింది. న్యూఢిల్లీలోని హోటల్ అమాక్స్లో దిగిన ఆమె, ఆగ్రాతో పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాలను చూసొచ్చింది. నేషనల్ మ్యూజియంకు వెళ్లి హోటల్కు తిరిగొస్తుండగా దారి తప్పిపోయింది. రైల్వేస్టేషన్లో కొంతమందిని అడ్రస్ అడుగుతుండగా ... కామాంధుల చేతిలో చిక్కింది. ఈ ఘటనపై ఆమె పోలీసులకు, డానిష్ ఎంబసీకి ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన వివరాల మేరకు పోలీసులు ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులపై 376 జీ (2) ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కాగా బాధితురాలు బుధవారం ఉదయం కోపెన్ హెగెన్ తిరిగి వెళ్లిపోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అయితే ఆమె వైద్య పరీక్షలకు నిరాకరించినట్లు తెలిపారు. కాగా వారం క్రితం ఇదే ప్రాంతంలో ఓ బాలిక కూడా ..... తనపై అత్యాచారం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అనంతరం ఆమె తనపై అత్యాచారం జరగలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో పోలీసులు అన్నికోణాల్లో ఈ కేసులో విచారణ జరుపుతున్నారు.